
‘బీజేపీయేతర పార్టీలు ఏకం కావాలి’
పట్నా: దేశవ్యాప్తంగా బీజేపీయేతర పార్టీలన్నీ కూటమిగా మారి 2019 లోక్సభ ఎన్నికల్లో బరిలోకి దిగేందుకు ముందుకురావాలని రాష్ట్రీయ జనతా దళ్ పార్టీ అధ్యక్షుడు లాలుప్రసాద్ యాదవ్ పిలుపునిచ్చారు.
మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ‘హిందుత్వ’ఎజెండాతో దూకుడు మీదున్న మోదీని నిలువరించడానికి ఐక్యం కావాలని సూచించారు. మహా కూటమి ఏర్పాటు గురించి బిహార్ సీఎం నితీశ్ కుమార్ తో కూడా చర్చించినట్టు చెప్పారు.