
పీసీలకు ట్యాబ్లెట్లు ప్రత్యామ్నాయం కాదు
పర్సనల్ కంప్యూటర్ల(డెస్క్టాప్, ల్యాప్టాప్)కు ట్యాబ్లెట్ ఇప్పుడప్పుడే ప్రత్యామ్నాయం కాదని సైబర్మీడియారీసెర్చ్(సీఎంఆర్) సర్వేలో తేలింది.
- ట్యాబ్లెట్ ప్రధాన కంప్యూటర్ డివైస్గా మారేందుకు సమయం పడుతుందని 78%మంది పేర్కొన్నారు.
- ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారిత ట్యాబ్లెట్లకు ప్రాధాన్యత ఇస్తామని 87% మంది అన్నారు.
- రోజుకు రెండు గంటలకు పైగా ట్యాబ్లెట్ను ఉపయోగించే వారి సంఖ్య 51 శాతంగా ఉంది. ఈ సమయం భవిష్యత్తులో పెరగే అవకాశాలున్నాయి.
- చాటింగ్, మెసేజింగ్, ఇమెయిల్ సర్వీసుల కోసం ఒక్క రోజులో ట్యాబ్లెట్ను పలుమార్లు ఉపయోగించే వారు 40 శాతంగా ఉన్నారు.