
కోలీవుడ్ స్టార్ కమెడియన్లలో వివేక్ పేరు ముందుటుంది.

స్టార్ హీరోల సినిమాల్లో తనదైన కామెడీ టైమింగ్తో అభిమానులను అలరించారు.

1987లో మనథిల్ ఉత్తమ్ వే చిత్రంతో అరంగేట్రం చేసిన వివేక్.. ప్రశాంత్, విజయ్, అజిత్, మాధవన్ హీరోలతో కలిసి పనిచేశారు.

అయితే కరోనా టైమ్లో ఊహించని విధంగా ఆయన ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు.

అయితే వివేక్ రెండో తరగతిలో ఉన్నప్పుడే అప్పటి ప్రధానికి లేఖ రాశారట.

నవంబర్ 19న అప్పటి పీఎం ఇందిరా గాంధీకి పుట్టినరోజు విషెల్ చెబుతూ లేఖ పంపారట.

అదే రోజు వివేక్ బర్త్ డే కూడా కావడంతో తనకు విషెస్ చెప్పాలని లేఖలో ప్రస్తావించారట.

ఆ తర్వాత ఇందిరా గాంధీ సైతం అతని లేఖకు ప్రత్యుత్తరం కూడా పంపిందట.

