‘మోదీ రూ. 25 కోట్ల లంచం తీసుకున్నారు’ | Modi took Rs 25 cr bribe from Aditya Birla group | Sakshi
Sakshi News home page

‘మోదీ రూ. 25 కోట్ల లంచం తీసుకున్నారు’

Nov 15 2016 8:20 PM | Updated on Aug 15 2018 6:32 PM

‘మోదీ రూ. 25 కోట్ల లంచం తీసుకున్నారు’ - Sakshi

‘మోదీ రూ. 25 కోట్ల లంచం తీసుకున్నారు’

పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీపై ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ మరోసారి విమర్శలు గుప్పించారు.

న్యూఢిల్లీ: పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీపై ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ మరోసారి విమర్శలు గుప్పించారు. ప్రధాని మోదీ పేర్కొన్నట్టు పెద్దనోట్ల రద్దు పేదలకు కడఖ్‌ చాయ్‌ కాదని, అది వారికి విషప్రాయమని చెప్పుకొచ్చారు. మోదీ పేదలను దోచుకొని, తన కార్పొరేట్‌ స్నేహితులను కాపాడుకుంటున్నారని, వ్యాపారవేత్తలు ఆయనకు ముడుపులు ఇస్తుండగా.. వారి ఇళ్లమీద ఐటీదాడులు జరగకుండా మోదీ చూస్తున్నారని విమర్శించారు.

పెద్దనోట్ల రద్దు వల్ల ప్రజలు పడుతున్న కష్టాలపై చర్చించేందుకు ప్రత్యేకంగా మంగళవారం నిర్వహించిన ఢిల్లీ అసెంబ్లీ సమావేశాల్లో కేజ్రీవాల్‌ మాట్లాడారు. మోదీ గుజరాత్‌ సీఎంగా ఉన్నప్పుడు ఆదిత్య బిర్లా గ్రూప్‌ నుంచి రూ. 25 కోట్లు లంచం తీసుకున్నారని కేజ్రీవాల్‌ తీవ్ర ఆరోపణలు చేశారు. ‘2013 అక్టోబర్‌లో అప్పటి ఆదిత్య బిర్లా గ్రూప్‌ అధ్యక్షుడిగా ఉన్న శుబేందు అమితాబ్‌పై ఐటీ దాడులు నిర్వహించింది. ఆయన లాప్‌టాప్‌లు, బ్లాక్‌బెర్రీ ఫోన్లు స్వాధీనం చేసుకుంది. వాటిని పరిశీలించగా 2012 నవంబర్‌ 16న గుజరాత్‌ సీఎంకు రూ. 25 కోట్లు చెల్లించినట్టు ల్యాప్‌టాప్‌లో వివరాలు ఉన్నాయి’ అని కేజ్రీవాల్‌ పేర్కొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement