రిటైర్డ్ కేంద్ర ప్రభుత్వోద్యోగుల ‘పెన్షన్ల’పై పైలట్ ప్రాజెక్టు | Test project for retd government employees to track pension details | Sakshi
Sakshi News home page

రిటైర్డ్ కేంద్ర ప్రభుత్వోద్యోగుల ‘పెన్షన్ల’పై పైలట్ ప్రాజెక్టు

Published Sat, Feb 15 2014 3:10 AM | Last Updated on Sat, Sep 2 2017 3:42 AM

రిటైరైన కేంద్ర ప్రభుత్వోద్యోగులకు వారి పెన్షన్ మంజూరు ప్రక్రియలో పురోగతి గురించి తెలియజేసే సరికొత్త విధానాన్ని కేంద్రం పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించింది.

న్యూఢిల్లీ: రిటైరైన కేంద్ర ప్రభుత్వోద్యోగులకు వారి పెన్షన్ మంజూరు ప్రక్రియలో పురోగతి గురించి తెలియజేసే సరికొత్త విధానాన్ని కేంద్రం పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించింది. పెన్షన్ మంజూరు సమాచారాన్ని ఎస్‌ఎంఎస్ , ఈ మెయిల్ ద్వారా తెలిపే వెబ్ ఆధారిత పెన్షన్ మంజూరు, చెల్లింపు పర్యవేక్షణ వ్యవస్థను 15 కేంద్ర మంత్రిత్వశాఖల్లో చేపట్టింది. దీన్ని పూర్తిస్థాయిలో అమలు చేసేటప్పుడు ‘భవిష్య’గా పిలవనున్నారు. ఈ విధానంలో పెన్షనర్ల వ్యక్తిగత సమాచారంతోపాటు వారి మొబైల్ నంబర్, ఈ మెయిల్ వంటి వివరాలను సేకరించి పెన్షన్ మంజూరు ప్రక్రియ సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలియజేస్తారు.
 
 
  ప్రభుత్వశాఖల్లో పెన్షన్ల మంజూరు, రిటైర్మెంట్ ప్రయోజనాల చెల్లింపులో జాప్యాన్ని గుర్తించడంలో ఈ చర్య దోహదపడనుంది. ప్రస్తుతం పైలట్ ప్రాజెక్టు విధానాన్ని కేంద్ర హోం, ఐటీ, గణాంక, ఉక్కు, ఆరోగ్య, పట్టణాభివృద్ధి, జౌళి, వాణిజ్యం, సిబ్బంది శిక్షణ వ్యవహారాల వంటి 15 శాఖలతోపాటు ప్రణాళికా సంఘం వంటి విభాగాల్లో చేపట్టింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement