హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ) నిర్వహిస్తున్న 5వ ఐడియా ఛాలెంజ్కు 16 రాష్ట్రాల నుంచి 450కి పైగా దరఖాస్తులు (నూతన ఆలోచనలు) వచ్చాయి. ఐఐటీ, ఐఐఎం, లండన్ బిజినెస్ స్కూల్, నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ తదితర యూనివర్సిటీల్లో విద్యనభ్యసించిన వృత్తి నిపుణులు సైతం ఈ చాలెంజ్ కోసం పోటీపడుతున్నారు. విజేతలుగా నిలిచిన టాప్-5 ఆలోచనలకు నగదు బహుమతిగా రూ.2 లక్షల దాకా ఐఎస్బీ అందించనుంది. అలాగే ఇంక్యుబేషన్ నిధి కింద రూ.2.5 కోట్లను బూట్క్యాంప్ ఫైనలిస్ట్స్ దక్కించుకునే అవకాశం ఉంది. ఈ నిధిని ఇంటెల్లిక్యా ప్, విల్గ్రోలు సమకూరుస్తాయి. తుది వరకు నిలిచిన 10 బృందాల కోసం నవంబరు 25 నుంచి 30 వరకు ఐఎస్బీ బూట్ క్యాంప్ నిర్వహిస్తోంది.