Ranchi
-
Rickshaw Pullers: రిక్షా పుల్లరమ్మలు
అభ్యర్థులు చురుకుగా ఉండాలి.. టోక్యో చరిత్రపై అవగాహన కలిగి ఉండాలి .. నగరం నలుమూలలు తెలిసుండాలి..ఇంగ్లిష్ పరిజ్ఞానాన్ని అదనపు అర్హతగా పరిగణిస్తాం.. శారీరక దారుఢ్యం తప్పనిసరి!ఇది గైడ్ కొలువుకు అప్లికేషన్ అని అర్థమవుతోంది. కాని చివరి రిక్వైర్మెంట్ ఏంటీ?నిజమే అది గైడ్ ఉద్యోగమే! దానితోపాటు రిక్షా పుల్లర్ జాబ్ కూడా! ఆశ్చర్యం వద్దు, అది నిజం! టోక్యో అనే పేరుంది కాబట్టి ఎక్కడో తెలిసిపోయే ఉంటుంది.. ఎస్ జపాన్లో! అయితే ఈ కొలువుకు అబ్బాయిల కన్నా అమ్మాయిలే ఎక్కువగా దరఖాస్తు చేసుకుంటున్నారట! టూరిస్ట్లు కూడా లేడీ రిక్షా పుల్లర్స్నే కోరుకుంటున్నారట. అబ్బాయిల కన్నా అమ్మాయిలే ఓపిగ్గా ఉండటం, ఇంగ్లిష్ కమ్యూనికేషన్ స్కిల్స్లో కూడా వాళ్లే బేషుగ్గా ఉండటం, చిరునవ్వును చెరగనీయకపోవడం, భద్రంగా తిప్పటం వంటి కారణాల వల్ల లేడీ రిక్షా పుల్లర్స్కే డిమాండ్ ఉందట టోక్యోలో! టెక్నికల్ అడ్వాన్స్మెంట్కి మారుపేరైన జపాన్లో రిక్షాలు.. అదీ మనిషి లాగే రిక్షాలు?! అలాంటి రిక్షాలను మన దేశంలో ఎప్పుడో బ్యాన్ చేశాం. కానీ జపాన్లో ఇంకా ఉనికిలో ఉండటమే కాక.. వాటిని లాగే ఉద్యోగం పట్ల క్రేజ్ కూడా ఉండటం విస్మయమే!రిక్షా పుల్లర్ ఉద్యోగానికి కరోనా తర్వాత డిమాండ్ పెరిగింది. కరోనా వచ్చి కొలువులకు చెక్ పెట్టడంతో ఇలాంటి జాబ్స్కి మళ్లారు చాలామంది. మన దగ్గర ఆటోలను అద్దెకిస్తున్నట్టు.. టోక్యోలో రిక్షా పుల్లర్ కొలువులను ఇచ్చే సంస్థలున్నాయి. దాని కోసం శిక్షణ కూడా ఇచ్చి, మరీ అపాయింట్ చేసుకుంటున్నాయి. అభ్యర్థి లర్నింగ్ స్కిల్స్ని బట్టి ఈ ట్రైనింగ్ రెండు నెలల నుంచి నాలుగు నెలల వరకు ఉంటుంది.అమ్మాయిలెలా వచ్చారు?ఇందాక చెప్పుకున్న కారణమే.. కరోనా! పాండమిక్కి ముందు ఈ రంగంలో మహిళలు పెద్దగా లేరు. కరోనా తర్వాత ఈ రిక్షా సంస్థలు తమ వ్యాపారం పెంచుకోవడానికి సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం కావించారు. రిక్షా లాగుతున్న అమ్మాయిల వీడియోలూ పెట్టడంతో, టోక్యోలోని నిరుద్యోగ వనితలు చాలామంది ఈ ఉద్యోగంలో చేరారు. అయితే ఆ అమ్మాయిలకు తమ కుటుంబ సభ్యుల నుంచి చాలానే వ్యతిరేకత వచ్చింది. ఆడపిల్లలకు అలాంటి ఉద్యోగం ఇస్తున్న రిక్షా సంస్థలకూ స్త్రీవాదుల నుంచి నిరసన, వ్యతిరేకత తప్పట్లేదు. ‘వారానికి అయిదారైనా ఇలాంటి నిరసన, వ్యతిరేక ఫోన్ కాల్స్ వస్తుంటాయి’ అని చెప్తాడు రిక్షా సంస్థల్లో ఒకటైన ‘టోక్యో రిక్షా సంస్థ’ మేనేజర్. లేడీ రిక్షా పుల్లర్ల సంఖ్య ఎక్కువగా ఉన్నది కూడా ఈ సంస్థలోనే! లేడీ రిక్షా పుల్లర్స్ రోజుకు దాదాపు 250 కేజీల బరువుతో, 20 కిలోమీటర్ల వరకు రిక్షాలను లాగుతారు. డిమాండ్లో ఉన్న రిక్షా పుల్లర్స్ నెలకు పదిలక్షల యెన్లను సంపాదిస్తున్నారట. అంటే మన కరెన్సీలో ఇంచుమించు అయిదు లక్షల 48 వేల రూపాయలన్నమాట. లేడీ రిక్షా పుల్లర్స్ టోక్యోలోని అసకుస అనే టూరిస్ట్ ఏరియాలోనే ఎక్కువగా కనిపిస్తారు. కాలేజీ అమ్మాయిలు దీన్నొక డిఫరెంట్ జాబ్గా భావించి, జాయిన్ అవుతున్నారట! -
జార్ఖండ్ పోలింగ్: 65 శాతం ఓటింగ్ నమోదు
Updatesజార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్ ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకు 64.86 శాతం పోలింగ్ నమోదు64.86 pc voters exercise franchise in first phase Jharkhand polls till 5 pmRead @ANI Story | https://t.co/tFstV6aCDt#Jharkhandelections #SeraikellaKharsawan #Ranchi #voterturnout pic.twitter.com/EbdTX3lkW8— ANI Digital (@ani_digital) November 13, 2024 మధ్యా హ్నం 3 గంటల వరకు 59.28 శాతం పోలింగ్ నమోదుభారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ.. రాంచీలోని పోలింగ్ బూత్లో సతీమణి సాక్షితో కలిసి ఓటు వేశారు.మధ్యాహ్నం 1 గంట వరకు 46% పోలింగ్ నమోదైంది.सराइकेला खरसावाँ जिलांतर्गत कुचाई प्रखंड के नक्सल प्रभावित क्षेत्र जैसे जाम्बरो, रेगाबेड़ा,कोमाय, गिलुआ,सियाडीह,तरंबा मतदान केंद्रों पर कड़ी सुरक्षा के बीच भयमुक्त और शांतिपूर्ण वातावरण में मतदान।@ECISVEEP @SpokespersonECI #VoteDeneChalo pic.twitter.com/xM3z1eYJqV— Chief Electoral Officer, Jharkhand (@ceojharkhand) November 13, 2024 బీజేపీ నేత జయంత్ సిన్హా హజారీబాగ్లో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. #WATCH | BJP leader Jayant Sinha casts his vote in Hazaribag as polling in the first phase of Jharkhand Assembly elections is underway pic.twitter.com/3JNGBaGveV— ANI (@ANI) November 13, 2024 జార్ఖండ్లోని పశ్చిమ సింగ్భూమ్లోని సోనాపి సోనాపిలోని ప్రాథమిక విద్యాలయం వద్ద ఓటర్లు నక్సల్స్ బెదిరింపులను ధిక్కరించి భారీ సంఖ్యలో ఓటు వేయడానికి వచ్చారు. నక్సలైట్లు.. పోస్టర్లు వేసి అడ్డుకునే ప్రయత్నం చేశారు. భద్రతా బలగాలు పోస్టర్లు, అడ్డంకులను విజయవంతంగా తొలగించాయి. జార్ఖండ్లోని పశ్చిమ సింగ్భూమ్లోని సోనాపి, జగన్నాథ్పూర్ పోలింగ్ బూత్ నంబర్ 25లో 60 శాతం ఓటింగ్ నమోదైంది.Voters at Prathmik Vidyala Sonapi defied naxals threat and came out in huge numbers to vote. Naxalite put up posters and tried obstructing the way. Security forces successfully removed the posters and obstacles and by 11 AM, 60% voting turnout was recorded at polling booth number… pic.twitter.com/ugpccrm3D5— ANI (@ANI) November 13, 2024 జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్ కొనసాగుతోందిఉదయం 11 గంటల వరకు 29.31 శాతం ఓటింగ్ నమోదైంది#JharkhandAssemblyElection2024 | Jharkhand (Phase-1)recorded 29.31% voter turnout till 11 am, as per the Election Commission of India. #WayanadByElection2024 | Wayanad recorded 27.04% voter turnout till 11 am, as per the Election Commission of India. pic.twitter.com/ohjDBHolK3— ANI (@ANI) November 13, 2024 జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్, ఆయన సతీమణి కల్పనా సోరెన్ రాంచీలోని ఓ పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు.#WATCH | Jharkhand CM Hemant Soren, his wife Kalpana Soren cast their votes at a polling station in Ranchi for #JharkhandAssemblyElections2024 pic.twitter.com/QCOCNn57p8— ANI (@ANI) November 13, 2024 జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల తొలి విడత పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 9 గంటల వరకు 13.04 శాతం ఓటింగ్ నమోదు#JharkhandAssemblyElection2024 | Jharkhand (Phase-1)recorded 13.04% voter turnout till 9 am, as per the Election Commission of India.#WayanadByElection2024 | Wayanad recorded 13.04% voter turnout till 9 am, as per the Election Commission of India. pic.twitter.com/5OI9p3Adtk— ANI (@ANI) November 13, 2024మాజీ కేంద్ర మంత్రి, బీజేపీ నాయకుడు అర్జున్ ముండా, ఆయన భార్య మీరా ముండా ఓటు శారు.సెరైకెలా ఖర్సావాన్లోని పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు.పొత్కా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా మీరాముండా బరిలో ఉన్నారు.#WATCH | Former Union Minister and BJP leader Arjun Munda, his wife Meera Munda show their inked fingers after casting vote at a polling station in Seraikela KharsawanMeera Munda is BJP's candidate from Potka Assembly constituency. #JharkhandAssemblyPolls2024 https://t.co/Xu8vO30qAR pic.twitter.com/mvKTxUy56H— ANI (@ANI) November 13, 2024 జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల తొలి విడత పోలింగ్ కొనసాగుతోంది.ఒడిశా గవర్నర్ , జార్ఖండ్ మాజీ సిఎం రఘుబర్ దాస్ తన కుటుంబంతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు.జంషెడ్పూర్లోని ఓ పోలింగ్ కేంద్రంలో ఆయన ఓటువేశారు.#WATCH | #JharkhandAssemblyElections: Odisha Governor and former Jharkhand CM Raghubar Das along with his family show their inked finger after casting their votes at a polling station in Jamshedpur. He says "It is the responsibility of the people to come out and use their… pic.twitter.com/QwUeRj0S3a— ANI (@ANI) November 13, 2024 కేంద్ర మంత్రి అన్నపూర్ణా దేవి ఓటు హకక్కు వినియోగించుకున్నారు.కోడెర్మాలోని పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు.జార్ఖండ్లో తొలి విడత పోలింగ్ కొనసాగుతోంది.#WATCH | Koderma, Jharkhand: Union Minister Annapurna Devi shows her inked finger after casting vote at a polling station in Koderma#JharkhandElections2024 pic.twitter.com/qpuLt4hEO9— ANI (@ANI) November 13, 2024 రాంచీలో తొలి విడత పోలింగ్ జరుగుతోంది.పోలీసులు డ్రోన్లను ఉపయోగించి నిఘా పెట్టారు.#WATCH | Ranchi, Jharkhand: Police use drones for surveillance in Ranchi as voting is underway for the first phase of #JharkhandAssemblyElections2024 pic.twitter.com/cjZow4klOn— ANI (@ANI) November 13, 2024 హజారీబాగ్ అసెంబ్లీ స్థానం కాంగ్రెస్ అభ్యర్థి మున్నా సింగ్ ఓటు వేశారు.హజారీబాగ్లో అభివృద్ధి, శ్రేయస్సు తీసుకురావడానికి ఓటు వేయాలని హజారీబాగ్ ఓటర్లందరినీ అభ్యర్థించారు.#WATCH | Hazaribagh, Jharkhand: After casting his vote, Congress candidate from Hazaribagh Assembly seat Munna Singh says, "I request all voters of Hazaribagh to vote to bring development and prosperity in Hazaribagh."#JharkhandAssemblyPolls2024 pic.twitter.com/ljbEs0xlAP— ANI (@ANI) November 13, 2024 పూర్తి ఉత్సాహంతో ఓటు వేయండి: ప్రధాని మోదీజార్ఖండ్ తొలి దశ పోలింగ్లో పూర్తి ఉత్సాహంతో ఓటు వేయాలని ప్రధాని మోదీ ఓరట్లను కోరారు. తొలిదశ పోలింగ్ కొనసాగుతోంది.తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి ప్రజలు క్యూలైన్లలో ఉన్నారు. PM Modi urges citizens to vote with full enthusiasm in Jharkhand pollingRead @ANI Story | https://t.co/DlZb7WiwWK#PMModi #Jharkhandpolls #Assemblyelections pic.twitter.com/ogsyZoxYqU— ANI Digital (@ani_digital) November 13, 2024 జార్ఖండ్లో తొలి దశ పోలింగ్ కొనసాగుతోంది. జంషెడ్పూర్ ఈస్ట్ కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ అజోయ్ కుమార్ ఓటు వేశారు. జంషెడ్పూర్లోని ఓ పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు.#WATCH | East Singhbhum, Jharkhand: Congress candidate from Jamshedpur East, Dr Ajoy Kumar casts his vote at a polling station in Jamshedpur. pic.twitter.com/2Hen7AFJd1— ANI (@ANI) November 13, 2024 జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల తొలిదశ పోలింగ్ కొనసాగుతోంది.రాంచీలోని ఓ పోలింగ్ కేంద్రంలో కేంద్ర మంత్రి సంజయ్ సేథ్ ఓటు వేశారు.#WATCH | #JharkhandAssemblyElection: Union Minister Sanjay Seth casts his vote at a polling station in Ranchi. pic.twitter.com/DFMWrKKrlK— ANI (@ANI) November 13, 2024 జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల తొలిదశ పోలింగ్ కొనసాగుతోంది.జంషెడ్పూర్ వెస్ట్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్న ఎన్డీఏ అభ్యర్థి, జేడీయూ నేత ఓటు హక్కు వినియోగించుకున్నారు.సరయూ రాయ్ జంషెడ్పూర్ వెస్ట్లోని పోలింగ్ బూత్లో ఆయన ఓటు వేశారు.ఆయనపై కాంగ్రెస్ అభ్యర్థి బన్నా గుప్తా పోటీ చేస్తున్నారు. #WATCH | Jharkhand: NDA candidate from Jamshedpur West Assembly seat and JDU leader Saryu Roy casts his vote at a polling booth in Jamshedpur West Congress's Banna Gupta is contesting against him. pic.twitter.com/KIK8I2yJUD— ANI (@ANI) November 13, 2024 జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్ కొనసాగుతోంది.గవర్నర్ సంతోష్ కుమార్ గంగ్వార్ ఓటు హక్కు వినియోగించుకున్నారు.రాంచీలోని ఓ పోలింగ్ బూత్లో ఆయన ఓటు వేశారు. #WATCH | Santosh Kumar Gangwar, Governor of Jharkhand casts his vote at a polling booth in Ranchi, Jharkhand #JharkhandAssemblyElections2024 pic.twitter.com/bwRe4JFlzB— ANI (@ANI) November 13, 2024 జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల మొదటి దశలో పోలింగ్ కొనసాగుతోంది.రాంచీలోని జవహర్ నగర్లోని పోలింగ్ కేంద్రంలో ఓటు వేయడానికి ప్రజలు పోలింగ్ స్టేషన్ వద్ద క్యూలైన్లో ఉన్నారు.#WATCH | People queue up at a polling station in Ranchi to vote in the first phase of Jharkhand Assembly electionsVisuals from a polling station in Jawahar Nagar pic.twitter.com/MVWrj3OnuU— ANI (@ANI) November 13, 2024 జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల మొదటి దశ పోలింగ్ కొనసాగుతోంది. రాంచీలోని పోలింగ్ బూత్ నంబర్లు 50,60, 61 పోలింగ్ జరుగుతోంది.ప్రజలు ఓటు వేయడానికి క్యూలైన్లతో నిల్చున్నారు.ఈ సందర్భంగా ఓ మహిళ సంప్రదాయ డోలు వాయిస్తూ ప్రజలను ఓటు వేయమని విజ్ఞప్తి చేశారు.#WATCH | Ranchi: A woman plays a traditional drum and appeals to people to vote during the first phase of Jharkhand assembly elections.(Visuals from polling booth numbers 50,60 and 61 in Ranchi) pic.twitter.com/bjE5uDHQVp— ANI (@ANI) November 13, 2024 జార్ఖండ్లో అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్ కొనసాగుతోంది.ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించుకోవటం కోసం పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారు. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల మొదటి దశ ఓటింగ్ కొనసాగుతోంది.ఈ దశలో 81 స్థానాలకు గాను 43 స్థానాలకు పోలింగ్ జరుగుతోంది.జంషెడ్పూర్లోని ఓ పోలింగ్ కేంద్రంలో ఓటుర్లు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. #WATCH | Voting begins for the first phase of Jharkhand assembly elections; In this phase, voting is taking place on 43 out of 81 seats.Visuals from a polling centre in Jamshedpur pic.twitter.com/cqSwJqSV6c— ANI (@ANI) November 13, 2024 జార్ఖండ్ శాసనసభ ఎన్నికల తొలి విడత పోలింగ్ ప్రారంభమైంది. Voting begins for the first phase of Jharkhand assembly elections; In this phase, voting is taking place on 43 out of 81 seats.Voting has also begun in the by-elections for 31 assembly seats spread across 10 states, as well as for the Wayanad Lok Sabha constituency in Kerala. pic.twitter.com/muTcQsr2nx— ANI (@ANI) November 13, 2024 పోలింగ్ నిర్వహణకు ఎన్నికల అధికారులు సర్వం సిద్ధంచేశారు.తొలి దశలో 43 నియోజకవర్గాల్లో పోలింగ్ జరగనుంది. సమస్యాత్మక ప్రాంతాల్లో కేంద్ర సాయుధ పోలీసు బలగాలను మోహరించారు. #WATCH | Preparations underway at St Columbus College polling booth in Hazaribagh, ahead of the first phase of voting to be held today.#JharkhandAssemblyPolls2024 pic.twitter.com/EY6WBe9YiT— ANI (@ANI) November 13, 2024 తొలిదశ పోలింగ్ జరుగుతున్న 43 స్థానాల్లో 17 జనరల్, 20 ఎస్టీ రిజర్వ్, ఆరు ఎస్సీ రిజర్వ్ స్థానాలున్నాయి. మాజీ రాష్ట్ర ముఖ్యమంత్రి, బీజేపీ నేత చంపయి సోరెన్ పోటీ చేస్తున్న సెరాయ్కెల్లా నియోజకవర్గంలోనూ ఇవాళే పోలింగ్ జరునుంది.కాంగ్రెస్ నేత అజయ్కుమార్ జంషెడ్పూర్ ఈస్ట్ నుంచి బరిలో దిగారుఇక్కడ జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ఒడిశా గవర్నర్ రఘుబర్దాస్ కోడలు పూర్ణిమా సాహూ పోటీచేస్తున్నారు. జంషెడ్పూర్లో మాజీ ముఖ్యమంత్రి మధు కోడా సతీమణి గీత బీజేపీ తరఫున బరిలో దిగారు. ఇక్కడ కాంగ్రెస్ నేత సోనారాం సింకూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. జంషెడ్పూర్ వెస్ట్ నుంచి కాంగ్రెస్ నేత, ఆరోగ్య మంత్రి బన్నా గుప్తా పోటీచేస్తున్నారు. ఈయనపై జేడీయూ నేత సరయూరాయ్ బరిలోకి దిగారు. సరయూరాయ్ 2019లో నాటి ముఖ్యమంత్రి రఘుబర్దాస్నే ఓడించడం విశేషం. రాంచీలో ఈసారి జేఎంఎం ప్రస్తుత రాజ్యసభ సభ్యులైన మహువా మాఝీని రంగంలోకి దింపింది. తొలి దశలో పోలింగ్ జరగనున్ను 43 అసెంబ్లీ స్థానాల్లో 29 రెడ్ అలర్ట్ నియోజకవర్గాలున్నాయి!బరిలోని అభ్యర్థుల్లో ముగ్గురు, అంతకంటే ఎక్కువ మందిపై క్రిమినల్ కేసులుంటే వాటిని రెడ్ అలర్ట్ స్థానాలుగా పరిగణిస్తారు. ఇక 174 (26%) మందిపై క్రిమినల్ కేసులున్నట్టు జార్ఖండ్ ఎలక్షన్ వాచ్, అసోసియేషన్ ఫర్ డెమొక్రాటిక్ రిఫారమ్స్ (ఏడీఆర్) వెల్లడించాయి.వీరిలో ఇందులో 127 (19%) మందిపై తీవ్రమైన క్రిమినల్ కేసులున్నాయి. బీజేపీకి చెందిన 36 మంది అభ్యర్థుల్లో 20 మంది (56%), 17 మంది కాంగ్రెస్ అభ్యర్థుల్లో 11 మంది (65%), 23 మంది జేఎంఎం అభ్యర్థుల్లో 11 (48%) మందిపై క్రిమినల్ కేసులున్నాయి.11 మందిపై మహిళలపై నేరాలకు సంబంధించిన కేసులున్నాయి. అభ్యర్థుల్లో 235 మంది (34%) కోటీశ్వరులు. బీజేపీలో 30 మంది (83%), కాంగెస్లో 18 మంది (78%) కోటీశ్వరులున్నారు. -
PM Narendra Modi: ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల మధ్య... చిచ్చుకు కాంగ్రెస్ కుట్ర
బొకారో: దేశంలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల మధ్య చిచ్చుపెట్టి అధికారం దక్కించుకోవాలన్నదే కాంగ్రెస్ వ్యూహమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దుయ్యబట్టారు. ‘‘ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లు దోచుకోవడానికి కాంగ్రెస్ రాజకుటుంబం కుట్రలు చేస్తోంది. స్వాతంత్య్రం వచి్చనప్పటి నుంచి ఆ వర్గాల ఐక్యతను కాంగ్రెస్ వ్యతిరేకిస్తూనే వస్తోంది. వాటి మధ్య ఐక్యత లేనంతకాలం కేంద్రంలో అధికారం చలాయించి దేశాన్ని లూటీ చేసింది’’ అని ఆరోపించారు. మనం సురక్షితంగా ఉండాలంటే కలసికట్టుగా ఉండాలని మరోసారి పిలుపునిచ్చారు. ఆదివారం జార్ఖండ్లోని బొకారో, గుమ్లా పట్టణాల్లో అసెంబ్లీ ఎన్నికల ప్రచార సభల్లో మోదీ మాట్లాడారు. రాష్ట్రంలోని అధికార కాంగ్రెస్–జేఎంఎం కూటమి ఓబీసీలను కులాలవారీగా ముక్కలు చేయజూస్తోందని మండిపడ్డారు. ఉప కులాల మధ్య మంటలు పెట్టి చలి కాచుకోవాలని చూస్తోందన్నారు. మాఫియాల భరతం పడతాం జార్ఖండ్లో తిష్టవేసిన అక్రమ వలసదార్లను వెళ్లగొట్టాలంటే, అవినీతిని అంతం చేయాలంటే బీజేపీ గెలవాలని మోదీ అన్నారు. ‘‘జేఎంఎం కూటమి పాలనలో పిడికెడు ఇసుక కూడా దొరక్క ప్రజలు ఇబ్బందులు పడ్డారు. పాలకులు మాత్రం ఇసుక దోచుకున్నారు. ఖనిజ సంపద, అడవులు, కొండలు, నదులు, బొగ్గు అన్నీ లూటీ చేశారు. కోట్లు కొల్లగొట్టారు. రిక్రూట్మెంట్ మాఫియా, పేపర్ లీక్ మాఫియాను సృష్టించారు. అవినీతి నేతను వదిలే ప్రసక్తే లేదు. వారిని జైలుకు పంపుతం. మేం గెలిచాక జార్ఖండ్ను అభివృద్ధి చేస్తాం’’ అని మోదీ ఉద్ఘాటించారు. గిరిజనులు ఉన్నత స్థానాలకు చేరితే కాంగ్రెస్ ఓర్వలేదని ఆరోపించారు. గిరిజన బిడ్డ ద్రౌపదీ ముర్ము రాష్ట్రపతి కాకుండా అడ్డుకొనేందుకు ప్రయత్నించిందన్నారు. ఆమెను ఇప్పటికీ అవమానిస్తూనే ఉందని ఆక్షేపించారు. అంబేడ్కర్కు ఘన నివాళి జమ్మూకశ్మీర్లో తొలిసారి ఒక ముఖ్యమంత్రి భారత రాజ్యాంగంపై ప్రమాణ స్వీకారం చేశారని మోదీ అన్నారు. ‘‘ఇది అంబేడ్కర్కు దక్కిన ఘన నివాళి. అక్కడ ఆరి్టకల్ 370ని మళ్లీ తేవాలని కాంగ్రెస్, మిత్రపక్షాలు ప్రయతి్నస్తున్నాయి. అదే జరిగితే అక్కడ రాజ్యాంగం మరోసారి అమలవకుండా పోతుంది. మన సైనికులు ఉగ్రవాదులతో తలపడాల్సి వస్తుంది’’ అన్నారు. రాంచీలో రోడ్ షో జార్ఖండ్ రాజధాని రాంచీలో మోదీ ఆదివారం 3 కిలోమీటర్ల మేర రోడ్ షో నిర్వహించారు. రోడ్డుకు ఇరువైపులా బారులు తీరిన ప్రజలకు అభివాదం చేస్తూ ఆయన ముందుకు సాగారు. #WATCH | Jharkhand: While addressing an election rally at Bokaro, Prime Minister Narendra Modi says, " ...I want to promise you (people), once the govt is formed, to give these corrupt people strictest punishment, we will take this fight to the court. Your money will be spent on… pic.twitter.com/I621Z0bDmB— ANI (@ANI) November 10, 2024చదవండి: 10వ తరగతిలో ఉగ్రవాదిని అవ్వాలనుకున్నా : ఎమ్మెల్యే -
ఆర్టికల్ 370 పునరుద్ధరణపై రాహుల్ గాంధీకి అమిత్ షా వార్నింగ్
రాంచీ: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ రాజ్యాంగానికి సంబంధించిన నకిలీ కాపీని చూపించి అవమానించారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆరోపించారు. మైనారిటీలకు రిజర్వేషన్లు అమలు చేసేందుక కాంగ్రెస్ చేస్తున్న ప్రయత్నాలను బీజేపీ ఎప్పటికీ అనుమతించదని అన్నారు. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా అమిత్ షా.. పాలమూలో నిర్వహించిన సభలో మాట్లాడారు.‘‘రాహుల్ గాంధీ రాజ్యాంగం కాపీని చూపించారు. ఆయన చూపించిన రాజ్యాంగం కాపీ కవర్పై భారత రాజ్యాంగం అని వ్రాసి ఉంది. అందులో ఏ కంటెంట్ లేదు. రాజ్యాంగాన్ని అపహాస్యం చేశాడు. నకిలీ రాజ్యాంగ కాపీతో బీఆర్ అంబేద్కర్ను అవమానించారు. నవంబర్ 26వ తేదీని రాజ్యాంగ దినోత్సవంగా నిర్వహించాలని ప్రధాని నరేంద్ర మోదీ నిర్ణయించారు. ఓబీసీలు, గిరిజనులు, దళితుల నుంచి రిజర్వేషన్లను లాక్కోవడానికి కాంగ్రెస్ ప్రయత్నం చేస్తోంది. ఆ రిజర్వెషన్లనుమైనారిటీలకు ఇవ్వాలని యోచిస్తోంది. ప్రధాని మోదీ నాయకత్వంలో.. మత ఆధారిత రిజర్వేషన్లను బీజేపీ ఎన్నటికీ అనుమతించదు. కశ్మీర్లో ఆర్టికల్ 370ని పునరుద్ధరించడానికి కాంగ్రెస్ ప్రయత్నం చేస్తోంది. కశ్మీర్ భారతదేశంలో అంతర్భాగం. కాంగ్రెస్ నాలుగో తరం కూడా ఆర్టికల్ 370ని తిరిగి తీసుకురాదని నేను రాహుల్ గాంధీని హెచ్చరిస్తున్నా. జార్ఖండ్లో జేఎంఎం నేతృత్వంలోని ప్రభుత్వం.. దేశంలోనే అత్యంత అవినీతి ప్రభుత్వం. ఈ కూటమి ప్రభుత్వాన్ని దించాల్సిన అవసరం ఉంది. ఇక.. అవినీతిపరులను తలకిందులుగా వేలాడదీస్తాం’ అని అన్నారు.ఇక.. జార్ఖండ్లో అసెంబ్లీ ఎన్నికలు నవంబర్ 13, 20 తేదీల్లో రెండు దశల్లో జరగనున్నాయి. నవంబర్ 23న ఫలితాలు విడుదల కానున్నాయి.చదవండి: దారుణం: రైలు ఇంజిన్-బోగీల మధ్య ఇరుక్కుపోయి ఉద్యోగి మృతి -
Jharkhand Elections: నేడు రాహుల్ జార్ఖండ్ రాక.. 20న అభ్యర్థుల ఎంపికపై చర్చ
రాంచీ: లోక్సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నేడు (శనివారం) జార్ఖండ్ రానున్నారు. రాజధాని రాంచీలోని శౌర్య ఆడిటోరియంలో జరిగే రాజ్యాంగ సదస్సులో ఆయన పాల్గొని, 500 మందికి పైగా ప్రతినిధులతో ఆయన సంభాషించనున్నారు.రాహుల్ గాంధీ తన జార్ఖండ్ పర్యటనలో పార్టీ నేతలతో కూడా సమావేశం కానున్నారు. రాహుల్ గాంధీ ఇక్కడి నుంచి ఢిల్లీకి తిరిగి వెళ్లాక అక్టోబర్ 20న కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో జార్ఖండ్ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల ఎంపికపై చర్చించనున్నారు. అదే రోజు మహారాష్ట్రలో కాంగ్రెస్ తమ అభ్యర్థుల పేర్లను ప్రకటించనుంది. కాగా రాష్ట్ర ఎన్నికల కమిటీ సమావేశం కాంగ్రెస్ కార్యాలయంలో జరిగింది. అభ్యర్థుల పేర్లపై సమావేశంలో చర్చించారు. రాష్ట్ర ఇన్చార్జి గులాం అహ్మద్ మీర్ ఈ సమావేశానికి హాజరయ్యారు.ఇండియా కూటమిలో సీట్ల సర్దుబాటు అనంతరం కాంగ్రెస్ తన అభ్యర్థుల జాబితాను ప్రకటించనుంది. ప్రస్తుతం అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో నిమగ్నమై ఉన్నామని కాంగ్రెస్ రాష్ట్ర ఇన్ చార్జి గులాం అహ్మద్ మీర్ మీడియాకు తెలిపారు. అభ్యర్థుల ఎంపికలో పారదర్శకత కొనసాగుతుందన్నారు. సీట్ల పంపకానికి సంబంధించి మూడు దఫాలుగా చర్చించామని, ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్తో కూడా చర్చలు జరిగాయన్నారు.ఇది కూడా చదవండి: మియాపూర్: ‘చిరుత కాదు.. అడవి పిల్లి’ -
తేనెటీగలదాడి.. తల్లీ ముగ్గురు కూతుళ్లు మృతి
రాంచీ:తేనేటీగల దాడిలో తల్లి ముగ్గురు కుమార్తెలు మృతిచెందిన విషాద ఘటన జార్ఖండ్ రాజధాని రాంచీలో జరిగింది.జ్యోతిగడి అనే మహిళ తన ముగ్గురు కుమార్తెలను తీసుకుని వీకెండ్ సరదాగా గడిపేందుకు తన పుట్టింటికి వెళ్లింది. వీరంతా కలిసి శనివారం(సెప్టెంబర్21)అకడున్న ఒక బావిలో స్నానం చేసేందుకు దిగారు.ఇంతలో ఎక్కడినుంచో వచ్చిన తేనెటీగల గుంపు ఒక్కసారిగా వారిపై దాడి చేసింది.దీంతో తల్లీకూతుళ్లు గట్టిగా అరవడంతో చుట్టుపక్కల ఉన్నవారు అక్కడి నుంచి పారిపోయారు తేనెటీగల దాడికి తట్టుకోలేక నలుగురూ బావిలోనే ప్రాణాలు విడిచారు.పోలీసులు నలుగురి మృతదేహాలను బావి నుంచి వెలికితీసి పోస్టమార్టంకు పంపారు. ఇదీ చదవండి: కామాంధుడి చెర నుంచి రక్షించిన కోతులు -
మహిళా జూనియర్ డాక్టర్కు వేధింపులు
రాంచీ: కోల్కతా మహిళా డాక్టర్ హత్యాచారంపై ఆందోళనలు కొనసాగుతుండగానే అలాంటి తరహా ఘటన మరొకటి జార్ఖండ్లో జరిగింది. రాంచీలోని రాజేంద్ర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(రిమ్స్) మెడికల్ కాలేజీ ఆస్పత్రి లిఫ్టులో మహిళా జూనియర్ డాక్టర్ లైంగిక వేధింపులకు గురయ్యారు. వేధింపులకు పాల్పడ్డ వ్యక్తిని పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు. వేధింపులకు గురైన డాక్టర్ ఆంకాలజీ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు.జూనియర్ డాక్టర్కు వేధింపుల ఘటనను నిరసిస్తూ మెడికల్ కాలేజీలో జూనియర్ డాక్టర్లు సమ్మెకు దిగారు. డాక్టర్లకు భద్రత పెంచుతామని ఆస్పత్రి యాజమాన్యం హామీ ఇవ్వడంతో డాక్టర్లు సమ్మె విరమించారు. ప్రతి లిఫ్టులో లిఫ్ట్ ఆపరేటర్ను నియమించడంతో పాటు ఆస్పత్రి క్యాంపస్లోఎ 100 మంది సాయుధులైన భద్రతా సిబ్బందిని మోహరించేందుకు యాజమాన్యం ఒప్పుకుంది. ఇదీ చదవండి.. మమత అబద్దం చెబుతున్నారు: కోల్కతా వైద్యురాలి తల్లి -
జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ భావోద్వేగం
జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ 49వ పుట్టినరోజు ఈరోజు (ఆగస్టు 10). ఈ సందర్భంగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. తన పుట్టినరోజు సందర్భంగా హేమంత్ సోరెన్ తన ఎక్స్ హ్యాండిల్లో ఒక చిత్రాన్ని షేర్ చేశారు. దానిలో పాటు హేమంత్ సోరెన్ ఇలా రాశారు.. ‘నా పుట్టినరోజు సందర్భంగా గత ఏడాది నాటి ఒక జ్ఞాపకం నా మదిలో మెదిలింది. అదే ఈ ఖైదీ గుర్తు.. ఇది జైలు నుండి విడుదలైనప్పుడు నాపై ముద్రించారు. ఈ గుర్తు నాది మాత్రమే కాదు.ప్రజలు ఎన్నుకొన్న ముఖ్యమంత్రిని ఎటువంటి ఆధారాలు లేకుండా 150 రోజులు జైలులో ఉంచారు. అందుకే ఈ గుర్తు సామాన్య గిరిజనులకు, అణగారిన వారికి చెందినది. దోపిడీకి గురవుతున్నవారి విషయంలో ఏమేమి జరుగుతుంటాయో ఎవరికీ చెప్పనవసరం లేదు. అందుకే ఈ రోజు నేను మరింత దృఢంగా నిశ్చయించుకున్నాను.. దోపిడీకి గురవుతున్న అణగారిన, దళిత, వెనుకబడిన, గిరిజన, ఆదివాసీలకు మద్దతుగా పోరాడాలనే నా సంకల్పాన్ని బలపరుచుకుంటున్నాను.హింసకు గురవుతూ, న్యాయం అందని ప్రతి వ్యక్తికి, సమాజానికి మద్దతుగా నేను నా గొంతును విప్పుతాను. చట్టం అందరికీ సమానమే. అధికార దుర్వినియోగం లేని సమాజాన్ని మనం నిర్మించాలి. అయితే ఈ మార్గం అంత సులభం కాదు. ఇందుకోసం మనం ఎన్నో సవాళ్లను ఎదుర్కోవలసి ఉంటుంది. అయితే మనమంతా కలిస్తే ఈ సవాళ్లను అధిగమించగలమనే నమ్మకం నాకుంది. ఎందుకంటే మన దేశంలోని భిన్నత్వంలోని ఏకత్వమే మన బలం’ అని అన్నారు. आज अपने जन्मदिन के मौक़े पर बीते एक साल की स्मृति मेरे मन में अंकित है - वह है यह कैदी का निशान - जो जेल से रिहा होते वक्त मुझे लगाया गया। यह निशान केवल मेरा नहीं, बल्कि हमारे लोकतंत्र की वर्तमान चुनौतियों का प्रतीक है।जब एक चुने हुए मुख्यमंत्री को बिना किसी सबूत, बिना कोई… pic.twitter.com/TsKovjS1HY— Hemant Soren (@HemantSorenJMM) August 10, 2024 -
జార్ఖండ్ సీఎంగా మళ్లీ హేమంత్ సొరేన్!
రాంచీ: జార్ఖండ్ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ సీఎం హేమంత్ సొరేన్ మరోసారి ముఖ్యమంత్రి చేపట్టబోతున్నట్లు సమాచారం. తమ నేతగా హేమంత్ సోరెన్ను ఎన్నుకుంటూ జార్ఖండ్ శాసనసభాపక్ష సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.ఇదిలా ఉండగా.. జార్ఖండ్లో మనీలాండరింగ్ కేసులో ఈడీ అరెస్ట్ చేయడంతో హేమంత్ సొరేన్ జైలుకు వెళ్లారు. అనంతరం, జూన్ 28వ తేదీన రాంచీ హైకోర్టు బెయిల్ ఇవ్వడంతో సొరేన్ బయటకు వచ్చారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత సీఎం చంపై సొరేన్ స్థానంలో హేమంత్ సొరేన్ మళ్లీ బాధత్యలు చేపట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో సీఎం చంపై సొరేన్ అధికారిక కార్యక్రమాలను కూడా ఆయన రద్దు చేసుకున్నారు. -
నీట్ పేపర్ లీక్: జర్నలిస్ట్ను అరెస్ట్ చేసిన సీబీఐ
రాంచీ: నీట్ యూజీ-2024 పరీక్ష ప్రశ్నపత్రం లీకేజీ, అవకతవకలే దేశంవ్యాప్తంగా దుమారం రేపుతోంది. నీట్ పరీక్షను రద్దు చేయాలని విక్షాలు, విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. మరోవైపు.. ప్రశ్న లీకేజీ కేసులో సీబీఐ దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. సీబీఐ తాజాగా శనివారం ప్రశ్నపత్రం లీకేజీతో సంబంధాలు ఉన్నాయని జార్ఖండ్లోని హజారీబాగ్కు చెందిన ఓ జర్నలిస్ట్ను అరెస్ట్ చేసింది. ఓ హింది న్యూస్ పేపర్లో పనిచేసే.. జమాలుద్దీన్ అనే జర్నలిస్ట్ పేపర్ లీకేజీలో ఒయాసిస్ స్కూల్ ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్కు సాయం చేసినట్లు అభియోగాలతో సీబీఐ అదుపులోకి తీసుకుంది. ఇప్పటికే ఒయాసిస్ స్కూల్ ప్రిన్సిపల్ ఎహసానుల్ హక్, వైస్ ప్రిన్సిపల్ ఇంతియాజ్ ఆలంకు శుక్రవారం సీబీఐ అరెస్ట్ చేసింది.అదేవిధంగా గుజరాత్లోని 7 వేర్వేరు ప్రాంతాల్లో సీబీఐ బృందాలు సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి. గోద్రా, ఖేడా, అహ్మాదాబాద్, అనంద్ సోదాలు నిర్వహించింది. ఈకేసులో ఎఫ్ఐఆర్ ఆధారంగా గోద్రా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి సీబీఐ తొలిసారిగా ఇద్దరు నిందితులను పట్నాలో అరెస్టు చేసింది. నిందితులను మనీశ్ కుమార్, ఆశుతోష్గా గుర్తించారు. -
మనీలాండరింగ్ కేసు: జైలులో ఉన్న జార్ఖండ్ మంత్రి రాజీనామా
రాంచి: మనీలాండరింగ్ కేసులో జైలులో ఉన్న అలంగీర్ ఆలం మంత్రి పదవికి రాజీనామా చేశారు. అలంగీర్ ఆలం మంత్రి పదవికి, కాంగ్రెస్ పక్ష నేత పదవికి రాజీనామా చేసినట్లు ఆయన కుమారుడు తన్వీర్ ఆలం వెల్లడించారు. జూన్ 8 (శనివారం) ఆయన రాజీనామా చేసి.. రిజైన్ లెటర్ను అదే రోజు సీఎం కార్యాలయానికి పంపించారు. అయితే ఆయన రాజీనామా లేఖ జార్ఖండ్ సీఎం చంపయ్ సోరెన్ ఆఫీసుకు సోమవారం చేరినట్లు తన్వీర్ తెలిపారు. అలంగీర్ ఆలం రాజీనామా చేసినట్లు జార్ఖండ్ కాంగ్రెస్ చీఫ్ రాజేశ్ ఠాకూర్ నిర్ధారించారు. మనీలాండరింగ్ కేసులో అలంగీర్ను దర్యాప్తు చేయటం కోసం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మే15న అరెస్ట్ చేసింది. మే 6 అలంగీర్ ఆలం వ్యక్తిగత కార్యదర్శి సంజీవ్ లాల్ పని మనిషి జహంగీర్ ఆలం ఇంట్లో ఈడీ సోదాలు చేపట్టింది. ఈడీకి సుమారు రూ. 37 కోట్ల భారీ నగదు పట్టుబడిన విషయం తెలిసిందే. భారీగా నగదు పట్టుబడటం జార్ఖండ్లో సంచలనం రేపింది. అలంగీర్ ఆలంతోపాటు సంజీవ్ లాల్ను కూడా ఈడీ అరెస్ట్ చేసింది. జార్ఖండ్ రూరల్ డెవలప్మెంట్ డిపార్టుమెంట్ మాజీ చీఫ్ ఇంజనీర్ వీరేంద్ర కె రామ్ మనీలాండరింగ్ కేసుతో సంబంధం ఉందన్న అనుమానంతో ఈడీ జహంగీర్ ఆలం ఇంటిపై సోదాలు చేసింది. వీరేంద్ర కె రామ్ గతేడాది అరెస్ట్ అయ్యారు. రూరల్ డెవలప్మెంట్ డిపార్టుమెంట్కు సంబంధించిన పలు స్కీముల్లో అక్రమాలకు పాల్పడినట్లు ఆయనపై ఆరోపణలు ఉన్నాయి.చదవండి: మంత్రి పీఎస్ పనిమనిషి ఇంట్లో కోట్లు -
పాయింట్ బ్లాంక్లో డీజేపై కాల్పులు
రాంచీ: జార్ఖండ్ రాజధాని రాంచీలో సోమవారం(మే27) తెల్లవారుజామున షాకింగ్ ఘటన జరిగింది. నగరంలోని ఓ బార్లో పనిచేస్తున్న డీజే సందీప్ను దుండగులు పాయింట్బ్లాక్ రేంజ్లో కాల్చి చంపారు. తొలుత ఆదివారం రాత్రి నలుగురు దుండగుల బ్యాచ్ బార్లోకి ప్రవేశించింది. బార్లో డీజే మ్యూజిక్ ప్లే చేస్తుండటంపై వారు అభ్యంతరం తెలిపారు. ఈ విషయమై డీజే సందీప్తో పాటు బార్ నిర్వాహకులతో వాగ్వాదానికి దిగారు. అనంతరం వారు వెళ్లిపోయారు. గొడవ సద్దుమణిగిందనుకునేలోపు మళ్లీ సోమవారం తెల్లవారుజామున ఒంటిగంట ప్రాంతంలో వచ్చి పాయింట్ బ్లాంక్ రేంజ్లో డీజే సందీప్ను తుపాకీతో ఛాతిపై కాల్చారు. వెంటనే సందీప్ను ఆస్పత్రికి తీసుకెళ్లినా ఫలితం దక్కలేదు. చికిత్స పొందుతూ అతడు మృతి చెందాడు. సందీప్ను ఛాతిపై తుపాకీతో కాల్చే దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. -
MS Dhoni: ఓటేసిన ధోని.. వీడియో వైరల్
టీమిండియా దిగ్గజ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని తన ఓటు హక్కును వినియోగించుకున్నాడు. స్వస్థలం రాంచిలో శనివారం ఓటు వేశాడు. కాగా లోక్సభ ఎన్నికలు-2024లో భాగంగా ఆరో విడత పోలింగ్ జరుగుతోంది.ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లో కలిపి మొత్తంగా 58 లోక్సభ స్థానాలకు శనివారం ఎన్నికలు నిర్వహిస్తున్నారు. బిహార్లో ఎనిమిది, హర్యానాలో పది, జమ్మూ-కశ్మీర్లో ఒకటి, జార్ఖండ్లో నాలుగు, ఢిల్లీలో ఏడు, ఒడిశాలో ఆరు, ఉత్తరప్రదేశ్లో పద్నాలుగు, పశ్చిమ బెంగాల్లో ఎనిమిది స్థానాలకు పోలింగ్ జరుగుతుండగా.. 889 మంది అభ్యర్థులు తమ అదృష్టం పరీక్షించుకుంటున్నారు.భారీ భద్రత నడుమ ఓటేసిన ధోనిఈ నేపథ్యంలో ధోని కుటుంబంతో సహా రాంచిలోని సమీప పోలింగ్ బూత్కు వెళ్లి ఓటేశాడు. ఈ క్రమంలో మిగతా ఓటర్లు అతడిని చుట్టుముట్టారు. ఫొటోలు, వీడియోలు తీసేందుకు ఉత్సాహం చూపించారు. అయితే, భారీ భద్రత నడుమ ధోని ఓటేసి వచ్చాడు.ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతుండగా.. భారత ఎన్నికల సంఘం సైతం.. ‘‘తలా ఫర్ రీజన్’’ అంటూ ప్రజాస్వామ్యంలో ధోని సిక్సర్ బాదాడంటూ ఫొటోను షేర్ చేసింది.ఇదిలా ఉంటే.. మరో మాజీ క్రికెటర్లు కపిల్ దేవ్, గౌతం గంభీర్, రెజ్లర్ బబితా ఫొగట్ తదితరులు తమ నియోజకవర్గాల్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు.ప్లే ఆఫ్స్ కూడా చేరకుండానేఇక ఐపీఎల్-2024 ఆరంభానికి ముందే చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్గా వైదొలిగిన ధోని.. ఆ బాధ్యతలను రుతురాజ్ గైక్వాడ్కు అప్పగించాడు. తాను మాత్రం వికెట్ కీపర్ బ్యాటర్గా కొనసాగాడు.వింటేజ్ ధోనిని గుర్తుచేస్తూ కళ్లు చెదిరే క్యాచ్లు అందుకోవడంతో పాటు మెరుపు ఇన్నింగ్స్తో అభిమానులను ఆకట్టుకున్నాడు. మొత్తంగా 14 మ్యాచ్లు ఆడి 161 పరుగులు సాధించాడు.అయితే, డిఫెండింగ్ చాంపియన్ చెన్నై ఈసారి కనీసం ప్లే ఆఫ్స్ చేరకుండానే నిష్క్రమించింది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో కీలక మ్యాచ్లో ఓడిపోయి ఇంటిబాట పట్టింది. ఈ క్రమంలో కొద్దిరోజుల క్రితమే జార్ఖండ్ చేరుకున్న ధోని కుటుంబానికి సమయం కేటాయించాడు.#WATCH | Jharkhand: Former Indian Captain MS Dhoni arrives at a polling station in Ranchi, to cast his vote for the sixth phase of #LokSabhaElections2024 pic.twitter.com/W5QQsIu90C— ANI (@ANI) May 25, 2024 -
గుట్టలుగా... అవినీతి కట్టలు
ఆరు కౌంటింగ్ మిషన్లు... పదుల కొద్దీ సిబ్బంది... 12 గంటల పైగా లెక్కింపు... 32 కోట్లకు పైగా విలువైన నగదు... దాదాపు అన్నీ అయిదొందల నోట్లు. జార్ఖండ్ రాజధాని రాంచీలోని గాడీఖానా చౌక్లోని ఆ చిన్న రెండు బెడ్రూమ్ల ఫ్లాట్లో అంత పెద్ద మొత్తం, పెద్ద పెద్ద సంచీల కొద్దీ నోట్ల కట్టలు ఉంటాయని ఎవరూ ఊహించరు. రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖలో పేరుకుపోయిన అవినీతికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోమవారం నాటి సోదాల్లో ఎదురైన దృశ్యాలే కళ్ళుచెదిరే సాక్ష్యాలు. సదరు శాఖ మంత్రి గారి వ్యక్తిగత కార్యదర్శి ఇంట, ఆ కార్యదర్శికి పనివాడి ఫ్లాట్లో, ఇతరుల వద్ద సోదాల్లో మొత్తం కలిపి రూ. 35 కోట్ల పైనే బయటపడేసరికి అంతా అవాక్కయ్యారు. అంతలేసి ధనం లెక్కాపత్రం లేకుండా ఎవరింట్లోనైనా ఉందంటే, అది అక్రమధనం కాక మరేమిటి? ‘ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్’ (పీఎంఎల్ఏ) కింద వారిద్దరినీ అరెస్ట్ చేశారు. ఇక, మంగ ళవారం రాంచీలో మరో 5 చోట్ల సోదాలు జరిపితే, ఓ కాంట్రాక్టర్ వద్ద 1.5 కోట్లు దొరికాయి. పశ్చిమ బెంగాల్, ఒడిశా, జార్ఖండ్... ఇలా ప్రాంతాలు, ప్రభుత్వాలు ఏవైనా సోదా చేస్తే చాలు... నల్లధనం విశ్వరూపం గుట్టల కొద్దీ కట్టల రూపంలో సాక్షాత్కరిస్తున్న తీరు ఆందోళనకరం.జార్ఖండ్ గ్రామీణాభివృద్ధి శాఖలో పై నుంచి కింద దాకా సమస్తం అవినీతిమయమేనని ఈడీ మాట. తీగ లాగితే డొంకంతా కదలడానికి తాజా కేసు ఉదాహరణ. గత ఏడాది ఫిబ్రవరిలో ఆ రాష్ట్ర∙గ్రామీణాభివృద్ధి శాఖలో ఛీఫ్ ఇంజనీర్ వీరేంద్రరామ్ను ఈడీ అరెస్ట్ చేసింది. కేవలం పదివేల రూపాయల లంచం తీసుకున్నందుకు జరిగిన ఆ అరెస్టు కథ చివరకు అనూహ్యంగా ఇంత పెద్ద కరెన్సీ గుట్టు విప్పింది. ప్రభుత్వ అధికార యంత్రాంగంలో చిన్నస్థాయిలోనే ఉన్నప్పటికీ, అవినీతి పరులైన ఉద్యోగులు నిఘా సంస్థల కంటబడకుండా తమ అక్రమార్జనను ఎలా తరలిస్తున్నదీ వీరేంద్రరామ్ విచారణలో తెలిసింది. సంక్లిష్టమైన అవినీతి వ్యవస్థలో తాను, తన లాంటి అధికారుల కోటరీ ఎలా భాగమైనదీ, టెండర్ల ప్రక్రియ సందర్భంగా లంచం సొమ్మును వివిధ మార్గాల్లో తరలించే పద్ధతీ ఆయన బయటపెట్టారు. ఆ వివరాలకు తగ్గట్లే... గ్రామీణాభివృద్ధి శాఖలో విస్తృతంగా అవినీతి సాగుతోందని గ్రహించిన ఈడీ తగిన చర్య చేపట్టాల్సిందిగా గత ఏడాది మేలోనే రాష్ట్ర సర్కారుకు గోప్యంగా లేఖ రాసింది. దానికి రాష్ట్ర ప్రభుత్వ అధికారులు పెద్దగా స్పందించలేదు. పైగా, నిఘా నీడలోని అవినీతి అధికారుల చేతిలోనే ఆ లేఖ పడడం విడ్డూరం.తిరుగులేని సాక్ష్యాధారాలు లభించడంతో గ్రామీణాభివృద్ధి మంత్రి ఆలంగిర్ ఆలమ్ వ్యక్తిగత కార్యదర్శి సంజీవ్లాల్ సహా పలువురు కీలక అనుమానితులపై ఈ సోమవారం ఈడీ దాడులు జరిపింది. కాంట్రాక్టులు ఇస్తూ అవినీతి ముఠాలో కీలకంగా వ్యవహరిస్తూ, లాల్ కోట్లు కూడ బెట్టారట. లాల్ పనివాడి ఇంట్లో ఏకంగా రూ. 32 కోట్ల పైగా డబ్బు గుట్టలుగా దొరకడంతో వ్యవహారం సంచలనమైంది. ఇదికాక, మరో వ్యక్తి ఇంట్లో మరో 3 కోట్లు దొరికిందంటే, అక్కడి ప్రభుత్వ శాఖలో ఏ స్థాయిలో అక్రమాలు, అవినీతి రాజ్యమేలుతున్నాయో అర్థమవుతోంది. ఈడీ దాడుల్లో లభించిన దస్తావేజులను బట్టి ముందుగా ఊహించిట్టే ఇందులో మంత్రి గారి హస్తం ఉండనే ఉందని రుజువవుతోంది. ఆయన మెడకు ఉచ్చు బిగుస్తోంది. జార్ఖండ్లోని పాకూర్ నుంచి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన డెబ్భై ఏళ్ళ ఈ సీనియర్ కాంగ్రెస్ నేతను ఈడీ ప్రశ్నించడమే ఇక బాకీ. పనివాడినీ, అతని ఇంటిని అవినీతి సొమ్ముకు గిడ్డంగిగా మార్చిన వ్యక్తిగత కార్యదర్శినీ అరెస్ట్ చేసినా అమాత్యవర్యులు అదరక, బెదరక అమాయకత్వం ప్రకటిస్తుండడం విడ్డూరం. జార్ఖండ్లోని చంపాయ్ సోరెన్ ప్రభుత్వంపై పడ్డ ఈ అవినీతి మచ్చ ఎన్నికల ప్రచారంలో బీజేపీకి బాగా అంది వస్తోంది. కాంగ్రెస్కు పెద్దదిక్కయిన గాంధీ కుటుంబానికి సన్నిహితులైన వారి ఇళ్ళల్లోనే గతంలోనూ, మళ్ళీ ఇప్పుడూ... ఇంత భారీగా అక్రమ ధనం లభించడాన్ని వివిధ రాష్ట్రాల ఎన్నికల ప్రచారంలో మోదీ ప్రస్తావిస్తున్నారు. అవినీతిని ఆపడానికి తాను ప్రయత్నిస్తుంటే, కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు తమను విమర్శిస్తున్నాయని ఆయన వాదన. కాగా, ఇదంతా ప్రత్యర్థులే లక్ష్యంగా మోదీ సర్కార్ సాగిస్తున్న దర్యాప్తు సంస్థల దుర్వినియోగమని ప్రతిపక్ష కూటమి ఆరోపణ. గత డిసెంబర్లో జార్ఖండ్ కాంగ్రెస్ ఎంపీ ధీరజ్ సాహూకు చెందిన ఒడిశా మద్యం డిస్టిలరీల్లో ఆదాయపు పన్ను శాఖ సోదాలు జరిపితే, కనివిని ఎరుగని రీతిలో రూ. 350 కోట్ల పైగా మొత్తం దొరికిన సంగతి తెలిసిందే. పరస్పర ఆరోపణలెలా ఉన్నా, ఈ ఘటనలన్నీ ప్రమాదకరమైన పరిణామాన్ని సూచిస్తు న్నాయి. అక్రమధనంపై దీర్ఘకాలంగా దేశవ్యాప్త ఉద్యమం జరుగుతూనే ఉంది. దర్యాప్తు సంస్థలు చురుగ్గానే ఉన్నాయి. అయినా సమస్య తీరకపోగా, కొత్తవి బయటపడడం పెను సవాలు. అవినీతిని అంతం చేసి, అక్రమధనాన్ని అందరికీ పంచిపెడతామంటూ ప్రగల్భాలు పలికిన నేతలు గత పదేళ్ళుగా గద్దె మీదే ఉన్నారు. అవినీతి, కుటుంబ పాలనపై పోరాటమని చెబుతూనే వస్తున్నారు. ఫలితం శూన్యం. పెద్దనోట్ల రద్దు లాంటివి ఎంత విఫలయత్నాలో అర్థమవుతూనే ఉంది. ఈడీ, ఐటీ, సీబీఐ కేసుల్లో నిందితులైన నేతలు సైతం జెండా మార్చి, కాషాయం కప్పుకుంటే పరమ పునీతులైపోతున్న పరిస్థితులూ చూస్తున్నాం. ఏలికల చేతుల్లో ఏజెన్సీలు, పీఎంఎల్ఏ లాంటి అసమంజస కఠిన చట్టాలున్నా సమస్య తీరకపోవడానికి కారణమేమిటో ఆలోచించాలి. ఇవాళ వ్యాపారం, రాజకీయాలు, సమాజం ఏ స్థితికి చేరాయో గ్రహించాలి. నేతలు, అధికారులు, వ్యాపారులు కుమ్మక్కై ఒకరి కోసం ఒకరు నడిచే తీరు దేశానికి క్షేమం కాదు. ఎన్నికల వేళ ఈ అక్రమధనం పెనుసమస్య. దాని పర్యవసానాలు ఎన్నికలపైనే కాదు, ఆ తర్వాతా ఉంటాయని విస్మరించరాదు. -
జార్ఖండ్లో బర్డ్ ఫ్లూ.. ఆరోగ్యశాఖ అప్రమత్తం!
జార్ఖండ్లో బర్డ్ ఫ్లూ విస్తరిస్తోంది. రాంచీలోని పౌల్ట్రీ ఫామ్లో బర్డ్ ఫ్లూ కేసులు నమోదవడంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమయ్యింది. హోత్వార్లోని ప్రాంతీయ పౌల్ట్రీ ఫామ్లో కేసులు నిర్ధారణ అయిన దరిమిలా పలు కోళ్లతో సహా నాలుగు వేల వివిధ రకాల పక్షులను అంతమొందించారు. వందలాది గుడ్లను ధ్వంసం చేశారు. ఏవియన్ ఫ్లూ(బర్డ్ ఫ్లూ) కనిపించిన ప్రాంతం నుంచి ఒక కిలోమీటరు పరిధిలో చికెన్, కోళ్లు, గుడ్లు అమ్మకాలను నిషేధించారు. రానున్న రోజుల్లో ప్రాంతీయ పౌల్ట్రీ ఫామ్లోని కోళ్లను శాస్త్రీయ పద్ధతుల ద్వారా తొలగించనున్నారు. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు కోళ్లు, ఇతర పక్షులు, గుడ్లు కొనుగోళ్లు, అమ్మకాలపై పూర్తి నిషేధం ఉంటుందని ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. జిల్లా వైద్యశాఖ అధికారులు బర్డ్ ఫ్లూ ప్రభావిత ప్రాంతంలోని ఇంటింటికీ తిరుగుతూ అక్కడివారిని అప్రమత్తం చేస్తున్నారు. మరోవైపు రాష్ట్ర పశుసంవర్ధక శాఖ కూడా చనిపోయిన పక్షులు కనిపిస్తే తమకు తెలియజేయాలని ప్రజలను కోరింది. బర్డ్ ఫ్లూ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టింది. -
మాజీ సీఎం హేమంత్ సోరెన్ కేసులో కీలకం కానున్న టీవీ, రిఫ్రిజిరేటర్
రాంచీ : జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ మనీ ల్యాండరింగ్ కేసులో టీవీ, రిఫ్రిజిరేటర్లు కీలకం కానున్నట్లు తెలుస్తోంది. రూ.31 కోట్ల కంటే ఎక్కువ విలువైన 8.86 ఎకరాల భూమిని అక్రమంగా సంపాదించారని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తన వాదనను సమర్ధించేందుకు కీలకమైన సాక్ష్యాలలో రిఫ్రిజిరేటర్, స్మార్ట్ టీవీ ఇన్వాయిస్లను స్వీకరించింది. ఈడీ రాంచీకి చెందిన ఇద్దరు డీలర్ల నుండి ఈ రశీదులను పొందింది. సోరెన్తో పాటు మరో నలుగురిపై దాఖలు చేసిన ఛార్జ్ షీట్లో వాటిని జత చేసింది. సంతోష్ ముండా పేరుమీద ఈడీ వర్గాల సమాచారం మేరకు..హేమంత్ సోరెన్ ఈడీ సేకరించిన టీవీ, రిఫ్రిజిరేటర్లను తన కుటుంబసభ్యుడు సంతోష్ ముండా పేరుమీద తీసుకున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు ఈ సంతోష్ ముండానే సోరెన్ కొనుగోలు చేసిన 8.86 ఎకరాల ల్యాండ్ వ్యవహరాలను గత 14 నుంచి 16 ఏళ్ల నుంచి చూసుకుంటున్నట్లు ఈడీ గుర్తించింది. సోరెన్కు ఈడీ సమన్లు.. రంగంలోకి పహాన్ మనీ ల్యాండరింగ్ కేసులో అరెస్టైన మాజీ సీఎం హేమంత్ సోరెన్ ఆ 8.86 ఎకరాల ల్యాండ్కు తనకు సంబంధం లేదని ఈడీ అధికారులతో వాదించారు. అందుకు కౌంటర్గా ఈడీ అధికారులు సంతోష్ ముండా నుంచి స్టేట్మెంట్ తీసుకున్నారు. అంతేకాదు, మనీ ల్యాండరింగ్ కేసులో ఈడీ తొలిసారి గతేడాది ఆగస్టులో హేమంత్ సోరెన్కు సమన్లు జారీ చేసింది. ఆ సమన్లు జారీ చేసిన వెంటనే రాజ్కుమార్ పహాన్ అనే వ్యక్తి ఆ 8.86 ఎకరాల భూమి తనతోపాటు మరికొందరి ఆధీనంలో ఉందని, ఇతర యజమానుల పేరిట ఉన్న మ్యుటేషన్ రద్దు చేయాలని రాంచీ డిప్యూటీ కమిషనర్కు లేఖ రాశారు. తద్వారా తన ఆస్తిని కాపాడుకోవచ్చని ఆ లేఖలో పేర్కొన్నారు. ఖండించిన ఈడీ రాజ్కుమార్ పహాన్ లేఖను ఈడీ ఖండించింది. సోరెన్ తన ఆస్తుల్ని సంరక్షించుకునేందుకు బినామీల పేరిట రాశారని ఆరోపిస్తోంది. సోరెన్ ఆదేశానుసారం సంతోష్ ముండాకు ఆస్తి సంరక్షకుని బాధ్యతను అప్పగించారని ఈడీ చెబుతోంది. కేసులో మరొక నిందితుడు హిలారియాస్ కచాప్ అక్కడ విద్యుత్ మీటర్ను అమర్చారని వెల్లడించింది. ఇక సోరెన్ సంతోష్ ముండా పేరుమీద ఫిబ్రవరి 2017లో రిఫ్రిజిరేటర్ కొనుగోలు చేయగా, నవంబర్ 2022లో అతని కుమార్తె పేరు మీద స్మార్ట్ టీవీని రాంచీలో భూమి ఉన్న చిరునామాలో కొనుగోలు చేసినట్లు ఈడీ అధికారులు తెలిపారు. ఆధారాల్ని తారుమారు చేసే ప్రయత్నం సంతోష్ ముండాతో పాటు, రాజ్కుమార్ పహాన్లు హేమంత్ సోరెన్ను రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారని, తద్వారా ఆస్తి పహాన్ అతని కుటుంబ సభ్యుల ఆధీనంలో ఉన్నట్లు చూపించి సోరెన్ను రక్షించేలా సాక్ష్యాలు తారుమారు చేయడం, అతని ఆస్తులు బయట పడకుండా దాచిపెట్టే ప్రయత్నం జరుగుతోందంటూ ఈడీ చెబుతోంది. జ్యుడీషియల్ కస్టడీలో హేమంత్ సోరెన్ కాగా, సీఎం పదవికి రాజీనామా చేసిన కొద్దిసేపటికే హేమంత్ సోరెన్ను మనీలాండరింగ్ కేసులో జనవరి 31న ఈడీ అరెస్టు చేసింది. ప్రస్తుతం సోరెన్ రాంచీలోని హోత్వార్లోని బిర్సా ముండా జైలులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. -
భారత్లో ‘మినీ లండన్’? వేసవి విడిది ఎందుకయ్యింది?
‘మెక్క్లస్కీగంజ్’.. భారత్లోని ‘మినీ లండన్’గా పేరుగాంచింది. పచ్చని చెట్లు, అందమైన పర్వతాల నడుమ ఈ ప్రాంతం ఉంది. వేసవిలో పర్యాటకులు సేదతీరేందుకు ఇక్కడికి తరలివస్తుంటారు. ఇంతకీ ఈ గ్రామం ఎక్కడుంది? దీనికి ‘మినీ లండన్’ అనే పేరు ఎందుకు వచ్చిందనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. జార్ఖండ్ రాజధాని రాంచీకి 60 కిలోమీటర్ల దూరంలో పర్వతాలపై ‘లండన్ గ్రామం’గా పేరొందిన మెక్క్లస్కీగంజ్ ఉంది. దీనిని ‘ఇంగ్లీష్ గ్రామం’ అని కూడా పిలుస్తారు. పచ్చదనంతో పాటు ప్రకృతి అందాలకు ఈ ప్రాంతం ప్రసిద్ధి చెందింది. వేసవిలో ఉష్ణోగ్రతలు తారాస్థాయికి చేరినప్పుడు దేశంలోని పలువురు పర్యాటకులు మెక్క్లస్కీగంజ్ వచ్చి సేదతీరుతుంటారు. ఇక్కడి సహజ వాతావరణం పర్యాటకులకు ప్రశాంతతను అందిస్తుంది. ఇక్కడకు చేరుకోవడానికి వంకరగా ఉండే రోడ్లు దూరం నుంచి అద్భుతంగా కనిపిస్తాయి. రోడ్డుకు ఇరువైపులా ఉన్న భారీ చెట్లు, ఆహ్లాదకరమైన వాతావరణం పర్యాటకులను మరో లోకానికి తీసుకువెళుతుంది. ఇక్కడ డేగా డేగి నది ఉంది. ఈ నది ఒడ్డున పర్యాటకులు యోగాను అభ్యసిస్తుంటారు. మెక్క్లస్కీగంజ్ నాడు బ్రిటిష్ వారి వేసవి విడిది. బ్రిటీష్ పాలకులు ఇక్కడ బంగ్లాలు నిర్మించారు. ఇప్పుడివి శిథిలావస్థలో ఉన్నాయి. పర్వతాలతో కూడిన ఈ ప్రాంతాన్ని ఒకసారి సందర్శించాక మళ్లీమళ్లీ ఇక్కడకు రావాలని అనిపిస్తుందని పలువురు పర్యాటకులు చెబుతుంటారు. నేటికీ కొందరు ఆంగ్లో-ఇండియన్లు మెక్క్లస్కీగంజ్లో నివసిస్తున్నారు. వారు ఇక్కడికి వచ్చే పర్యాటకులతో తమ పాత జ్ఞాపకాలను పంచుకుంటారు. దట్టమైన అడవుల మధ్య ఉన్న ఈ ‘లిటిల్ ఇంగ్లాండ్ ఆఫ్ ఇండియా’ పర్యాటకులు మెచ్చిన ప్రాంతంగా పేరొందింది. -
Joe Root: రూట్ సరికొత్త చరిత్ర! ఇప్పటికి ఒకే ఒక్కడు..
‘‘రూట్ నుంచి ఇంత వరకు తన స్థాయికి తగ్గ ఇన్నింగ్స్ రాలేదు. అనూహ్య రీతిలో బంతితో రాణిస్తున్నాడే తప్ప బ్యాట్తో మ్యాజిక్ చేయలేకపోతున్నాడు’’.. టీమిండియాతో తాజా టెస్టు సిరీస్లో భాగంగా తొలి మూడు మ్యాచ్ల ప్రదర్శన ఆధారంగా ఇంగ్లండ్ బ్యాటర్ జో రూట్పై వచ్చిన విమర్శలు. అయితే, వాటన్నింటికీ నాలుగో టెస్టు సందర్భంగా బ్యాట్తోనే సమాధానమిచ్చాడు రూట్. రాంచి మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది ఇంగ్లండ్. టీమిండియా అరంగేట్ర పేసర్ ఆకాశ్ దీప్ ధాటికి 47 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ క్రమంలో జట్టును గట్టెక్కించే బాధ్యత తీసుకున్న రూట్.. బజ్బాల్ అంటూ దూకుడు ప్రదర్శించకుండా అచ్చమైన సంప్రదాయ క్రికెట్ ఆడాడు. ఓవైపు వికెట్లు పడుతున్నా ఏమాత్రం ఏకాగ్రత చెదరనీయక.. పట్టుదలగా నిలబడి 219 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. తన కెరీర్లో 139 టెస్టు ఆడుతున్న రూట్.. 31వ శతకం నమోదు చేశాడు. ఇక ఓవరాల్గా రూట్కు ఇది 31వ టెస్టు సెంచరీ కాగా.. టీమిండియాపై పదవది. తద్వారా భారత్పై అత్యధిక టెస్టు శతకాలు బాదిన క్రికెటర్గా రూట్ చరిత్రకెక్కాడు. టీమిండియాపై అత్యధిక టెస్టు సెంచరీలు ►10- జో రూట్(ఇంగ్లండ్- 52 ఇన్నింగ్స్*) ►9- స్టీవెన్ స్మిత్(ఆస్ట్రేలియా- 37) ►8- గ్యారీ సోబర్స్ (వెస్టిండీస్- 30) ►8- వివ్ రిచర్డ్స్ (వెస్టిండీస్- 41) ►8- రికీ పాంటింగ్ (ఆస్ట్రేలియా- 51) -
అందుకే ధోని అలా చేస్తున్నాడు: ఆసీస్ దిగ్గజ క్రికెటర్
టీమిండియా దిగ్గజ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని మరోసారి మైదానంలో మెరుపులు మెరిపించేందుకు సిద్ధమవుతున్నాడు. ఐపీఎల్-2024లో డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ తరఫున బరిలోకి దిగేందుకు ఇప్పటికే ప్రాక్టీస్ మొదలుపెట్టాడు ఈ మిస్టర్ కూల్. ఇందులో భాగంగా 42 ఏళ్ల మహి.. నెట్ సెషన్స్లో పాల్గొంటూ బ్యాటింగ్ చేస్తున్నాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట ప్రత్యక్షమయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రాక్టీస్ సమయంలో ధోని ఉపయోగించిన బ్యాట్పై అభిమానుల దృష్టి పడింది. ముఖ్యంగా.. ఆ బ్యాట్ మీద ప్రైమ్ స్పోర్ట్స్ పేరిట ఉన్న స్టిక్కర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ధోని స్వస్థలం రాంచికి చెందిన పరమ్జిత్ సింగ్ అనే వ్యక్తికి చెందిన షాపు పేరు అది. క్రికెటర్గా ఎదుగుతున్న సమయంలో తనకు సాయం అందించిన పరమ్జిత్ షాపును ప్రమోట్ చేస్తూ ధోని తీసుకున్న ఈ నిర్ణయం అభిమానుల మనసు దోచుకుంది. ఈ విషయంపై స్పందించిన ఆస్ట్రేలియా దిగ్గజ వికెట్ కీపర్ ఆడం గిల్క్రిస్ట్ ధోనిపై ప్రశంసలు కురిపించాడు. ‘‘ఎంఎస్ ధోని నెట్స్లో బ్యాటింగ్ చేయడం చూశాను. అతడి బ్యాట్పై కొత్త స్టిక్కర్ కనిపించింది. MS Dhoni with the 'Prime Sports' sticker bat. It is owned by his friend. MS thanking him for all his help during the early stage of his career. pic.twitter.com/sYtcGE6Qal — Mufaddal Vohra (@mufaddal_vohra) February 7, 2024 తన స్కూల్మేట్కు చెందిన స్థానిక స్పోర్ట్స్ స్టోర్ పేరు అది. తన స్నేహితుడి షాపులో అమ్మకాలు పెంచడం కోసం ధోని ఇలా తన బ్యాట్పై ఆ స్టిక్కర్ వేయించుకున్నాడు’’ అని గిల్క్రిస్ట్ పేర్కొన్నాడు. ఆస్ట్రేలియా- వెస్టిండీస్ మధ్య రెండో టీ20 సందర్భంగా కామెంట్రీ చేస్తున్న సందర్భంలో గిల్క్రిస్ట్ ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు. ఇక చెన్నై సూపర్ కింగ్స్ను ఇప్పటికే ఐదుసార్లు చాంపియన్గా నిలిపిన ఘనత ధోని సొంతం. అయితే, వయసు పైబడుతున్న దృష్ట్యా తాజా సీజన్కు అతడు అందుబాటులో ఉంటాడా లేదా అన్న సందిగ్దాల నడుమ.. తలా బ్యాట్ పట్టి ప్రాక్టీస్ చేయడం అభిమనుల్లో జోష్ నింపింది. ధోని ఈసారి కూడా కెప్టెన్గా బరిలోకి దిగడం ఖాయమంటూ నెట్టింట సందడి చేస్తున్నారు ఫ్యాన్స్. Michael Hussey, Adam Gilchrist and Mark Howard talking about MS Dhoni - Unreal Influence 🐐🔥pic.twitter.com/S8q3xSmfQ5 — MN 👾 (@CaptainnRogerrs) February 11, 2024 -
Jharkhand Crisis: హైదరాబాద్లో జార్ఖండ్ ఎమ్మెల్యేల క్యాంప్
రాంచీ: రాష్ట్రం ఏర్పడి 23 ఏళ్లు అవుతోంది. ఈ కాలంలో 12 మంది సీఎంలు బాధ్యతలు నిర్వర్తిస్తారు. అంతటి అనిశ్చితిని ఎదుర్కొంటూ వస్తున్న జార్ఖండ్లో ఇప్పుడు రాజకీయాలు రసకందాయంగా మారాయి. ఆ రాష్ట్ర లెజిస్లేటివ్ పార్టీ లీడర్గా జార్ఖండ్ ముక్తి మోర్చా (JMM) సీనియర్ నేత, రవాణా శాఖ మంత్రి చంపయ్ సోరెన్ను జేఎంఎం ప్రకటించినప్పటి గంటలు గడుస్తున్నా.. ప్రభుత్వ ఏర్పాటుకు ఇంకా రాజ్భవన్ నుంచి ఆహ్వానం అందలేదు. దీంతో ఏం జరగబోతుందా? అనే ఉత్కంఠ మొదలైంది. అదే సమయంలో జార్ఖండ్లో క్యాంప్ రాజకీయాలు మొదలయ్యాయి. జార్ఖండ్లో అధికారం కోల్పోతామనే భయం జేఎంఎం-ఆర్జేడీ-కాంగ్రెస్ కూటమిలో నెలకొంది. చంపయ్కు గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ ఆహ్వానం పంపకపోవడంతో.. ఈ గ్యాప్లో బీజేపీ తమ ఎమ్మెల్యేలకు గాలం వేసే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తోంది. దీంతో ఎమ్మెల్యేలు జేజారిపోకుండా ఉండేందుకు అధికార జార్ఖండ్ ముక్తి మోర్చా (JMM) ప్రయత్నాలు ప్రారంభించింది. ప్రస్తుతం మద్ధతుగా ఉన్న 47 మంది ఎమ్మెల్యేలను చేజారిపోనివ్వకుండా జాగ్రత్త పడుతోంది. ఎల్లా హోటల్కు.. హైదరాబాద్లో జార్ఖండ్ ఎమ్మెల్యేల క్యాంప్ ఖరారైంది. సాయంత్రం నాలుగు గంటలకు రాంచీ నుండి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ రానున్నారు ఇండియా కూటమి ఎమ్మేల్యేలు. అందుబాబులో ఉన్న సుమారు 35 మంది ఎమ్మెల్యేలు హైదరాబాద్కు రానున్నట్లు తెలుస్తోంది. వాళ్లను బేగంపేట నుంచి నేరుగా గచ్చిబౌలిలోని ఎల్లా హోటల్కు తరలించనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు చంపయ్ సోరెన్ ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశమే లేదని బీజేపీ అంటోంది. తగినంత మద్ధతు లేకపోవడమే అందుకు కారణమని చెబుతోంది. ఇదిలా ఉంటే.. జేఎంఎం మిత్రపక్షం ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ బీజేపీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఓ గిరిజన ముఖ్యమంత్రిని దర్యాప్తు సంస్థను అడ్డుపెట్టుకుని బీజేపీ హింసిస్తోందని.. వాళ్ల కుట్రలు ఎక్కువ కాలం కొనసాగవని అన్నారాయన. హేమంత్కే తమ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారాయన. జార్ఖండ్ అసెంబ్లీలో 81 స్థానాలు ఉన్నాయి. ప్రభుత్వం ఏర్పాటుకు బలం 41 స్థానాలు. ఇదిలా ఉంటే ఈడీ తనను అరెస్టు చేయడాన్ని సవాల్ చేస్తూ మాజీ ముఖ్యమంత్రి జేఎంఎం అధినేత హేమంత్ సోరెన్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. రేపు(శుక్రవారం) ఆ పిటిషన్ను విచారణ చేపట్టనుంది చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని బెంచ్. సోరెన్ తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదనలు వినిపించబోతున్నారు. -
అజ్ఞాతం వీడిన సోరెన్.. అరెస్టుకు రంగం సిద్ధం?
రాంచీ: భూకుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ అజ్ఞాతం వీడారు. మంగళవారం మధ్యాహ్నాం రాంచీలో ఆయన ప్రత్యక్షం అయ్యారు. తన అధికార నివాసంలో ఆయన మంత్రులు, జేఎంఎం ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు. ఈ భేటీకి ఆయన సతీమణి కల్పన కూడా హాజరయ్యారు. దీంతో తాజా ఊహాగానాలే నిజం కానున్నాయా? అనే అనే చర్చ మొదలైంది. మరోవైపు ఆయనకు వ్యతిరేకంగా ఆధారాలు ఉండడంతో అరెస్టుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఢిల్లీలోని తన నివాసానికి వెళ్లిన సోరెన్.. ఆ తర్వాత కనిపించకుండా పోయారు. అయితే ఆయన కోసం అక్కడికి వెళ్లిన ఈడీకి ఎదురు చూపులే మిగిలాయి. ఈ సాయంత్రంలోపు ఆయన అరెస్టు ఉంటుందా? ఉండదా? అనేదానిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. #WATCH | Jharkhand CM Hemant Soren holds a meeting of the state's ministers and ruling side's MLAs at CM's residence in Ranchi. His wife Kalpana Soren is also present at the meeting. pic.twitter.com/oo2GJhZ0gi — ANI (@ANI) January 30, 2024 ఇదీ చదవండి: 18 గంటలుగా మిస్సింగ్.. జరిగింది ఇదే..! ఇదిలా ఉండగా.. జార్ఖండ్ ముక్తి మోర్చా (JMM) నేతృత్వంలోని సంకీర్ణ కూటమి ఎమ్మెల్యేలంతా రాంచీకి రావడంతో రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. త్వరలో రాష్ట్ర నాయకత్వంలో మార్పు జరగొచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సోరెన్ సతీమణికి సీఎం పగ్గాలు అప్పగించే అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతోంది. -
‘పారిస్’ బెర్త్ లక్ష్యంగా...
రాంచీ: ఆసియా క్రీడల ద్వారా నేరుగా పారిస్ ఒలింపిక్స్కు అర్హత పొందలేకపోయిన భారత మహిళల హాకీ జట్టు... అందుబాటులో ఉన్న రెండో అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనే పట్టుదలతో ఉంది. రాంచీలో నేటి నుంచి జరిగే మహిళల హాకీ ఒలింపిక్ క్వాలిఫయింగ్ టోర్నీలో సవితా పూనియా సారథ్యంలో భారత జట్టు బరిలోకి దిగనుంది. మొత్తం 8 జట్లు పాల్గొంటున్న ఈ టోరీ్నలో టాప్–3లో నిలిచిన జట్లు పారిస్ ఒలింపిక్స్కు అర్హత సాధిస్తాయి. గ్రూప్ ‘ఎ’లో చిలీ, చెక్ రిపబ్లిక్, జర్మనీ, జపాన్... గ్రూప్ ‘బి’లో భారత్, అమెరికా, న్యూజిలాండ్, ఇటలీ జట్లున్నాయి. నేడు జరిగే తొలి రౌండ్ లీగ్ మ్యాచ్ల్లో అమెరికాతో భారత్; న్యూజిలాండ్తో ఇటలీ; చిలీతో జర్మనీ; చెక్ రిపబ్లిక్తో జపాన్ తలపడతాయి. భారత్, అమెరికా మ్యాచ్ రాత్రి 7 గంటల 30 నిమిషాలకు మొదలవుతుంది. ఈ మ్యాచ్ను స్పోర్ట్స్ 18 చానెల్, జియో సినిమా యాప్లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. ఆస్ట్రేలియన్ ఓపెన్ మెయిన్ ‘డ్రా’కు సుమిత్ అర్హత టెన్నిస్ సీజన్ తొలి గ్రాండ్స్లామ్ టోర్నమెంట్ ఆ్రస్టేలియన్ ఓపెన్ మెయిన్ ‘డ్రా’కు భారత నంబర్వన్ సుమిత్ నగాల్ అర్హత సాధించాడు. మెల్బోర్న్లో శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వాలిఫయింగ్ ఫైనల్ రౌండ్ మ్యాచ్లో ప్రపంచ 139వ ర్యాంకర్ సుమిత్ 6–4, 6–4తో ప్రపంచ 118వ ర్యాంకర్ అలెక్స్ మోల్కన్ (స్లొవేకియా)పై నెగ్గాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్ మెయిన్ ‘డ్రా’కు అర్హత పొందడం సుమిత్కిది రెండోసారి. 2021లోనూ అతను అర్హత సాధించాడు. అలెక్స్తో 2 గంటల 3 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్లో సుమిత్ ఐదు ఏస్లు సంధించాడు. తన సర్వీస్ను రెండుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్ను నాలుగుసార్లు బ్రేక్ చేశాడు. 22 విన్నర్స్ కొట్టిన సుమిత్ నెట్ వద్ద 12 సార్లు పాయింట్లు గెలిచాడు. ఆదివారం మొదలయ్యే ప్రధాన టోర్నీ మెయిన్ ‘డ్రా’ తొలి రౌండ్లో ప్రపంచ 31వ ర్యాంకర్ బుబ్లిక్ (కజకిస్తాన్)తో సుమిత్ తలపడతాడు. -
బాజా భజంత్రీలతో విడాకుల ఊరేగింపు గుర్తుందా? ఈ కేసులో షాకింగ్ ట్విస్ట్
భార్యభర్తల మధ్య, లేదా ఇరు వర్గాల మధ్య ఏదైనా విభేదాలు వచ్చిన పుడు ఇరుపక్షాల వాదనలు వినడం రివాజు. అపుడు మాత్రమే అసలు నిజాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. లేదంటే అసలు విషయం పక్కకుపోయి.. ఉల్టా పల్టా అవుతుంది. విడాకుల ఊరేగింపు స్టోరీ గుర్తుందా. అత్తింట్లో బాధపడుతున్న కన్నకూతుర్ని గౌరవంగా మేళతాళాలతో ఇంటికి తెచ్చుకున్న తండ్రి అంటూ ఒక స్టోరీ వైరల్ అయింది. ఈ స్టోరీలో తాజాగా కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. ముఖ్యంగా భార్తభర్తల విషయంలో నాణానికి రెండో వైపు విషయాలను తెలుసుకోవడం ఎంత అవసరమో ఈ వైరల్ స్టోరీ మరోసారి గుర్తు చేసింది. ఈ స్టోరీలో సాక్షి భర్త సచిన్ వాస్తవాలు వేరే ఉన్నాయి అంటూ కొత్త వాదనను వినిపించారు. ఆయన మాటల ప్రకారం ఇందులోని మరోకోణం పూర్తి భిన్నంగా ఉంది. సాక్షి తనను చాలా వేధించిందని, చాలా రకాలుగా ఇబ్బంది పెట్టిందని వీడియాతో చెప్పాడు. తన తల్లి తండ్రులను ఏమాత్రం భరించేది కాదని సాక్షి భర్త సచిన్ వాపోయాడు. తల్లి దండ్రులను, ఆసుపత్రిలో ఉన్న చుట్టాలను కూడా తనను కలవనిచ్చేది చూడనిచ్చే ది కాదని ఆరోపించారు. సాక్షి గుప్తపై తానే తొలుత విడాకుల కేసు నమోదు చేశాననీ, ఈ సందర్భంగా కోటి, 15 లక్షల రూపాయలు భరణం ఇవ్వాలని వారు డిమాండ్ చేశారని తెలిపారు. దీంతో వన్ టైం సెటిల్మెంట్ కూడా చేసుకున్నామని వెల్లడించారు. అయితే తనకు వారసత్వంగా వచ్చిన ఇంటిని ఆక్రమించుకుని మొత్తం డబ్బు చెల్లించే దాకా బెదిరించిందని ఆరోపించారు. ఇంత చేసింతరువాత కూడా తనపై లేనిపోని ఆరోపణలుతో బ్యాండ్ బాజా అంటూ ఇంత హడావిడి చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని ఆయన సాక్షి గుప్తాని ప్రశ్నించారు. కాగా అత్తింటి వేధింపులతో ఇబ్బంది పడుతున్న తన కుమార్తెను బాజా భజంత్రీలు, బాణాసంచాతో ఊరేగింపుగా తీసుకొచ్చి విడాకులను కూడా పెళ్లి వేడుకలా ఘనంగా జరిపించి వార్తల్లో నిలిచాడు సాక్షి తండ్రి. ఝార్ఖండ్లోని రాంచీలో ఈఘటన ఈ చోటుచేసుకుంది. కైలాశ్నగర్ కుమ్హర్టోలి ప్రాంతంలో నివసించే ప్రేమ్ గుప్తా గతేడాది ఏప్రిల్ 28న తన కుమార్తె సాక్షి గుప్తాకు వివాహం చేశాడు. అయితే పెళ్లైన కొన్ని రోజులకే సచిన్ నుంచి తన కుమార్తెకు వేధింపులు ఎదురు కావడం, దీనికి తోడు అంతకు ముందే అల్లుడికి రెండు సార్లు వివాహమైందని తమ దృష్టికి రావడంతో కన్నకూతురిని సగౌరవంగా ఇంటికి తెచ్చుకున్నామంటూ సోషల్మీడియాలో తండ్రి పేర్కొన్నాడు. అంతేకాదు ఆడపిల్లలకి వివాహ జీవితంలో ఇబ్బందులు ఎదురైనపుడు వారిని గౌరవంగా ఇంటికి తిరిగి తెచ్చుకోవాలి, వాళ్లు చాలా విలువైన వాళ్లు అంటూ సందేశం ఇచ్చాడు. దీంతో నాన్న అంటే ఇలా ఉండాలీ అంటూ ఈ కథనం గత నెలలో బాగా వైరల్ అయిన సంగతి తెలిసిందే. The story behind the Viral Band Baja Divorce Bride..... Glad that @aajtak @sudhirchaudhary decided to show it finally pic.twitter.com/vhL2B590jv — Deepika Narayan Bhardwaj (@DeepikaBhardwaj) November 17, 2023 -
అత్తింట్లో చిత్రహింసలు: మేళతాళాలతో కుమార్తెకు తండ్రి ఘన స్వాగతం
మేళ తాళాలతో ఘనంగా పెళ్లిచేసి కూతురిని బ్యాండ్-బాజా-బారాత్తో సాగనంపడం మన అందరమూ చూసి ఉంటాం కానీ పెళ్లయిన కూతురిని అదే ఆనందంతో శాశ్వతంగా ఇంటికి తిరిగి తీసుకురావడం మీరు ఎప్పుడైనా చూశారా? అవును ఇది నిజంగా జరిగింది. అరుదైన ఈ ఘటన ఝార్ఖండ్ రాజధాని రాంచీలో చోటుచేసుకుంది. మూడు ముళ్లూ పడిన తరువాత చచ్చిన బతికినా మెట్టినింట్లోనే మన సమాజంలో ఎక్కువ మంది ఆడ పిల్లలని వేధించే మాటలివి. ఏ కష్టం వచ్చినా.. కాంప్రమైజ్ అయ్యి బతకాల్సిందే. తరాలు మారుతున్నా అమ్మాయిల జీవితాల్ని శాసిస్తున్న ఇలాంటి కట్టుబాట్లను తోసి రాజన్నారొక తండ్రి. తండ్రి అంటే ఇలానే ఉండాలి అన్నట్టుగా ప్రవర్తించి ఈ ప్రపంచంలోని అమ్మాయిలందరి మనసు దోచుకున్నారు. రాంచీకి చెందిన ప్రేమ్ గుప్తా తన కుమార్తె సాక్షి గుప్తాకు గతేడాది ఏప్రిల్లో సచిన్ కుమార్ అనే వ్యక్తితో ఘనంగా పెళ్లి జరిపించారు. భర్తతో నిండు నూరేళ్లు హాయిగా జీవించమంటూ ఆశీర్వదించి అత్తారింటి సాగనంపారు. అయితే వేయి కలలతో అత్తింట్లో అడుగుపెట్టిన ఆమె ఆశలన్నీ ఆవిరైపోయాయి. భర్తకు ఇంతకుముందే పెళ్లి అయింది. ఒకసారి కాదు, రెండుసార్లు పెళ్లి చేసుకున్నాడు. మూడో పెళ్లి తర్వాత కూడా సాక్షితో కలిసి సవ్యంగా జీవించలేదు. అయినా సర్దుకు పోదాం అనుకుంది. అతడే మార తాడులే అనుకుని బంధం కొనసాగించాలని సాక్షి నిర్ణయించుకుంది. దీనికి తోడు అత్తింటి వేధింపులు కూడా ఎక్కువ కావడంతో, తల్లిదండ్రులతో తన గోడును వెళ్ల బోసుకుంది. కూతురి కష్టాలు చూసిన తండ్రి చలించిపోయాడు. సాక్షికి అండగాఉండాలనే నిర్ణయం తీసుకోవడంమాత్రమేకాదు. భాజాభజంత్రీలు, బాణాసంచాతో ఊరేగింపుగా తన కుమార్తెను తిరిగి పుట్టింటికి స్వాగతం పలికారు తండ్రి. దీనికి సంబంధించిన వీడియోను ఆయన సోషల్ మీడియాలోషేర్ చేశారు. ఆడపిల్లలు చాలా విలువైన వాళ్లు.. వాళ్లను గౌరవించాలి..అంటూ సమాజానికి మంచి సందేశ మిచ్చారు. దీంతో నెటిజన్లు ఆయనను అభినందిస్తున్నారు. -
గాల్లోనే ఊపిరి పోశారు!
న్యూఢిల్లీ: అది శనివారం ఉదయం వేళ. రాంచీ నుంచి ఢిల్లీ వెళ్తున్న ఇండిగో విమానం. బయల్దేరి అప్పటికి 20 నిమిషాలైంది. ఇంకో గంట ప్రయాణం ఉంది. ప్రయాణికుల్లో పుట్టుకతోనే తీవ్ర హృద్రోగ సమస్యతో బాధ పడుతున్న ఒక ఆర్నెల్ల చిన్నారి. తల్లిదండ్రులు తనను చికిత్స కోసం ఢిల్లీ ఎయిమ్స్ తీసుకెళ్తున్నారు. ఉన్నట్టుండి ఊపిరాడక పాప అల్లాడింది. దాంతో తల్లి పెద్దపెట్టున రోదించింది. సాయం కోసం అర్థించింది. విషయం అర్థమై ప్రయాణికుల్లో ఉన్న ఇద్దరు డాక్టర్లు హుటాహుటిన రంగంలో దిగారు. తనకు తక్షణం సాయం అందించారు. విమానంలో పెద్దలకు ఉద్దేశించి అందుబాటులో ఉండే ఆక్సిజన్ కిట్ నుంచే పాపకు శ్వాస అందించారు. ఎయిర్ హోస్టెస్ వద్ద అందుబాటులో ఉన్న ఎమర్జెన్సీ కిట్ నుంచే మందులను వాడారు. అలా ఏకంగా గంట పాటు తన ప్రాణం నిలబెట్టారు. అంతసేపూ ప్రయాణికులతో పాటు సిబ్బంది కూడా ఊపిరి బిగబట్టి దీన్నంతా ఉత్కంఠతో చూస్తూ గడిపారు. విమానం ఢిల్లీలో దిగుతూనే అక్కడ అప్పటికే అందుబాటులో ఉన్న ఎమర్జెన్సీ వైద్య బృందం చిన్నారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించింది. దాంతో ప్రయాణికులతో పాటు అందరూ తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నారు. ఆ 15 నిమిషాలు... ఇలా చిన్నారి ప్రాణాలను నిలబెట్టిన వైద్యుల్లో ఒకరు ఐఏఎస్ అధికారి కావడం విశేషం! ఆయన పేరు డాక్టర్ నితిన్ కులకరి్ణ. జార్ఖండ్ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శిగా ఉన్నారు. మరొకరు డాక్టర్ మొజమ్మిల్ ఫిరోజ్. రాంచీలోని సదర్ ఆస్పత్రిలో పని చేస్తున్నారు. చిన్నారి పుట్టుకతోనే పేటెంట్ డక్టస్ అర్టరియోసిస్ అనే హృద్రోగంతో బాధ పడుతోందని వారు చెప్పారు. ‘మేం వెంటనే రంగంలో దిగి పాపకు ఆక్సిజన్ అందివ్వడంతో పాటు థియోఫైలిన్ ఇంజక్షన్ ఇచ్చాం. అలాగే తల్లిదండ్రులు తమ వెంట తెచి్చన డెక్సోనా ఇంజక్షన్ కూడా బాగా పని చేసింది. హార్ట్ బీట్ ను స్టెతస్కోప్ తో చెక్ చేస్తూ వచ్చాం. తొలి 15 నుంచి 20 నిమిషాలు చాలా భారంగా గడిచింది. పెద్ధగా ఏమీ పాలుపోలేదు. కాసేపటికి పాప స్థితి క్రమ క్రమంగా మెరుగైంది‘ అని వారు తమ అనుభవాన్ని వివరించారు. సహా ప్రయాణికుల్లో పలువురు వారి అమూల్య సేవను మెచ్చుకుంటూ ఎక్స్లో మేసేజ్లు చేశారు. -
కలలో కూడా ఊహించని గిఫ్ట్ ఇచ్చిన ధోని! తప్పుపట్టిన నెటిజన్లు..
MS Dhoni- Bike Riding- Viral Video: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని మరోసారి అభిమానుల మనసు గెలుచుకున్నాడు. ఓ యువ క్రికెటర్కు కలలో కూడా ఊహించని బహుమతి ఇచ్చాడు. తన బైక్పై లిఫ్ట్ ఇచ్చి.. సదరు ప్లేయర్ను సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తాడు. స్వయంగా బైక్ నడుపుతూ అతడిని రాంచి వీధుల్లో తిప్పాడు. ఇందుకు సంబంధించిన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా మిస్టర్ కూల్ కెప్టెన్గా ఘనత వహించిన ధోని.. తనను అభిమానించే వారిని ఎప్పటికప్పుడు సర్ప్రైజ్ చేస్తూనే ఉంటాడన్న విషయం తెలిసిందే. నీ బుద్ధి ఏమైంది? తాజాగా ఓ యువకుడికి ఆ అవకాశం దక్కింది. రాంచిలో ట్రెయినింగ్ సెషన్ పూర్తి చేసుకున్న ధోని.. యంగ్ ఫ్యాన్ కోరిక మేరకు అతడిని తన బైక్ ఎక్కించుకున్నాడు. Yamaha RD350ని ధోని డ్రైవ్ చేస్తుండగా.. వెనక కూర్చున్న ఆ అబ్బాయి సెల్ఫీ వీడియో తీసుకుంటూ మురిసిపోయాడు. అయితే, నెటిజన్లు మాత్రం అతడి చర్యను తప్పుబడుతున్నారు. ధోని ఎంచక్కా హెల్మెట్ పెట్టుకుని జాగ్రత్తగా బండి నడుపుతుంటే నువ్వు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదని హితవు పలుకుతున్నారు. రహదారి చిన్నదే కావొచ్చు.. కానీ.. సెల్ఫీ వీడియో పిచ్చిలో మునిగిపోయి ఏదైనా జరగరానిది జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని చురకలు అంటిస్తున్నారు. కనీసం ధోని అయినా అతడిని వారించాల్సిందని కామెంట్లు చేస్తున్నారు. ఐదోసారి చాంపియన్గా నిలిపి కాగా భారత క్రికెట్ జట్టుకు మూడు ఐసీసీ టైటిళ్లు అందించిన ధోని ప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్ ద్వారా అభిమానులకు వినోదం పంచుతున్న విషయం తెలిసిందే. ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్కు సారథ్యం వహిస్తున్న తలా.. ఈసారి జట్టును చాంపియన్గా నిలిపాడు. తద్వారా ఏకంగా ఐదుసార్లు టైటిల్ గెలిచిన కెప్టెన్గా ముంబై ఇండియన్స్ సారథి రోహిత్ శర్మ రికార్డు సమం చేశాడు. 41 ఏళ్ల వయసులో ఈ ఘనత సాధించి పలు రికార్డులు సృష్టించిన ధోని.. ప్రస్తుతం స్వస్థలం జార్ఖండ్లో ఉన్నాడు. రాంచిలోని నివాసంలో కుటుంబంతో సమయం గడుపుతున్న తలా.. మోకాలి నొప్పి నుంచి కోలుకుని ట్రెయినింగ్ సెషన్లో పాల్గొంటున్నట్లు తెలుస్తోంది. చదవండి: మరీ చెత్తగా.. అందుకే ఓడిపోయాం.. వాళ్లిద్దరు అద్భుతం: బాబర్ ఆజం Nothing to see here. Just #MSDhoni living his best semi retired life and a very lucky young cricketer who got a lift on his #YAMAHA RD350. 🏍️ #Jharkhand #Dhoni #msd #mahi #ranchi pic.twitter.com/EipYkBptsU — Jharkhand Jatra (@JharkhandJatraa) September 15, 2023 -
MS Dhoni: ధోని గారాలపట్టి జివా స్కూల్ ఫీజు తెలిస్తే షాక్! ఆ మాత్రం ఉండదా?
MS Dhoni's Daughter Ziva: సెలబ్రిటీల వ్యక్తిగత జీవితం గురించి తెలుసుకోవాలని అభిమానుల్లో కుతూహలం ఉండటం సహజం. ఆయా రంగాల్లో వారు సాధించిన విజయాలతో పాటు.. పర్సనల్ లైఫ్ గురించి ఆరా తీయడం షరా మామూలే. ముఖ్యంగా సోషల్ మీడియా వినియోగం పెరిగిన తర్వాత ఫ్యాన్స్కు ఈ పని మరింత ఈజీ అయిపోయింది. సరిలేరు నీకెవ్వరు! టీమిండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోని గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. భారత జట్టుకు మూడు ఐసీసీ టైటిళ్లు అందించిన ఎంఎస్ క్రీడా జీవితం తెరిచిన పుస్తకమే. అదే విధంగా.. ఈ చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ పర్సనల్ లైఫ్ గురించి కూడా కొత్తగా చెప్పాల్సింది ఏమీలేదు. సాధారణ మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన ధోని.. క్రికెటర్గా ఉన్నత శిఖరాలను అధిరోహించాడు. కీర్తి ప్రతిష్టలతో పాటు లెక్కకు మిక్కిలి డబ్బు కూడా సంపాదించాడు. కెరీర్లో అత్యుత్తమ స్థాయికి చేరుకున్న మహేంద్రుడు.. 2010, జూలై 4న సాక్షి సింగ్ను పెళ్లాడి వివాహ బంధంలో అడుగుపెట్టాడు. గారాలపట్టి జివా అన్యోన్య దంపతులుగా పేరున్న ఈ జంటకు 2015, ఫిబ్రవరి 6న కూతురు జివా జన్మించింది. పాప పుట్టే సమయానికి ధోని.. వన్డే వరల్డ్కప్ ఈవెంట్తో ఆస్ట్రేలియాలో బిజీగా ఉన్నాడు. భారత జట్టు కెప్టెన్గా తన బాధ్యతలు నెరవేర్చిన తర్వాతే బిడ్డను చూడటానికి దేశానికి తిరిగి వచ్చాడు. ఇక ఒక్కగానొక్క కూతురు జివా అంటే ధోనికి పంచప్రాణాలు. కాస్త విరామం దొరికినా తన గారాలపట్టి కోసమే సమయం కేటాయిస్తాడు తలా. కోటీశ్వరుడైన ధోని తలచుకుంటే తన కూతురిని విదేశాల్లో టాప్ మోస్ట్ స్కూల్స్లో చదివించగలడు. కానీ.. బిడ్డకు దూరంగా ఉండటం అతడికి ఇష్టం లేదు. రాంచిలోనే.. ఫీజు ఎన్ని లక్షలంటే! అందుకే స్వస్థలం రాంచిలోనే పేరెన్నికగన్న ప్రముఖ పాఠశాలలో జివాను చేర్పించారు ధోని దంపతులు. ఎనిమిదేళ్ల జివా ప్రస్తుతం మూడో తరగతి చదువుతున్నట్లు సమాచారం. మరి.. ఇంటర్నేషనల్ స్కూళ్లో డే స్కాలర్గా ఉన్న జివా కోసం ధోని ఏడాదికి చెల్లిస్తున్న ఫీజు ఎంతో తెలుసా? అక్షరాలా రెండు లక్షల డెబ్బై ఐదువేల రూపాయలు!! తామే స్వయంగా.. సదరు పాఠశాల వెబ్సైట్లో ఉన్న వివరాల ప్రకారం గ్రేడ్ 2-8 వరకు డే స్కాలర్స్కు రూ. 2,75,000, హాస్టల్లో ఉండే వాళ్లకు రూ. 4,40,000 చెల్లించాల్సి ఉంటుంది. మరి ఈ లెక్కన జివా నెల ఫీజు సుమారు 23 వేల రూపాయలు! దాదాపు వెయ్యి కోట్ల మేర ఆర్జించిన తలాకు ఈ మొత్తం లెక్కకాదు. అయితే, కూతుర్ని విదేశాల్లో చదివించడమో.. హాస్టల్లో వేయడమో కాకుండా తామే స్వయంగా బిడ్డ ఆలనాపాలనా దగ్గరుండి చూసుకోవడం విశేషమే!! విలాసవంతమైన ఫామ్హౌజ్లో.. కాగా ధోనికి రాంచిలో విలాసవంతమైన ఫామ్హౌజ్ ఉన్న సంగతి తెలిసిందే. ధోని తన కుటుంబంతో కలిసి ప్రస్తుతం అక్కడే నివసిస్తున్నట్లు సమాచారం. ఇక తలా కూతురిగా జివాకు ఉన్న అభిమానగణం కూడా ఎక్కువే! ఇన్స్టాగ్రామ్లో ఆమెకు 2.3 మిలియన్ ఫాలోవర్లు ఉండటం ఇందుకు నిదర్శనం. ఇక తల్లి సాక్షితో పాటు మ్యాచ్లకు హాజరవుతూ తండ్రిని ఉత్సాహపరిచే ఈ చిన్నారి ‘చీర్ లీడర్’కు సంబంధించిన స్కూల్ ఫీజు అంశం ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. చదవండి: అరంగేట్రంలో 4 రన్స్! మూడో మ్యాచ్లో ఏకంగా ట్రిపుల్ సెంచరీ.. కానీ ఏడాదిలోనే ఖతం! -
ఇకపై పరీక్షల్లో కాపీకొట్టి పట్టుబడితే జైలుకే..
రాంచీ: జార్ఖండ్ రాష్ట్ర అసెంబ్లీ గురువారం రోజున సంచలనాత్మక బిల్లును ఆమోదించింది. ఇకపై పరీక్షల్లో కాపీ కొట్టి పట్టుబడితే 10 కోట్లు జరిమానాతో పాటు జీవిత కాలం జైలు శిక్ష కూడా విధించేలా చట్టాన్ని రూపొందించి అమలు చేయనుంది. ఏమిటీ బిల్లు.. గురువారం జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి అలాంగిర్ అలాం ఈ బిల్లును ప్రవేశపెట్టగా దీనిపై సుదీర్ఘంగా చర్చ కూడా సాగింది. ఇకపై ఎవరైనా పోటీ పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్ చేస్తూ పట్టుబడితే వారికి 10 కోట్లు జరిమానా తోపాటు జీవితకాలం ఖైదు చేసే విధంగా చట్టాన్ని రూపొందించారు. పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్ చేయడాన్ని క్షమించరాని నేరంగా పరిగణిస్తూ నాన్ బెయిలబుల్ కేసుగా నమోదు చేయాలని బిల్లులో ప్రతిపాదించారు. అనర్హులకు చెక్.. ఆయా నియామకాలకు సంబంధించి జరిగే కాంపిటీటివ్ పరీక్షలను అత్యంత పారదర్శకంగా నిర్వహించాలన్న ఉద్దేశంతోనే ఈ బిల్లును ప్రవేశపెట్టినట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ చట్టం ద్వారా పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్ చేసేవారికి కఠినమైన హెచ్చరికలు జారీ చేసినట్టయ్యింది. ఇంతకాలం పరీక్షల నిర్వహణలో అక్కడక్కడ ఉన్న చిన్న చిన్న లొసుగులను సద్వినియోగం చేసుకుంటూ గతంలో కొందరు అభ్యర్థులు పరీక్షల్లో అవకతవకలకు పాల్పడ్డారని, అందుకే ఈ తరహా కఠిన చట్టాలను రూపొందించాలని నిర్ణయించినట్లు తెలిపాయి ప్రభుత్వ వర్గాలు. మరోపక్క బీజేపీ పార్టీ ఎప్పటిలాగే దీన్నొక క్రూరమైన చట్టంగా వర్ణించింది. సీఎం కామెంట్.. దీనిపై స్వయంగా జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్ స్పందిస్తూ.. బీజేపీ ప్రభుత్వం పార్లమెంటులో చట్టాలను ఎలా తయారు చేస్తోందో అందరూ చూస్తున్నారని.. ఇలాంటి చట్టం చేయడం ఇదే మొదటిసారి కాదని, మరికొన్ని రాష్ట్రాలు ఈ చట్టాన్ని ఇప్పటికే అమలు చేస్తున్నాయని గుర్తు చేశారు. అలాగే జైలు శిక్షను కూడా కుదిస్తూ మొదటిసారి పట్టుబడితే ఏడాదిపాటు.. రెండోసారి పట్టుబడితే మూడేళ్లపాటు ఉండేలా సవరణలు చేశారు. ఇది కూడా చదవండి: విపక్షాల కూటమికి షాక్.. ఢిల్లీ హైకోర్టు నోటీసులు.. -
జార్ఖండ్లో యువతిపై దారుణం.. బట్టలు విప్పి చెట్టుకి కట్టేసి
రాంచీ: జార్ఖండ్ రాష్ట్రంలోని గిరిధి జిల్లాలో దారుణం జరిగింది. ఓ కుటుంబంలోని నలుగురు తమ కుమారుడితో ప్రేమ వ్యవహారంలో 26 ఏళ్ల యువతిని అడవిలోకి తీసుకెళ్లి చితకబాది వివస్త్రురాలిని చేసి చెట్టుకు కట్టేసి వెళ్లిపోయిన సంఘటన సంచలనం సృష్టించింది. పోలీసులు ఆ యువతిని రక్షించి వైద్యం నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. దాడికి పాల్పడిన ఆ నలుగురిలో యువతి ప్రియుడు కూడా ఉన్నట్లు తెలిపారు పోలీసులు. బాగోడార్ షబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ నౌషాద్ అలామ్ తెలిపిన వివరాల ప్రకారం సారియా పోలీస్ స్టేషన్ పరిధిలో 26 ఏళ్ల బాధితురాలు ఒక యువకుడితో ప్రేమలో పడింది. ఈ వ్యవహారం గురించి తెలుసుకున్న అతని కుటంబసభ్యులు.. తండ్రి, తల్లి, సవతి తల్లి కుమారుడిని మందలించి ఆ యువతిని ఇంటికి రప్పించమన్నారు. వెంటనే వారి కుమారుడు ఆమెకు కబురు పంపగా బుధవారం అర్ధరాత్రి ఆమె ఇంటికి చేరుకోగానే నలుగురు కలిసి దౌర్జన్యంగా బంధించి సమీపంలోని అడవికి తీసుకుని వెళ్లారు. అక్కడ ఆమె ప్రియుడితో సహా కుటుంబసభ్యులంతా ఏకమై ఆమెపై విచక్షణారహితంగా దాడి చేసి బట్టలను చింపివేశారని అవమానంతో ఆమె ఆత్మహత్య చేసుకుంటుందని భావించి యువతిని చెట్టుకు కట్టేసి వెళ్లిపోయారు. సంఘటనా స్థలానికి చేరుకొని బాధిత యువతిని స్థానిక ఆసుపత్రికి తరలించామని.. ఆమె ప్రియుడిని, అతడి తండ్రిని, తల్లిని, సవతి తల్లిని అరెస్టు చేసి రిమాండుకు తరలించినట్లు తెలిపారు. ఇది కూడా చదవండి: కేంద్రానికి ఊరట.. ఈడీ చీఫ్ పదవీకాలం పొడిగించిన సుప్రీంకోర్టు -
చెక్ బౌన్స్ కేసులో స్టార్ హీరోయిన్కు రూ.500 ఫైన్
ప్రముఖ బాలీవుడ్ నటి అమీషా పటేల్ చెక్ బౌన్స్ కేసులో చిక్కుకున్న విషయం తెలిసిందే. ఈ కేసుపై రాంచీ కోర్టులో పలుమార్లు విచారణ కూడా జరిగింది. కానీ ఆమె కోర్టుకు హాజరు కాకపోవడంతో ఇదే ఏడాది ఏప్రిల్ 6న అమీషా పటేల్కు న్యాయస్థానం వారెంట్ ఇష్యూ చేసింది. దీంతో ఆమె రాంచీలోని సివిల్ కోర్టులో లొంగిపోయింది. ఈ మేరకు అప్పట్లో విచారణ జరిపిన కోర్టు ఆమెకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. కానీ ఇదే కేసుకు సంబంధించి ఆమె తరపున కేసు వాధించే లాయర్ రాకపోవడంతో అమీషా పటేల్కు రాంచీ కోర్టు 500 రూపాయల జరిమానా విధించింది. అమీషా పటేల్పై చెక్ బౌన్స్కు కారణం ఇదే బాలీవుడ్ ప్రముఖ నిర్మాత అజయ్ కుమార్ ఓ సినిమా విషయంలో అమీషా పటేల్పై చెక్ బౌన్స్ కేసు వేశారు. సినిమా నిర్మిస్తానంటూ తన దగ్గర నుంచి రూ. 2.5కోట్లు అమీషా పటేల్ తీసుకున్నారని. ఆ తర్వాత సినిమా పూర్తిచేయకపోగా తన డబ్బులు తిరిగి ఇవ్వలేదని పేర్కొంటు రాంచీలోని సివిల్ కోర్టులో పిటిషన్ వేశారు. (ఇదీ చదవండి: అతనితో డేటింగ్లో భారత మహిళా క్రికెటర్.. ఫోటోలు వైరల్) పిటిషనర్ అజయ్ కుమార్ సింగ్ తరపున సాక్షిగా కంపెనీ మేనేజర్ టింకు సింగ్ తాజాగా విచారణ కోసం కోర్టుకు హాజరయ్యారు. కానీ అమిషా పటేల్ తరపు న్యాయవాది అతన్ని క్రాస్ ఎగ్జామినేట్ చేయలేదు. బదులుగా, ఆమె న్యాయవాది దాని కోసం మరింత సమయం కోరారు. అప్పుడు జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ డిఎన్ శుక్లా కొంతమేరకు అసహనం వ్యక్తం చేశారు. దీంతో అమిషా పటేల్కు కోర్టు రూ. 500 జరిమానా విధించింది. తదుపరి విచారణను ఆగష్టు 7కి వాయిదా వేసింది. -
'భోజన ప్రియుడ్ని చూశాం.. వాహన ప్రియుడ్ని చూడడం ఇదే తొలిసారి'
టీమిండియా మాజీ క్రికెటర్ ఎంఎస్ ధోని మంచి వాహన ప్రియుడన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రాంచీలోని తన సొంత ఇంట్లో ధోని కార్లు, బైక్ల కోసం ప్రత్యేక గ్యారేజీనే ఏర్పాటు చేసుకున్నాడు. మార్కెట్లో కొత్త బైక్ లేదా కార్ వచ్చిన అది ధోని గ్యారేజీలోకి రావాల్సిందే. ధోని తన గ్యారేజీని ఎప్పుడు చూపించడానికి ఇష్టపడలేదు. అయితే మాజీ బౌలర్ వెంకటేశ్ ప్రసాద్ చొరవతో ధోని గ్యారేజీని తొలిసారి చూసే అవకాశం మనకు దక్కింది. ధోని గ్యారేజీకి సంబంధించిన వీడియోనూ చూస్తే కళ్లు బెర్లు కమ్మడం ఖాయం. పలు రకాల మోడల్స్కు సంబంధించిన కార్లు, బైక్లు లెక్కలేనన్ని ఉన్నాయి. గ్యారేజీ మొత్తం బైకులు, కార్లతో నిండిపోయింది. అవసరం అనుకుంటే ధోని ఒక చిన్నపాటి షోరూం అయినా నడిపించొచ్చు. ఏది ప్రత్యేకంగా కనిపించినా.. అది ధోని గ్యారేజ్లోకి రావాల్సిందే. బైక్లు, కార్లు అంటే ధోనీకి అంత పిచ్చి అన్నమాట. పాత కార్ల నుంచి లేటెస్ట్ మోడల్స్ వరకు ధోని గ్యారేజ్లో చూడొచ్చు. విషయంలోకి వెళితే.. టీమిండియా మాజీలు వెంకటేష్ ప్రసాద్, సునీల్ జోషిలు రాంచీ పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా ధోనీ ఫామ్హౌస్కి చేరుకున్నారు. అక్కడే ఉన్న ధోని తొలిసారి తన గ్యారేజీని వారికి చూపించాడు. గ్యారేజీలో ఒక్కో కారు, బైకు చూస్తుంటే మతి పోవాల్సిందే. ధోని దగ్గర దాదాపు అన్ని రకాల మోడల్స్ వింటేజ్ బైక్ కలెక్షన్స్ ఉన్నాయి. ఇది చూసిన తర్వాత వెంకటేష్ ప్రసాద్ నోటి నుంచి ఒక్క మాట కూడా రాలేదు. బైక్ల విస్తృత సేకరణతో పాటు, ధోనీకి పాతకాలపు కార్ల జాబితా కూడా ఉంది. వీటిలో కొన్ని ధోని దిగుమతి చేసుకున్న కార్లు కాగా, మరికొన్ని భారత ఆర్మీ నుంచి కొనుగోలు చేసినవి. అతిపెద్ద విషయం ఏమిటంటే, ధోని తన గ్యారేజీలో ఉన్న అన్ని బైక్లను చాలా ప్రేమగా చూసుకుంటుంటాడు. వీటికి సర్వీసింగ్ కూడా స్వయంగా తానే చేసుకుంటాడు. ధోని గ్యారేజీ చూడాలనుకుంటే వెంటనే వీడియోపై ఒక లుక్కేయండి. అయితే వీడియో చూసిన అభిమానులు.. ''ఇంత పిచ్చి ఏంటి ధోని భయ్యా.. నీ దగ్గరున్న బైక్లు, కార్లతో షోరుంనే ఏర్పాటు చేయొచ్చు''.. ''మంచి భోజన ప్రియుడ్ని చూశాం.. నీలాంటి వాహన ప్రియుడ్ని మాత్రం ఎక్కడా చూడలేదు'' అంటూ కామెంట్స్ చేశారు. One of the craziest passion i have seen in a person. What a collection and what a man MSD is . A great achiever and a even more incredible person. This is a glimpse of his collection of bikes and cars in his Ranchi house. Just blown away by the man and his passion @msdhoni pic.twitter.com/avtYwVNNOz — Venkatesh Prasad (@venkateshprasad) July 17, 2023 చదవండి: BAN Vs AFG: పుండు మీద కారం చల్లినట్లు..హెడ్కోచ్, ఆటగాడిని శిక్షించిన ఐసీసీ #MLC2023: దంచికొట్టిన సీఎస్కే ఓపెనర్.. సూపర్కింగ్స్కు రెండో విజయం -
MS Dhoni: ధోనికి హెలికాప్టర్ షాట్ నేర్పించింది అతడే! 42 ఆసక్తికర విషయాలు..
#HappyBirthdayMSDhoni: మహేంద్ర సింగ్ ధోని.. ఈ పేరుకు పరిచయం అక్కర్లేదు. తన అద్భుత ఆట తీరుతో.. అసాధారణ కెప్టెన్సీ నైపుణ్యాలతో టీమిండియాకు ఏకంగా మూడు ఐసీసీ ట్రోఫీలు అందించిన ఘనత అతడి సొంతం. టీ20 ప్రపంచకప్-2007, వన్డే వరల్డ్కప్-2011, చాంపియన్స్ ట్రోఫీ- 2013 సాధించి చరిత్ర సృష్టించాడు. కోట్లాది మంది అభిమానుల హృదయాల్లో గూడు కట్టుకున్నాడు. అంతర్జాతీయ స్థాయిలో తిరుగులేని నాయకుడిగా ఎదిగిన ధోని.. ఫ్రాంఛైజీ క్రికెట్లోనూ సత్తా చాటుతున్నాడు. 41 ఏళ్ల వయసులో చెన్నై సూపర్ కింగ్స్ను ఏకంగా ఐదోసారి చాంపియన్గా నిలపడం ఇందుకు నిదర్శనం. హెలికాప్టర్ షాట్ల ధోని క్రీజులోకి వస్తున్నాడంటే చాలు మైదానం హోరెత్తిపోవాల్సిందే. ధోని మేనియాతో జనం ఊగిపోవాల్సిందే. అలాంటిది ధోని పుట్టినరోజు(1981, జూలై 7) అంటే సంబరాలు అంబరాన్నంటుతాయి కదా! అవును.. ఈరోజు తలా.. 42వ వసంతంలో అడుగుపెడుతున్నాడు. ఈ సందర్భంగా జార్ఖండ్ డైనమైట్ ధోని వ్యక్తిగత జీవితం, క్రికెట్ కెరీర్కు సంబంధించిన 42 ఆసక్తికర విషయాలు మీకోసం.. క్రికెటర్ అవడానికి ముందు 1. ప్రొఫెషనల్ క్రికెట్ కెరీర్ ఆరంభించడానికి ముందు ధోని భారత రైల్వేస్లో ఉద్యోగి. 2. భారత్లోని అతిపెద్ద రైల్వే స్టేషన్లలో ఒకటైన ఖరగ్పూర్ పరిధిలో ట్రెయిన్ టికెట్ ఎగ్జామినర్గా విధులు నిర్వర్తించాడు. 3. క్రికెట్ కాకుండా ధోనికి ఇష్టమైన ఇతర క్రీడలు డబ్ల్యుడబ్ల్యూఈ, ఫుట్బాల్, బ్యాడ్మింటన్. 4. టీమిండియాలోకి వచ్చిన తొలినాళ్లలో ధోని జులపాల జుట్టుతో కనిపించేవాడు. తన హెయిర్స్టైల్కు బాలీవుడ్ హీరో జాన్ అబ్రహం స్ఫూర్తి అట! 5. ధోనికి హాట్ చాకొలెట్లంటే మహాప్రీతి. వాళ్ల పాటలంటే చెవికోసుకుంటాడు 6. ప్రముఖ సింగర్లు కిషోర్ కుమార్, ముకేశ్లకు ధోని వీరాభిమాని. బాలీవుడ్ ఓల్డ్ క్లాసిక్స్ అంటే చెవికోసుకుంటాడు. 7. ఆటోమొబైల్స్ అంటే ధోనికి పిచ్చిప్రేమ. ఈ విషయం తన గ్యారేజీలో ఉన్న వింటేజ్ మోటార్ సైకిల్స్, సూపర్బైకులు చూస్తే అర్థమవుతుంది. 8. 2007లో ధోని తొలిసారి సాక్షిని కలిశాడు. 2010లో ఆమెను పెళ్లి చేసుకున్నాడు. వీరికి కూతురు జివా సంతానం. 9. 1999-2000 సీజన్లో ధోని దేశవాళీ క్రికెట్లో అడుగుపెట్టాడు. 10. 2004లో టీమిండియా తరఫున అరంగేట్రం చేసిన ధోని.. 90 టెస్టులు, 350 వన్డేలు, 98 టీ20లు ఆడాడు. ఆయా ఫార్మాట్లలో వరుసగా 4876, 10773, 1617 పరుగులు సాధించాడు. అత్యధిక స్కోరు అదే 11. చెన్నై సూపర్ కింగ్స్ కాకుండా ధోని ప్రాతినిథ్యం వహించిన ఏకైక ఐపీఎల్ జట్టు రైజింగ్ పుణె సూపర్జెయింట్స్. 12. 2005లో శ్రీలంక మీద సాధించిన 183 పరుగులు(నాటౌట్) ధోనికి వన్డేల్లో అత్యధిక స్కోరు. 13. అంతర్జాతీయ టీ20లలో అత్యధిక క్యాచ్లు అందుకున్న రెండో వికెట్ కీపర్గా ధోని రికార్డు నెలకొల్పాడు. 14. వన్డేల్లో 200 లేదంటే అంతకంటే ఎక్కువ మ్యాచ్లకు సారథ్యం వహించిన ఏకైక ఆసియా కెప్టెన్ ఎంఎస్ ధోని. 15. అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక సిక్సర్లు బాదిన సారథిగా ధోని చరిత్రకెక్కాడు. రెండో బ్యాటర్గా 16. అంతర్జాతీయ స్థాయిలో కెప్టెన్గా అత్యధిక మ్యాచ్లు ఆడిన సారథిగా ధోని అరుదైన ఘనత. 17. వన్డేల్లో అత్యధిక స్కోరు(శ్రీలంకపై 183 పరుగులు నాటౌట్) సాధించిన వికెట్ కీపర్గా ధోని రికార్డులకెక్కాడు. 18. ఐపీఎల్లో 11 ఫైనల్ మ్యాచ్లలో ఆడిన ఏకైక క్రికెటర్ ఎంఎస్ ధోని. 19. ఐపీఎల్-2023లో చెన్నైని విజేతగా నిలిపిన ధోని ఐదోసారి ట్రోఫీ గెలిచాడు. తద్వారా ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ పేరిట ఉన్న రికార్డును సమం చేశాడు. 20. చెన్నైలో 2013 నాటి టెస్టు మ్యాచ్లో ఆస్ట్రేలియా మీద ధోని 224 పరుగులు చేశాడు. భారత కెప్టెన్లలో ఈ మేరకు అత్యధిక స్కోరు నమోదు చేసిన రెండో బ్యాటర్ ధోని. ఐసీసీ టైటిళ్ల వీరుడు 21. టీ20 క్రికెట్లో అత్యధిక క్యాచ్లు అందుకున్న వికెట్ కీపర్గా 2018లో ధోని ప్రపంచ రికార్డు సృష్టించాడు. 22. స్వదేశంలో, విదేశాల్లో ఎక్కువ టెస్టు మ్యాచ్లు గెలిపించిన రెండో భారత కెప్టెన్ ధోని. 23. వరుసగా ఐదు ద్వైపాక్షిక సిరీస్లు గెలిచిన ఏకైక భారత కెప్టెన్ ధోని. 24. ఐసీసీ టీ20, వన్డే, చాంపియన్స్ ట్రోఫీ గెలిచిన ఏకైక కెప్టెన్గా ధోని చరిత్రకెక్కాడు. 25. వన్డేలో ఒకే మ్యాచ్లో 10 సిక్సర్లు బాదిన ఏకైక టీమిండియా క్రికెటర్. 41 ఏళ్ల తర్వాత అక్కడ విజయం 26. వన్డే క్రికెట్లో 100 కంటే ఎక్కువ స్టంపింగ్లు చేసిన ఏకైక వికెట్ కీపర్ ధోనినే! 27. 2009లో ధోని అద్భుతమైన కెప్టెన్సీ కారణంగా న్యూజిలాండ్ గడ్డ మీద 41 ఏళ్ల తర్వాత టీమిండియా తొలిసారి విజయం నమోదు చేసింది. 28. 2009లో టీమిండియాను టెస్టు క్రికెట్లో వరల్డ్ నెంబర్ 1గా నిలిపాడు ధోని. 29. 2008, 2009లో ధోని ఐసీసీ వన్డే ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డులు అందుకున్నాడు. 30. 2007లో ధోని రాజీవ్ ఖేల్ రత్న అవార్డు గెలుచుకున్నాడు. అవార్డులు ఇవే 31. 79 బంతుల్లో 91 పరుగులు చేసిన ధోని అద్భుత ఇన్నింగ్స్ కారణంగా దాదాపు 28 ఏళ్ల తర్వాత భారత్ మరోసారి వన్డే వరల్డ్కప్(2011) గెలుచుకుంది. 32. టెస్టు క్రికెట్లో 78 సిక్సర్లు బాదిన ధోని వీరేంద్ర సెహ్వాగ్ తర్వాత ఈ ఫీట్ అందుకున్న రెండో భారత క్రికెటర్గా నిలిచాడు. 33. క్రీడా రంగంలో ధోని సేవలకు గానూ భారత ప్రభుత్వం 2009లో పద్మశ్రీ, 2018లో పద్మ భూషణ్ పురస్కారాలతో సత్కరించింది. 34. ఐపీఎల్లో కెప్టెన్గా 100 కంటే ఎక్కువ మ్యాచ్లు గెలిచిన ఒకే ఒక్క క్రికెటర్ ఎంఎస్ ధోని. 35. ధోని జీవితం ఆధారంగా 2016లో ఎంఎస్ ధోని: ది అన్టోల్డ్ స్టోరీ పేరిట బాలీవుడ్లో సినిమా వచ్చింది. సుశాంత్ సింగ్ రాజ్పుత్ ధోని పాత్రలో నటించాడు. సెప్టెంబరు 30, 2016లో ఈ సినిమా విడుదలైంది. వాళ్లంటే అభిమానం 36. 2011లో ధోని లెఫ్టినెంట్ కల్నల్ హోదా దక్కించుకున్నాడు. కపిల్ దేవ్ తర్వాత ఈ గౌరవం పొందిన రెండో క్రికెటర్ ధోని. 37. డబ్ల్యుడబ్ల్యుఈకి అభిమాని అయిన ధోని ఫేవరెట్ రెజ్లర్లు బ్రెట్ ది హిట్మ్యాన్ హార్ట్, హల్క్ హోగన్. 38. ధోని ఆల్టైమ్ ఫేవరెట్ ఫుట్బాలర్ జినెడైన్ జిడానే. లియొనల్ మెస్సీ ఆటను కూడా ధోని ఇష్టపడతాడు. 39. ధోనికి సిగ్నేచర్ షాట్ హెలికాప్టర్ షాట్. దానిని అతడికి నేర్పించింది మరెవరో కాదు ధోని సహచర ఆటగాడు,బెస్ట్ఫ్రెండ్ సంతోష్ లాల్. 40. తన బర్త్డే జూలై 7న కాబట్టి ధోని తన జెర్సీ నంబరును సెవన్గా ఎంచుకున్నాడు. 41. టెస్టు క్రికెట్లో ద్విశతకం బాదిన ఒకే ఒక్క భారత వికెట్ కీపర్ బ్యాటర్ ధోని. 42. క్రికెటర్గా అత్యున్నత శిఖరాలకు ఎదిగిన ధోని ఇండియన్ సూపర్ లీగ్లో అభిషేక్ బచ్చన్తో కలిసి చెన్నైయన్ ఎఫ్సీ సహ యజమానిగా ఉన్నాడు. -సాక్షి, వెబ్డెస్క్. చదవండి: ఒక్క బంతి ఎక్కువ తీసుకున్నా గోవిందా! నాడు తండ్రి సచిన్ వికెట్ తీసి.. ఇప్పుడేమో రాణించిన పుజారా.. సత్తా చాటిన సూర్యకుమార్, నిరాశపరిచిన పృథ్వీ షా -
మా ఓటమికి ప్రధాన కారణం అదే.. అతడు మాత్రం సూపర్: హార్దిక్
India vs New Zealand, 1st T20I: టీమిండియాతో వన్డే సిరీస్లో ఘోర పరాభవం పాలైన న్యూజిలాండ్ టీ20 సిరీస్లో మాత్రం శుభారంభం చేసింది. రాంచి వేదికగా శుక్రవారం జరిగిన తొలి మ్యాచ్లో 21 పరుగులతో జయకేతనం ఎగురవేసింది. తద్వారా మిచెల్ సాంట్నర్ బృందం మూడు మ్యాచ్ల సిరీస్లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది. మా ఓటమికి కారణం అదే కివీస్ ఆలౌరౌండ్ ప్రతిభతో విజయం సాధించగా.. టీమిండియా స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేక పరాజయం పాలైంది. ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం భారత కెప్టెన్ హార్దిక్ పాండ్యా మాట్లాడుతూ.. తమ ఓటమికి గల కారణాలు విశ్లేషించాడు. ‘‘రాంచి వికెట్ ఇలా ఉంటుందని ఎవరూ ఊహించి ఉండరు. ఇరు జట్లకు ఇది ఆశ్చర్యం కలిగించే విషయమే. అయితే, న్యూజిలాండ్ మాకంటే మెరుగ్గా ఆడింది. అందుకే అనుకున్న ఫలితం రాబట్టగలిగింది. నిజానికి కొత్త బంతి అనుకోని రీతిలో టర్న్ అవడం మమ్మల్ని ఆశ్చర్యానికి గురి చేసింది. నేను, సూర్య బ్యాటింగ్ చేస్తున్నప్పుడు వికెట్ కాస్త మెరుగైంది. ఏదేమైనా ఈ వికెట్పై ప్రత్యర్థిని 176- 177 వరకు పరుగులు చేయనివ్వడం సరికాదు. మా బౌలింగ్ వైఫల్యం కారణంగానే ఇలా జరిగింది. 20-25 పరుగులు ఎక్కువగానే ఇచ్చుకున్నాం. మా జట్టులో యువకులే ఎక్కువ. ఈ ఓటమి నుంచి కచ్చితంగా పాఠాలు నేర్చుకుంటాం’’ అని పాండ్యా చెప్పుకొచ్చాడు. సుందర్ సూపర్ ఇక వాషింగ్టన్ సుందర్ ఆట తీరు గురించి ప్రస్తావిస్తూ.. ‘‘ఈరోజు న్యూజిలాండ్పై తను బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ చేసిన విధానం అమోఘం. మాకు ఇలాంటి వాళ్లే కావాలి. వాషింగ్టన్ సుందర్ లాంటి ఆటగాడు జట్టులో ఉంటే మా ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది’’ అంటూ హార్దిక్ ప్రశంసలు కురిపించాడు. అదరగొట్టిన సుందర్ కాగా కివీస్తో తొలి టీ20లో 4 ఓవర్ల బౌలింగ్లో 22 పరుగులు మాత్రమే ఇచ్చిన వాషీ 2 వికెట్లు పడగొట్టాడు. లక్ష్య ఛేదనలో సూర్య(47), పాండ్యా(21) మినహా మిగతా వాళ్లంతా చేతులెత్తేసిన వేళ అర్ధ శతకంతో రాణించాడు. 28 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో వాషింగ్టన్ సుందర్ 50 పరుగులు సాధించాడు. ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ తొలి టీ20 మ్యాచ్ స్కోర్లు ►న్యూజిలాండ్- 176/6 (20) ►ఇండియా- 155/9 (20) ►ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: డారిల్ మిచెల్30 బంతుల్లో 59 పరుగులు- నాటౌట్ చదవండి: T20 WC Ind Vs Eng: ఆసీస్పై ఇంగ్లండ్ విజయం.. ఫైనల్లో టీమిండియాతో పోరు! చరిత్రకు అడుగు దూరంలో భారత్.. Ranji Trophy: ముంబై- మహారాష్ట్ర మ్యాచ్ డ్రా.. క్వార్టర్ ఫైనల్లో ఆంధ్ర -
ఏ మాత్రం తగ్గని ధోని మేనియా
టీమిండియా మాజీ ఆటగాడు ఎంఎస్ ధోని అంతర్జాతీయ క్రికెట్కు గుడ్బై చెప్పి మూడేళ్లు కావొస్తున్నా అతనిపై ఉన్న క్రేజ్ మాత్రం ఇసుమంతైనా తగ్గలేదు. దానికి ఉదాహరణే రాంచీ వేదికగా టీమిండియా, న్యూజిలాండ్ మధ్య జరిగిన తొలి టి20. సొంత ఇలాకాలో మ్యాచ్ జరగడంతో ధోని తన ఫ్యామిలీతో కలిసి మ్యాచ్కు హాజరయ్యాడు. అంతకముందు ఒకరోజే టీమిండియా ఆటగాళ్లను కలిసిన ధోని వారిని సర్ప్రైజ్ చేశాడు. ఇక మ్యాచ్ సందర్భంగా ధోని స్క్రీన్పై కనబడగానే స్టేడియం మొత్తం ధోని.. ధోని అంటూ నినాదాలతో హోరెత్తించారు. ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ తమ అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. ధోనీ ధోనీ అంటూ అభిమానులు నినదిస్తుండగా అతడు అభివాదం చేశాడు. క్రికెట్లో దిగ్గజ కెప్టెన్లలో ఒకడిగా పేరు తెచ్చుకున్న ధోనీ రిటైర్మెంట్ తర్వాత ఇతర కార్యక్రమాలపై దృష్టి పెట్టాడు. అయితే ఆటకు దూరంగా ఉన్న ఏదో ఒక రూపంలో క్రీడలతో అనుబంధాన్ని కొనసాగిస్తూనే ఉన్నాడు. ఇటీవలి కాలంలో టీమిండియా ఆడుతున్న మ్యాచ్లకు హాజరవుతున్నాడు. ఇక శుక్రవారం జరిగిన తొలి టి20లో న్యూజిలాండ్ చేతితో భారత్ ఓడిపోయింది. వన్డే సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా తొలి టీ20 లో మాత్రం ఓడిపోవడంతో భారత అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. భారత్ ముందు న్యూజిలాండ్ నిర్దేశించిన 177 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా ఛేదించలేక చతికిలపడింది. నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లకు 155 పరుగులు మాత్రమే చేసి 21 పరుగుల తేడాతో ఓటమి పాలయ్యింది. సుందర్ ఒక్కడే అర్థశతకంతో ఒంటరిపోరాటం చేశాడు. MSD + Ranchi = 🤩 When the Ranchi crowd welcomed the legendary @msdhoni in style 😃👌#TeamIndia | #INDvNZ | @mastercardindia pic.twitter.com/40FoEDudSv — BCCI (@BCCI) January 27, 2023 చదవండి: ఒకే ఓవర్లో 27 పరుగులు; అర్ష్దీప్ ఖాతాలో అత్యంత చెత్త రికార్డు స్టన్నింగ్ క్యాచ్తో మెరిసిన సుందర్.. -
Ind Vs NZ: రాంచిలో మ్యాచ్ అంటే అంతే!
India vs New Zealand, 1st T20I: వన్డే సిరీస్లో న్యూజిలాండ్ను చిత్తు చేసిన టీమిండియా టీ20 సిరీస్పై కన్నేసింది. వన్డేల్లో క్లీన్స్వీప్ చేసిన భారత జట్టు రెట్టించిన ఉత్సాహంతో పొట్టి క్రికెట్లో పోటీకి సిద్ధమైంది. రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి వంటి సీనియర్ల గైర్హాజరీలో హార్దిక్ పాండ్యా సారథ్యంలో కివీస్తో పోరుకు సై అంటోంది. మరోవైపు.. వన్డే సిరీస్లో ఘోర పరాజయంతో డీలా పడిన న్యూజిలాండ్ టీ20 సిరీస్లోనైనా సత్తా చాటి తిరిగి పుంజుకోవాలని పట్టుదలగా ఉంది. మిచెల్ సాంట్నర్ నేతృత్వంలో కివీస్ జట్టు బరిలోకి దిగనుంది. కాగా సారథిగా సాంట్నర్ ఐర్లాండ్, స్కాట్లాండ్, నెదర్లాండ్స్ వంటి చిన్న జట్లపై కివీస్కు విజయాలు అందించాడు. ఈ క్రమంలో రాంచి వేదికగా శుక్రవారం నాటి తొలి మ్యాచ్తో టీమిండియా- కివీస్ మధ్య ఆరంభం కానున్న టీ20 సిరీస్ ఆసక్తికరంగా మారింది. రాంచీ మ్యాచ్ అంటే అంతే! ఇక రాంచీలో మ్యాచ్ అంటే ఆడినా, ఆడకపోయినా మహేంద్ర సింగ్ ధోని ఉండాల్సిందే! తన రిటైర్మెంట్ తర్వాతి నుంచి ఎప్పుడు నగరంలో టీమిండియా ఆడినా వారిని కలిసే ధోని ఈసారి కూడా దానిని కొనసాగించాడు. మ్యాచ్ జరిగే జేఎస్సీఏ స్టేడియానికి వచ్చి పాండ్యా బృందంతో మిస్టర్ కూల్ ముచ్చటించాడు. జార్ఖండ్ టీమ్ డ్రెస్లో అప్పటి వరకు ప్రాక్టీస్ సాగించిన ఈ మాజీ కెప్టెన్.. డ్రెస్సింగ్ రూమ్కు వచ్చి ఆటగాళ్లతో విభిన్న అంశాలపై మాట్లాడాడు. అతనితో కలిసి ఆడిన, ఆడని కొత్త ఆటగాళ్లు, సహాయక సిబ్బంది కూడా ధోనిని కలిసినందుకు ఆనందంతో పొంగిపోయారు. Look who came visiting at training today in Ranchi - the great @msdhoni! 😊#TeamIndia | #INDvNZ pic.twitter.com/antqqYisOh — BCCI (@BCCI) January 26, 2023 ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మొదటి టీ20 పిచ్, వాతావరణం బ్యాటింగ్కు అనుకూలంగా ఉండే సాధారణ వికెట్. ఛేదనలోనే అన్ని జట్లకు మెరుగైన రికార్డు ఉంది. ఇక్కడ ఆడిన 3 అంతర్జాతీయ టి20ల్లోనూ భారత్ గెలిచింది. మ్యాచ్ రోజు వర్షసూచన లేదు. మంచు ప్రభావం ఎక్కువ కాబట్టి టాస్ గెలిచిన జట్టు ఫీల్డింగ్ ఎంచుకోవడం ఖాయమని చెప్పవచ్చు. ముఖాముఖి పోరు కాగా 2021 నవంబర్లో భారత్లో ఆడిన టి20 సిరీస్లో న్యూజిలాండ్ 0–3తో చిత్తయింది. తుది జట్ల వివరాలు (అంచనా) టీమిండియా: శుబ్మన్ గిల్, ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), రాహుల్ త్రిపాఠి, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), దీపక్ హుడా, వాషింగ్టన్ సుందర్, శివం మావి, ఉమ్రాన్ మాలిక్, అర్ష్దీప్ సింగ్, యజువేంద్ర చహల్ న్యూజిలాండ్ ఫిన్ అలెన్, డెవాన్ కాన్వే(వికెట్ కీపర్), మార్క్ చాప్మన్, గ్లెన్ ఫిలిప్స్, డారిల్ మిచెల్, మైకేల్ బ్రాస్వెల్, మిచెల్ సాంట్నర్(కెప్టెన్), లాకీ ఫెర్గూసన్, ఇష్ సోధి, బ్లెయిర్ టిక్నర్, బెన్ లిస్టర్/జాకోబ్ డఫీ. చదవండి: Ravindra Jadeja: రీ ఎంట్రీలో దుమ్మురేపిన జడేజా.. ఏకంగా 8 వికెట్లతో..! ICC Awards 2022: ఐసీసీ అవార్డు విన్నర్ల మొత్తం జాబితా ఇదే.. Hello Ranchi 👋 We are here for the #INDvNZ T20I series opener 👏 👏#TeamIndia | @mastercardindia pic.twitter.com/iJ4uSi8Syv — BCCI (@BCCI) January 25, 2023 -
సీనియర్లు లేకుండా టీ20 సమరానికి 'సై'! ఆ ముగ్గురికి విశ్రాంతి
సీనియర్లు లేకుండా మరో టి20 సిరీస్... రోహిత్ శర్మ, కోహ్లి, కేఎల్ రాహుల్ విశ్రాంతి తీసుకోగా, వరల్డ్కప్ తర్వాత హార్దిక్ పాండ్యా కెప్టెన్ వరుసగా మూడో సిరీస్... వన్డేల్లో న్యూజిలాండ్పై సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించిన టీమిండియా ఇప్పుడు టి20ల్లో కూడా అదే జోరును కొనసాగించేందుకు సిద్ధమైంది. ఏడాది వన్డే వరల్డ్కప్ ఉండటంతో టి20 ఫార్మాట్కు ప్రాధాన్యత తగ్గిన నేపథ్యంలో సీజన్లో చివరి టి20 ద్వైపాక్షిక పోరులో సత్తా చాటేందుకు యువ ఆటగాళ్లకు మరో అవకాశం దక్కింది. గత ప్రత్యర్థి శ్రీలంక తరహాలో కివీస్ కూడా కనీసం ఈ ఫార్మాట్లో అయినా పోటీనిస్తుందా లేదా అనేది చూడాలి. రాంచీ: దాదాపు ఏకపక్షంగా సాగిన వన్డే సిరీస్ తర్వాత టి20ల్లో అమీతుమీ తేల్చుకునేందుకు భారత్, న్యూజిలాండ్ సన్నద్ధమయ్యాయి. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా నేడు ఇరు జట్ల మధ్య తొలి టి20 పోరు జరగనుంది. అనుభవం, గణాంకాల దృష్ట్యా ప్రత్యర్థి కంటే టీమిండియా ఎంతో బలంగా కనిపిస్తుండగా... కివీస్ తమ యువ ఆటగాళ్లతో సంచలనాన్ని ఆశిస్తోంది. ఇలాంటి స్థితిలో ఈ సిరీస్ అయినా పోటాపోటీగా సాగుతుందా లేక ఇదీ ఏకపక్షమవుతుందా అనేది ఆసక్తికరం. గిల్తోనే ఓపెనింగ్... దాదాపు ఇరవై రోజుల క్రితం భారత జట్టు తమ చివరి టి20 మ్యాచ్ను శ్రీలంకతో ఆడింది. స్వల్ప మార్పుల మినహా అదే జట్టు ఈసారి కూడా బరిలోకి దిగే అవకాశం ఉంది. ఒక ఓపెనర్గా ఇషాన్ కిషన్ ఖాయం కాగా... రెండో ఓపెనర్గా శుబ్మన్ గిల్ ఆడతాడని కెప్టెన్ హార్దిక్ చెప్పేశాడు. రుతురాజ్ గైక్వాడ్ గాయంతో సిరీస్కు దూరం కాగా, పృథ్వీ షా రూపంలో మరో ఓపెనర్ అందుబాటులో ఉన్నాడు. శ్రీలంకతో సిరీస్లోనే అరంగేట్రం చేసిన గిల్ టి20 రికార్డు అంత గొప్పగా ఏమీ లేదు. అయితే వన్డేల్లో అతని తాజా ఫామ్ను చూస్తే జట్టులో స్థానం ఇవ్వక తప్పదని కూడా హార్దిక్ వెల్లడించాడు. రాహుల్ త్రిపాఠి తన సత్తాను గత మ్యాచ్లో చూపించగా... నాలుగో స్థానంలో ‘ఐసీసీ టి20 ప్లేయర్ ఆఫ్ ద ఇయర్’ రూపంలో సూర్యకుమార్ సిద్ధంగా ఉన్నాడు. ఆల్రౌండర్గా దీపక్ హుడా బరిలోకి దిగనుండగా, పెళ్లి కారణంగా అక్షర్ పటేల్ ఈ సిరీస్కు దూరంగా ఉండటంతో వాషింగ్టన్ సుందర్కు చోటు ఖాయమైంది. సీనియర్ పేసర్లు ఎవరూ లేకపోవడంతో మరోసారి ఉమ్రాన్ మాలిక్, అర్ష్దీప్ సింగ్, శివమ్ మావిలపైనే జట్టు భారం ఉంది. మున్ముందు అగ్రశ్రేణి బౌలర్లు వచ్చినా... తమ స్థానం నిలబెట్టుకోవాలంటే ఈ సిరీస్లో వీరు సత్తా చాటాల్సి ఉంది. మణికట్టు స్పిన్నర్ స్థానానికి సహజంగానే కుల్దీప్, చహల్ మధ్య పోటీ నెలకొంది. ఇష్ సోధికి చోటు... వన్డేలలాగే టి20 సిరీస్ నుంచి కూడా న్యూజిలాండ్ సీనియర్లు విలియమ్సన్, సౌతీ విశ్రాంతి తీసుకున్నారు. దాంతో సాన్ట్నర్ నాయకత్వంలో జట్టు బరిలోకి దిగుతోంది. కెప్టెన్గా సాన్ట్నర్ బలహీన జట్లు ఐర్లాండ్, స్కాట్లాండ్, నెదర్లాండ్స్ జట్లపై విజయాలు అందించాడు. టి20 వరల్డ్కప్ తొలి మ్యాచ్లో మెరుపు సెంచరీతో చెలరేగిన తర్వాత ఓపెనర్ ఫిన్ అలెన్ ఆడిన ఆరు టి20ల్లోనూ విఫలమయ్యాడు. తాజా వన్డే సిరీస్లో కూడా రెండుసార్లు డకౌట్ అయిన అతను ఇప్పుడైనా చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడాలని జట్టు కోరుకుంటోంది. ఆల్ఫార్మాట్ బ్యాటర్గా తనకంటూ ఇప్పటికే గుర్తింపు తెచ్చుకొని చివరి వన్డేలో సెంచరీ బాదిన కాన్వే మరోసారి కీలకం కానుండగా... ముగ్గురు ఆల్రౌండర్లు మిచెల్, బ్రేస్వెల్, సాన్ట్నర్ రాణిస్తేనే జట్టుకు విజయావకాశాలు ఉంటాయి. పేస్ బౌలింగ్లో కివీస్ బాగా బలహీనంగా కనిపిస్తోంది. లిస్టర్, షిప్లీ ఇప్పటివరకు టి20లు ఆడకపోగా... టిక్నర్, డఫీ అనుభవం కూడా అంతంత మాత్రమే. దాంతో ఫెర్గూసన్పై అదనపు భారం పడింది. లిస్టర్ ఈ మ్యాచ్తో అరంగేట్రం చేసే అవకాశం ఉంది. అయితే గాయంతో వన్డేలు ఆడని ప్రధాన స్పిన్నర్ ఇష్ సోధి కోలుకోవడం జట్టుకు పెద్ద ఊరట. భారత గడ్డపై అతనికి మంచి రికార్డు ఉంది. తుది జట్ల వివరాలు (అంచనా) భారత్: హార్దిక్ (కెప్టెన్), గిల్, ఇషాన్ కిషన్, రాహుల్ త్రిపాఠి, సూర్యకుమార్, హుడా, సుందర్, మావి, ఉమ్రాన్, అర్ష్దీప్, కుల్దీప్/చహల్. న్యూజిలాండ్: సాన్ట్నర్ (కెప్టెన్), అలెన్, కాన్వే, చాప్మన్, ఫిలిప్స్, మిచెల్, మైకేల్ బ్రేస్వెల్, టిక్నర్, సోధి, లిస్టర్, ఫెర్గూసన్. చదవండి: Australian Open: ఆశలు గల్లంతు! ఫైనల్లో ఓటమిపాలైన సానియా-బోపన్న జోడి -
IND VS NZ 1st T20: టీమిండియాతో కలిసి సందడి చేసిన ధోని
3 మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య రాంచీ వేదికగా రేపు (జనవరి 27) తొలి మ్యాచ్ జరుగనున్న విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్కు ముందు భారత డ్రెస్సింగ్ రూమ్లో ఓ అనుకోని అతిధి ప్రత్యక్షమై అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తడంతో పాటు జట్టు సభ్యుల్లో జోష్ నింపాడు. ఆ స్పెషల్ పర్సన్ ఎవరంటే..? టీమిండియా మాజీ కెప్టెన్, లోకల్ హీరో మహేంద్రసింగ్ ధోని. Look who came visiting at training today in Ranchi - the great @msdhoni! 😊#TeamIndia | #INDvNZ pic.twitter.com/antqqYisOh — BCCI (@BCCI) January 26, 2023 టీమ్ మేనేజ్మెంట్కు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా డ్రెస్సింగ్ రూమ్లో ప్రత్యక్షమైన ధోనిని చూసి యువ భారత సభ్యులు ఉబ్బితబ్బిబైపోయారు. ధోనితో సరదాగా గడుపుతూ సందడి చేశారు. ధోని సైతం హుషారుగా యువ సభ్యులతో మాటలు కలుపుతూ, సలహాలిచ్చాడు. హార్ధిక్, ఇషాన్, గిల్, సూర్యకుమార్, చహల్, సుందర్.. ఇలా దాదాపుగా ప్రతి సభ్యుడు మిస్టర్ కూల్ కెప్టెన్తో కలియతిరిగారు. Hello Ranchi 👋 We are here for the #INDvNZ T20I series opener 👏 👏#TeamIndia | @mastercardindia pic.twitter.com/iJ4uSi8Syv — BCCI (@BCCI) January 25, 2023 ధోని సైతం వారితో సరదాగా గడిపారు. చాలాకాలం తర్వాత కలిసిన భారత నాన్ ప్లేయింగ్ బృంద సభ్యులకు ధోని షేక్ హ్యాండ్ ఇచ్చి పలకరించాడు. దీనికి సంబంధించిన వీడియోను బీసీసీఐ ఇవాళ (జనవరి 26) తమ అధికారిక ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేయగా, ప్రస్తుతం వైరలవుతోంది. ధోనిని చాలాకాలం తర్వాత చూసిన ఫ్యాన్స్ తెగ సంబురపడిపోతున్నారు. కాగా, మహేంద్రుడి స్వస్థలం జార్ఖండ్లోని రాంచీ అన్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే, భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య రేపు రాత్రి 7 గంటల నుంచి తొలి టీ20 ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్లో గెలుపే లక్ష్యంగా ఇరు జట్లు బరిలోకి దిగనున్నాయి. వన్డే సిరీస్ను క్లీన్స్వీప్ చేసిన జోష్లో టీమిండియా ఉండగా.. ఈ సిరీస్నైనా గెలిచి పరువు నిలుపుకోవాలని కివీస్ పట్టుదలగా ఉంది. 3 మ్యాచ్ల ఈ సిరీస్లో రెండో టీ20 జనవరి 29న లక్నోలో, మూడో మ్యాచ్ ఫిబ్రవరి 1న అహ్మదాబాద్లో జరుగనుంది. న్యూజిలాండ్తో టీ20 సిరీస్ను భారత జట్టు.. హార్ధిక్ పాండ్యా (కెప్టెన్), సూర్యకుమార్ యాదవ్ (వైస్ కెప్టెన్), ఇషాన్ కిషన్ (వికెట్కీపర్), జితేశ్ శర్మ (వికెట్కీపర్), శుభ్మన్ గిల్, పృథ్వీ షా, రాహుల్ త్రిపాఠి, దీపక్ హుడా, వాషింగ్టన్ సుందర్, శివమ్ మావీ, కుల్దీప్ యాదవ్, అర్షదీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్, యుజ్వేంద్ర చహల్, ముకేశ్ కుమార్ న్యూజిలాండ్ జట్టు.. మిచెల్ సాంట్నర్ (కెప్టెన్), మైఖేల్ బ్రేస్వెల్, డారల్ మిచెల్, మైఖేల్ రిప్పన్, మార్క్ చాప్మన్, ఫిన్ అలెన్, డెవాన్ కాన్వే, డేన్ క్లీవర్, గ్లెన్ ఫిలిప్స్, జాకబ్ డఫ్ఫీ, బెన్ లిస్టర్, ఐష్ సోధీ, లోకీ ఫెర్గూసన్, హెన్రీ షిప్లే, బ్లెయిర్ టిక్నర్ -
అప్పుడే తొలిసారి ధోనిని చూశా..! రోజూ పెట్టినా అవే తింటా: ఇషాన్
India vs New Zealand T20 Series: న్యూజిలాండ్తో వన్డే సిరీస్ను క్లీన్స్వీప్ చేసిన టీమిండియా తదుపరి టీ20 సిరీస్కు సన్నద్ధమవుతోంది. ఇందులో భాగంగా రాంచి వేదికగా శుక్రవారం ఇరుజట్ల మధ్య తొలి మ్యాచ్ జరుగనుంది. కాగా టీమిండియా యువ సంచలనం ఇషాన్ కిషన్ దేశవాళీ క్రికెట్లో జార్ఖండ్కు ఆడతాడన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కివీస్తో రాంచిలో తొలి టీ20 నేపథ్యంలో బీసీసీఐ ఇంటర్వ్యూలో ఇషాన్ పలు ఆసక్తికర అంశాలు పంచుకున్నాడు. తన జెర్సీ నెంబర్ వెనుక రహస్యం సహా తనకిష్టమైన వంటకాలు, రాంచి డైనమైట్ ధోనితో అనుబంధం తదితర విషయాల గురించి చెప్పాడు. నంబర్ 23 కావాలనుకున్నా ‘‘నా జెర్సీ నంబర్ 23 ఉండాలని కోరుకున్నా. కానీ అప్పటికే కుల్దీప్ యాదవ్ అదే నంబర్ ఎంపిక చేసుకున్నాడు. దీంతో నేను మరో ఆప్షన్కు వెళ్లాల్సి వచ్చింది. అప్పుడు వెంటనే మా అమ్మకు ఫోన్ చేసి.. తన అభిప్రాయం అడిగాను. 32 నంబర్ ఉంటే తీసుకోమని చెప్పింది. అందుకు గల కారణాన్ని నేను అడగాలనుకోలేదు. అమ్మ మాట మీదుగా జెర్సీ నంబర్ను 32గా ఫిక్స్ చేసుకున్నా’’ అని ఇషాన్ పేర్కొన్నాడు. ఇప్పటివరకైతే ‘‘14 ఏళ్ల వయసులో.. బిహార్ నుంచి జార్ఖండ్కు మా కుటుంబం షిఫ్ట్ అయినపుడే ప్రొఫెషనల్ క్రికెటర్గా ఎదగాలని నిశ్చయించుకున్నా. తొలతు అండర్ 19.. ఆ తర్వాత టీమిండియాకు ఆడాలనేది నా కోరిక. ఈ సుదీర్ఘ ప్రయాణలో ఇప్పటి వరకు నేను కోరుకున్నవన్నీ దక్కాయి’’ అని ఇషాన్ హర్షం వ్యక్తం చేశాడు. అవే గొప్ప క్షణాలు ఇక 18 ఏళ్ల వయసులో తొలిసారి ధోని ఆటోగ్రాఫ్ తీసుకున్నాన్న ఇషాన్ కిషన్.. ధోనిని నేరుగా క్షణాలు తన జీవితంలో అత్యంత ముఖ్యమైనవని పేర్కొన్నాడు. కష్టాలకు భయపడే తత్వం తనది కాదని.. సవాళ్లను ఎదుర్కొంటూ ముందుకు సాగడమే తనకిష్టమని చెప్పుకొచ్చాడు. ఇక తనకు జపనీస్ వంటకాలంటే ప్రాణమన్న ఇషాన్.. రోజూ వాటినే పెట్టినా హాయిగా తినేస్తానంటూ సరాదాగా వ్యాఖ్యానించాడు. ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ ట్విటర్లో షేర్ చేసింది. చదవండి: IND VS NZ T20 Series: టీమిండియాకు భారీ షాక్.. గాయం కారణంగా స్టార్ ఓపెనర్ ఔట్ Rajat Patidar: అలా అయితే ఇషాన్ కూడా రాంచీలో నన్ను ఆడించు అంటాడు! కానీ.. Secret behind jersey number 🤔 Getting the legendary @msdhoni's autograph ✍️ Favourite cuisine 🍱 Get to know @ishankishan51 ahead of #INDvNZ T20I opener in Ranchi 👌🏻👌🏻#TeamIndia pic.twitter.com/neltBDKyiI — BCCI (@BCCI) January 26, 2023 -
లాయర్ల కుటుంబం నుంచి వచ్చి.. కాస్మోటిక్ బేస్డ్ స్టార్టప్తో ఎదిగి..
జార్ఖండ్లోని రాంచిలో పుట్టి పెరిగింది రోమిత. తండ్రి న్యాయవాది. తల్లిదండ్రులు తన పట్ల ఎప్పుడూ వివక్ష ప్రదర్శించలేదు. సోదరుడితో సమానంగా పెంచారు. యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో బిజినెస్ ఎకనామిక్స్ చదువుకునే రోజుల్లో కూడా తనకు వివక్ష ఎదురు కాలేదు. హార్బర్ రిడ్జ్ క్యాపిటల్లో ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్గా కెరీర్ను ప్రారంభించింది రోమిత. ఆ తరువాత వెంచర్ క్యాపిటలిస్ట్(వీసి)గా కూడా తనను తాను నిరూపించుకుంది. ఒకానొకరోజు...తనకు వ్యాపారరంగంలోకి ప్రవేశించాలని ఆలోచన వచ్చింది. లాయర్ల కుటుంబం నుంచి వచ్చిన రోమితకు ఎలాంటి వ్యాపార అనుభవం లేదు. ‘ఎందుకొచ్చిన రిస్క్’ అని అనుకొని ఉంటే తన కలను నెరవేర్చుకునేది కాదు. కాస్మోటిక్స్ బేస్డ్ స్టార్టప్ గురించి ఆలోచనతో నిధుల సమీకరణకు ప్రయత్నాలు మొదలు పెట్టినప్పుడు తనను బాధ పెట్టే ఎన్నో అనుభవాలు, ప్రశ్నలు ఎదురయ్యాయి. ‘మీరు మాత్రమేనా?’ ‘మేల్ కో–ఫౌండర్ ఎవరూ లేరా? ‘మీకు పెళ్లి అయిందా? అయితే పూర్తి సమయం కంపెనీ కోసం ఎలా కేటాయించగలరు?’ ‘మీరు సీరియస్గా వ్యాపారరంగంలోకి వచ్చినట్లుగా అనిపించడం లేదు. ఏదో సరదాగా వచ్చినట్లు అనిపిస్తుంది’... ఇవి మనసులోకి తీసుకునే ఉంటే రోమిత మజుందార్ తిరిగి వెనక్కి వెళ్లేదే తప్ప ముందుకు అడుగు వేసేది కాదు. ఎన్నో రకాల అనుమానాలు, అవమానాలను ఎదుర్కొని ఎట్టకేలకు కాస్మోటిక్ బేస్డ్ స్టార్టప్ ‘ఫాక్స్టేల్’తో తన కలను నిజం చేసుకుంది. ముంబై కేంద్రంగా పనిచేస్తున్న ఈ కంపెనీ నాలుగు రకాల ఉత్పత్తులతో మార్కెట్లోకి ప్రవేశించి కొద్దికాలంలోనే విజయకేతనం ఎగరేసింది. ఎంటర్ప్రెన్యూర్గా రోమిత మజుందార్ మంచి పేరు తెచ్చుకుంది. చదవండి: Viral: 13 ఏళ్లుగా ఎదురు చూస్తున్నా! ఆ తండ్రికి పుత్రికోత్సాహం.. వీడియో వైరల్ -
మరో పోరాటం.. రాంచీలో తల్లుల ఫుట్బాల్ ఫైనల్
కతార్ వైపు అందరూ కళ్లప్పగించి చూస్తున్నప్పుడు అక్కడికి 3000 కిలోమీటర్ల దూరంలోని జార్ఖండ్లో కూడా అంతే ఉత్కంఠ భరితమైన మ్యాచ్లు జరిగాయి. ఆదివారమే అక్కడా ఫైనల్స్ జరిగాయి. ఎవరు గెలిచారో తర్వాతి సంగతి. కాని పిల్లల తల్లులైన గిరిజన స్త్రీలు క్రీడాదుస్తులు ధరించి బాల్ కోసం పరిగెత్తడం సామాన్యం కాదు. ఆదివాసీ స్త్రీల మీద సాగే బాల్య వివాహాలు, గృహ హింస, మంత్రగత్తె అనే అపవాదు, నిర్బంధ నిరక్షరాస్యత వంటి దురన్యాయాలపై చైతన్యం తేవడానికి ఈ తల్లుల ఫుట్బాల్ కప్ను నిర్వహిస్తున్నారు. ‘మాత్ర శక్తి ఫుట్బాల్ టోర్నమెంట్’ వినూత్నతపై కథనం. కతార్లో జరిగిన ఫుట్బాల్ మ్యాచ్లో రోమాంచిత సన్నివేశాలు చూశారు ప్రేక్షకులు. కాని మొన్న రాంచీలో జరిగిన ‘మాత్ర శక్తి ఫుట్బాల్ టోర్నమెంట్’లోని సన్నివేశాలు అంతకు తక్కువేమి కావు. సన్నివేశం 1: అనితా భేంగరాకు 24 ఏళ్లు. టీమ్లో జోరుగా ఫుట్బాల్ ఆడుతూ హటాత్తుగా ఆగిపోయింది. మేచ్ నుంచి బయటికొచ్చేసింది. కారణం? తన చంటి పిల్లాడి ఏడుపు వినిపించడమే. పాలకు వాడు ఏడుస్తుంటే వాడి దగ్గరకు పరిగెత్తింది. ఆమె లేకుండానే ఆట కొనసాగింది. బిడ్డకు పాలు ఇస్తూ తన టీమ్ను ఉత్సాహపరుస్తూ కూచుంది అనిత. సన్నివేశం 2: ‘నెట్టె హజమ్’ (ముందుకొచ్చి కొట్టు), ‘రుడుమ్ నెట్టె’ (పక్కకు తిరిగి కొట్టు) అని ముండారి భాషలో అరుస్తున్నాడు సుక్కు ముండా. అతను తోడుగా వచ్చిన టీమ్ గ్రౌండ్లో ఆడుతూ ఉంది. వారిలో అతని భార్య సునీతా ముండా ఉంది. అసలే అది ఫైనల్ మేచ్. భర్త ఉత్సాహానికి భార్య రెచ్చి పోయింది. గోల్ కొట్టింది. సునీత టీమే ఫైనల్స్లో విజేతగా నిలిచింది. సుక్కు ముండా ఉత్సాహానికి అంతే లేదు. జార్ఖండ్లోని రాంచీ, ఖుంతి జిల్లాలోని 23 గ్రామాల నుంచి 32 మహిళా టీములు ‘మాత్ర శక్తి ఫుట్బాల్ టోర్నమెంట్ 2022’లో పాల్గొన్నాయి. 360 మంది తల్లులు ఈ టీముల్లో ఉన్నారు. కొందరు ఒక బిడ్డకు తల్లయితే మరొకరు ఇద్దరు పిల్లల తల్లి. వీరి వయసు 21 నుంచి 57 వరకూ ఉంది. ఈ టోర్నమెంట్ను 2018లో మొదలెట్టారు. జార్ఖండ్లో ఆదివాసీల కోసం పని చేస్తున్న ‘ప్రతిగ్య’ అనే సంస్థ వీటిని నిర్వహిస్తోంది. ఎందుకు ఈ టోర్నమెంట్? ►జార్ఖండ్ ఆదివాసీల్లో స్త్రీయే ప్రధాన పోషకురాలు. కుటుంబాన్ని ఆమె నడపాలి. అందువల్ల ఆమెపై కట్టడి జాస్తి. ►సంస్కృతి రీత్యా ఆమె ఒకే రకమైన దుస్తులు ధరించాలి. ఆటలు ఆడరాదు. ఆడేందుకు వేరే రకం దుస్తులు ధరించరాదు. ►చదువు వీరికి దూరం. బాల్య వివాహాలు, లైంగిక దాష్టీకాలు, మంత్రగత్తెలని చంపడం... ఇవి సర్వసాధారణం. ►ఆరోగ్య స్పృహ, వ్యక్తిగత శుభ్రత లోపం. వీటిపై పోరాడడానికి, చైతన్యం తేవడానికి, స్త్రీలలో ఐకమత్యం సాధించడానికి, తల్లులను ఇంటి నుంచి కదిలేలా చేస్తే వారి ద్వారా పిల్లలకు చదువు, ఆటలు అందుతాయనే ఉద్దేశం. వీటన్నింటి కోసం ప్రతిగ్య సంస్థ ఈ టోర్నమెంట్ను మొదలుపెట్టింది. నాగపూర్లో స్లమ్ ఫుట్బాల్ పుట్టినట్టు ఇది ఆదివాసీ స్త్రీల ఫుట్బాల్. ఎన్నో సమస్యలు అయితే 2018లో టోర్నమెంట్ కోసం ప్రతిగ్య వాలంటీర్లు పల్లెలు తిరుగుతుంటే స్త్రీల నుంచే వ్యతిరేకత ఎదురైంది. ‘మేమెందుకు ఆడాలి’ అన్నారు. భర్తలైతే కాళ్లు విరగ్గొడతాం అన్నారు. చివరకు రాంచీ జిల్లాలోని మైనీ కచ్చప్ అనే తల్లి (40) మొట్టమొదటి ప్లేయర్గా ఆడటానికి అంగీకరించింది. ఆమె నుంచి టీమ్ తయారైంది. 2018లో అతి కష్టమ్మీద 6 టీములు పాల్గొన్నాయి. 2019లో 24 టీములు వచ్చాయి. 2022 నాటికి టీముల సంఖ్య 32కు పెరిగింది. వీళ్లెవరికీ సరైన జెర్సీలు లేవు. షూస్ లేవు. కోచ్లు లేరు. ప్రచారం లేదు. స్పాన్సర్లు లేరు. ప్రైజ్ మనీని ఏర్పాటు చేయడం కూడా కష్టమే. అయినా సరే ఎంతో ఉత్సాహంగా టోర్నమెంట్లో పాల్గొన్నారు. కూతురూ తల్లి, అత్తా కోడలు ఈ టోర్నమెంట్లో ఒక పల్లెలో కూతురూ తల్లి (కూతురు కూడా తల్లే) టీమ్లో చేరారు. అయితే వాళ్లిద్దరూ ఆడటం ఊళ్లో మగవారికి ఇష్టం లేదు. వాళ్లను ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్లే గ్రౌండ్కు చేర్చడానికి ఎవరూ సహకరించలేదు. దాంతో వాళ్లు నడుస్తూ వచ్చి ఆట ఆడారు. మరో ఊళ్లో అత్తా కోడలు కలిసి టీమ్లో చేరారు. ‘ఈ ఆట ఆడక ముందు అత్త నాతో అంటీ ముట్టనట్టు ఉండేది. ఇప్పుడు మేమిద్దరం మంచి స్నేహితులయ్యాము. ఎన్నో మాటలు మాట్లాడుకుంటున్నాము. ఒకరికొకరం తోడయ్యాము’ అంది కోడలు. మొదట చర్రుపర్రుమన్న భర్తలు గ్రౌండ్లో తమ భార్యలు ఆడుతుంటే మురిసి ప్రోత్సహించడం మొదలెట్టారు. స్త్రీలందరూ ఈ గేమ్ వంకతో కలిసి మాట్లాడుకుంటున్నారు. తమ సమస్యలు చెప్పుకుంటున్నారు. వాటి సాధన కోసం ఏం చేయాలో తెలుసుకుంటున్నారు. వాళ్లు తన్నాలనుకుంటున్న బంతి ఆ సమస్యే. ఇలాంటి టోర్నమెంట్లు ఎన్నోచోట్ల మరెన్నో జరిగితే బాగుండు. చదవండి: Kajol: 48 ఏళ్ల వయసులోనూ ఆకట్టుకునే రూపం.. ఈ మూడు పాటించడం వల్లే అంటున్న కాజోల్ -
ఈడీ ముందుకు హేమంత్ సోరెన్
రాంచీ: అక్రమ గనుల తవ్వకం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ఎట్టకేలకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణకు హాజరయ్యారు. రాంచీ కార్యాలయంలో ఆయనను దాదాపు 9 గంటలకుపైగా ప్రశ్నించింది. ఈడీ కేసులో ప్రశ్నించేందుకు గతంలో ఆయనకు పలుమార్లు దర్యాప్తు సంస్థ సమన్లు జారీచేయగా వ్యక్తిగత, అధికారిక కారణాలు చూపుతూ ఇన్నాళ్లూ గైర్హాజరైన విషయం విదితమే. గురువారం రాంచీలోని ఈడీ కార్యాలయానికి వచ్చిన సోరెన్.. ఈడీకి ఒక లేఖ రాశారు. నిజాలేవిటో నిర్ధారించుకోకుండా ‘సంచలన ప్రకటనలు’ చేయొద్దని లేఖలో సూచించారు. ‘ మొత్తం జార్ఖండ్లో గత రెండేళ్లలో గనులు, ఖనిజాల తవ్వకం ద్వారా ప్రభుత్వానికి వచ్చింది కేవలం రూ.750 కోట్లు. మీరేమో రూ.1,000 కోట్ల అవినీతి జరిగిందంటున్నారు. ఇంతటి భారీ స్థాయిలో అవినీతి చేయాలంటే ఒక్క సాహెబ్గంజ్లోనే 8 కోట్ల మెట్రిక్ టన్నుల రాళ్లను తవ్వాలి. చట్టబద్ధంగా తవ్విన దానికంటే ఇది ఏకంగా నాలుగు రెట్లు ఎక్కువ. ఇది సాధ్యమా?’ అంటూ లేఖలో సీఎం పేర్కొన్నారు. ‘జేఎంఎం పార్టీ నుంచి నేను గెంటేసిన రవి కేజ్రీవాల్ బీజేపీ తరఫున మాట్లాడుతూ నాపై చేసిన ఆరోపణలు పూర్తిగా అబద్ధం. ఈ కేసును ఎలాంటి రహస్య అజెండా లేకుండా దర్యాప్తుచేయండి’ అని ఈడీని కోరారు. తనపై బీజేపీ కుట్ర పన్నుతోందని అంతకుముందు మీడియాతో అన్నారు. దర్యాప్తును ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ప్రభావితం చేస్తున్నారని బీజేపీ ఆరోపించింది. -
అరుదైన కేసు: 21 రోజుల శిశువు కడుపులో ఎనిమిది పిండాలు
రాంచీ: రాంచీలో ఒక అరుదైన ఘటన జరిగింది. జార్ఖండ్లో రామ్గఢ్ జిల్లాలోని ప్రభుత్వాస్పత్రిలో అక్టోబర్ 10న ఒక పాప జన్మించింది. ఐతే ఆ పాప పొట్టలో గడ్డ ఉన్నట్లు గుర్తించిన వైద్యులు వెంటనే పాపకు ఆపరేషన్ చేయాలని తల్లిదండ్రులకు తెలిపారు. దీంతో ఆ పాపను పుట్టిన 21 రోజుల తర్వాత ఆస్పత్రి తీసుకు వచ్చారు తల్లిదండ్రులు. వైద్యులు తాము మొదటగా ఆ పాప పొత్తికడుపులో తిత్తి లేదా కణితి లాంటి దాన్ని గుర్తించడంతో దాన్ని ఆపరేషన్ చేసి తొలగించాలనుకున్నాం అని చెప్పారు.. ఈ మేరకు వైద్యులు ఆ పాపకు నవంబర్1న ఆపరేషన్ నిర్వహించినట్లు తెలిపారు. అప్పుడే తాము ఆ పాపం శరీరంలో ఒకటి రెండు కాదు ఏకంగా ఎనిమిది పిండాలను తీశామని చెప్పారు. ఇలాంటి కేసు చాలా అరుదు అని అన్నారు. ఎప్పుడైనా ఏదైనా జన్యు లోపం తలెత్తితే కవలల్లో ఇలా జరుగుతుందని చెప్పారు. ఒక కవల శిశువు శరీరంలోకి మరో కవల పిండం ఉండటం జరుగుతుంది. కానీ ఇలా ఏకంగా ఎనిమిది పిండలు అనేది ఇదే మొట్టమొదటి కేసు అని చెప్పారు. ఈ మేరకు డాక్టర్ ఇమ్రాన్ మాట్లాడుతూ...దీనిని ఫెటస్ ఇన్ ఫీటు(ఎఫ్ఐఎఫ్) అని పిలుస్తారు. ఎఫ్ఐఎఫ్ అనేది చాలా అరుదు, పైగా ఒక పిండం మాత్రమే ఉంటుందని ఇలా ఎనిమిది పిండాలు ఉండటం ఇంతవకు ఎక్కడా జరగలేదు. పిండాల పరిమాణం కూడా మూడు నుంచి ఐదు సెంటిమీటర్లు ఉన్నాయి. ఇలా ఐదు లక్షల జనాభాలో ఒకరికి సంభవిస్తుంది. అని తెలిపారు. ప్రస్తుతం పాపను అబ్జర్వేషన్లో ఉంచామని, వారం రోజుల్లో డిశ్చార్జ్ చేసి పంపిస్తామని వైద్యులు చెప్పారు. (చదవండి: చనిపోయిన దోమలను తీసుకుని కోర్టుకు హాజరైన గ్యాంగ్స్టర్) -
Ind Vs SA: ఇది నా హోం గ్రౌండ్.. వాళ్లు సెంచరీ చేయమన్నారు! కానీ..
South Africa tour of India, 2022- India vs South Africa, 2nd ODI: దక్షిణాఫ్రికాతో రెండో వన్డేలో అద్భుతమైన ఆటతీరుతో అభిమానుల మనసు దోచుకున్నాడు టీమిండియా యువ వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్. సొంత మైదానంలో ఆకాశమే హద్దుగా చెలరేగుతూ ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించాడు. మరో యువ ఆటగాడు శ్రేయస్ అయ్యర్(111 బంతుల్లో 113 పరుగులు, నాటౌట్)తో కలిసి జట్టును గెలిపించడంలో కీలక పాత్ర పోషించాడు. పాపం ఇషాన్ కిషన్! అంతా బాగానే ఉన్నా వన్డేల్లో తొలి సెంచరీ చేసే అవకాశం మాత్రం చేజార్చుకున్నాడు ఇషాన్. శతకానికి ఏడు పరుగుల దూరం(84 బంతుల్లో 4 ఫోర్లు, 7 సిక్స్ల సాయంతో 93 పరుగులు)లో నిలిచిపోయాడు. అయితే, సెంచరీ చేజారినా టీమిండియా విజయానికి తన ఇన్నింగ్స్ ఉపయోగపడటం సంతోషంగా ఉందంటూ హర్షం వ్యక్తం చేశాడు. సెంచరీ చేయమని అడిగారు.. కానీ మ్యాచ్ అనంతరం ఇషాన్ కిషన్ మాట్లాడుతూ.. ‘‘మ్యాచ్ అద్భుతంగా సాగింది. ఇప్పుడు సిరీస్ను 1-1తో సమం చేశాం. ఢిల్లీలో నిర్ణయాత్మక మూడో వన్డే కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. ఈరోజైతే నేను చాలా చాలా సంతోషంగా ఉన్నాను. ఇది నా హోం గ్రౌండ్. నేను ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో.. ఈరోజు సెంచరీ చేయాలంటూ ప్రేక్షకులు నన్ను అడిగారు. దురదృష్టవశాత్తూ నేను శతకం బాదలేకపోయాను. అయినా, మరేం పర్లేదు. జట్టు గెలుపులో నా వంతు పాత్ర పోషించినందుకు ఆనందంగా ఉంది. తదుపరి మ్యాచ్లో కూడా ఇలాగే అత్యుత్తమ ఇన్నింగ్స్ ఆడి జట్టును గెలిపిస్తానేమో! షాట్ సెలక్షన్ మార్చుకుంటూ నిజానికి రాంచి పిచ్పై పరుగులు రాబట్టడం ఒక్కోసారి చాలా కష్టతరంగా మారుతుంది. ముఖ్యంగా కొత్త బ్యాటర్లు ఇక్కడ స్కోర్ చేయడం అంత తేలికేమీ కాదు. నోర్జే, రబడ బాగా బౌలింగ్ చేశారు. వారి బౌలింగ్కి తగ్గట్లు నా ప్రణాళికలు, షాట్ సెలక్షన్ మార్చుకుంటూ బ్యాటింగ్ చేశాను. మెరుగైన ఫలితం రాబట్టాను’’ అంటూ చెప్పుకొచ్చాడు. కాగా రాంచీ వేదికగా జరిగిన రెండో వన్డేలో ధావన్ సేన.. ప్రొటిస్ జట్టుపై ఏడు వికెట్ల తేడాతో గెలుపొంది మూడు మ్యాచ్ల సిరీస్ను 1-1తో సమం చేసింది. ఇరు జట్ల మధ్య నిర్ణయాత్మక ఆఖరి వన్డే మంగళవారం (అక్టోబరు 11) ఢిల్లీలో జరుగనుంది. చదవండి: World Cup Super League: దక్షిణాఫ్రికాపై ఘన విజయం.. టాప్5లో టీమిండియా Fan interactions with local lad @ishankishan51 👏👏 P.S. - Also, Ishan delivers a special fan note to @imShard ☺️👌 #TeamIndia | #INDvSA pic.twitter.com/6DWYVmNohh — BCCI (@BCCI) October 9, 2022 -
'ధోని భయ్యాను చాలా మిస్సవుతున్నాం'
రాంచీ అనగానే మొదటగా మనకు గుర్తుకు వచ్చేది టీమిండియా మాజీ క్రికెటర్ ఎంఎస్ ధోని. టీమిండియాకు రెండు వరల్డ్కప్లు అందించిన ఏకైక కెప్టెన్గా ధోని చరిత్రకెక్కాడు. తాజాగా రాంచీ వేదికగా ఇవాళ భారత్, దక్షిణాఫ్రికాల మధ్య రెండో వన్డే జరగనుంది. తొలి వన్డేలో గెలిచిన సౌతాఫ్రికా 1-0తో ఆధిక్యంలో ఉండగా.. ఈ మ్యాచ్లో గెలిచి సిరీస్ను సమం చేయాలని టీమిండియా భావిస్తోంది. ధోని రిటైర్మెంట్ అయిన తర్వాత రాంచీలో ఎప్పుడు టీమిండియా మ్యాచ్ ఆడినా తప్పకుండా హాజరయ్యేవాడు. కానీ ఈసారి కొన్ని కారణాల వల్ల ధోని ఈ మ్యాచ్కు వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ధోని సొంత పట్టణంలో మ్యాచ్ ఆడుతున్న సందర్భంగా టీమిండియా బౌలర్ శార్దూల్ ఠాకూర్ స్పందించాడు. ధోని భయ్యాను మిస్ అవుతున్నట్లు పేర్కొన్నాడు "ధోనీని ప్రతి ఒక్కరం మిస్ అవుతున్నాం. జట్టులో అనుభవజ్ఞుడు లేని కొరత కనిపిస్తోంది. అతడు 300 కంటే ఎక్కువగా వన్డేలు, దాదాపు 90 టెస్టుల్లో భారత్కు ప్రాతినిధ్యం వహించాడు. కాబట్టి ఇంత అనుభవం ఉన్న ఆటగాడిని తప్పనిసరిగా మిస్ అవుతాం. ఇలాంటి ఆటగాడు దొరకడం చాలా అరుదు.'' అని పేర్కొన్నాడు. జట్టులో బౌలర్ల వైఫల్యం గురించి మాట్లాడుతూ.. "ఇక్కడ బౌలర్లు కూడా పరుగులు కోసం కొట్టుకుంటున్నారు. దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్లో మన బౌలర్లును విమర్శిస్తే.. ప్రత్యర్థి బౌలర్లను కూడా విమర్శించాలి. ఎందుకంటే మనం సిరీస్ గెలిచాం. అలాగే మీరు నిలకడ గురించి ఆడిగితే.. పిచ్ పరిస్థితులను తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకోవాలి. కొన్నిసార్లు వన్డేల్లో 350 కంటే ఎక్కువ పరుగులు నమోదవుతాయి. భారత్ ఎప్పుడూ ఏకపక్షం పోరు ఆడలేదు. ఫైట్ ఎల్లప్పుడూ ఉంటుంది. మేము ఒకటి, రెండు మ్యాచ్లు ఓడిపోయి ఉండొచ్చు.. కానీ గరిష్ఠ సంఖ్యలో గెలిచాం. కాబట్టి జట్టులో స్థిరత్వం ఉంది." అని శార్దూల్ అన్నాడు. ఇక ఎంఎస్ ధోనీ 2020లో తన అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికాడు. ధోనీ కెప్టెన్సీలో టీమిండియా 2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచకప్, 2013 ఛాంపియన్స్ ట్రోఫీని గెలిచింది. వీటితో పాటు 2014 టీ20 వరల్డ్ కప్లో ఫైనల్కు చేరి రన్నరప్గా నిలిచింది. చదవండి: తండ్రిగా ప్రమోషన్ పొందిన స్పెయిన్ బుల్ చిన్నారి మరణం.. శోకసంద్రంలో డేవిడ్ మిల్లర్! -
Ind Vs SA: రాంచీకి చేరుకున్న టీమిండియా; అక్కడ ప్రాక్టీసులో రోహిత్ సేన!
India vs South Africa, 2nd ODI: దక్షిణాఫ్రికాతో స్వదేశంలో టీ20 సిరీస్ సొంతం చేసుకున్న టీమిండియాకు.. వన్డే సిరీస్ ఆరంభ మ్యాచ్లో మాత్రం చేదు అనుభవం ఎదురైంది. లక్నో వేదికగా గురువారం(అక్టోబరు 6) జరిగిన మ్యాచ్లో ప్రొటిస్ చేతిలో ధావన్ సేన ఓడిపోయిన విషయం తెలిసిందే. తొమ్మిది పరుగుల తేడాతో పరాజయం పాలై మూడు మ్యాచ్ల సిరీస్లో 0-1తో వెనుబడింది. ఈ నేపథ్యంలో మిగిలిన రెండు వన్డేలు గెలిచి ట్రోఫీ సాధించడమే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తోంది టీమిండియా. ఈ క్రమంలో రెండో మ్యాచ్ ఆడేందుకు రాంచీకి చేరుకుంది. జార్ఖండ్లోని జేఎస్సీఏ ఇంటర్నేషనల్ స్టేడియం కాంప్లెక్స్లో ఆదివారం (అక్టోబరు 9) ఇరు జట్ల మధ్య మ్యాచ్ జరుగనుంది. ధావన్ సేనకు ఘన స్వాగతం ఇందుకోసం రాంచీకి చేరుకున్న టీమిండియాకు ఘన స్వాగతం లభించింది. కెప్టెన్ శిఖర్ ధావన్ సహా కోచ్ వీవీఎస్ లక్ష్మణ్ తదితరులకు హోటల్ సిబ్బంది బొట్టుపెట్టి ఆహ్వానించగా.. అభిమానులు ఆటగాళ్లను విష్ చేస్తూ సందడి చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ ట్విటర్లో షేర్ చేసింది. Touchdown Ranchi 📍#TeamIndia | #INDvSA pic.twitter.com/HCgIQ9pk0M — BCCI (@BCCI) October 8, 2022 ప్రాక్టీసులో తలమునకలైన రోహిత్ సేన ఇదిలా ఉంటే.. రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియా టీ20 వరల్డ్కప్-2022 టోర్నీ నేపథ్యంలో ఆస్ట్రేలియాకు చేరుకున్న విషయం తెలిసిందే. హెడ్కోచ్ రాహుల్ ద్రవిడ్ మార్గదర్శనంలో ఇప్పటికే ప్రాక్టీసు మొదలుపెట్టేసింది కూడా! ఇలా భారత ఆటగాళ్లు తీరికలేని షెడ్యూల్తో బిజీగా ఉన్నారు. అక్టోబరు 16 నుంచి ప్రపంచకప్ ఈవెంట్ ఆరంభం కానున్న నేపథ్యంలో క్రికెట్ ప్రేమికులకు కావాల్సినంత వినోదం లభించనుంది. చదవండి: Ind Vs SA: పరుగులు సాధిస్తున్నా టీమిండియాలో చోటు దక్కడం లేదు! స్వీట్లు, చైనీస్ ఫుడ్ మానేశా! ఇకపై.. #TeamIndia had a light training session yesterday at the WACA. Our strength and conditioning coach, Soham Desai gives us a lowdown on the preparations ahead of the @T20WorldCup pic.twitter.com/oH1vuywqKW — BCCI (@BCCI) October 8, 2022 -
బీసీసీఐ మాజీ సంయుక్త కార్యదర్శి హఠాన్మరణం
Amitabh Choudhary: భారత క్రికెట్ నియంత్రణ మండలి మాజీ సంయుక్త కార్యదర్శి అమితాబ్ చౌదరి కన్నుమూశారు. గుండెపోటుతో మంగళవారం హఠాన్మరణం చెందారు. ఆయన వయస్సు 58 ఏళ్లు. అమితాబ్ చౌదరి స్వస్థలం ఝార్ఖండ్లోని రాంచి. కాగా అశోక్నగర్లో ఉన్న తన నివాసంలో అమితాబ్ మంగళవారం ఉదయం అకస్మాత్తుగా కుప్పకూలిపోయారు. దీంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన స్థానిక ఆస్పత్రికి తరలించారు. అయితే, అప్పటికే పరిస్థితి విషమించడంతో ఆయన తుది శ్వాస విడిచారు. తీవ్రమైన గుండెపోటు రావడంతోనే అమితాబ్ మరణించినట్లు సదరు ఆస్పత్రి వైద్యులు తెలిపారు. కాగా అమితాబ్ చౌదరి గతంలో ఝార్ఖండ్ క్రికెట్ అసోసియేషన్(జేపీఎస్సీ) చైర్మన్గా పనిచేశారు. ముఖ్యమంత్రి సంతాపం అమితాబ్ చౌదర్ ఆకస్మిక మరణం పట్ల ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ విచారం వ్యక్తం చేశారు. ‘‘జేపీఎస్సీ చైర్మన్ అమితాబ్ చౌదరీ జీ మరణించారన్న విషాదకర వార్త తెలిసింది. ఐపీఎస్ అధికారి అయిన ఆయన రాష్ట్రంలో క్రికెట్ అభివృద్ధికి ఎంతగానో కృషి చేశారు. దేవుడు ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలి’’ అని ప్రార్థించారు. కుటుంబ సభ్యులకు ఆ దేవుడు మనోధైర్యం ప్రసాదించాలంటూ సంతాపం ప్రకటించారు. ఐపీఎస్ ఆఫీసర్గా.. ఐఐటీ ఖరగ్పూర్ పూర్వ విద్యార్థి అయిన అమితాబ్ చౌదరి ఐపీఎస్కు ఎంపికయ్యారు. ఝార్ఖండ్లో ఐజీపీ ర్యాంకులో పనిచేశారు. కాగా జేపీఎస్ చైర్మన్గా రాంచిలో మెరుగైన క్రికెట్ స్టేడియంలు నిర్మించడంలో... మౌలిక సదుపాయాల కల్పనలో కీలక పాత్ర పోషించారు. గతంలో బీసీసీఐ సంయుక్త కార్యదర్శిగానూ పనిచేశారు. అయితే, 2005 నాటి జింబాబ్వే టూర్ మాత్రం ఆయన కెరీర్లో చేదు జ్ఞాపకంగా మిగిలిపోయింది. అప్పటి కెప్టెన్, ప్రస్తుత బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, ఆనాటి టీమిండియా కోచ్ గ్రెగ్ చాపెల్ మధ్య తలెత్తిన విభేదాలు వివాదానికి దారితీశాయి. చదవండి: విరాట్ కోహ్లి ఫామ్పై ఆసక్తికర కామెంట్స్ చేసిన గంగూలీ -
రాజకీయాలపై సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ కీలక వ్యాఖ్యలు
-
NV Ramana: చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ సంచలన వ్యాఖ్యలు
రాంచీ: భారత సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాంచీలో(జార్ఖండ్) శనివారం జరిగిన ఒక ఉపన్యాస కార్యక్రమంలో ఆయన మీడియాలో డిబేట్ల పేరిట జరుగుతున్న ‘అతి’ విచారణలపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తూనే.. న్యాయవ్యవస్థ పాత్ర, న్యాయమూర్తుల ముందున్న సవాళ్లపై కీలక వ్యాఖ్యలు చేశారు. మీడియా తమ టీవీ డిబెట్లతో కంగారు కోర్టులుగా(సరైన ఆధారాలు.. వాదప్రతివాదనలు లేని అనధికార న్యాయస్థానాలు) వ్యవహరిస్తున్నాయని, సోషల్ మీడియా కూడా అదే రీతిలో వ్యవహరిస్తూ దేశాన్ని వెనక్కి తీసుకెళ్తున్నాయని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వాళ్ల ప్రవర్తన పక్షపాతం, అవగాహనలేమితో కూడిన సమాచారం, ప్రత్యేకించి ఒక ఎజెండా-ఆధారితంగా ఉంటోంది ఆవేదన వ్యక్తం చేశారు. ఇంకా.. ► సోషల్ మీడియాలో జడ్జిలకు వ్యతిరేకంగా క్యాంపెయిన్లు చేస్తున్నారు. జడ్జిలు వాటికి అత్యవసరంగా స్పందించాల్సిన అవసరం లేదు. దయచేసి దీనిని బలహీనతనో లేదంటే నిస్సహాయత అని పొరబడకండి అని న్యాయమూర్తులకు జస్టిస్ రమణ సూచించారు. ► ఈరోజుల్లో మీడియా టూల్స్ అపారమైన సామర్థ్యాన్ని కలిగి ఉంటున్నాయి. కానీ, వాస్తవం ఏదో, ఏది మంచో, ఏది సరైందో నిర్ధారించలేకపోతున్నాయి. మీడియా విచారణలు.. కేసుల్లో మార్గనిర్దేశం చేయలేవు. అలాగే మీడియా ఛానెళ్లు ‘కంగారు కోర్టు’లను నడిపిస్తున్నాయి. ఈ పరిణామాలతో.. కొన్నిసార్లు అనుభవజ్ఞులైన న్యాయమూర్తులు కూడా సమస్యలపై నిర్ణయం తీసుకోవడం కష్టంగా ఉంటోంది. ► న్యాయం పంపిణీకి సంబంధించిన సమస్యలపై.. అవగాహన లేని, అజెండాతో కూడిన నడిచే చర్చలు ప్రజాస్వామ్య ఆరోగ్యానికి హానికరం. ► మీడియా ద్వారా వ్యాప్తి చెందుతున్న పక్షపాత అభిప్రాయాలు ప్రజాస్వామ్యాన్ని బలహీనపరుస్తున్నాయి. వ్యవస్థకు హాని కలిగిస్తున్నాయి. ఈ ప్రక్రియలో.. న్యాయ పంపిణీ ప్రతికూలంగా ప్రభావితమవుతుంది. ► మీ బాధ్యతను(మీడియాను ఉద్దేశించి..) అతిక్రమించడం ద్వారా మీరు మన ప్రజాస్వామ్యాన్ని రెండడుగులు వెనక్కి తీసుకెళ్తున్నారు ► ప్రింట్ మీడియాకు ఇప్పటికీ కొంత స్థాయిలో జవాబుదారీతనం పని చేస్తోంది. ► ఎలక్ట్రానిక్ మీడియాకు మాత్రం జవాబుదారీతనం శూన్యంగా ఉంటోంది. ఇక సోషల్ మీడియా చాలా అధ్వాన్నంగా ఉంటోంది. ► దీనికి పరిష్కారం.. మీడియా స్వీయ నియంత్రణ పాటించడమే. ఎలక్ట్రానిక్, సోషల్ మీడియా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని నేను కోరుతున్నా. ప్రజలకు అవగాహన కల్పించడానికి, దేశాన్ని ఉత్తేజపరిచేందుకు ఎలక్ట్రానిక్ మీడియా తమ గొంతుకను ఉపయోగించాలి ► జడ్జిల మీద దాడులు పెరిగిపోతున్నాయి. ప్రజాప్రతి నిధులు, రాజకీయ నాయకులు, అధికారులు, పోలీసు అధికారులు.. ఇలా రిటైర్మెంట్ తర్వాత సున్నిత అంశాలతో ముడిపడిన వ్యక్తులకు రక్షణ ఇస్తోంది మన దేశం. కానీ, న్యాయమూర్తుల విషయంలోనే అది జరగడం లేదు. ► కొన్ని దశాబ్దాల క్రితం వరకు.. న్యాయమూర్తి అంటే కోర్టుల ముందు పార్టీల మధ్య వివాదాల పరిష్కారానికి మాత్రమే పరిమితం అనే అంచనాలు జనాలకు ఉండేవి. ఇప్పుడు, సమాజంలో ఆలోచించదగిన ప్రతి సమస్య న్యాయవ్యవస్థ ద్వారా పరిష్కరించబడుతుందని భావిస్తున్నారు. ► న్యాయం అమలు చేయడానికి, న్యాయమూర్తులు సామాజిక వాస్తవాల గురించి తెలుసుకోవాలి. సామాజిక ఏకాంతంగా పరిమితం కాకూడదు. నిష్పాక్షికత మరియు స్వతంత్రత అనేది మానసిక స్థితి అని మనం అర్థం చేసుకోవాలి. ► న్యాయమూర్తులంటే.. పది గంటలకు వచ్చి సాయంత్రం నాలుగు గంటలకు వెళ్లిపోతారు. సెలవుల్ని ఆస్వాదిస్తారు.. వాళ్లు వాళ్ల వాళ్ల జీవితాల్లో కంఫర్ట్గా ఉన్నారు అనేది ఒక దురభిప్రాయం మాత్రమే. అదంతా వాస్తవం కాదు. ► ఈరోజుల్లో.. న్యాయం అందించడం అంత తేలికైన బాధ్యత కాదు. ఇది రోజురోజుకూ సవాలుగా మారుతోంది. కొన్నిసార్లు, మీడియాలో, ముఖ్యంగా సోషల్ మీడియాలో న్యాయమూర్తులకు వ్యతిరేకంగా ఏకీకృత ప్రచారాలు కూడా జరుగుతాయి ► సామాజిక వాస్తవాల విషయంలో న్యాయమూర్తులు.. చూసిచూడనట్లుగా, గుడ్డిగా వ్యవహరించకూడదు. వ్యవస్థను కాపాడటానికి నొక్కి చెప్పడానికి సిద్ధంగా ఉండాలి. ► ఈ క్రమంలో.. రాజకీయాలపైనా కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో చేరాలనుకున్నా. విధి వేరే దారి చూపించింది. న్యాయమూర్తి అయినందుకు బాధపడడం లేదని సీజే ఎన్వీ రమణ పేర్కొన్నారు. -
మోకాలి నొప్పులతో బాధపడుతున్న ధోని.. ట్రీట్మెంట్ ఖర్చు 40 రూపాయలు!
MS Dhoni- Knee Pain: కొన్ని ఆరోగ్య సమస్యలకు పెద్ద ఆస్పత్రులకు వెళ్లినా.. భారీ మొత్తం ఖర్చు చేసినా ఒక్కోసారి పెద్దగా ఫలితం కనిపించదు. అలాంటప్పుడు హస్తవాసి బాగున్న వైద్యుల గురించి తెలిస్తే అక్కడికి వెళ్లి ట్రీట్మెంట్ తీసుకోవం సహజం. టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని కూడా ఇందుకు మినహాయింపు కాదు. మోకాలి నొప్పులతో బాధ పడుతున్న ఈ మిస్టర్ కూల్ ఇటీవల ఓ ఆయుర్వేద వైద్యుడిని సంప్రదించినట్లు సమాచారం. ఎన్ని ఆస్పత్రులు తిరిగినా ప్రయోజనం లేకపోవడంతో ఆఖరికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మరి, ధోని ట్రీట్మెంట్కు అయిన ఖర్చు ఎంతో తెలుసా? దైనిక్ భాస్కర్ వార్తా పత్రిక కథనం ప్రకారం... జార్ఖండ్ రాజధాని రాంచీకి సుమారు 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న లాపంగ్లో గల వందన్ సింగ్ ఖెర్వార్ అనే ఆయుర్వేద వైద్యుడు ఉన్నారు. ఆయన హస్తవాసి గురించి స్థానికంగా మంచి పేరుంది. ఈ విషయం తెలుసుకున్న ధోని ఆయన దగ్గరకు వెళ్లి మోకాలి నొప్పుల సమస్యల గురించి బయటపడే మార్గం గురించి అడిగాడు. కాల్షియం లోపం వల్ల తాను బాధపడుతున్నానని ఖెర్వార్కు ధోని చెప్పాడు. దీంతో ప్రతిసారి నాలుగు రోజులకు ఓసారి తన వద్దకు రావాల్సిందిగా సదరు వైద్యుడు సూచించాడు. ఈ విషయాల గురించి ఆయుర్వేద డాక్టర్ వందన్ సింగ్ ఖెర్వార్ ఎన్డీటీవీతో మాట్లాడుతూ... ‘‘మొదటి సారి ధోని నా దగ్గరకు వచ్చినపుడు ఆయనను గుర్తుపట్టలేకపోయాను. కన్సల్టేషన్ ఫీజు కింద 20 రూపాయలు.. చికిత్సకై మందుల కోసం 20 రూపాయల మేర ప్రిస్కిప్షన్ రాశాను. ధోని తల్లిదండ్రులకు కూడా నేను వైద్యం చేస్తున్నాను’’ అని చెప్పుకొచ్చారు. ఇరుగు పొరుగు వారి గురించి తన గురించి తెలుసుకున్న ధోని తనను సంప్రదించినట్లు పేర్కొన్నారు. కాగా ధోని లాపంగ్కు వస్తున్న విషయం తెలుసుకున్న స్థానికులు అతడిని చూసేందుకు తరలివస్తున్నారు. అయితే, ధోని మాత్రం సెల్ఫీలు గట్రా వద్దంటూ వారిని సున్నితంగా వారిస్తున్నాడట. ఇదిలా ఉంటే.. ఇటీవల ముగిసిన ఐపీఎల్-2022లో ధోని సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ పేలవ ప్రదర్శన కనబరిచిన విషయం తెలిసిందే. సీజన్ ఆరంభంలో జడేజాను కెప్టెన్గా నియమించిన సీఎస్కే.. వరుస పరాజయాల నేపథ్యంలో మళ్లీ ధోనికే సారథ్య బాధ్యతలు అప్పజెప్పింది. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. దీంతో డిఫెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగిన చెన్నైకి ఘోర పరాభవం తప్పలేదు. పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో నిలిచింది. కాగా 40 ఏళ్ల వయస్సులోనూ క్రికెట్ ఆడుతున్న ధోనిని గత కొన్ని రోజులుగా మోకాళ్ల నొప్పి సమస్య వేధిస్తోందట. చదవండి: India Vs England-Rishabh Pant: అద్భుతమైన షాట్లు.. నువ్వో సూపర్స్టార్: పంత్పై ప్రశంసల జల్లు -
కాపీ కొట్టి ఆ సినిమా తీశారు.. స్క్రీన్షాట్స్ వైరల్
బీటౌన్ దర్శక నిర్మాతల్లో ప్రముఖంగా చెప్పుకునే వారిలో ఒకరు కరణ్ జోహార్. ఆయన ధర్మ ప్రొడక్షన్స్ పేరిట తాజాగా నిర్మించిన చిత్రం 'జుగ్జుగ్ జీయో'. రాజ్ మెహతా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ క్యాస్ట్ అనిల్ కపూర్, నీతూ కపూర్, వరుణ్ ధావన్, కియరా అద్వానీ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ మూవీ జూన్ 24న విడుదలకు సిద్ధంగా ఉంది. పుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్గా అలరించేందుకు రెడీ అయిన తరుణంలో తాజాగా నిర్మాత కరణ్ జోహార్కు షాక్ తగిలింది. ఈ సినిమా విడుదలకు ముందే తమకు చూపించాలని రాంచీ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. విషయం ఏంటంటే.. తను పంపించిన పాయింట్స్ను కాపీ కొట్టి 'జుగ్జుగ్ జీయో' సినిమాను నిర్మించారని రాంచీకి చెందిన రచయిత విశాల్ సింగ్ ఆరోపించారు. దానికి సంబంధించిన స్క్రీన్షాట్స్ కూడా తన వద్ద ఉన్నాయని చెప్పుకొచ్చాడు. 'బన్నీ రాణీ' అనే టైటిల్తో కొన్ని పాయింట్స్ను ధర్మ ప్రొడక్షన్స్కు పంపించినట్లు ఆయన తెలిపాడు. తర్వాత ఆ సంస్థ నుంచి రిప్లై కూడా వచ్చిందని, అయితే ఆ పాయింట్స్ను సినిమాగా రూపొందిస్తున్నట్లు ధర్మ ప్రొడక్షన్స్ తనతో చెప్పలేదని, తీరా చూస్తే ఆయన పాయింట్స్తో ఈ మూవీ వచ్చినట్లుగా పేర్కొన్నాడు. ఈ విషయంపై రాంచీ కోర్టులో దావా వేశారు విశాల్. పిటిషన్ స్వీకరించిన రాంచీ కమర్షియల్ కోర్టు సినిమా విడుదలకు ముందే తమకు చూపించాలని ఉత్తర్వులు జారీ చేసింది. స్క్రీనింగ్ తర్వాత ఇరువైపులా వాదనలు విని, కాపీ రైట్ ఉల్లంఘన జరిగిందో, లేదో చెబుతామని వెల్లడించింది. చదవండి: లారెన్స్ బిష్ణోయ్ ముఠా హిట్ లిస్ట్లో కరణ్ జోహార్.. బుల్లితెర నటి ఆత్మహత్య.. అతడే కారణమని తండ్రి ఆరోపణ వికటించిన సర్జరీ.. గుర్తుపట్టలేని స్థితిలో హీరోయిన్ అయితే ఇప్పటివరకు ఈ విషయంపై కరణ్ జోహార్ అధికారికంగా స్పందించలేదు. కాగా 'జనవరి 2020లో బన్నీ రాణీ టైటిల్తో కథ రిజిస్టర్ చేసుకున్నా. 2020 ఫిబ్రవరిలో సహా నిర్మాతగా వ్యవహరించే అవకాశం కోసం ధర్మ ప్రొడక్షన్స్కు మెయిల్ చేశా. నాకు రిప్లై కూడా ఇచ్చారు. తర్వాత వాళ్లు నా స్టోరీ తీసుకున్నారు. జుగ్జుగ్ జీయో సినిమాను తెరకెక్కించారు. ఇది సరికాదు కరణ్ జోహార్.' అని విశాల్ సింగ్ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్తోపాటు విశాల్ పంపించిన పాయింట్స్కు సంబంధించిన స్క్రీన్షాట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. -
హింసాత్మకంగా మారిన నిరసనలు.. రాజధానిలో కర్ఫ్యూ విధింపు
మహ్మద్ ప్రవక్తపై బీజేపీ బహిష్కృత నేత నూపుర్ శర్మ, నవీన్ జిందాల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బీజేపీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ముస్లిం సంఘాలు నిరసనలకు దిగాయి. పలు రాష్ట్రాల్లో శుక్రవారం మసీద్లో నమాజ్ ముగిసిన వెంటనే నిరసనకారులు ఆందోళనలకు దిగారు. కాగా, ముస్లింల ఆందోళనల్లో హింసాత్మక ఘటన చోటుచేసుకున్నాయి. జార్ఖండ్లో నిరసనకారులు.. పోలీసులపైకి రాళ్లు రువ్వారు. దీంతో, పోలీసులు వారిపై టియర్ గ్యాస్ ప్రయోగించారు. ఈ క్రమంలో పోలీసులతో పాటు నిరసనకారులు కూడా గాయపడ్డారు. దీంతో రాంచీలో కర్ఫ్యూ విధించారు. ప్రజలందరూ ఇళ్లలో నుంచి బయటకు రావద్దని హెచ్చరికలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో జార్ఖండ్ సీఎం హేమంత్ సోరేన్ మీడియాతో మాట్లాడుతూ.. నిరసనల గురించి సమాచారం అందింది. జార్ఖండ్ ప్రజలు ఎప్పుడూ చాలా సహనంతో ప్రశాంతంగా ఉంటారు. ప్రజలందరూ సంయమనం పాటించాలని ప్రతీ ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఎవరూ భయపడాల్సిన అవసరంలేదని తెలిపారు. మరోవైపు.. ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్లో కూడా హింసాత్మక ఘటనలు జరిగాయి. నిరసనకారులు వాహనాలకు నిప్పంటించారు. అనంతరం పోలీసులపైకి రాళ్లు విసిరారు. దీంతో పోలీసులు నిరసనకారులపైకి టియర్ గ్యాస్ ప్రయోగించారు. #WATCH | Jharkhand: Protest over the controversial remarks by suspended BJP leader Nupur Sharma turned violent in Ranchi. Vehicles were torched and vandalised and stone-pelting occurred. Injuries reported. pic.twitter.com/Z5FIndjZzf — ANI (@ANI) June 10, 2022 #WATCH | West Bengal: A huge crowd gathers at Howrah in protest over the controversial remarks of suspended BJP leader Nupur Sharma & expelled BJP leader Naveen Kumar Jindal. pic.twitter.com/m8Bak7Q0nF — ANI (@ANI) June 10, 2022 ఇది కూడా చదవండి: టెన్షన్.. టెన్షన్.. పాతబస్తీలో మోహరించిన పోలీసులు.. వీడియో -
మనోళ్లే కదా అని నమ్మి ఆమెను వారితో పంపిస్తే.. అక్కడ బైక్ ఆపి..
దేశంలో యువతులు, మహిళలపై లైంగిక దాడులు రోజురోజుకు పెరుగుతున్నాయి. తాజాగా జార్ఖండ్లో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఇద్దరు వ్యక్తులు ఓ మైనర్పై లైంగిక దాడికి పాల్పడ్డారు. దీంతో ఆగ్రహించిన గ్రామస్తులు వారిని కిరాతకంగా హత్య చేశారు. వివరాల ప్రకారం.. గుమ్లా జిల్లాలోని పొరుగు గ్రామంలో బాధితురాలి కుటుంబ సభ్యులు ఓ పెళ్లికి వెళ్లి స్వగ్రామానికి తిరిగి వెళ్తున్నారు. వారి ఊరికి బస్సు సౌకర్యం లేకపోవడంతో ఆ రూట్లో వస్తున్న తమ గ్రామానికి చెందిన వ్యక్తులు బైక్ మీద వచ్చారు. దీంతో వారిని ఆపి.. తన కూతురును ఇంటి వద్ద డ్రాప్ చేయాలని మైనర్ తండ్రి కోరాడు. తర్వాత, గ్రామానికి వెళుతున్న క్రమంలో బాధితురాలని నిర్జన ప్రదేశానికి తీసుకువెళ్లిన నిందితులు ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డారు. అనంతరం ఆమె పేరెంట్స్ ఇంటికి వచ్చాక.. కన్నీరుపెట్టుకుని జరిగిన విషయం వారికి చెప్పింది. ఈ విషయం వారు గ్రామ పెద్దలకు చెప్పడంతో గ్రామస్తులు ఆగ్రహంతో నిందితులను చితకబాదారు. నిందితులపై కిరోసిన్ పోసి నిప్పంటించారు. ఈ క్రమంలో ఓ నిందితుడు అక్కడే కాలిన గాయాలతో మరణించగా.. మరో వ్యక్తి కాలిన గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీంతో ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు వెల్లడించారు. ఇది కూడా చదవండి: భర్త నుంచి విడాకులు.. ప్రియుడు పెళ్లికి నిరాకరించాడని.. -
లాలూను రాంచిలోని రిమ్స్ ఆస్పత్రికి తరలించిన పోలీసులు
-
MS Dhoni: అదీ ధోని భాయ్ అంటే.. ఎంతో ఓపికగా జిమ్లో...
MS Dhoni: టీమిండియా మాజీ సారథి, మిస్టర్ కూల్ ఎంఎస్ ధోని తన అభిమానులను ఎప్పుడూ నిరాశపరచడు. రికార్డుల ధీరుడిగా ఆటతోనూ... ఆటోగ్రాఫ్ల విషయంలోనూ వారి మనసులు గెలుచుకుంటూనే ఉంటాడు. తాజాగా మరోసారి ఫ్యాన్స్ను ఆకట్టుకున్నాడు ధోని. ఐపీఎల్-2022 సీజన్కు చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ధోని సన్నద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మెగా వేలంలో అనుసరించాల్సిన వ్యూహంపై ప్రణాళికలు రచిస్తున్న ధోని భాయ్.. వ్యక్తిగత ఫిట్నెస్పై కూడా దృష్టి సారించాడు. ఇందులో భాగంగా స్వస్థలం రాంచిలోని ఓ జిమ్లో చెమటలు చిందిస్తున్నాడు. ఈ క్రమంలో ఓ వ్యక్తికి ఆటోగ్రాఫ్లు ఇస్తూ కెమెరా కంటికి చిక్కాడు ధోని. ఓపికగా అతడు అందిస్తున్న ఒక్కో బ్యాట్పై సంతకం చేస్తూ కనిపించాడు. ఇందుకు సంబంధించిన వీడియోను నితీశ్ అనే నెటిజన్ సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్ అవుతోంది. కాగా ఫిబ్రవరి 12, 13 తేదీల్లో నిర్వహించనున్న మెగా వేలానికి ఫ్రాంఛైజీలు సిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలో సీఎస్కే కెప్టెన్ ధోని దగ్గరుండి ఆక్షన్ను పరిశీలించనున్నట్లు తెలుస్తోంది. ఇక రిటెన్షన్లో భాగంగా రవీంద్ర జడేజా, ధోని, రుతురాజ్ గైక్వాడ్, మొయిన్ అలీలను సీఎస్కే రిటైన్ చేసుకున్న సంగతి తెలిసిందే. చదవండి: India Vs West Indies 2nd Odi: సిరీస్ గెలుపే లక్ష్యంగా టీమిండియా; గత మ్యాచ్లో ఒక్క బంతికే అవుటయ్యాడు... ఆ కెప్టెన్ రాణించేనా? Exclusive from JSCA gym! Iconic autograph 😍🔥 © : Bajaj Sumeet Kumar/ig#MSDhoni • #IPL2022 • #WhistlePodu pic.twitter.com/8VLLjHevRY — Nithish Msdian (@thebrainofmsd) February 8, 2022 -
వైరల్ వీడియో: స్టేజీపైనే ఆటగాడి చెంప చెళ్లుమనిపించిన బీజేపీ ఎంపీ
రాంచీ: బీజేపీ ఎంపీ, రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ బ్రిజ్ భూషణ్ సింగ్ బహిరంగంగా ఓ వ్యక్తి చెంప చెల్లుమనిపించారు. స్టేజ్పైనే ఆటగాడికి రెండు చెంపలు వాయించడంతో వేదికపై ఉన్న వారంతా ఆశ్చర్యానికి లోనయ్యారు. ఈ ఘటన జార్ఖండ్లోని రాంచీలో అండర్-15 జాతీయ రెజ్లింగ్ ఛాంపియన్షిప్ ఈవెంట్లో చోటుచేసుకుంది. షహీద్ గణ్పత్ రాయ్ ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఎంపీ భూషణ్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ క్రమంలో ఓ యువకుడికి15 ఏళ్లు దాటడంతో అండర్ -15 ఈవెంట్లో పాల్గొనేందుకు అధికారులు అనుమతించలేదు. దీంతో తనను పోటీల్లో పాల్గొనడానికి అనుమతించాలని స్టేజ్ మీదకు వెళ్లి ఎంపీ సింగ్ను పదే పదే ఇబ్బంది పెట్టాడు. దీంతో సహనం కోల్పోయిన ఎంపీ వేదికపై ఉన్న రెజ్లర్ను అందరిముందే చెంప దెబ్బ కొట్టాడు. యువ రెజ్లర్ వేదిక నుంచి కిందకు దిగుతుండగా రెండు సార్లు అతనిపై చేయిచేసుకున్నాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఆటగాడిపై ఎంపీ చేయి చేసుకోవడంపై ప్రస్తుతం తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాగా ఎంపీ సింగ్ ప్రస్తుతం లోక్సభలో ఉత్తరప్రదేశ్లోని కైసర్గంజ్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. BJP सांसद व भारतीय कुश्ती संघ के अध्यक्ष बृजभूषण शरण सिंह ने रांची में अंडर-15 नेशनल कुश्ती चैंपियनशिप के दौरान मंच पर एक युवा पहलवान को थप्पड़ जड़ दिया। वीडियो वायरल… pic.twitter.com/Tlm6LpXSHG — Ashraf Hussain (@AshrafFem) December 17, 2021 -
రోహిత్ శర్మ పాదాలపై పడిన అభిమాని.. చివరకు ఏం జరిగిందంటే?
Rohit Sharma left stunned as fan Breaches Security: రాంఛీ వేదికగా న్యూజిలాండ్తో జరిగిన రెండో టీ20లో భారత్ 7వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్లో ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. న్యూజిలాండ్ ఇన్నింగ్స్లో రోహిత్ శర్మ అభిమాని సెక్యూరిటీ కళ్లు గప్పి మైదానంలోకి ప్రవేశించాడు. ఈ క్రమంలో మిడాన్లో ఫీల్డింగ్ చేస్తున్న రోహిత్ వద్దకి వెళ్లిన ఆ అభిమాని అమాంతం పాదాలపై పడిపోయాడు. వెంటనే అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది అతడిని గ్రౌండ్ నుంచి బయటకు తీసుకువెళ్లారు. అయితే ఆటగాళ్ల భద్రతపై పలువురు మాజీలు ఆసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా చాలా సార్లు అభిమానులు ఇలా మైదానంలో దూసుకొచ్చారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన న్యూజిలాండ్ ఆరంభంలో ధాటిగా ఆడిన చివర్లో చేతులు ఎత్తేసింది. గప్టిల్(31),డారిల్ మిచెల్(31), గ్లెన్ ఫిలిప్స్ (34) రాణించడంతో కివీస్ నిర్ణీత 20 ఓవర్లలో 153 పరుగులు చేసింది. అనంతరం లక్ష్యచేధనతో బరిలోకి దిగిన టీమిండియాకు.. ఓపెనర్లు రాహుల్(65), రోహిత్ (55)శర్మ సెంచరీ భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. తరువాత వరుస బంతుల్లో రెండు వికెట్లు కోల్పోయినప్పటికీ భారత్.. పంత్, వెంకటేశ్ అయ్యర్ లక్ష్యాన్ని పూర్తి చేశారు. దీంతో భారత్ 2-0 తేడాతో సిరీస్ను కైవసం చేసుకుంది. చదవండి: IND Vs NZ 2nd T20: రెండో టి20లో విజయం.. టీమిండియాదే సిరీస్ And a fan stormed into the field!!! The fellow sitting beside me, “ab maar khaaye chahe jo ho uska Sapna poora ho gaya! Ab yeh Ranchi mein Hatia mein Jharkhand mein poore India mein famous ho gaya!!” #IndiaVsNewZealand #INDVsNZT20 #fans #CricketTwitter pic.twitter.com/6NsIQDY0fO — Sunchika Pandey/संचिका पाण्डेय (@PoliceWaliPblic) November 19, 2021 -
జనజాతీయ గౌరవ్ దివస్గా బిర్సా ముండా జయంతి: మోదీ
-
రాంచీలో బిర్సా ముండా స్మారకాన్ని ప్రారంభించిన మోదీ
రాంచీ: ధార్తీ ఆబాగా ప్రసిద్ధి చెందిన గిరిజన స్వాతంత్య్ర సమరయోధుడు బిర్సా ముండా జ్ఞాపకార్థం ప్రధాని నరేంద్ర మోదీ రాంచీలో మ్యూజియాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. "ధార్తీ ఆబా ఎక్కువ కాలం జీవించలేకపోయినప్పటికీ భవిష్యత్ తరాలకు దిశానిర్దేశం చేసేలా భారత చరిత్రలో లిఖించబడిని ఒక మహోన్నత వ్యక్తిగా అభివర్ణించారు. అంతేకాదు ముండాకు భారతదేశ గిరిజన సమాజ గుర్తింపును చెరిపివేయాలని కోరుకునే భావజాలానికి వ్యతిరేకంగా పోరాడిని గొప్ప వ్యక్తి బిర్సా . (చదవండి: జిమ్లో అసభ్య ప్రవర్తన... టిక్టాక్ షేర్ చేయడంతో పరార్!!) ఆధునికత పేరుతో వైవిధ్యంపై దాడి చేయడం, ప్రాచీన గుర్తింపును, ప్రకృతిని తారుమారు చేయడం సమాజ శ్రేయస్సుకు మార్గం కాదని భగవాన్ బిర్సాకు తెలుసు. ఆధునిక విద్యకు అనుకూల మార్పు కోసం వాదించాడు. అంతేకాదు తన గిరిజన సమాజంలోని లోటుపాట్లను గురించి మాట్లాడే ధైర్యం చూపించాడు." అని అన్నారు. ఈ మేరకు మోదీ బిర్సా ముండా మెమోరియల్ ఉద్యాన్ మ్యూజియంను జాతికి అంకితం చేశారు. జార్ఖండ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, కేంద్ర మంత్రి అర్జున్ ముండా, మాజీ ముఖ్యమంత్రి బాబూలాల్ మరాండీ తదితరులు పాల్గొన్నారు. అయితే ఈ మ్యూజియం రాంచీలోని బిర్సా ముండా తుది శ్వాస విడిచిన ఓల్డ్ సెంట్రల్ జైలులో ఉంది. అంతేకాదు ఇక్కడ 25 అడుగుల ఎత్తు ఉన్న ముండా విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అయితే ఈ మ్యూజియం ఆదివాసీలు తమ అడవులు, భూమి హక్కులు, సంస్కృతిని పరిరక్షించడానికి వారు ప్రదర్శించిన శౌర్యాన్ని, త్యాగాలను ప్రతిబింబిస్తుందని ఇది దేశ నిర్మాణానికి చాలా ముఖ్యమైనదని అని మోదీ అన్నారు. పైగా ముండాతో పాటు, బుధు భగత్, సిద్ధూ-కన్హు, నీలాంబర్-పీతాంబర్, దివా-కిసున్, తెలంగాణ ఖాదియా, గయా ముండా, జాత్రా భగత్, పోటో హెచ్ భగీరథ్ మాంఝీ గంగా నారాయణ్ సింగ్ వంటి గిరిజన స్వాతంత్య్ర సమరయోధులను కూడా ఈ మ్యూజియం హైలైట్ చేస్తుంది. (చదవండి: యూకే లివర్పూల్ నగరంలో కారు బ్లాస్ట్... ఒకరు మృతి) -
ధోనిని కలిసేందకు 1400కి.మీ కాలినడక.. చివరకు ఏమైందంటే!
రాంఛీ: ఎంఎస్ ధోని అంతర్జాతీయ క్రికెట్కు గుడ్ బై చెప్పి ఏడాది గడిచిన ప్యాన్స్లో మాత్రం ఏ మాత్రం క్రేజ్ తగ్గలేదు. ప్రపంచవ్యాప్తంగా ధోని కు అభిమానులు ఉన్నారు. మన దేశంలో అయితే ప్రత్యేకంగా చేప్పే అవసరంలేదు. అతనంటే ప్రాణం ఇచ్చే వీరాభిమానులూ చాలా మందే కనిపిస్తారు. తాజాగా ఓ అభిమాని ధోనీని కలిసేందుకు పెద్ద సాహసమే చేశాడు. వివరాలు.. హరియాణకు చెందిన అజయ్ గిల్ ధోనీకు వీరాభిమాని. తన చిన్నతనం నుంచి ధోని అంటే పిచ్చి...జీవితంలో ఒక్కసారైన కలవాలని కలలు కనేవాడు. ఈ తరుణంలో ధోనీని కలిసేందుకు ఏకంగా 1400 కిలోమీటర్లు కాలినడకన వెళ్లాడు. హరియాణ లోని హిసార్ జిల్లా జలన్ ఖేడా గ్రామానికి చెందిన 18 ఏళ్ల అజయ్ జులై 29న తన గ్రామం నుంచి నడక మొదలు పెట్టాడు. జులై 29న పయనమైన అజయ్ 16 రోజుల పాటు నడిచి రాంచీకి చేరుకున్నాడు. చివరకు ధోనీ ఇంటి వద్దకు చేరుకుని నిలబడి ఉన్న అతడిని ఒక జాతీయ మీడియా ప్రతినిధి చూశాడు. ఆ యువకుడుని ఎందుకు ఇక్కడ ఉన్నావు అని ప్రశ్నించాడు. తాను ధోనీ అభిమానిని అని..తనను కలిసేందకు వచ్చాను అని తెలిపాడు. ధోనిని కలిసిన తర్వాత మా ఇంటికి వెళ్తాను'అని అజయ్ గిల్ చెప్పాడు. ఎంతో దూరం నుంచి వచ్చిన తనకు అభిమాన క్రికెటరైన మహీతో 10 నిమిషాలు మాట్లాడిస్తే చాలని వేడుకున్నాడు. అయితే ధోని ఐపీఎల్ 2021 సెకండాఫ్ లీగ్ కోసం దుబాయ్ వెళ్లడాని ఆ మీడియా ప్రతినిధి గిల్కు తెలిపాడు. మూడు నెలల తర్వాత ధోని భారత్కు వస్తాడని చెప్పినా.. తన ఆరాధ్య దైవాన్ని కలవకుండా ఇంటికి వెళ్లే పరిస్థితే లేదని మొండి పట్టాడు. ధోని రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత క్రికెట్ ఆడటం మానేశానని గిల్ తెలిపాడు. మహీ ఆశీర్వాదం తీసుకున్నాక మళ్లీ క్రికెట్ ఆడాలని నిర్ణయించుకున్నట్లు వివరించాడు. గిల్ తన హెయిర్కు ఎల్లో, ఆరేంజ్, డార్క్ బ్లూ, కలర్స్ వేసుకున్న అతను ఓ పక్క ధోనీ, మరో పక్క మహీ అని వెంట్రుకలపై రాసుకున్నాడు. కానీ 1400 కిలోమీటర్ల కాలినడకన వచ్చిన అజయ్ కోరిక మాత్రం తీరలేదు. -
జార్ఖండ్ జడ్జి హత్య కేసు విచారణ: రూ.5 లక్షల రివార్డు ప్రకటించిన సీబీఐ
రాంచీ: సంచలనంగా మారిన జార్ఖండ్ జడ్జి ఉత్తమ్ ఆనంద్ హత్య కేసును సీబీఐకి అప్పగించిన విషయం తెలిసిందే. దీంతో సీబీఐ కేసు విచారణను వేగవంతం చేయడానికి అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో హత్య కేసుకు సంబంధించిన కీలకమైన సమాచారన్ని అందించిన వారికి రూ.5లక్షల రివార్డు ఇస్తామని సీబీఐ అధికారులు ఆదివారం ప్రకటించారు. హత్య, కుట్ర వివరాలు ఎవరికైనా తెలిస్తే.. ఆ సమాచారాన్ని తెలియజేసిన వారికి రూ.5 లక్షలు రివార్డు ఇస్తామని సీబీఐ పేర్కొంది. గత నెల 28న ఉదయం 5గంటల సమయంలో రోడ్డు పక్కన జాగింగ్ చేస్తున్న జడ్జి ఉత్తమ్ ఆనంద్ను ఓ టెంపో వాహనం ఢీకొట్టి వెళ్లిపోయింది. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలను పరిశీలించిన పోలీసులు దర్యాపు చేసి.. ఆ టెంపో వాహనాన్ని నడిపిన డ్రైవర్తో పాటు మరో ఇద్దరని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. జడ్జి ఉత్తమ్ ఆనంద్ హత్య కేసును సుమోటో తీసుకున్న సూప్రీం కోర్టు ఇటీవల కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. -
జడ్జి హత్యపై నివేదిక ఇవ్వండి
న్యూఢిల్లీ: ధన్బాద్ సెషన్స్ జడ్జి ఉత్తమ్ ఆనంద్ను వాహనంతో ఢీకొట్టి చంపిన ఘటనపై వారం రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని జార్ఖండ్ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర డీజీపీలను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఘటనపై కొనసాగుతున్న దర్యాప్తు ప్రగతిని తమకు తెలియజేయాలని కోరింది. అదేవిధంగా, జడ్జి మృతిపై జార్ఖండ్ హైకోర్టు చేపట్టిన చర్యలు యథాప్రకారం కొనసాగుతాయని స్పష్టం చేసింది. వారం తర్వాత జరిగే విచారణకు హాజరు కావాలని జార్ఖండ్ అడ్వకేట్ జనరల్ను ధర్మాసనం ఆదేశించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ సూర్యకాంత్ల ధర్మాసనం శుక్రవారం ఈ కేసుపై సుమోటోగా విచారణ చేపట్టింది. -
ప్రభుత్వం కూల్చేందుకు భారీ కుట్ర? జార్ఖండ్లో కలకలం
రాంచీ: ఓ స్టార్ హోటల్లో ముగ్గురు పోలీసులకు చిక్కడం జార్ఖండ్లో కలకలం రేపుతోంది. తమ ప్రభుత్వాన్ని కుప్పకూల్చేందుకు కుట్ర పన్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో వారి అరెస్ట్ హాట్ టాపిక్గా మారింది. రాష్ట్ర రాజధాని రాంచీలో ఈ సంఘటన జరిగింది. ఈ పరిణామంపై ముఖ్యమంత్రి హేమంత్ సోరేన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి వెనకున్న వారిని బయటకు లాగుతామని, ఆ కుట్రను బహిర్గతం చేస్తామని హెచ్చరించారు. రాంచీలోని ఓ హోటల్లో మూడు రోజుల నుంచి ఆ హోటల్లో పెద్ద ఎత్తున ఓ కార్యకలాపాలు జరుగుతున్నాయని ప్రభుత్వ నిఘా వర్గాలు గుర్తించాయి. ఈ కుట్ర విషయమై కాంగ్రెస్ ఎమ్మెల్యే కుమార్ జై మంగల్ సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొన్ని శక్తులు కుట్ర పన్నుతున్నాయని కొత్వాలి పోలీస్ స్టేషన్కు లేఖ ద్వారా ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు ఈ దాడులు జరపగా ముగ్గురు అరెస్టయ్యారు. దీనిపై విచారణ చేపట్టి సోదాలు చేయగా అభిషేక్ దుబే, అమిత్ సింగ్, నివారణ్ ప్రసాద్ మహతో పోలీసులకు పట్టుబడ్డారు. వారి వద్ద నుంచి పెద్ద ఎత్తున నగదు పట్టుకున్నారని సమాచారం. అదుపులోకి తీసుకున్న వారు కాంగ్రెస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు ప్రయత్నిస్తున్నారనే ఆరోపణలు అధికార పార్టీ ఆరోపించింది. ప్రస్తుతం జార్ఖండ్లో జార్ఖండ్ ముక్తి మోర్చ (జేఎంఎం), కాంగ్రెస్, రాష్ట్రీయ జనతా దల్ (ఆర్జేడీ) కలిసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రిగా హేమంత్ సోరేన్ ఉన్నారు. 2019లో జరిగిన ఎన్నికల్లో 81 స్థానాలు ఉన్న జార్ఖండ్లో జేఎంఎం (30), కాంగ్రెస్ (18), ఆర్జేడీ (1)లకు మొత్తం కలిపి 47 స్థానాలు వచ్చాయి. దీంతో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేశాయి. ఈ ప్రభుత్వాన్ని కుప్పకూల్చే ప్రయత్నాలు బీజేపీ చేస్తోందనే ఆరోపణలు వస్తున్నాయి. అందులో భాగంగానే హోటల్లో ఓ రహాస్య కుట్రకు తెరతీశారని తెలుస్తోంది. దీనికి సంబంధించిన వివరాలు మరిన్ని తెలియాల్సి ఉంది. -
దారుణం: నాలుగేళ్లుగా ఆశ్రమంలోని పిల్లలపై లైంగిక వేధింపులు
రాంచీ: అనాథశ్రమాలు, వృద్ధాశ్రమాలు, స్వచ్ఛంద సంస్థలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. అయితే అయినోళ్ళకు దూరమైన వారికి అవే ఆధారం. కాగా చీకట్లు కమ్ముకున్న చిన్నారులను ఈ ఆశ్రమాలు మరింత అంధకారంలోకి నెడుతున్నాయి. తాజాగా జార్ఖండ్లోని తూర్పు సింగ్భూమ్ జిల్లాలో ఓ స్వచ్ఛంద సంస్థకు చెందిన ఇద్దరు మైనర్ బాలికలు తప్పిపోయారు. మదర్ థెరీసా వెల్ఫేర్ ట్రస్ట్ (ఎంటీడబ్ల్యూటీ)లోని పిల్లలను నాలుగేళ్లుగా లైంగిక వేధింపుల గురిచేస్తున్నారనే ఆరోపణలు రావడంతో అధికారులు శుక్రవారం జంషెడ్పూర్లోని గోబర్ఘౌసీలోని బాల్ కళ్యాణ్ ఆశ్రమానికి తరలించారు. అయితే నలభై మంది పిల్లల్లో 38 మంది పిల్లలు మాత్రమే ఉన్నారని చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఆదివారం గుర్తించింది. 17 సంవత్సరాల వయసు గల ఇద్దరు మైనర్ బాలికలు తప్పిపోయినట్టు తెలిపారు. కాగా తప్పిపోయిన బాలికల ఆచూకి కోసం గాలిస్తున్నట్లు తూర్పు సింగ్భూమ్ సీనియర్ సూపరింటెండెంట్ (ఎస్ఎస్పీ) డాక్టర్ ఎం తమిళ వనన్ తెలిపారు. ఎంటీడబ్ల్యూటీ డైరెక్టర్ హర్పాల్ సింగ్ థాపర్, అతని భార్య పుష్ప రాణి టిర్కీ, వార్డెన్ గీతా సింగ్, ఆమె కుమారుడు ఆదిత్య సింగ్, మరో వ్యక్తితో సహా నిందితులను పట్టుకునేందుకు గాలిస్తున్నట్లు ఎస్ఎస్పీ వెల్లడించారు. కాగా మదర్ థెరీసా వెల్ఫేర్ ట్రస్ట్ డైరెక్టర్ భార్య టిర్కీ, తూర్పు సింగ్భూమ్ జిల్లా శిశు సంక్షేమ కమిటీ (సీడబ్ల్యూసీ) చైర్పర్సన్గా కూడా ఉన్నారని, మదర్ థెరిసా వెల్ఫేర్ ట్రస్ట్ గత 10 సంవత్సరాలుగా ఖరంగజార్లో నడుస్తున్నట్లు ఓ అధికారి తెలిపారు. చదవండి: దేశంలో మరింత తగ్గిన కరోనా కేసులు -
కలకలం: బీజేపీ నాయకుడి కుమార్తెపై అత్యాచారం, హత్య?
రాంచీ: అటవీ ప్రాంతంలో బీజేపీ నాయకుడి కుమార్తె అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. చెట్టుకు వేలాడుతూ ఆమె మృతదేహం కనిపించింది. రెండు రోజులుగా కనిపించికుండాపోయిన కుమార్తె విగతజీవిగా మారడంతో ఆ నాయకుడు, కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. అయితే ఆమెది ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించాని బాధిత కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటన ఝార్ఖండ్లో జరిగింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. పలాం జిల్లాలోని బుదాపూర్ గ్రామానికి చెందిన బీజేపీ నాయకుడికు ఐదుగురు సంతానం. వారిలో పెద్ద కుమార్తె (16) పదో తరగతి చదువుతోంది. జూన్ 7వ తేదీన ఇంటి నుంచి బయటకు వెళ్లిన కుమార్తె మళ్లీ ఇంటికి రాలేదు. కంగారుపడిన కుటుంబసభ్యులు తెలిసినవారి ఇళ్లల్లో, స్నేహితుల నివాసాల్లో గాలించారు. ఎంతకీ ఆచూకీ తెలియకపోవడంతో పాంకి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అయితే లాలిమతి అటవీ ప్రాంతంలో బుధవారం (జూన్ 9) చెట్టుకు వేలాడుతూ ఓ మృతదేహం కనిపించింది. స్థానికులు సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. పరిశీలించగా బీజేపీ నాయకుడి కుమార్తెగా గుర్తించారు. అయితే బాలిక మృతదేహంపై గాయాలు, దుస్తులు చెదిరి ఉండడం, కళ్లు బయటకు వచ్చి ఉండడంతో ఎవరో హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు చెట్టుకు వేలాడదీశారని కుటుంబసభ్యులు ఆరోపించారు. విచారణ చేపట్టగా ప్రదీప్కుమార్ సింగ్ ధనుక్ (23)తో బాలికకు సంబంధం గుర్తించి అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతడు వివాహితుడు. బాలికపై అత్యాచారానికి పాల్పడిన అనంతరం హత్య చేసి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. బాలికను హత్య చేశారని ప్రాథమిక నిర్దారణకు వచ్చారు. బాలిక మృతదేహానికి పోస్టుమార్టం అనంతరం అంత్యక్రియలు జరిపించారు. ప్రస్తుతం ఈ కేసు విచారణ కొనసాగుతోంది. ఈ ఘటన ఒక్కసారిగా ఆ రాష్ట్రంలో కలకలం రేపింది. ఎందుకంటే బాలిక మృతదేహం చూడలేని పరిస్థితిలో ఉంది. కేసును దర్యాప్తు చేసి నిజానిజాలు త్వరలోనే తేలుస్తామని పోలీసులు తెలిపారు. చదవండి: ఇంజెక్షన్లతో కామవాంఛ.. 8 ఏళ్లుగా యువతిపై -
చేతులు చాచారు.. అడ్డంగా బుక్కయ్యారు
రాంచీ: జార్ఖండ్కు చెందిన ఓ ఐదుగురు పోలీసులను సస్పెండ్కు గురయ్యారు. ఓ డ్రైవర్ నుంచి డబ్బులు వసూలు చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వారిని సస్పెండ్ చేసినట్లు సిమ్దేగా పోలీస్ సూపరింటెండెంట్ షామ్స్ తబ్రేజ్ ఆదివారం తెలిపారు. పోలీస్ శాఖ పరువు తీసే ఇటువంటి సంఘటనలను సహించమని ఎస్పీ అన్నారు. మే 22న సోషల్ మీడియాలో వైరల్ మారిన ఈ వీడియోలో ఉన్నది ఈశ్వర్ మారండి, అనుజ్ కుమార్, ముఖేష్ కుమార్ మహతో, శివ్ ఒరాన్, అఖిలేష్ తిర్కీగా గుర్తించినట్టు ఆయన పేర్కొన్నారు. వీరిపై శాఖ పరమైన చర్యలు తీసుకోన్నట్టు వెల్లడించారు. (చదవండి: వైరల్: తేనెటీగలతో సాహసం.. 21 మిలియన్ల వ్యూస్!) -
వైరల్ వీడియో: దెయ్యం! ఏలియన్! లేక..
-
బ్రిడ్జిపై వింత ఆకారం: పోలీసులు ఏమన్నారంటే..
రాత్రిపూట బ్రిడ్జ్పై వింత ఆకారం తిరుగుతున్నట్లు వీడియో ఒకటి ఇంటర్నెట్లో, మీడియా చానెల్స్లో కథనాలు ప్రసారం అవుతోంది. ఆ టైంలో కొందరు బైకర్స్ వీడియో తీసి వైరల్ చేయడంతో అది అంతటా పాకింది. అది ఏలియన్ అని కొందరు, కాదు బ్రిడ్జ్ దగ్గర్లో శ్మశానం ఉండడంతో దెయ్యం అని మరికొందరు ప్రచారం మొదలుపెట్టారు. అయితే ఈ వీడియో పోలీసుల దాకా చేరడంతో దర్యాప్తు మొదలుపెట్టారు. రాంచీ: బ్రిడ్జ్ మీద వింత ఆకారం పేరుతో వీడియో ఒకటి విపరీతంగా షేర్ అవుతున్న విషయం తెలిసిందే. హజారిబాఘ్ సమీపంలోని ఓ బ్రిడ్జ్ మీద ఇది జరిగిందని ప్రచారం నడుస్తోంది. మే 28న రాత్రి ఎనిమిది గంటల సమయంలో బైకులపై వెళ్తున్న కొందరు ఆ వింత ఆకారాన్ని గుర్తించారని, వీడియో తీసి వైరల్ చేశారని అక్కడి లోకల్ మీడియా ఛానెల్స్ కథనాల్ని ప్రచురించాయి. దీంతో పంజాబ్ కేసరి ఫేస్బుక్ ఛానెల్ ఆ వీడియోను అప్లోడ్ చేసి.. వింత ఆకారం సంచరించడంపై స్థానికులు ఆందోళన చెందుతున్నారంటూ పోస్టులు పెట్టడంతో మెయిన్ స్ట్రీమ్ మీడియాకు విషయం చేరింది. అయితే వైరల్ వీడియో తమ దృష్టిలోకి వచ్చిందని హజారిబాగ్లోని పెలావాల్ స్టేషన్ ఇన్ఛార్జి వికర్ణ కుమార్ తెలిపారు. ‘‘సోషల్ మీడియా ద్వారా వీడియో మా దృష్టికి వచ్చింది. ఛాద్వా డ్యామ్ బ్రిడ్జ్ దగ్గర ఈ ఘటన జరిగింది. ఆరోజు వాతావారణం బాగోలేదు. పైగా బ్రిడ్జ్ దగ్గర్లో మతిస్థిమితం లేని ఓ వ్యక్తి తిరుగుతుంటాడు. బహుశా ఆ వ్యక్తే నగ్నంగా తిరిగి ఉంటాడని అనుమానిస్తున్నాం’’ అని ఆయన చెప్పారు. ఇక ఫ్రాంక్ వీడియోలు తీసే ఆకతాయిల మీదా అనుమానం వ్యక్తం చేస్తూ ఆ కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నామమని వెల్లడించారు. కాగా, గతంలో ఇలాంటి ఘటన ఎప్పుడూ ఎదురు కాలేదని స్థానికులు అంటున్నారు. అయితే ఆ బ్రిడ్జ్కి వంద మీటర్ల దూరంలో ఓ వ్యక్తి బట్టలు లేకుండా తిరిగే విషయాన్ని మాత్రం నిర్ధారించారు. బహుశా అతని వీడియోను మార్ఫింగ్ చేసి ఎవరైనా ఉత్త ప్రచారానికి తెరలేపి ఉండొచ్చని కొందరు యువకులు అనుమానిస్తున్నారు. ఈరోజుల్లో టెక్నాలజీ ఉపయోగించి ఎలాంటి వీడియోను అయినా క్రియేట్ చేయొచ్చు. ఇది కూడా అలాంటిదేమోనని.. ఈ వీడియోపై త్వరలోనే పూర్తి నిజాలు తేలుస్తాం వికర్ణ తెలిపారు. జోకులు రాత్రి పూట బ్రిడ్జ్పై వెళ్తున్న కొందరు ఆ ఆకారం దగ్గరకు వెళ్లగానే ‘‘దెయ్యం దెయ్యం’’ అంటూ అరుస్తూ వీడియో షూట్ చేశారు. ఇక జార్ఖండ్ వైరల్ వీడియోపై సోషల్ మీడియా సరదా కామెంట్లతో నిండిపోయింది. ఇది ఫ్రాంక్స్టర్ల పని కావొచ్చని, క్యాస్టూమ్.. లైటింగ్ ఎఫెక్ట్ మాయాజాలం అయ్యి కూడా ఉండొచ్చని కొందరు కామెంట్లు పెడుతున్నారు. మరికొందరేమో ఏలియన్లు వ్యాక్సినేషన్ కోసం వచ్చి ఉంటాయని, అయినా ఏలియన్లు అమెరికాలో తప్ప ఈ భూమ్మీద ఇంకెక్కడ కనిపించవని జోకులు వేస్తే.. ఇంకొందరేమో ఈ వీడియో సంగతేంటో చూడండంటూ నాసాకి, ఎలన్ మస్క్కి ట్యాగులు చేస్తున్నారు. చదవండి: మోదీసార్.. మాకెందుకీ కష్టాలు -
మానవత్వం బతికే ఉంది.. కరోనా పేషెంట్లకు ఫ్రీ రైడ్
రాంచీ: ప్రజలు కోవిడ్ మహమ్మారి సోకి నరకయాతన అనుభవిస్తుంటే కొందరు మాత్రం రోగుల నుంచి ఎవరికి తోచిన విధంగా వారు దొరికినంత దోచుకుంటున్నారు. ఇటీవల రెమ్డిసెవర్ ఇంజక్షన్లు, ఆక్సిజన్ల కొరతను అడ్డుపెట్టుకొని బ్లాక్లో వేలల్లో వీటిని అమ్ముకున్న సంగతి తెలిసింతే. వీళ్లు మానవత్వం చూపించకపోయినా ఫర్వాలేదు కానీ ప్రాణాలతో ఇలా వ్యాపారం చేయకూడదనే విషయాన్ని కూడా మరిచారు. ఓ వైపే ఇలా ఉంటే మరోవైపే మనుషుల్లో ఇంకా మానవత్వం మిగిలే ఉందనేందుకు నిదర్శనంగా కొందరు కరోనా రోగులను తమ వంతు సాయం అందజేయడానికి ముందుకు వస్తున్నారు. అలా రాంచీలో ఓ ఆటోడ్రైవర్ కరోనా పేషంట్లకు తన వంతు సాయం చేస్తూ వార్తల్లో నిలిచాడు. వివరాల్లోకి వెళితే.. జార్ఖండ్ రాంచీకి చెందిన ఓ ఆటో డ్రైవర్ కోవిడ్ పేషెంట్ల కష్టాలు చూసి తన వంతు సహాయంగా ఏమైనా చేయదలచాడు. తన ఆటోలో ప్రయాణించే కరోనా రోగులకు ఉచిత ప్రయాణం కల్పిస్తూ తన మానవత్వాన్ని చాటుకుంటున్నాడు. అంతేగాక సోషల్ మీడియాలో తన ఫోన్ నెంబర్ని పెట్టాడు. ఆటోకి కూడా ఫోన్ నెంబర్తో ఉన్న పోస్టర్ని అతికించాడు. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే కోవిడ్ రోగులను హాస్పిటల్కి తీసుకెళ్లుతున్నాడు. వారి నుంచి ఎలాంటి డబ్బులు వసూలు చేయడం లేదు. ఇలా చేయడానిక ఓ కారణం ఉందని.. ఈనెల 15న కోవిడ్ సోకిన ఓ మహిళను రిమ్స్ హాస్పిటల్లో దింపగా ఆ తర్వాత ఆమెని తీసుకెళ్లడానికి ఎవరూ ముందుకు రాలేదు. దీంతో మహిళ ఆ రోజు పడిన వేదన చూసినప్పటి నుంచి ఈ ఫ్రీ రైడ్ ప్రారంభమైందని అంటున్నాడు. అసలే కర్ఫ్యూ, అది కాకుండా పెరిగిన పెట్రోల్ ధరలతో ఆటో పై వచ్చే సంపాదన ఎంత. కానీ లాభాపేక్ష లేకుండా కేవలం మానవత్వంతో ఈ ఆటోడ్రైవర్ చేస్తోన్న సహాయానికి స్థానికులే కాదు నెటిజన్ల నుంచి కూడా ప్రశంసలు అందుతున్నాయి. ( చదవండి: రూ.22 లక్షల కారు అమ్మేశాడు: ఎందుకో తెలిస్తే దండం పెడతారు! ) Jharkhand: An auto driver in Ranchi offers free ride to people who need to go to hospitals, amid #COVID19 pandemic. Ravi, the driver says, "Doing this since 15th April when I dopped a woman at RIMS after everyone else refused. My number's on social media so people can contact me" pic.twitter.com/HkL49rzUni — ANI (@ANI) April 23, 2021 -
ఝార్ఖండ్ లోని రాంచీలో ఏనుగు బీభత్సం
-
2008 ఎస్సై ఉద్యోగాలు: జార్ఖండ్ హైకోర్టు కీలక తీర్పు
రాంచీ: ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపై జార్ఖండ్ రాష్ట్ర హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ప్రభుత్వ ఉద్యోగాలు ప్రతిభ ఆధారంగా ఇవ్వాలని ఆదేశించింది. అలా చేయకపోతే అది రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించింది. పోటీ పరీక్షల ఉద్యోగార్థులకు ప్రతిభ ఆధారంగా కొలువులు కల్పించాలని పేర్కొంది. ఈ మేరకు 2008లో ఎస్సై నియామకాలపై దాఖలైన కేసులో రాంచీ హైకోర్టు గురువారం కీలక ఆదేశాలు జారీ చేసింది. జార్ఖండ్లో 2008లో ఎస్సై ఉద్యోగాలకు ప్రకటన విడుదల చేయగా తుది ఫలితాల అనంతరం 382 మంది ఉద్యోగాలకు ఎంపికయ్యారు. అయితే తమకు మెరిట్ ఉన్నప్పటికీ తుది జాబితాలో పేర్లు లేవని 43 మంది హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై ప్రభుత్వం ఒక కమిటీ వేసింది. విచారణ చేసిన ఆ కమిటీ తుది ఫలితాల్లో తప్పిదాలను గుర్తించి 43 మందికి ఉద్యోగాలు ఇవ్వాలని సూచించింది. ఈక్రమంలో కమిటీ నిర్ణయం ద్వారా ఉద్యోగం దక్కని మిగతావారు హైకోర్టును ఆశ్రయించారు. విచారణ చేసిన హైకోర్టు తొలుత ప్రకటించిన 382 మందికే ఉద్యోగాలు ఇవ్వాలని, కమిటీ సూచించిన ఆ 43 మంది పేర్లను కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మరలా ఆ 43 మంది హైకోర్టు తలుపు తట్టగా.. జస్టిస్ ఎల్.నాగేశ్వర రావు, ఇందిరా బెనర్జీతో కూడిన బెంచ్ విచారణ చేపట్టింది. ఈ మేరకు ఎస్సై నియమాలకు సంబంధించి 43 మంది మెరిట్ అభ్యర్థులకు ఉద్యోగాలు కల్పించాలని స్పష్టం చేసింది. మెరిట్ ఉన్నప్పటికీ పోస్టు ఇవ్వకపోవడం రాజ్యాంగ విరుద్ధం కిందకు వస్తుందని ప్రభుత్వానికి స్పష్టం చేసింది. నియామకాల్లో పొరపాట్లకు పాలక సంస్థలదే బాధ్యత అని వ్యాఖ్యానించింది. -
తినడం మొదలుపెడితే ఒక్కటి కూడా మార్కెట్కు వెళ్లదు
రాంచీ: ఎంఎస్ ధోని ఆటకు గుడ్బై చెప్పిన తర్వాత రైతుగా మారిన సంగతి తెలిసిందే. రాంచీలోని తన వ్యవసాయక్షేత్రంలో వివిధ రకాల పంటలను సాగు చేస్తూ బిజీగా మారిపోయాడు. తాజాగా శుక్రవారం తన ఇన్స్టాగ్రామ్ వేదికగా తన తోటలో పండిన స్ట్రాబెరీని రుచి చూస్తూ వీడియోనూ షేర్ చేశాడు. కాగా ఆ వీడియోకు ధోని పెట్టిన క్యాప్షన్ వైరల్ అవుతుంది.(చదవండి: ఆసీస్ క్రికెటర్పై షేన్ వార్న్ అసభ్యకర వ్యాఖ్యలు) ఇంతకీ ధోని పెట్టిన క్యాప్షన్ ఏంటంటే.. ' నా పొలంలోని స్ట్రాబెరీలను నేను తినడం మొదలుపెడితే మార్కెట్కు ఒక్క పండు కూడా వెళ్లేలా లేదు' అంటూ సెటైరిక్ పద్దతిలో కామెంట్ చేశాడు. తన తోటలో పండిన స్రాబెరీ చాలా రుచిగా ఉన్నాయని.. తనకు బాగా నచ్చడంతో అన్ని తానే తినేస్తానేమోనని ఉద్దేశంతో క్యాప్షన్ పెట్టినట్లుగా తెలుస్తుంది.ధోని షేర్ చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది.(చదవండి: ఆసీస్పై రోహిత్ సెంచరీ సిక్సర్ల రికార్డు) రాంచీ శివార్లలోని శంబో గ్రామంలోని తన 43 ఎకరాల ఫామ్ హౌస్లో ధోనీ 10 ఎకరాల్లో టమోటా, క్యాబేజీ, బొప్పాయి, ఇతర పంటలను పండిస్తున్నాడు. ధోనీ ఫామ్ కూరగాయలకు స్థానికంగా మంచి డిమాండ్ రావడంతో వీటిని గల్ఫ్లో మార్కెట్ చేసేందుకు ఫామ్ ఫ్రెష్ ఏజెన్సీతో జార్ఖండ్ వ్యవసాయ శాఖ సంప్రదింపులు జరిపిన విషయం తెలిసిందే.ఇక గతేడాది ఆగస్టు 15న అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన ధోని.. ఐపీఎల్ 2020 సీజన్ మాత్రం ఆడాడు. కానీ మునపటి సత్తా చాట లేకపోయాడు. View this post on Instagram A post shared by M S Dhoni (@mahi7781) -
విషమంగా లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్యం
పట్నా: బిహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్య పరిస్థితి విషమించింది. రాంచీలోని రాజేంద్ర ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (రిమ్స్)లో చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్యం పరిస్థితి ప్రస్తుతం బాగా క్షీణించినట్లు సమాచారం. ఈ మేరకు డాక్టర్ ఉమేష్ ప్రసాద్ మాట్లాడుతూ.. 'లాలూ ప్రసాద్ యాదవ్ కిడ్నీలు ప్రస్తుతం 25 శాతం మాత్రమే పనిచేస్తున్నాయి. ఆయన కిడ్నీ పనితీరు ఎప్పుడైనా పూర్తిగా క్షీణించొచ్చు. అది ఎప్పుడు అనేది ఊహించడం కష్టం. కానీ అది ఖచ్చితంగా జరగుతుంది. ఇది చాలా ఆందోళనకరమైన విషయం. అందుకే నేను ఈ విషయం గురించి అధికారులకు లిఖితపూర్వకంగా తెలిపాను. ఇప్పటికే అనేక రకాలైన ఆరోగ్య సమస్యలు ఎదుర్కొందటున్న ఆయనకు.. ఇప్పుడు కొత్తగా మూత్రపిండాల పనితీరు క్షీణిస్తుంది. ఇప్పటికే లాలూ డయాబెటిస్, రక్తపోటు, గుండె జబ్బుతో బాధపడుతున్నట్లు తెలిసింది. అందువల్ల ఆయన కిడ్నీల నితీరు క్రమంగా క్షీణించిందని' రిమ్స్ వైద్యుడు ప్రసాద్ వెల్లడించారు. ఇదిలా ఉండగా, లాలూకు బెయిల్ మంజూరు చేయాలంటూ ఆయన తరపు న్యాయవాది వేసిన పిటిషన్ను జార్ఖండ్ హైకోర్టు జనవరి 22కి వాయిదా వేసింది. చదవండి: (‘నాడు పవార్కు దక్కని ప్రధాని పదవి’) -
‘కడక్నాథ్’ కోళ్ల బిజినెస్లోకి ధోని ఎంట్రీ!
రాంచీ: టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్కింగ్స్ సారథి ఎంఎస్ ధోని సరికొత్త వ్యాపారాన్ని ప్రారంభించేందుకు సిద్ధమైనట్లు సమాచారం. సిరులు కురిపించడంతో పాటు అత్యధిక పోషక విలువలు కలిగి ఉండే నల్లకోళ్లు ‘కడక్నాథ్’ పెంపకంపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి రాంచీలోని ఫాంహౌజ్లో ఆర్గానిక్ పౌల్ట్రీ పరిశ్రమను నెలకొల్పేదిశగా మహీ టీం ముందుకు సాగుతోంది. ఈ మేరకు ధోని బృందం ఆర్డర్ చేసిన 2 వేల కోడి పిల్లలు, డిసెంబరు 15న రాంచీకి డెలివరీ కానున్నట్లు సమాచారం. ఈ మేరకు మధ్యప్రదేశ్ గిరిజన రైతు వినోద్ మెండాతో వీరు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ విషయం గురించి మధ్యప్రదేశ్లోని జబువాలో గల కడక్నాథ్ ముర్గా రీసెర్చ్ సెంటర్ డైరెక్టర్ ఐఎస్ తోమర్ మీడియాతో మాట్లాడుతూ.. కోళ్ల పెంపకం విషయమై ధోని తమను సంప్రదించాడని, అయితే ఆ సమయంలో తమ వద్ద కోడి పిల్లలు అందుబాటులో లేనందున రైతు నంబరు ఆయనకు ఇచ్చినట్లు పేర్కొన్నారు. (చదవండి: ధోని తప్పుకొంటే.. సీఎస్కే కెప్టెన్గా అతడికే అవకాశం!) కాగా మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని వెనకబడిన ప్రాంతాలైన ఝూబువా, అలీరాజ్పూర్ పరిసరాల్లో భీల్, భిలాలా తెగ ప్రజలు వందల ఏళ్ల నుంచి ఈ జాతి కోళ్లను పెంచుతున్నారు. ప్రొటీన్ల శాతం ఎక్కువ. కొలెస్ట్రాల్ శాతం చాలా తక్కువ.. అదే విధంగా ఐరన్ శాతం మామూలు కోళ్ల కంటే పది శాతం ఎక్కువ ఉంటుందట. ఇక ఈ కోళ్ల చర్మం, మాంసంతోపాటు రక్తం కూడా నలుగు రంగులోనే ఉండటం విశేషం. వీటి గుడ్లు గోధుమ రంగులో ఉంటాయి. పిల్లలు నీలం, నలుపూ తెలుపూ చారలతో ఉండి, పెరిగే కొద్దీ నలుపు రంగులోకి మారుతాయి. అధిక రోగనిరోధక శక్తి గల కడక్నాథ్ జాతి కోళ్లు ప్రతికూల వాతావరణ పరిస్థితులను సైతం తట్టుకుని నిలబడగలవు. కాగా ఈ జాతి కోడి కిలో మాంసం రూ.700 నుంచి రూ.వెయ్యి, గుడ్డు ధర రూ.40–50 పైగానే ఉంటుందట. ఇక అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన ధోని, ప్రస్తుతం ఐపీఎల్ టీం సీఎస్కేకు కెప్టెన్గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. వీలు చిక్కినప్పుడల్లా తన ఫాంహౌజ్లో కుటుంబంతో సమయం గడిపే ధోని, ఇప్పుడు అక్కడే పౌల్ట్రీని నెలకొల్పనున్నాడు. -
కాకరకాయ, పచ్చిమిర్చితో రసగుల్లా
రాంచి: కరోనా వైరస్ నేపథ్యంలో రోగనిరోధక శక్తి పెంచుకునేందుకు తీపి అంటే ఇష్టమైన వాళ్లంతా నోళ్లు కట్టేసుకుంటున్నారు. అలాంటి వారి కోసం రాంచిలోని ఓ స్వీట్ షాపు నిర్వాకుడు కమల్ అగర్వాల్ తీపి కబురు అందించాడు. తీపి తినేవారికి రోగనిరోధక శక్తని అందించే రసగుల్లాను ఈ దీపావళి పండుగ కోసం ప్రత్యేకంగా తయారు చేయిస్తున్నాడు. అయితే స్వీట్స్తో రోగనిరోధక శక్తి ఎలా పెరుగుతుందా అని ఆశ్చర్యపోతున్నారా. ఇందులో వాడే పదార్థాలు ఏంటో మీరే చదవండి మరి. ఈ రసగుల్లా తయారికి అగర్వాల్ ఇమ్యూనిటీని పెంచే పదార్థాలు... కాకరకాయ, పచ్చిమిర్చి, వెల్లుల్లి, పసుపు పదార్థాలను వాడుతున్నాడు. ఈ పదార్థాల్లో విటమిన్లు, పోషకాలు పుష్కలంగా ఉన్నాయని, ఇవి రోగనిరోధక శక్తి పెంచడానికి సహాయపడతాయని జార్ఖండ్ ప్రభుత్వ ఆయుష్ వైద్యుడు భరత్ కుమార్ కూడా స్పష్టం చేశారు. (చదవండి: మరో లాక్డౌన్ వల్ల అన్నీ అనర్థాలే!) స్వీట్స్ షాపు నిర్వాహకుడు కమల్ అగర్వాల్ మాట్లాడుతూ.. ‘కరోనా వైరస్ నేపథ్యంలో మార్చిలో దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించిన విషయం తెలిసిందే. దీంతో నా మిఠాయిల వ్యాపారం నిలిచిపోయి తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని చూశాను. జనాలు కూడా మహమ్మారి బారిన పడకుండా ఉండేందుకు రోగనిరోధక శక్తినిచ్చే ఉత్పత్తులపైనే ఆసక్తి చూపిస్తున్నారు. అలాంటి పదార్థాలనే ప్రజలంతా కొనుగోలు చేయడం గమనించాను. అందువల్లే ఇమ్యూనిటీ ఇచ్చే ఈ రసగుల్లాలను తయారు చేయాలని నిర్ణయించుకున్నాను’ అని చెప్పాడు. అయితే ఇవి తయారు చేసిన మొదల్లో చాలా తక్కువమంది ఈ రసగుల్లాలను కోనుగొలు చేసేవారని, అయితే దుర్గా పూజ తర్వాత వీటి డిమాండ్ బాగా పెరిగిందన్నాడు. అంతేగాక ఈ స్వీట్స్కు ప్రజల నుంచి విశేష స్పందని వస్తుందని, ఈ దీపావళికి రసగుల్లాలకు చాలా ఆర్డర్లు వచ్చాయని అగర్వాల్ ఆనందం వ్యక్తం చేశాడు. (చదవండి: జ్వరమొస్తే కరోనా, డెంగీ టెస్టులు తప్పనిసరి) -
జీవాపై అభ్యంతరకర వ్యాఖ్యలు: బాలుడు అరెస్ట్
అహ్మదాబాద్: మహేంద్ర సింగ్ ధోని కూతురు జీవా ధోనిపై అసభ్యకర కామెంట్లు చేసిన 16 ఏళ్ల బాలుడిని పోలీసులు అరెస్టు చేశారు. అతడు గుజరాత్లోని కచ్ జిల్లా ముంద్రా ప్రాంతానికి చెందినవాడిగా రాంచీ పోలీసులు గుర్తించి అక్కడి పోలీసులకు సమాచారం ఇచ్చారు. అతడిని అదుపులోని తీసుకొని విచారించగా, ఆ పోస్ట్ తానే చేసినట్లు ఒప్పుకున్నాడు. రాంచీ పోలీసులు ఇక్కడికి వచ్చిన అనంతరం నిందితుడిని వారికి అప్పగిస్తామని కచ్ జిల్లా (వెస్ట్) ఎస్పీ సౌరబ్ సింగ్ తెలిపారు. కోల్కతాతో జరిగిన మ్యాచ్లో చెన్నై జట్టు ఓడిపోయింది. ధోని సరిగ్గా ఆడకపోవడం వల్లే మ్యాచ్ ఓడిపోయిందని, మళ్లీ సరిగ్గా ఆడకపోతే జీవా ధోనిపై అత్యాచారం చేస్తానంటూ ఇన్స్టాగ్రామ్లో అసభ్యకర కామెంట్లు చేశాడు. ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపింది. పలు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు, క్రికెటర్లు దీన్ని తీవ్రంగా ఖండించారు. నిందితుడిని వెంటనే అరెస్టు చేయాలని సోషల్ మీడియాలో డిమాండ్ చేశారు. (జీవా ధోనిపై అభ్యంతరకర వ్యాఖ్యలు) (చదవండి: రాయల్స్ రైజింగ్..) -
బకెట్లో మనిషి చేయి లభ్యం
రాంచీ : మనిషి చేయి ఒకటి బకెట్లో లభించడం కలకలం రేపింది. ఈ ఘటన జార్ఖండ్లోని బారియాటు ప్రాంతంలో ఆదివారం చోటుచేసుకుంది. బకెట్లో తెగిన చేయి ఒకటి కనిపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే ఈ విషయాన్ని రాంచీ పోలీసులకు సమాచారమందించారు. పోలీసులు వచ్చి బకెట్లో లభించిన చేతిని స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ తెగిన చేతి ఒక క్యాన్సర్ పేషంట్దని తమ దర్యాప్తులో తేలిందని పోలీసులు వెల్లడించారు. పరీక్షకు సంబంధించి ల్యాబ్కు పంపేందుకు ఒక చోట ఉంచగా అది మాయమైనట్లు సదరు ఆసుపత్రి సిబ్బంది పేర్కొంది. కాగా తెగిన చేయి ఆసుపత్రి నుంచి బకెట్లోకి ఎలా వచ్చిందన్న దానిపై విచారణ జరుపుతున్నట్లు రాంచీ సిటీ ఎస్పీ సౌరభ్ తెలిపారు. చదవండి : అస్సాంలో దారుణం.. ఆలస్యంగా వెలుగులోకి గోద్రా అల్లర్లు: మోదీ పేరు తొలగింపు -
ఐపీఎల్ 2020 : ధోని ప్రాక్టీస్ షురూ
రాంచీ : దుబాయ్ వేదికగా సెప్టెంబర్ 19 నుంచి ఇండియన్ ప్రీమియర్ లీగ్ 13వ సీజన్ జరగనుంది. ఈ నేపథ్యంలో అందరి కళ్లు టీమిండియా మాజీ కెప్టెన్ దనాధన్ ఎంఎస్ ధోనిపై ఉన్నాయని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎప్పుడెప్పుడు ధోని బరిలోకి దిగుతాడా.. అతని ఆటను ఎప్పుడు కళ్లారా చూస్తామా అంటూ అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే 2019 ప్రపంచకప్లో న్యూజిలాండ్తో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్ అనంతరం మళ్లీ టీమిండియా జట్టులో ధోని కనబడలేదు.. ఆడలేదు. దాదాపు ధోనిని మైదానంలో చూసి 14 నెలలు అయింది. తాజాగా ఐపీఎల్ 13వ సీజన్ గ్రీన్ సిగ్నల్ దొరకడంతో మళ్లీ ధోని తన స్వస్థలమైన రాంచీలో నెట్స్లో సాధన చేస్తున్నాడు. హెలికాప్టర్ షాట్లు త్వరలో చూస్తారని చెన్నై జట్టు స్టార్ ఆటగాడు సురేష్ రైనా చెప్పిన ఒక రోజు తర్వాత.. మహీ ప్రాక్టీస్ ఆరంభించడం విశేషం. (ఐపీఎల్ కొత్త టైటిల్ స్పాన్సర్ ఎవరు?) ఇదే విషయాన్ని జార్ఖండ్ క్రికెట్ అసోసియేషన్ పేర్కొంది. 'గత వారం జేఎస్సీఏ ఇంటర్నేషనల్ స్టేడియం కాంప్లెక్స్కు మహీ వచ్చాడు. ఇండోర్ స్టేడియంలో బౌలింగ్ మెషిన్ను ఉపయోగించి బ్యాటింగ్ సాధన చేశాడు. ఎంఎస్ ధోని ప్రణాళికలు ఏమిటో, అతను ప్రాక్టీస్ కోసం మళ్లీ ఇక్కడికి వస్తాడో లేదో తెలియదు. సాధన కోసం ఇక్కడి రావడంతోనే ఆ విషయం మాకు తెలిసింది. గత వారాంతంలో రెండు రోజులు బ్యాటింగ్ ప్రాక్టీస్ చేసాడు కాని అప్పటి నుండి మరలా ఇక్కడికి రాలేదు. అయితే ప్రాక్టీస్ కోసం ఇక్కడ సదుపాయాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవడానికి వచ్చాడు కావొచ్చు' అని ఒక అధికారి పేర్కొన్నారు. (పొరపాటున యువరాజ్ను గాయపర్చాను : అక్తర్) యూఏఈ వేదికగా ఐపీఎల్ 2020 సెప్టెంబర్ 19 నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో అన్ని జట్లు ఆగస్టు 20న అక్కడికి పయనం కానున్నాయి. మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ గత మార్చిలో చెన్నై సూపర్ కింగ్స్ నిర్వహించిన శిక్షణా శిబిరంలో సాధన చేశాడు. ప్రాక్టీస్ సమయంలో భారీ సిక్సర్లు కూడా బాదాడు. మహీని చూడడానికి చిదంబరం మైదానంకు భారీ స్థాయిలో అభిమానులు క్యూ కట్టారు. అయితే కరోనా వైరస్ ముంచుకురావడంతో తిరిగి రాంచీకి వెళ్ళిపోయాడు. ఇక ఐపీఎల్ లీగ్ ఆరంభం నుంచి చెన్నై సూపర్కింగ్స్కు కెప్టెన్గా వ్యవహరించిన ధోని విజయవంతమైన కెప్టెన్గా నిలిచాడు. చెన్నై జట్టుకు మూడూ ఐపీఎల్ టైటిళ్లు(2010, 2011,2018) సాధించిపెట్టి కెప్టెన్గా తన ప్రత్యేకతను చాటుకున్నాడు. (‘ధోని ఏమిటో మీరే చూస్తారు కదా’) -
బతికున్న మనిషిని చంపేశారు.. కానీ
రాంచీ : కరెంట్ షాక్కు గురైన వ్యక్తిని కమ్యూనిటీ హెల్త్ సెంటర్కు తీసుకురాగా అక్కడి వైద్యులు అతన్ని పరీక్షించి చనిపోయాడని నిర్థారించారు. దీంతో మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. ఆ వ్యక్తికి పోస్టుమార్టం నిర్వహిస్తుండగా అతను బతికే ఉన్నట్లు తెలియడంతో ఆశ్చర్యానికి లోనయ్యారు. ఈ వింత ఘటన జార్ఖండ్ రాజధాని రాంచీలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. లోహర్దాగా జిల్లాకు చెందిన వ్యక్తి మంగళవారం కరెంట్ షాక్కు గురవ్వడంతో రాంచీలోని చానాహో కమ్యూనిటీ హెల్త్ సెంటర్కు తరలించారు. అక్కడి వైద్యులు ఆ వ్యక్తిని పరీక్షించి చనిపోయాడని నిర్థారించారు. పోస్టుమార్టం కొరకు రాజేంద్ర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్కు సిఫార్సు చేశారు. కాగా రిమ్స్ అధికారులు వ్యక్తి శరీరానికి పోస్టుమార్టం నిర్వహిస్తుండగా అతను బతికే ఉన్నట్లు తెలిసింది. దీంతో వెంటనే అతన్ని ఎమర్జెన్సీ వార్డుకి తరలించారు. అయితే ఆ తర్వాత అతడికి చికిత్స అందిస్తున్న సమయంలో చనిపోవడం గమనార్హం. ఈ ఘటనపై జార్ఖండ్ ఆరోగ్య శాఖ మంత్రి బన్నా గుప్తా సీరియస్ అయ్యారు. బతికున్న మనిషిని చచ్చిపోయాడంటూ తప్పుడు రిపోర్టు ఇచ్చిన చానాహో కమ్యూనిటీ హెల్త్ సెంటర్పై సీరియస్ యాక్షన్ తీసుకోనున్నట్లు తెలిపారు. -
ధోని ‘ఆట’ ముగిసింది!
చెన్నై: ఐపీఎల్లో వీరాభిమానుల గురించి చెప్పాల్సి వస్తే ముందు వరుసలో చెన్నై సూపర్ కింగ్స్ ఫ్యాన్సే ఉంటారు. ఐపీఎల్ సన్నాహాల్లో భాగంగా ఇటీవల చెన్నై సూపర్ కింగ్స్ సాధన చేస్తుంటే జనం విరగబడి వచ్చారు. ఒక మ్యాచ్కు వచ్చినట్లుగా తలపించే రీతిలో ప్రాక్టీస్ సెషన్లకు ప్రేక్షకులు కనిపించారు. ఇదంతా తమ ఆరాధ్య ఆటగాడు ధోని కోసమే! గత ఏడాది జులైలో ప్రపంచకప్ ముగిసిన తర్వాత మళ్లీ మ్యాచ్ ఆడని ధోని ఐపీఎల్లో బరిలోకి దిగుతుండటంతో వారిలో ఉత్సాహం రెట్టింపయింది. ఐపీఎల్లో మెరుపులకు ముందు ప్రత్యక్షంగా ధోని బ్యాటింగ్ను చూసేందుకు తరలి వచ్చారు. అయితే ఇప్పుడు తాజా పరిణామాల నేపథ్యంలో ధోని సాధన ముగిసింది. ఐపీఎల్ ఎప్పుడు జరుగుతుందో తెలియని స్థితిలో ఫ్రాంచైజీ తమ సన్నాహాలను నిలిపివేసింది. దాంతో ధోని కూడా ఆదివారం రాంచీకి బయల్దేరాడు. ధోనికి వీడ్కోలు చెబుతున్నట్లుగా ఫ్రాంచైజీ వీడియో పోస్ట్ చేసింది. అన్నట్లు ధోని భవిష్యత్తు, ప్రపంచ కప్ జట్టులో చోటు వంటివి ఐపీఎల్ ప్రదర్శనతో ముడిపడి ఉన్నాయని గత కొంతకాలంగా కోచ్, సెలక్టర్లు పదే పదే చెబుతూ వచ్చారు. మరి ఐపీఎల్ జరగకపోతే ధోని ఫామ్ను, ప్రదర్శనను ఎలా అంచనా వేస్తారో! -
మహిళను చంపి, ఏం దొంగిలించారంటే?..
రాంచీ : మహిళను దారుణంగా హత్య చేసి, వాటర్ కూలర్ దొంగిలించిన ఘటనలో పోలీసులు పురోగతి సాధించారు. 2019 సెప్టెంబర్లో జరిగిన ఈ హత్యకు సంబంధించి ఇద్దరు వ్యక్తుల్ని అరెస్ట్ చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు వారినుంచి పలు కీలకమైన విషయాలను రాబట్టారు. వివరాల్లోకి వెళితే.. 2019 సెప్టెంబర్లో బీహార్కు చెందిన రాజేంద్ర శర్మ, అతడి కుమారుడు అమిర్ శర్మలు మరో ఆరుగురు వ్యక్తులతో కలిసి దొంగతనానికి వెళ్లారు. అర్థరాత్రి సమయంలో రామ్ఘర్లోని కమలేశ్ కౌర్ అనే మహిళ ఇంట్లోకి చొరబడ్డారు. నిద్రలో ఉన్న ఆమెను గొంతు నులిమి చంపారు. ఆ తర్వాత పక్కగదులో నిద్రిస్తున్న కమలేశ్ కౌర్ కోడలి మీద కూడా దాడి చేయటానికి ప్రయత్నించారు. పక్కనే ఉన్న కమలేశ్ కౌర్ కుమారుడు వెంటనే మేల్కొవటంతో దుండగులు అక్కడినుంచి పరుగులు పెట్టారు. పారిపోతున్న సమయంలో ఇంట్లోని వాటర్ కూలర్ను ఎత్తుకెళ్లారు. కానీ, దాన్ని మోయలేక ఇంటికి 100మీటర్ల దూరంలో వదిలేసి వెళ్లిపోయారు. కౌర్ కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు కొద్ది నెలల గాలింపు అనంతరం ఇద్దరు వ్యక్తుల్ని అరెస్ట్ చేశారు.