ఉపాధ్యాయుడు కొట్టిన దెబ్బలకు విద్యార్థి మృతి! | Jharkhand boy dies after alleged beating by teacher | Sakshi
Sakshi News home page

ఉపాధ్యాయుడు కొట్టిన దెబ్బలకు విద్యార్థి మృతి!

Published Mon, Feb 3 2014 10:29 AM | Last Updated on Sat, Sep 2 2017 3:18 AM

Jharkhand boy dies after alleged beating by teacher

రాంచీ: ఉపాధ్యాయుడు కొట్టిన దెబ్బలకు తాళలేక ఓ విద్యార్థి మృతి చెందిన ఘటన జార్ఖండ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. రాంచీ సమీపంలోఎని మండార్ టౌన్ ప్రాంతానికి చెందిన సుజిత్ ముండాను ఉపాధ్యాయుడు అర్సద్ అన్సారీ విచక్షణరహితంగా కొట్టడంతో మరణించాడని విద్యార్థి తల్లితండ్రులు ఆరోపిస్తున్నారని పోలీసులు తెలిపారు. గాయపడిన విద్యార్థి రాజేంద్ర ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ చికిత్స పొందుతూ ఆదివారం మరణించారని పోలీసులు వెల్లడించారు. 
 
ఈ ఘటన రాంచీకి 40 కిలోమీటర్ల దూరంలోని మండార్ లోని ఓ ప్రభుత్వ ఆస్పత్రిలో చోటుచేసుకుంది. కేసును దర్యాప్తు చేస్తున్నాం. ఉపాధ్యాయుడు కొట్టిన దెబ్బలకే మరణించినట్లయితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. పోస్ట్ మార్టమ్ రిపోర్డ్ కోసం చూస్తున్నామని.. ఆతర్వాత మృతికి కారణాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement