
నేడు ‘సాక్షి-ఎరీనా వన్’ యూత్ఫెస్ట్ ప్రారంభం
‘సాక్షి-ఎరీనా వన్’ యూత్ఫెస్ట్ శుక్రవారం నగరంలో ప్రారంభం కానుంది.
సాక్షి, హైదరాబాద్: ‘సాక్షి-ఎరీనా వన్’ యూత్ఫెస్ట్ శుక్రవారం నగరంలో ప్రారంభం కానుంది. హైదరాబాద్ గండిపేటలోని సీబీఐటీ కళాశాల ఇందుకు వేదిక కానుంది. అసోసియేటెడ్ స్పాన్సర్ ‘బజాజ్ పల్సర్ ఇండియా నంబర్ 1 బైక్’ సౌజన్యంతో మధ్యాహ్నం ఒంటి గంటకు ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. తొలిరోజు ‘బాటిల్ ఆఫ్ బ్యాండ్స్ అండ్ ఇన్స్ట్రుమెంట్ సోలో’ అంశంపై పోటీలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి అందరూ హాజరుకావచ్చు. మిగిలిన అంశాల్లో నిర్వహించే పోటీల వివరాలను ‘సాక్షి ఎరీనా వన్’ యాప్ ద్వారా త్వరలో వెల్లడించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.