vivek
-
ప్రముఖ హాస్యనటుడి గుర్తుగా మొక్కలు నాటిన హీరో
తమిళసినిమా మరిచిపోలేని నటుల్లో హాస్యనటుడు వివేక్ పేరు కచ్చితంగా చోటు చేసుకుంటుంది. తెలుగు చిత్రపరిశ్రమలో కూడా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. కాగా ఆయన మూడో సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని నటుడు వైభవ్ షూటింగ్ స్పాట్లో మొక్కలను నాటారు. నటుడు వైభవ్ కథానాయకుడిగా తన 27వ చిత్రంలో నటిస్తున్నారు. ఆయనతోపాటు సెల్మురుగన్ నటిస్తున్నారు. వైవిధ్య భరిత కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ స్థానిక తరమణిలోని ఎంజీఆర్ ఫిలిం ఇన్స్టిట్యూట్లో నిర్వహిస్తున్నారు. కాగా దివంగత హాస్యనటుడు వివేక్ అబ్దుల్ కలాంను మార్గదర్శిగా తీసుకుని గ్లోబల్ వార్మింగ్ను తగ్గించే ప్రయత్నంలో తమిళనాడులో వేలాది మొక్కలను నాటిన విషయం తెలిసిందే. కాగా నటుడు వివేక్ మూడో సంస్మరణ దినం సందర్భంగా ఆయన్ని గౌరవించేలా నటుడు వైభవ్తో పాటు ఇతర చిత్ర యూనిట్ సభ్యులు, ఎంజీఆర్ ఫిలిం ఇన్స్టిట్యూట్ విద్యార్థులు కలిసి 100 మొక్కలను నాటినట్లు యూనిట్ వర్గాలు మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. -
Actor Vivek Daughter Marriage: దివంగత కమెడియన్ వివేక్ కూతురి పెళ్లి (ఫొటోలు)
-
కమెడియన్ వివేక్ కూతురి పెళ్లి.. తండ్రి బాటలో తేజస్విని
కోలీవుడ్ దివంగత ప్రముఖ హాస్యనటుడు వివేక్ కుటుంబంలో శుభకార్యం జరిగింది. ఆయన కూతురు పెళ్లి చెన్నైలోని తన నివాసంలో జరిగింది. ఈ కార్యక్రమం అతికొద్దిమంది సమక్షంలో జరిగింది. 2021 ఏప్రిల్లో గుండెపోటుతో వివేక్ మరణించిన విషయం తెలిసిందే. దాదాపు 300లకు పైగా చిత్రాల్లో నటించిన వివేక్. కోలీవుడ్కు చెందిన స్టార్ హీరోలు రజనీకాంత్, సూర్య, అజిత్ చిత్రాల్లో హాస్యనటుడిగా మెప్పించారు. శివాజీ, సింగం, సింగం-2, విశ్వాసం,రఘువరన్ బీటెక్ చిత్రాలతో వివేక్ తెలుగువారికి కూడా సుపరిచితులయ్యారు. మార్చి 28 వివేక్ కూతురు తేజస్విని ఏడు అడుగుల బంధంలోకి అడుగుపెట్టింది. భరత్ అనే యువకుడితో ఆమె వివాహం జరిగింది. చెన్నైలోని విరుగంబాక్కం వద్ద పద్మావతి నగర్లో ఉన్న వివేక్ నివాసంలోనే తేజస్విని వివాహం జరిగింది. ఈ పెళ్లి వేడుకలో ఇరు కుటుంబాలకు చెందిన అతికొద్ది సన్నిహితుల సమక్షంలో చాలా సింపుల్గా జరిగింది. తండ్రి బాటలో తేజస్విని వివేక్కు మొక్కలంటే చాలా ఇష్టం.. దివంగత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారిని ఆదర్శంగా తీసుకున్న వివేక్.. చెన్నై నగర వ్యాప్తంగా లక్షల సంఖ్యలో మొక్కల నాటాడు. తన తండ్రికి ఇష్టమైన కార్యక్రమాన్ని ఇప్పుడు తేజస్విని కూడా కొనసాగిస్తుంది. తన తండ్రి కోరికను నిలబెడుతూ.. తన వంతుగా ప్రకృతిని కాపాడేందుకు మొక్కలు నాటినట్టు ఆవిడ తెలిపారు. అందులో భాగంగా వారి వివాహానికి హాజరైన అతిథిలకు తేజస్విని దంపతులిద్దరూ మొక్కలను పంపిణీ చేశారు. అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. తేజస్విని చేస్తున్న పనికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. -
బ్లాక్ బస్టర్ మూవీ.. దాదాపు 22 ఏళ్ల తర్వాత వస్తోంది!
కోలీవుడ్లో మరచిపోలేని చిత్రాల్లో అళగి ఒకటని చెప్పుకోవచ్చు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ తంగర్ బచ్చన్ తెరకెక్కించిన తొలి చిత్రం ఇదే. ఆయన జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. హృదయాలను హత్తుకునే కథా, కథనాలు ఈ చిత్రానికి హైలెట్గా నిలుస్తాయి. నటుడు పార్తీపన్, నందితాదాస్, దేవయాని ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని ఉదయగీత సినీ క్రియేషన్స్ పతాకంపై ఉదయకుమార్ నిర్మించారు. ఈ చిత్రానికి ఇళయరాజా సంగీతం అందించారు. 2002లో విడుదలైన ఈ వైవిధ్యభరిత ప్రేమకథా చిత్రం అప్పుట్లో సంచలన విజయాన్ని సాధించింది. ఇంకా చెప్పాలంటే కమలహాసన్ నటించిన పంబల్ కే.సంబంధం, అజిత్ హీరోగా నటించిన రెడ్ వంటి భారీ చిత్రాల మధ్య విడుదలైన అళగి చిత్రం అన్నింటికంటే పెద్ద విజయం సాధించింది. ఇళయరాజా సంగీత బాణీలు సంగీత ప్రియులను అలరించాయి. తీరం దాటని పాఠశాల ప్రేమకథా చిత్రంగా అళగి తెరకెక్కింది. ఈ తరం ప్రేమకథా చిత్రాలకు పూర్తి భిన్నంగా అందమైన ప్రేమకథా చిత్రంగా తెరకెక్కిన చిత్రం అళగి. ఈ తరం యువతకు అందించాలనే ఉద్దేశంతో అళగి చిత్రాన్ని 22 ఏళ్ల తరువాత మళ్లీ ఆధునిక డిజిటల్ టెక్నాలజీతో కొత్త హంగులు అద్ది.. ఈ నెల 29వ తేదీన విడుదల చేయనున్నట్లు నిర్మాత ఉదయకుమార్ తెలిపారు. ఈ చిత్ర ప్రమోషన్ కార్యక్రమంలో ప్రముఖ నటీనటులందరూ పాల్గొంటారని ఆయన చెప్పారు. ఈ తరం యువత చూడాల్సిన కథా చిత్రం అళగి అని పేర్కొన్నారు. ఈ చిత్రాన్ని రీ రిలీజ్ చేయడాన్ని దర్శకుడు తంగర్బచ్చన్ సంతోషం వ్యక్తం చేశారన్నారు. దీనికి ఆయన సహకారం చాలా ఉందని చెప్పారు. ఇకపోతే అళగి చిత్రానికి సీక్వెల్ను కూడా చేసే ఆలోచన ఉందని నిర్మాత ఉదయకుమార్ చెప్పారు. -
అమ్మా, నాన్న ఆనంద విహారం
ఇన్స్టాగ్రామ్ యూజర్ వివేక్ వాఘ్ సర్ప్రైజ్ ట్రావెల్ ప్లాన్తో తల్లిదండ్రులను ఆశ్చర్యానందాలకు గురి చేశాడు. ‘ఫ్లైయిట్లో మనం జైపూర్కు వెళుతున్నాం’ అని చెప్పి తల్లిదండ్రులను ఎయిర్పోర్ట్కు తీసుకెళ్లాడు. పాస్పోర్ట్లను వారి చేతికి అందిస్తూ ఆఖరులో అసలు విషయం చెప్పాడు. తాము వెళుతున్నది జైపూర్ కాదని సింగపూర్కు అని తెలుసుకున్న వివేక్ తల్లిదండ్రులు ఆనందంలో మునిగిపోయారు. ఇది వారికి తొలి అంతర్జాతీయ ప్రయాణం. ‘సీ దెయిర్ రియాక్షన్... సర్ప్రైజ్ ట్రిప్’ కాప్షన్తో పోస్ట్ చేసిన ఈ వీడియో మూడు లక్షలకు పైగా వ్యూస్ను సొంతం చేసుకుంది. సోషల్ మీడియా యూజర్లు, సెలబ్రిటీలు ఈ వీడియోను చూసి ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. యాక్టర్ జై భానుశాలి ‘ప్రౌడ్ సన్. విషయం తెలిసిన తరువాత మీ తండ్రి ఇచ్చిన ఎక్స్ప్రెషన్ నాకు ఎంతగానో నచ్చింది. మా అబ్బాయి మమ్మల్ని సింగపూర్ తీసుకువెళ్లాడు అని ఆయన గర్వంగా స్నేహితులతో చెప్పుకోవచ్చు’ అని కామెంట్ పెట్టారు. -
పెళ్లైన గంటల్లోనే భార్యపై దాడి.. వివేక్ బింద్రాపై గృహహింస కేసు
ప్రముఖ మోటివేషనల్ స్పీకర్, సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ వివేక్ బింద్రాపై కేసు నమోదైంది. పెళ్లైన కొన్ని గంటలకే భార్యను వేధింపులకు గురిచేయడంతో పోలీసులు వివేక్ బింద్రాపై గృహహింస చట్టం కింద కేసు నమోదు చేశారు. వివరాలు.. వివేక్ బింద్రాకు యానిక అనే మహిళతో డిసెంబర్ 6న వివాహం జరిగింది. వీరు నోయిడాలోని సెక్టర్ 94 సూపర్ నోవా రెసిడెన్సీలో నివాసం ఉంటున్నారు. డిసెంబర్ 7 తెల్లవారుజామున, బింద్రా అతని తల్లి ప్రభ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. గొడవను ఆపేందుకు ఆయన భార్య యానికా ప్రయత్నించడంతో బింద్రా ఆమెపై దాడికి దిగాడు. యానిక శరీరంపై పలుచోట్ల గాయాలు కాగా ప్రస్తుతం ఆమె ఢిల్లీలోని ఓ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతోంది. ఈ విషయంపై బాధితురాలు సోదరుడు వైభవ్ క్వాత్రా నోయిడాలోని సెక్టర్ 126 పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అంతేగాక వివాహం జరిగిన కొన్ని గంటలకే, బింద్రా యానికను ఒక గదిలోకి తీసుకెళ్లి, ఆమెపై అసభ్యపదజాలంతో దూషించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆమె జుట్టును లాగి, దాడి చేసినట్లు తెలిపారు. యానికా చెవికి గాయం అవ్వడంతో వినికిడి సమస్య ఏర్పడినట్లు వెల్లడించారు. బింద్రా ఆమె ఫోన్ను కూడా పగలగొట్టినట్లు చెప్పారు. దీనిపై నోయిడా పోలీసులు విచారణ ప్రారంభించారు. అయితే ప్రస్తుతం బింద్రా పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఇక దేశంతో పేరు ప్రఖ్యాతలు సాధించినమోటివేషనల్ స్పీకర్ వివేక్ బింద్రా.. బడా బిజినెస్ ప్రైవేట్ లిమిటెడ్ (బీబీపీఎల్) సీఈవో కూడా. అతనికి యూట్యూబ్, ఇన్స్టాలో లక్షల్లో ఫాలోవర్స్ ఉన్నారు. చదవండి: వికటించిన క్రిస్మస్ డిన్నర్.. 700 మందికి అస్వస్థత -
ఈటల భూముల కోసమే రూ. 27 కోట్లు ఇచ్చా
భీమారం: బీజేపీ నేత ఈటల రాజేందర్ భూముల కోసమే రూ. 27 కోట్లు చెక్కుల రూపంలో ఇచ్చానని, ఆ భూముల వ్యవహారంలో తనకు నోటీసులు ఇచ్చిన ఐటీ అధికారులు... ఆయనకు ఎందుకు ఇవ్వలేదని చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థి, మాజీ ఎంపీ గడ్డం వివేక్ ప్రశ్నించారు. బీజేపీలో ఉన్నాడనే ఉద్దేశంతోనే ఈటలకు నోటీసులు కూడా ఇవ్వడం లేదా అని నిలదీశారు. గురువారం మంచిర్యాల జిల్లా భీమారం మండలం కొత్తపల్లి గ్రామంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న వివేక్... బీఆర్ఎస్తోపాటు కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బీజేపీలో ఉన్నప్పుడు తనను సీతలా చూసిన ఆ పార్టీ నేతలు... కాంగ్రెస్లో చేరాక రావణుడిలా చూస్తున్నారన్నారు. చెన్నూరు బీఆర్ఎస్ అభ్యర్థి బాల్క సుమన్ ఓటమి భయంతోనే సీఎం కేసీఆర్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు చెప్పి తనపై కేంద్ర సంస్థలతో దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు. గతంలో హుజూరాబాద్, మునుగోడులో బీజేపీ అభ్యర్థుల గెలుపు కోసం తాను అహర్నిశలు కృషి చేశానని చెప్పారు. బాల్క సుమన్ ఫిర్యాదుతో ఐటీ అధికారులు 8 చోట్ల సోదాలు నిర్వహించి దాదాపు 12 గంటలపాటు తాను ప్రచారానికి వెళ్లకుండా అడ్డుకున్నారని వివేక్ ఆరోపించారు. ఆ కంపెనీ నా మిత్రుడిదే... తాను నిజాయతీతో వ్యాపారం చేస్తున్నానని, ఇప్పటివరకు రూ. 10 వేల కోట్ల మేర పన్నులు చెల్లించా నని వివేక్ వివరించారు. 2014 ఎన్నికల్లో ముఖ్యమంత్రి కేసీఆర్కు కూడా ఆర్థిక సాయం చేశానని, అలాంటిది తనపై దాడులు చేయించారన్నారు. కేసీ ఆర్కు దమ్ముంటే ఈ ఎన్నికల్లో గెలవాలని సవాల్ విసిరారు. తప్పుడు ఆరోపణలతో బీజేపీ, బీఆర్ఎస్ కలసి తనను అరెస్టు చేయాలని కుట్ర చేస్తున్నా యని వివేక్ ఆరోపించారు. రూ. 20 లక్షల కంపెనీ రూ. 200 కోట్ల మేర లావాదేవీలు చేసిందని అంటున్నారని, కానీ ఆ కంపెనీ తన మిత్రుడికి చెందినదని వివేక్ తెలిపారు. చట్ట నిబంధనల ప్రకారమే తాను ఆ కంపెనీని చూసుకుంటున్నానని చెప్పారు. ఇటీవలే ఆ కంపెనీ షేర్లు అమ్మితే రూ. 50 కోట్ల లాభం వచ్చిందని, అందులో రూ. 9 కోట్లను పన్నుగా చెల్లించామని వివేక్ వివరించారు. -
చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ ఇంట్లో సోదాలపై ఈడీ ప్రకటన
సాక్షి, హైదరాబాద్: మాజీ ఎంపీ, కాంగ్రెస్ చెన్నూరు నియోజకవర్గ అభ్యర్థి వివేక్ ఇంట్లో సోదాలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ప్రకటన విడుదల చేశారు. మొత్తం రూ. 200 కోట్ల అక్రమ లావాదేవీలను జరిపినట్లు ఈడీ అధికారులు గుర్తించారు. యాశ్వంత్ రియాలిటీతో పాటు గడ్డం వివేక్ భార్య పేరిట కూడా భారీగా అక్రమ లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు. విజిలెన్స్ సెక్యూరిటీ పేరుతో పెద్దఎత్తున అక్రమాలు జరిగినట్లు గుర్తించిన అధికారులు ఫెమా చట్టం కింద మాజీ ఎంపీ వివేక్పై కేసు నమోదు చేశారు. విజిలెన్స్ సెక్యూరిటీ ద్వారా ఎలాంటి వ్యాపారం లేకపోయినా పెద్దఎత్తున లావాదేవీలు జరిగినట్లు అధికారులు తెలిపారు. నకిలీ పత్రాలతో ఆస్తులను కొనుగోలు.. విజిలెన్స్ సెక్యూరిటీ పేరుతో ఇప్పటి వరకూ 20 లక్షల ఆదాయపు పన్ను మాత్రమే చెల్లించినట్లు పేర్కొన్నారు. కాగా డైరెక్టరేట్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ తెలంగాణలోని నాలుగు ప్రదేశాలలో ఫారిన్ ఎక్స్ఛెంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ (FEMA) నిబంధనల ప్రకారం సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. హైదరాబాద్లోని డాక్టర్ గడ్డం వివేకానంద నివాసంతోపాటు హైదరాబాద్లోని విశాఖ ఇండస్ట్రీస్ లిమిటెడ్, విజిలెన్స్ సెక్యూరిటీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ కార్యాలయాల్లో ఈ తనిఖీలు జరిగాయి. రామగుండంలో లిమిటెడ్. హైటెక్ సిటీ, మంచిర్యాలలో ఆయన నివాసం ఉంటున్న తాత్కాలిక స్థలంలో కూడా సోదాలు నిర్వహించారు. తెలంగాణ పోలీసుల సూచన మేరకు ఈడీ దర్యాప్తు ప్రారంభించి రూ. 8 కోట్లు డాక్టర్ జి. వివేక్ బ్యాంక్ ఖాతా నుండి M/s విజిలెన్స్ సెక్యూరిటీకి RTGS చేశారు ఈడీ దర్యాప్తులో విజిలెన్స్ సెక్యూరిటీ బ్యాంక్ ఖాతా నుంచి హేతుబద్ధత లేకుండా డబ్బును సర్క్యుటస్గా బదిలీ చేసినట్లు అధికారులు గుర్తించారు. వివేక్, అతని భార్య వారి సంస్థ విశాఖ ఇండస్ట్రీస్లో విజిలెన్స్ సెక్యూరిటీతో 100 కోట్లు పెట్టబడి పెట్టినట్లు, విజిలెన్స్ సెక్యూరిటీపై వివేక్కు పరోక్ష నియంత్రణ ఉన్నట్లు వెల్లడైంది. విజిలెన్స్ సెక్యూరిటీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా FEMA ఉల్లంఘనలు, పన్ను ఎగవేతలు జరిగినట్లు ప్రాథమికంగా గుర్తించారు. లెక్కలోని అనేక కోట్ల లావాదేవీలు గుర్తించారు. పలు డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. దీనిపై తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని అధికారులు చెప్పారు. -
కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ ఇంట్లో ఐటీ సోదాలు
సాక్షి, మంచిర్యాల: చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ వెంకటస్వామి ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు చేపట్టారు. హైదరాబాద్, మంచిర్యాలలోని వివేక్ ఇళ్లలో ఏకకాలంలో ఐటీ అధికారులు సోదాలు కొనసాగుతున్నాయి. వివేక్ ఇంటితో పాటు ఆయనకు సంబంధించిన కంపెనీలు, అతని ముఖ్య అనుచరులు, బంధువుల ఇళ్లలోనూ ఐటీ దాడులు నిర్వహిస్తున్నారు. ఇటీవల వివేక్కు సంబంధించిన విశాఖ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఖాతా నుంచి విజిలెన్స్ సెక్యూరిటీ సర్విసెస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఖాతాలోకి బదిలీ అయిన రూ.8 కోట్లు సైఫాబాద్ పోలీసులు ఫ్రీజ్ చేసిన సంగతి తెలిసిందే. సోమాజీగూడలోని వివేక్ నివాసంలో ఐటీ సోదాలు ముగిశాయి. నాలుగున్నర గంటలపాటు తనిఖీలు నిర్వహించారు. ఈ నెల 13న ఫ్రీజ్ చేసిన నగదుపై ఐటీ అధికారులు ఆరా తీశారు. కాగా, మంచిర్యాలోని వివేక్ ఇంట్లో సోదాలు కొనసాగుతున్నాయి. చదవండి: తనిఖీల జప్తులో తెలంగాణ టాప్.. ఏకంగా 659 కోట్ల స్వాధీనం -
విశాక ఇండస్ట్రీస్కు చెందిన రూ.8 కోట్లు ఫ్రీజ్!
సాక్షి, హైదరాబాద్: చెన్నూరు నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వివేక్కు సంబంధించిన విశాక ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఖాతా నుంచి విజిలెన్స్ సెక్యూరిటీ సర్విసెస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఖాతాలోకి బదిలీ అయిన రూ.8 కోట్లు సైఫాబాద్ పోలీసులు ఫ్రీజ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) ఆదేశాల మేరకు నగర పోలీసు ఉన్నతాధికారుల సూచనలతో ఈ చర్య తీసుకున్నట్లు మధ్య మండల డీసీపీ వెంకటేశ్వర్లు ఆదివారం వెల్లడించారు. గత సోమవారం జరిగిన ఈ వ్యవహారంపై ఆ నియోజకవర్గ సిట్టింగ్ ఎమ్మెల్యే బాల్క సుమన్ బుధవారం సీఈఓకు ఫిర్యాదు చేశారు. ఈ విజిలెన్స్ కంపెనీ రామగుండంలోని వివేక్ ఇంటి చిరునామాతో ఉందని, ఆయన సంస్థ ఉద్యోగులే ఈ సంస్థ డైరెక్టర్లుగా ఉన్నారని అందులో పేర్కొన్నారు. ఈ లావాదేవీపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలని, ఎన్నికల్లో విచ్చలవిడిగా ఖర్చు పెట్టడానికే వివేక్ ఈ షెల్ కంపెనీ ఖాతా వినియోగిస్తున్నట్లు సీఈఓకు ఇచ్చిన ఫిర్యాదుతో పేర్కొన్నారు. దీంతో ఈ విషయాన్ని సీఈఓ నగర పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్ళారు. ఈ నేపథ్యంలోనే రంగంలోకి దిగిన సైఫాబాద్ పోలీసులు లోతుగా దర్యాప్తు చేశారు. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ బేగంపేట బ్రాంచ్లో ఉన్న విశాక ఇండస్ట్రీస్కు చెందిన ఓ గుర్తుతెలియని ఖాతా నుంచి విజిలెన్స్ సెక్యూరిటీస్ సంస్థకు ఐడీబీఐ బ్యాంక్ బషీర్బాగ్ బ్రాంచ్లోకి బదిలీ అయినట్లు గుర్తించారు. సోమవారం ఉదయం 10.57 గంటలకు జరిగిన ఈ లావాదేవీ అనుమానాస్పదంగా ఉండటంతో సైఫాబాద్ పోలీసులు ఈ మొత్తాన్ని ఫ్రీజ్ చేయించారు. దీనిపై ఎన్నికల అధికారులతో పాటు ఆదాయపు పన్ను శాఖ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తదితర విభాగాలకు సమాచారం ఇచ్చారు. దీనిపై దర్యాప్తు చేపట్టామని, వెలుగులోకి వచ్చే అంశాల ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయని డీసీపీ వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. -
ఆ సోదరుల ధనబలం ముందు బీఆర్ఎస్ ప్రతాపమెంత?
ఓ పార్టీ అభ్యర్థి మందమర్రి మండలం ఊరు రామకృష్ణాపూర్లో తన బలం పెంచుకునేందుకు 30 మందికోసం రూ.2లక్షలు ఖర్చు చేశాడు. దీంతో ఆ అభ్యర్థికే వారు జై కొట్టడం ప్రారంభించారు. పార్టీ కండువాలు కప్పుకొని రోజువారీగా ప్రచారం చేస్తున్నారు. ఓ వాడలో 30 మందిని మాత్రమే తనవైపు తిప్పుకొనేందుకే సదరు అభ్యర్థి అక్షరాల రూ.2లక్షలు ఖర్చు చేయడం విశేషం. ► ఇదీ ఎస్సీ రిజర్వ్డ్ స్థానమైన చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ఓ అభ్యర్థి చేసే ఎన్నికల ఖర్చుకు చిన్న ఉదాహరణ. సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: అసెంబ్లీ ఎన్నికలు గతంలో ఎన్నడూ లేనంతగా అత్యంత ఖరీదుగా మారాయి. జిల్లా పరిఽధిలో నాలుగు అసెంబ్లీ స్థానాలున్నాయి. ఇందులో మంచిర్యాల జనరల్, బెల్లంపల్లి, చెన్నూరు ఎస్సీ, ఖానాపూర్ (జన్నారం) ఎస్టీ రిజర్వ్డ్ స్థానాలుగా ఉన్నాయి. సాధారణంగా జనరల్ స్థానంలో బలమైన నాయకులు పోటీలో ఉంటే అధికంగా డబ్బు ఖర్చు చేస్తుంటారు. అయితే ఈసారి ఇందుకు భిన్నంగా జనరల్ స్థానం కన్నా బెల్లంపల్లి, చెన్నూరు ఎస్సీ రిజర్వ్డ్ స్థానాల్లోనూ విచ్చలవిడిగా డబ్బు ప్రవాహం పెరిగింది. పోటీలో ఉన్నవారు ఎలాగైనా ఎమ్మెల్యేగా గెలవాలనే లక్ష్యంతో ముందుకెళ్తుండగా ఎన్నికలు చాలా ఖరీదవుతున్నాయి. ధనబలమున్న గడ్డం సోదరులైన మాజీ మంత్రి వినోద్, మాజీ ఎంపీ వివేక్ రంగ ప్రవేశంతో ఎన్నికలు మరింత ప్రియమైపోయాయి. బీఆర్ఎస్ బలం తగ్గకుండా.. చెన్నూర్, బెల్లంపల్లి కాంగ్రెస్ అభ్యర్థులైన గడ్డం సోదరులకు దీటుగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బాల్క సుమన్, దుర్గం చిన్నయ్య ఖర్చు చేయడంలో పోటీ పడుతున్నారు. ప్రచారం, నాయకులు, కార్యకర్తల చేరికలు, బహిరంగసభలు, సమావేశాలు, ర్యాలీలు కార్యక్రమాలు పోటాపోటీగా సాగుతున్నాయి. ఇటీవల సీఎం కేసీఆర్ బహిరంగసభలు విజయవంతం చేసేందుకు రూ.కోట్లు వెచ్చించాల్సి వచ్చింది. దీంతో అధికార పార్టీ అభ్యర్థులకూ ఖర్చులు తడిసిమోపెడవుతున్నాయి. ప్రతిరోజూ ప్రత్యర్థులకు ఏ మాత్రం తగ్గకుండా కార్యక్రమాలు చేయడమో.. అంతకంటే భారీగా ప్లాన్ చేయడం కోసమో నోట్ల కట్టలు విప్పాల్సి వస్తోంది. మంచిర్యాల నియోజకవర్గం కంటే ఈ రెండు చోట్ల కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థుల ఖర్చు పోటాపోటీగా నడుస్తోంది. బీజేపీ అభ్యర్థుల హైరానా కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులు ఎన్నికల్లో ఓట్లు రాల్చేందుకు రూ.కోట్లు ఖర్చు చేస్తుంటే బీజేపీ అభ్యర్థులు హైరానా పడుతున్నారు. చెన్నూరు టికెట్ తెచ్చుకున్న దుర్గం అశోక్, బెల్లంపల్లిలో మాజీ ఎమ్మెల్యే శ్రీదేవి ఆ రెండు పార్టీలతో డబ్బుల్లో పోటీపడలేకపోతున్నారు. అయినప్పటికీ తమ స్థాయికి మించి ఖర్చు చేసేందుకు వెనుకాడడం లేదు. పోటీలో ఎక్కడ వెనుకబడిపోతామనే భయంతో చేతి చమురు వదులుకోవాల్సి వస్తోంది. ఇక బీఎస్పీ, స్వతంత్రులుగా పోటీ చేస్తున్నవారైతే ఈ ఖర్చు చూసి ముక్కున వేలేసుకుంటున్నారు. పోటీ పడలేక, పోటీ నుంచి తప్పుకోలేక ఇబ్బందిగానే ముందుకు సాగుతున్నారు. రోజుకు రూ.లక్షల్లోనే ఖర్చు తెల్లవారు మొదలు పొద్దుగుంకేదాకా ప్రచారమంతా ఖర్చుతోనే నడుస్తోంది. ర్యాలీలు, బహిరంగ సభలకు జనసమీకరణ, రవాణా, భోజనాలు, మద్యం, ఊరూరా ప్రచార రథాలు, ప్రకటనలు, కరపత్రాలు, కండువాలు, బహిరంగ సభలు, వసతులు తదితర వాటి కోసం రూ.లక్షల్లోనే ఖర్చవుతోంది. ఎన్నికల నిబంధనల ప్రకారం ప్రతీ అభ్యర్థి రూ.40లక్షల్లోపే ఖర్చు పరిమితి ఉంది. అయితే ఆ పరిమితి వాస్తవానికి ఎప్పుడో దాటిపోయింది. ఇతర పార్టీల నాయకులు తాము పార్టీ మారేందుకు ‘బేరసారాలు’ మొదలుపెట్టాక ఈ ఖర్చు మరింత పెరిగిపోయింది. నామినేషన్ల ఉపసంహరణలోనూ డబ్బు ప్రవావం ఉంటోంది. ఇక పోలింగ్ సమీపించే కొద్దీ ఈ నోట్ల ప్రవాహం మరింత పెరిగే అవకాశం లేకపోలేదు. జిల్లా ఎన్నికల వ్యయ పరిశీలకులు అభ్యర్థుల ఖర్చుపై పకడ్బందీ నిఘా పెడితే ఎన్నికల్లో డబ్బు ప్రవాహానికి అడ్డుకట్ట పడనుంది. -
కేసీఆర్కు కోటి అప్పు ఇచ్చిన వివేక్
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థుల అఫిడవిట్లలో ఆసక్తికర విషయాలు వెల్లడవుతున్నాయి. మంచిర్యాల జిల్లా చెన్నూరు అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్ అ భ్యరి్థగా పోటీ చేస్తున్న మాజీ ఎంపీ వివేక్.. సీఎం కేసీఆర్కు రూ.కోటి అప్పు ఇచ్చినట్టుగా తన అఫిడవిట్లో పేర్కొన్నా రు. అదేవిధంగా రామలింగారెడ్డికి రూ.10లక్షలు, కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డికి రూ.1.50కోట్లు అప్పుగా ఇచ్చినట్టు వెల్లడించారు. మొత్తంగా రూ.23.99 కోట్లను వ్యక్తిగత అప్పులు ఇచ్చినట్లుగా పేర్కొన్న వివేక్ ఆయనకు రూ. 600 కోట్ల ఆస్తులు ఉన్నట్లు తెలిపారు. ఆస్తుల విషయంలో ఈ మాజీ ఎంపీ రాష్ట్రంలోనే అత్యధిక ఆస్తులున్న రాజకీయ నాయకుడిగా ఉన్నారు. ఆయన సతీమణి జి.సరోజ పేరుతో రూ.377కోట్లు ఉండగా, విశాఖ కంపెనీతో సహా పలు కంపెనీలు, మీడియా సంస్థల్లో పెట్టుబడులు ఉన్నట్లు తెలిపారు. రెండో స్థానంలో పొంగులేటి: ఆ తర్వాత పాలేరు స్థానానికి పోటీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీకే చెందిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్రెడ్డి రూ.460కోట్ల ఆస్తులతో ధనిక అభ్యర్థుల జాబితాలో రెండో స్థానంలో ఉన్నారు. గజ్వేల్, కామారెడ్డి నుంచి పోటీ చేస్తున్న బీఆర్ఎస్ అధినేత సీఎ కేసీఆర్ తన అఫిడవిట్లో తన కుటుంబ ఆస్తులు రూ.59కోట్లు ఉన్నట్లు, సొంత కారు కూడా లేదని పేర్కొనడం తెలిసిందే. అయితే తాను మాజీ ఎంపీ వివేక్కు రూ.1.06కోట్లు అప్పు ఉన్నట్లు పేర్కొన్నారు. బీఆర్ఎస్లో ఉన్నప్పుడు మాజీ ఎంపీ వివేక్ సీఎం కేసీఆర్కు మ«ధ్య లావాదేవీలు జరిగినట్లు, గతంలో టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ సందర్భంగా ఈ డబ్బులు ఇచి్చనట్లు పార్టీ నాయకులు అనుకుంటున్నారు. చదవండి: తెలంగాణకు మోదీ గ్యారంటీలు -
ఎన్ని గంటలు పనిచేశామన్నది కాదు అసలు పని చేశామా లేదా అన్నది పాయింట్
వర్క్ కల్చర్పై ‘ఇన్ఫోసిస్’ కో–ఫౌండర్ నారాయణమూర్తి చేసిన కామెంట్ ‘70 హవర్స్ ఏ వీక్’ సోషల్ మీడియాలో వైరల్ అయింది. రకరకాల కోణాలలో ఈ కామెంట్ గురించి చర్చోపచర్చల మాట ఎలా ఉన్నా స్టాండప్ కమెడియన్లు, మీమ్స్ సృష్టించే వాళ్లకు మాత్రం చేతినిండా పని దొరికింది. స్టాండప్ కమెడియన్ వివేక్ మురళీధరన్ వీడియోలో... ‘ఇప్పుడు మనం 70 హవర్స్ ఏ వీక్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం’ అంటూ సెల్ఫోన్లో క్యాలిక్యులేటర్ ఓపెన్ చేసి ‘వారానికి 70 గంటలు పని చేయాలంటే’ అంటూ లెక్కలు వేయడం మొదలు పెడతాడు. రోజుకు, వారానికి, నెలకు ఎన్ని గంటలు పనిచేయాల్సి ఉంటుందో చెబుతాడు. టోటల్గా చెప్పాలంటే సంవత్సరంలో మనకంటూ మిగిలేది రెండు నెలలే. అందుకే తరచుగా ఈ సంవత్సరం తొందరగా గడిచినట్లు అనిపిస్తుంది అంటుంటాం’ అని వివేక్ అన్నప్పుడు ప్రేక్షకులు గట్టిగా నవ్వారు. ఒకరు ‘పోకిరి’ సినిమా ‘ఎప్పుడు వచ్చావన్నది కాదన్నయ్యా’ డైలాగుతో మీమ్ చేశారు... ‘ఎన్ని గంటలు పనిచేశామన్నది కాదన్నయ్యా,,,, అసలు పనిచేశామా లేదా అన్నది పాయింట్’. -
వివేక్తో రేవంత్రెడ్డి భేటీ
సాక్షి, రంగారెడ్డి జిల్లా: తెలంగాణలో బీజేపీకి వరుసగా ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయి. మారుతున్న రాజకీయ సమీకరణాల నేపథ్యంలో ఇప్పటికే మునుగోడు నుంచి బీజేపీ అభ్యర్థిగా గతంలో పోటీ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీని వీడి కాంగ్రెస్లో చేరారు. తాజాగా నిన్న బీజేపీలో సీనియర్ నేతగా ఉన్న వివేక్.. రేవంత్ రెడ్డి తో భేటీ కావడం చర్చనీయాంశమైంది. గత కొద్ది రోజులుగా వివేక్ పార్టీ మారతారని ప్రచారం జరిగినా దాన్ని ఖండిస్తూ వచ్చారు. ఇప్పుడు రేవంత్ రెడ్డికి అపాయిమెంట్ ఇవ్వడం, స్వయంగా కలుసుకోవడం చర్చలు జరపడం ఈ పరిణామాలు పార్టీ మారుతాయి అన్న వాదనలకు బలం చేకూర్చేలా ఉన్నాయి. మరో సీనియర్ నాయకురాలు విజయశాంతి కూడా పోటీకి దూరం అని చెప్పుకోవడం వెనుక అంతరార్థం మరోలా ఉంటుందన్నది ప్రచారంలో ఉంది. వరుస చేరికలతో జోష్లో ఉన్న కాంగ్రెస్.. కీలక నాయకుల్ని పార్టీలో చేర్చుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. చదవండి: పవన్ కల్యాణ్ రాయబారం సఫలం కాలేదా?! -
వివేక్తో విందుకు ఫీజు 50 వేల డాలర్లు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష రేసులో ఉన్న భారత సంతతి వ్యాపారవేత్త వివేక్ రామస్వామితో కలిసి మాట్లాడుకుంటూ విందారగించాలనుకుంటున్నారా? అలాగైతే సుమారు రూ.42 లక్షలు చెల్లిస్తే చాలు..! సిలికాన్ వ్యాలీకి చెందిన పలు బడా సంస్థలు కొన్ని వివేక్కి ఎన్నికల ప్రచార నిధులను సేకరించి పెట్టేందుకు ఈ నెల 29వ తేదీన విందు ఏర్పాటు చేశాయి. ఇందులో వివేక్తోపాటు పాల్గొనాలనుకునే వారు చెల్లించాల్సిన ఫీజు మొత్తాన్ని రూ.41.47 లక్షలు (50 వేల డాలర్లు)గా ఖరారు చేశారు. విందు ద్వారా మొత్తం 10 లక్షల డాలర్లను సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. శాన్ఫ్రాన్సిస్కో బే ఏరియాలోని ఇన్వెస్టర్, సోషల్ కేపిటల్ సంస్థ సీఈవో చమత్ నివాసంలో ఈ విందు జరగనుంది. రిపబ్లికన్ పార్టీ తరఫున అధ్యక్ష బరిలో అగ్రస్థానంలో మాజీ అధ్యక్షుడు ట్రంప్ కొనసాగుతుండగా, రెండో స్థానంలో వివేక్ రామస్వామి నిలిచిన విషయం తెలిసిందే. -
ఆయన గెలిస్తే భారతీయ టెక్కీల అమెరికా ఆశలు గల్లంతే..!
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తాను గెలిస్తే హెచ్-1బీ (H-1B) వీసాల జారీని ఎత్తేస్తానని రిపబ్లికన్ ప్రెసిడెంట్ అభ్యర్థి భారతీయ-అమెరికన్ వివేక్ రామస్వామి (Vivek Ramaswamy) పేర్కొన్నారు. హెచ్-1బీ వీసా ప్రోగ్రామ్ను "ఒప్పంద దాస్యం"గా అభివర్ణించారు. లాటరీ ఆధారిత ఈ వీసా వ్యవస్థను తొలగించి దాన్ని మెరిటోక్రాటిక్ అడ్మిషన్తో భర్తీ చేస్తానని ప్రమాణం చేశారు. అమెరికా వెళ్లే భారతీయ ఐటీ నిపుణులు ఎక్కువగా కోరుకునేది హెచ్-1బీ వీసానే. ఇది వలసేతర వీసా. సైద్ధాంతిక లేదా సాంకేతిక నైపుణ్యం అవసరమయ్యే ప్రత్యేక వృత్తులలో విదేశీ ఉద్యోగులను నియమించుకోవడానికి యూఎస్ కంపెనీలకు ఇది అనుమతిస్తుంది. (Unemployment Fraud: వామ్మో రూ. 11 లక్షల కోట్లా..? అత్యంత భారీ నిరుద్యోగ మోసమిది!) భారత్, చైనా వంటి దేశాల నుంచి ప్రతి సంవత్సరం సుమారు 10 వేల మంది ఉద్యోగులను నియమించుకోవడానికి టెక్నాలజీ కంపెనీలు ఈ హెచ్-1బీ వీసాపైనే ఆధారపడుతుంటాయి. రామస్వామి స్వయంగా ఈ వీసా ప్రోగ్రామ్ను 29 సార్లు ఉపయోగించుకోవడం గమనార్హం. రామస్వామి స్వయంగా 29 దరఖాస్తులు 2018 నుంచి 2023 వరకు రామస్వామి పూర్వ కంపెనీ రోవాంట్ సైన్సెస్ కోసం H-1B వీసాల కింద ఉద్యోగులను నియమించుకోవడానికి 29 దరఖాస్తులను యూఎస్ సిటిజెన్షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ ఆమోదించింది. అయినప్పటికీ H-1B వీసా వ్యవస్థ సక్రమంగా లేదని రామస్వామి చెప్పినట్లుగా యూఎస్ రాజకీయ వార్తా పత్రిక పొలిటికో పేర్కొంది. రామస్వామి 2021 ఫిబ్రవరిలో రోవాంట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పదవి నుంచి వైదొలిగారు. కానీ ఈ ఏడాది ఫిబ్రవరిలో తన అధ్యక్ష ఎన్నికల ప్రచారాన్ని ప్రకటించే వరకు కంపెనీ డైరెక్టర్ల బోర్డు అధ్యక్షుడిగా ఆయన కొనసాగారు. స్వతహాగా వలసదారుల సంతానమైన రామస్వామి.. ఇమ్మిగ్రేషన్ పాలసీని ప్రశ్నిస్తూ వార్తల్లో నిలిచారు. సరిహద్దును కాపాడుకోవడానికి సైనిక బలగాలను ఉపయోగిస్తానని, అమెరికాలో జన్మించిన పత్రాలు లేని వలసదారుల పిల్లలను బహిష్కరిస్తానని కూడా చెప్పారు. (దాంట్లో ఇన్ఫోసిస్ నారాయణమూర్తి హస్తం ఉంది: యూకే మాజీ ప్రధాని..) కాగా H-1B వీసాలకు డిమాండ్ పెరుగుతూనే ఉంది. 2021 ఆర్థిక సంవత్సరానికి 85,000 వీసా స్లాట్లు అందుబాటులో ఉండగా అమెరికన్ కంపెనీలు ఏకంగా 7,80,884 దరఖాస్తులను సమర్పించాయి. అంతకుముందు ఏడాది కంటే ఆ సంవత్సరంలో కాగా H-1B వీసా దరఖాస్తులు 60 శాతం కంటే ఎక్కువ పెరిగాయి. -
US Presidential Elections: మూడొంతుల మందిని సాగనంపుతా!
వాషింగ్టన్: తాను అధ్యక్షుడినైతే అమెరికా ప్రభుత్వంలోని ముప్పావు వంతు ఉద్యోగులను ఇంటికి పంపిస్తానని అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరఫున అభ్యరి్థత్వం కోసం పోటీపడుతున్న వివేక్ రామస్వామి సంచలన ప్రకటన చేశారు. భారతీయ మూలాలున్న వివేక్.. అమెరికన్ వార్తా వెబ్సైట్ యాక్సియస్కు ఇచి్చన ప్రత్యేక ముఖాముఖిలో పలు విషయాలను కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. ‘ రిపబ్లికన్ పార్టీ అభ్యరి్ధత్వం సాధించి అధ్యక్ష ఎన్నికల్లో గెలిచి అమెరికా అధ్యక్ష పీఠంపై కూర్చుంటే వెంటనే నా పని మొదలుపెడతా. దేశవ్యాప్తంగా విధుల్లో ఉన్న ప్రభుత్వ సిబ్బందిలో 75 శాతం మందిని ఉద్యోగాల నుంచి తీసేస్తా. ఇన్ని లక్షల మంది సిబ్బంది అమెరికా సర్కార్కు పెనుభారం. ఇక ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(ఎఫ్బీఐ) వంటి ప్రధాన దర్యాప్తు సంస్థలను మూసేస్తా. విద్య, ఆల్కాహాల్, పొగాకు, ఆయుధాలు, పేలుడు పదార్ధాలు, అణు నియంత్రణ కమిషన్, అంతర్గత ఆదాయ సేవలు, వాణిజ్య శాఖల ప్రక్షాళనకు కృషిచేస్తా. అధ్యక్షుడిగా తొలి ఏడాది పూర్తయ్యేలోపు సగం మంది ప్రభుత్వ ఉద్యోగులను ఇంటికి సాగనంపుతా. మిగతా సగం మందిలో 30 శాతం మందితో వచ్చే ఐదేళ్లలో పదవీ విరమణ చేయిస్తా. ఇందులో అనుమానమేమీ లేదు. పిచి్చపని అస్సలుకాదు’ అని 38 ఏళ్ల వివేక్ అన్నారు. ప్రస్తుతం అమెరికాలో 22.5 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. వీరిలో 75 శాతం మందిని అంటే దాదాపు 16 లక్షల మందిని వచ్చే నాలుగేళ్లలో ఉద్యోగాల నుంచి తీసేస్తానని వివేక్ లెక్కచెప్పారు. ఇన్ని లక్షల మందిని తీసేస్తే ప్రభుత్వంపై వేతన భారం భారీగా తగ్గుతుందని ఆయన అభిప్రాయం. -
వివేక్ రామస్వామిపై ట్రంప్ ప్రశంసలు
న్యూయార్క్: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. రిపబ్లికన్ ప్రెసిడెన్షియల్ ప్రత్యర్థి వివేక్ రామస్వామిపై ప్రశంసల జల్లు కురిపించారు. ఉపాధ్యక్షునిగా రామస్వామి బలమైన అభ్యర్థి కాగలడని, మంచి మనిషి అని పేర్కొన్నారు. శక్తివంతమైన నాయకత్వ లక్షణాలు ఉన్నాయని కొనియాడారు. 2024 ఎన్నికల్లో ట్రంప్ రిపబ్లిక్ పార్టీ తరుపున ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఎవరికి ఆమోదం తెలుపనున్నారనే సందిగ్ధంలో ఆయన ఈ మేరకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 'వివేక్ మంచి మనిషి. మంచి టాలెంట్ ఉన్న వ్యక్తి. అతని వద్ద మంచి మేధాశక్తి ఉంది. ఏదో మంచి మార్పును తీసుకురాగలడు. నా కంటే గొప్ప ప్రత్యేకతను కలిగి ఉన్నాడు. ఎవరైనా నన్ను బెస్ట్ అధ్యక్షునిగా గుర్తిస్తే.. నేను అతనిలా ఉంటాను' అని ఓ టెలివిజన్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రామస్వామిపై ట్రంప్ ప్రశంసలు కురిపించారు. ఇటీవల రిపబ్లికన్ ప్రెసిడెన్షియల్ డిబేట్లో ట్రంప్ను 21వ శతాబ్దపు బెస్ట్ ప్రెసిడెంట్గా రామస్వామి అభివర్ణించారు. ఈ మాటలు రామస్వామికి ఎంతో ఆధరణను ఇచ్చాయని ట్రంప్ తన సోషల్ మీడియాలో వెల్లడించారు. ఇందుకు వివేక్ రామస్వామికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. రామస్వామికి ట్రంప్ ఆమోదం తెలపడం వచ్చే ఎన్నికల్లో మంచి ఊపునిచ్చే అంశమని పలువురు భావిస్తున్నారు. ప్రస్తుతం రిపబ్లికన్ ప్రెసిడెన్షియల్ డిబేట్లో ట్రంప్ మొదటి స్థానంలో ఉండగా.. వివేక్ రామస్వామి మూడో స్థానంలో ఉన్నారు. ఇదీ చదవండి: ‘బైడెన్ పిచ్చితో మూడో ప్రపంచ యుద్ధమే!’.. తీవ్ర పదజాలంతో ట్రంప్ దూషణ -
‘నేను గెలిస్తే ఆ పదవి మస్క్కే’.. రిపబ్లికన్ అభ్యర్థి వివేక్ రామస్వామి
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తాను గెలిచి యూఎస్ అధ్యక్షుడిగా ఎన్నికైతే తనకు సలహాదారుగా ఎలాన్ మస్క్ (Elon Musk)ను కోరుకుంటానని రిపబ్లికన్ పార్టీ ప్రెసిడెంట్ అభ్యర్థి భారతీయ-అమెరికన్ వివేక్ రామస్వామి (Vivek Ramaswamy) పేర్కొన్నారు. లోవాలోని టౌన్ హాల్లో రామస్వామి మాట్లాడుతూ తన సంభావ్య అధ్యక్ష పదవికి సలహాదారులుగా ఎవరు కావాలనుకుంటున్నారని అడిగిన ప్రశ్నకు బదులుగా ఈ వ్యాఖ్యలు చేసినట్లు ఎన్బీసీ న్యూస్ నివేదించింది. ట్విటర్ (ప్రస్తుతం ‘ఎక్స్’)ని స్వాధీనం చేసుకున్న తర్వాత గత సంవత్సరం ఆ సంస్థ నుంచి భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగించిన విషయం తెలిసిందే. అయితే ఈ తొలగింపు చర్యను వివేక్ రామస్వామి మెచ్చుకోవడం అప్పట్లో చర్చనీయాంశమైంది. ‘ఎలాన్ మస్క్ ఇటీవల చాలా మెరుగవడం సంతోషంగా ఉంది. నాకు అతన్ని కీలక సలహాదారుగా కోరుకుంటున్నా. ఎందుకంటే అతను ట్విటర్లో 75 శాతం మందిని తొలగించాడు’ అని రామస్వామి పేర్కొన్నట్లుగా ఎన్బీసీ న్యూస్ కథనం వివరించింది. గతంలో ఫ్లోరిడా గవర్నర్ రాన్ డిసాంటిస్కు మద్దతు తెలిపిన ఎలాన్ మస్క్ ఇటీవల వికేక్ రామస్వామిని ఆశాజనక అభ్యర్థిగా భివిస్తున్నట్లు చెప్పాడు. రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా అత్యంత పిన్న వయస్కుడైన రామస్వామి.. దక్షిణ కరోలినా మాజీ గవర్నర్ నిక్కీ హేలీ తర్వాత రిపబ్లికన్ పార్టీ నామినేషన్ కోసం పోటీ పడుతున్న మరో ఇండియన్-అమెరికన్. ప్రభుత్వంలో విద్యా శాఖ, ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, బ్యూరో ఆఫ్ ఆల్కహాల్, టొబాకో, ఫైర్ ఆర్మ్స్, ఎక్స్ప్లోసివ్స్ను మూసివేయాలని తాను కోరుకుంటున్నట్లు రామస్వామి పేర్కొన్నట్లుగా ఎన్బీసీ నివేదిక వివరించింది. 38 ఏళ్ల వివేక్ రామస్వామి 40 ఏళ్లలోపు అత్యంత సంపన్న అమెరికన్లలో ఒకరు. యేల్ నుంచి న్యాయ పట్టా పొందే ముందు హార్వర్డ్లో జీవశాస్త్రాన్ని అభ్యసించారు. ఫోర్బ్స్ ప్రకారం, కొంతకాలం బిలియనీర్గా ఉన్న ఆయన సంపద స్టాక్ మార్కెట్ తిరోగమనంతో 950 మిలియన్ డాలర్లకు పడిపోయింది. -
భారత్తో బంధాలు బలపడితే చైనాపై ఆధారపడనక్కర్లేదు
లోవా: భారత్తో అమెరికా బంధాలు మరింత బలపడితే చైనాపై ఆధారపడే అవసరం ఉండదని అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్ధిత్వం కోసం పోటీ పడుతున్న భారత సంతతికి చెందిన వివేక్ రామస్వామి అభిప్రాయపడ్డారు. అండమాన్ సముద్రంలో మిలటరీ బంధాల్ని భారత్తో పటిష్టం చేసుకుంటే చైనా నుంచి దూరం కావచ్చునని వ్యాఖ్యానించారు. 38 ఏళ్ల వయసున్న వివేక్ రామస్వామి రిపబ్లికన్ అధ్యక్ష అభ్యరి్థత్వ రేసులో నిలిచిన వారిలో పిన్న వయసు్కడు. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తర్వాత ఈ బరిలో ముందున్నారు. అధ్యక్ష ఎన్నికల్లో అత్యంత కీలకమైన లోవా రాష్ట్రంలో పర్యటిస్తున్న వివేక్ రామస్వామి పీటీఐకి ఇంటర్వ్యూ ఇచ్చారు. ‘చైనాపై అమెరికా ఆర్థికంగా ఆధారపడి ఉంది. భారత్తో సంబంధాలు బలపడితే చైనాతో బంధాల నుంచి బయటపడవచ్చు’ అని రామస్వామి వివరించారు. ‘అండమాన్ సముద్రంలో మిలటరీ బంధాలు సహా భారత్తో అమెరికాకు వ్యూహాత్మక సంబంధాలు బలోపేతం కావాలి. పశి్చమాసియా దేశాల నుంచి చైనాకు చమురు సరఫరా అవుతున్న మలక్కా జలసంధిని భారత్ అడ్డుకోగలదన్న విషయం మనకు తెలిసుండాలి. ఇరు దేశాల బంధాల బలోపేతానికి ఇవే కీలకం. అదే జరిగితే అమెరికాకు మంచే జరుగుతుంది. ఆ దిశగా నేను ముందుకు వెళతాను’ అని రామస్వామి చెప్పారు. మొదటిసారిగా భారతీయ మీడియాకి ఇంటర్వ్యూ ఇచ్చిన వివేక్ భారత ప్రధాని మోదీ మంచి నాయకుడని ప్రశంసించారు. మోదీతో కలిసి ఇరు దేశాల సంబంధాల బలోపేతానికి కృషి చేసే రోజు కోసం తాను ఎదురు చూస్తున్నట్టుగా చెప్పారు. -
US Presidential ElectionIns 2024: ట్రంప్తో కలిసి పోటీ పడడానికి సిద్ధమే
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష అభ్యర్థి రేసులో అనూహ్యంగా పుంజుకొని అందరి దృష్టిని ఆకర్షిస్తున్న భారత సంతతికి చెందిన వివేక్ రామస్వామి తన రూటు మార్చారు. రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి రేసులో ఉన్న ఆయన ఇన్నాళ్లూ ఉపాధ్యక్ష పదవికైతే పోటీ పడనని చెబుతూ వస్తున్నారు. అధ్యక్ష పదవి తప్ప తనకు దేనిపైనా ఆసక్తి లేదని గతంలో చెప్పిన ఆయన ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష అభ్యర్థి నామినేషన్ను గెలుచుకుంటే ఆయనతో కలిసి పోటీ చేయడానికి సిద్ధమేనని స్పష్టం చేశారు. బ్రిటన్కు చెందిన జిబి న్యూస్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రామస్వామిని ట్రంప్కు ఉపాధ్యక్షుడిగా పోటీ చేయడం మీకు సంతోషమేనా అని ప్రశ్నించగా ఇప్పుడు తన వయసుకు అది మంచి పదవేనని చెప్పారు. ‘‘అమెరికాని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసి పునరేకీకరణ చేయాల్సిన అవసరం ఉంది. వైట్హౌస్లో ఒక నాయకుడిగా ఉంటేనే ఆ పని నేను చెయ్యగలను’’అని చెప్పారు. 38 ఏళ్ల రామస్వామి రిపబ్లికన్ పార్టీ అభ్యర్థుల చర్చలో తన సత్తా చూపించి రేసులో ట్రంప్ తర్వాత స్థానంలో దూసుకుపోతున్నారు. రామస్వామిని ట్రంప్ శిబిరం కూడా ప్రశంసించింది. అప్పట్నుంచి ట్రంప్, రామస్వామిలు అధ్యక్ష, ఉపాధ్యక్ష అభ్యర్థులుగా అంతిమంగా బరిలో నిలుస్తారన్న చర్చ పార్టీలో జరుగుతోంది. -
US Presidential Elections 2024: నువ్వా X నేనా?
నిక్కీ హేలీ, వివేక్ రామస్వామి ఇద్దరూ ఇద్దరే. భారత సంతతికి చెందిన వారే. రిపబ్లికన్ల అమెరికా అధ్యక్ష అభ్యర్థుల తొలి చర్చలో వారిద్దరే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలిచారు. ఉక్రెయిన్ యుద్ధ్దంపై మాటల తూటాలు విసురుకున్నారు. చివరికి వివేక్ రామస్వామి పైచేయి సాధించారు. ట్రంప్కు గట్టి పోటీ ఇస్తారని అంచనాలున్న రాన్ డిసాంటిస్ను పక్కకు పెట్టి మరీ రామస్వామి ముందుకు దూసుకుపోతున్నారు. ► రిపబ్లికన్ పార్టీ అమెరికా అధ్యక్ష అభ్యర్థుల మధ్య జరిగిన తొలి చర్చ వాడీగా వేడిగా సాగింది. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ చర్చకు దూరంగా ఉండడంతో ఇద్దరే ఇద్దరు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలిచారు. వారిద్దరూ భారత సంతతికి చెందిన అభ్యర్థులే. దక్షిణ కరోలినా మాజీ గవర్నర్ నిక్కీ హేలీ, మల్టీ మిలియనీర్ వివేక్ రామస్వామి మధ్య ఉక్రెయిన్ యుద్ధంపై చర్చ మరో మలుపు తీసుకుంది. అమెరికా చరిత్రలో ఇద్దరు భారతీయులు ఒకే వేదికను పంచుకొని ఈ తరహాలో చర్చించుకోవడం ముందెన్నడూ జరగలేదు. ఇద్దరికి ఇద్దరు ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా ఒకానొక దశలో వేలి చూపిస్తూ బెదిరించుకున్నారు. ఒకరిపై మరొకరు 30 సెకండ్లపాటు అరుచుకున్నారు. విదేశీ వ్యవహారాల్లో వివేక్ రామస్వామికి అవగాహన లేదని, రష్యా, ఉక్రెయిన్ యుద్ధం అంశంలో ఆయన పుతిన్కు మద్దతుగా వ్యవహరిస్తున్నారంటూ నిక్కీ హేలీ గట్టి ఆరోపణలే చేశారు. అమెరికా శత్రువులకి కొమ్ముకాస్తూ, దేశ మిత్రులకు దూరంగా వెళుతున్నారని వివేక్ను దుయ్యబట్టారు. పుతిన్ ఒక హంతకుడని అతనికి మద్దతుగా మాట్లాడేవారు ఈ దేశానికి అధ్యక్షుడైతే భద్రత గాల్లో దీపంలా మారుతుందంటూ హేలీ మండిపడ్డారు. హేలీ మాట్లాడుతున్నంత సేపు వివేక్ రామస్వామి ఆమెని అడ్డుకుంటూనే ఉన్నారు. హేలీ చెబుతున్నవన్నీ అబద్ధాలని , తనపై నోటికొచి్చనట్టు మాట్లాడుతున్నారంటూ ఎదురు దాడికి దిగారు. అమెరికా భద్రతే ముఖ్యం.. ► ఉక్రెయిన్కు మరింత సాయానికి తాను వ్యతిరేకిస్తానని వివేక్ రామస్వామి ఈ చర్చలో కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. అమెరికాకు ఉక్రెయిన్ ప్రధానం కాదని, వారికి చేసే మిలటరీ సాయాన్ని తమ దేశ సరిహద్దుల్లో మోహరిస్తే దేశ భద్రత మరింత పటిష్టమవుతుందని వివేక్ రామస్వామి పేర్కొన్నారు. రక్షణ రంగానికి చెందిన కాంట్రాక్టర్ల ఒత్తిడితోనే నిక్కీ ఉక్రెయిన్కు మద్దతుగా ఉన్నారంటూ ధ్వజమెత్తారు. ఈ చర్చలో నిక్కీ హేలీపై వివేక్ రామస్వామి పై చేయి సాధించారు. అమెరికాకు ఎప్పుడైనా తన దేశ భద్రతే ముఖ్యం తప్ప, ఉక్రెయిన్కు సాయం చేయడం కాదంటూ గట్టిగా వాదించారు. రాజకీయ అనుభవం లేకపోవడంతో మొదట్లో అంతగా గుర్తింపు లేని వివేక్ రామస్వామి తాను నమ్మిన సిద్ధాంతాలను ఆక ట్టుకునేలా చెప్పడం ద్వారా మద్దతు పెంచుకుంటున్నారు. అధ్యక్ష అభ్యర్థి రేసులో ముందున్న డొనాల్డ్ ట్రంప్కు గట్టి పోటీగా ఫ్లోరిడా గవర్నర్ రాన్ డిసాంటిస్ పేరు వినిపించేది. మొదటి చర్చలో రాన్ ఎంత మాత్రం ప్రభా వితం చూపించలేకపోయారు. ఇప్పుడు ఆయనను దాటుకొని మరీ వివేక్ రామస్వామి దూసుకుపోతున్నారు. తొలి చర్చలో వివేక్రామస్వామి విజేతగా నిలిచారంటూ వివిధ పోల్స్ వెల్లడిస్తున్నాయి. సెపె్టంబర్ 22న జరిగే రెండో చర్చలో వివేక్ రామస్వామి ఏంమాట్లాడతారన్న ఉత్కంఠ రేపుతోంది. ఎవరీ వివేక్ రామస్వామి ? కేరళ నుంచి అమెరికాకు వలస వెళ్లిన భారతీయ దంపతులకు ఒహియోలోని సిన్సినాటిలో 1985, ఆగస్టు9న వివేక్ రామస్వామి జని్మంచారు. సంప్రదాయ హిందూ కుటుంబంలో పుట్టి పెరిగారు. తండ్రి ఎలక్ట్రిక్ ఇంజనీరు. తల్లి మానసిక వైద్యురాలు. యేల్, హార్వర్డ్ విశ్వవిద్యాలయాల్లో రామస్వామి చదువుకున్నారు. పాఠశాలలో విద్యనభ్యసించేటప్పుడు జూనియర్ టెన్నిస్ క్రీడాకారుడిగా జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. యువకుడిగా ఉన్నప్పుడు తీరిక సమయాల్లో అల్జీమర్స్ రోగుల వద్ద పియానో వాయించేవారు. కాలేజీలో చదువుకున్నప్పుడు స్టూడెంట్ బిజినెసెస్.డాట్కామ్ సహవ్యవస్థాపకుడిగా ఉంటూ వ్యాపార రంగంలో అడుగు పెట్టారు. 2007 నుంచి 2014 వరకు క్యూవీటీ ఫైనాన్సెస్ సంస్థలో పని చేశారు. 2014లో సొంతంగా బయోటెక్ కంపెనీ రాయివాంట్ సైన్సెస్ను ఏర్పాటు చేశారు. అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మిని్రస్టేషన్ (ఊఈఅ) ఆమోదం పొందిన ఐదు ఔషధాలను అభివృద్ధి చేశారు. 10 మంది ఉద్యోగులతో ప్రారంభమైన ఈ సంస్థ 2017 నాటికి 110 కోట్ల డాలర్ల వ్యాపారం చేసే సంస్థగా ఎదిగింది. అమెరికాలో 40 ఏళ్లకు తక్కువ వయసున్న అత్యంత ధనికుడైన ఎంటర్ ప్రెన్యూర్గా ఫోర్బ్స్ జాబితాలోకెక్కారు. వివేక్ రామస్వామి ఆస్తుల విలువ 63 కోట్ల డాలర్లు ఉంటుందని అంచనా. తన క్లాస్మేట్ అయిన అపూర్వ తివారీని 2015లో పెళ్లాడిన వివేక్ రామస్వామికి కార్తీక్, అర్జున్ అనే ఇద్దరు అబ్బాయిలున్నారు. పుస్తక రచన, రాజకీయాలపై ఆసక్తితో రాయివాంట్ సంస్థ సీఈవో పదవి నుంచి 2021లో ఆయన తప్పుకున్నారు. ‘వోక్, ఇంక్: ఇన్సైడ్ కార్పొరేట్ అమెరికాస్ సోషల్ జస్టిస్ స్కామ్’అనే పుస్తకాన్ని రచించారు. ఎన్నో పత్రికల్లో వ్యాసాలు రాశారు. ఈ ఏడాది ఫిబ్రవరి 21న అధ్యక్ష అభ్యరి్థగా నామినేషన్ వేశారు. సాంస్కృతిక ఉద్యమంతో కొత్త అమెరికా కల సాకారమవుతుందని రామస్వామి నినదిస్తున్నారు. ఇప్పటికే ఎలన్మస్క్ వంటి పారిశ్రామికవేత్తలు రామస్వామికి బహిరంగంగా మద్దతు పలుకుతూ ఉండడం, ట్రంప్ చుట్టూ కేసుల ఉచ్చు బిగుస్తూ ఉండడంతో వివేక్ రామస్వామి వైపు రిపబ్లికన్లు తిరుగుతారా అన్న చర్చ మొదలు కావడం విశేషం. – సాక్షి, నేషనల్ డెస్క్ -
బీజేపీలో కోల్డ్వార్ పాలిటిక్స్.. జేపీ నడ్డాకు వారు ముగ్గురు ఏం చెప్పారు?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ బీజేపీలో ముసలం కొనసాగుతోంది. పార్టీలో నేతల మధ్య సయోధ్య కుదిర్చేందుకు బీజేపీ అధిష్టానం ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో బీజేపీ హైకమాండ్ యాక్షన్ ప్లాన్పై సస్పెన్స్ కొనసాగుతోంది. ఇదిలా ఉండగా.. ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డితో అధిష్టానం ఇప్పటికే మంతనాలు జరిపిన విషయం తెలిసిందే. ఈ సందర్బంగా పార్టీలో వారికున్న సమస్యలను వివరించినట్టు సమాచారం. మరోవైపు.. నిన్న(ఆదివారం) నాగర్కర్నూలులో బీజేపీ సభ అనంతరం కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. జేపీ నడ్డాతో బీజేపీ నేతలు విజయశాంతి, రఘునందన్ రావు, వివేక్ విడివిడిగా మంతనాలు జరిపారు. ఇక, తెలంగాణలో బీజేపీ నేతల నుంచి ఫిర్యాదుల చేసిన నేపథ్యంలో అధిష్టానం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది అనేది పార్టీ హాట్ టాపిక్గా మారింది. ఇక, రాబోయే వారం పది రోజుల్లో ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి తెలంగాణలో పర్యటించే అవకాశం ఉన్నట్టు బీజేపీ శ్రేణులు చెబుతున్నాయి. దీనికి ప్లాన్ చేస్తున్నట్టు తెలిపారు. కాగా, తెలంగాణలో మోదీ పర్యటన అనంతరం.. పార్టీ కీలక మార్పులు జరిగే అవకాశం కూడా ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో అసంతృప్తి నేతలకు పదవులు వస్తాయా? అనేది చర్చనీయాంశంగా మారింది. ఇది కూడా చదవండి: మహారాష్ట్రకు బయలుదేరిన సీఎం కేసీఆర్.. 600 కార్ల కాన్వాయ్తో.. -
వివేకా కేసులో ప్రజలందరూ తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే..
-
2024 US Presidential Election: ఎందుకు పోటీ చేస్తున్నానంటే...
2024 అమెరికా అధ్యక్ష ఎన్నికలకు అప్పుడే కోలాహలం మొదలైంది. ముఖ్యంగా ఈసారి భారత సంతతీయుల సందడి ఎక్కువగా ఉండేట్టుంది. ఇప్పటికే ఆంట్రప్రెన్యూర్, రచయిత వివేక్ రామస్వామి తాను అధ్యక్ష స్థానానికి పోటీ చేస్తానని ప్రకటించారు. దీనికిగానూ ముందు తన సొంత పార్టీ అయిన రిపబ్లికన్ పార్టీ మద్దతు కూడగట్టవలసి ఉంటుంది. ఏమైనా నిండా నలభై ఏళ్లు లేని, కేరళ మూలాలున్న వివేక్ రామస్వామి ఇంత పెద్ద పదవికి పోటీ పడాలని అనుకోవడమే విశేషం. ‘ఒక నూతన అమెరికన్ స్వప్నాన్ని రూపొందించడానికి నేను రాజకీయ ప్రచారం మొదలుపెట్టడం మాత్రమే కాకుండా, ఒక సాంస్కృతిక ఉద్యమాన్ని కూడా ప్రారంభిస్తున్నాను’ అని ఆయన చెబుతున్నారు. అమెరికా ప్రస్తుతం జాతీయ అస్తిత్వ సంక్షోభంలో ఉంది. విశ్వాసం, దేశభక్తి, కఠిన శ్రమ వంటివి కుప్పగూలుతున్న క్షణంలో మనం ఒక పరమార్థం కోసం తపిస్తున్నాం. అవగాహనకు సంబంధించిన మన అవసరాలను సంతృప్తిపర్చుకునేందుకు వాతావరణతత్వం, కోవిడ్ తత్వం, జెండర్ భావజాలం వంటి లౌకిక మతాలను కౌగిలించుకుంటున్నాం. కానీ అమెరికన్ అంటే అర్థం ఏమిటనే ప్రశ్నకు మన వద్ద సమాధానం లేదు. ఈ మేలుకొలుపు వాదాన్ని (వోక్ ఎజెండా) పలుచన చేసి దాని ప్రాసంగికతను నిర్వీర్యం చేయడం, ఆ శూన్యాన్ని ఉత్తేజకర జాతీయ అస్తిత్వంతో భర్తీ చేయడం రిపబ్లికన్ పార్టీ ప్రథమ ప్రాధాన్యం కావాలి. కానీ దీనికి బదులుగా చాలామంది అగ్రశ్రేణి రిపబ్లికన్లు 1980లలో కంఠస్థం చేసిన నినాదాలను వల్లెవేస్తున్నారు. ప్రత్యామ్నాయాన్ని ప్రతి పాదించకుండానే వామపక్ష సంస్కృతిని విమర్శిస్తున్నారు. అమెరికాను ప్రథమ స్థానంలో నిలిపేందుకు, అమెరికా అంటే ఏమిటి అని మనం కొత్తగా ఆవిష్కరించాల్సిన అవసరం ఉంది. అందుకే నేను అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నాను. ఒక నూతన అమెరికన్ స్వప్నాన్ని రూపొందించడానికి రాజకీయ ప్రచారాన్ని మాత్రమే కాకుండా, ఒక సాంస్కృతిక ఉద్యమాన్ని కూడా ప్రారంభిస్తున్నాను. 37 సంవత్సరాల ఒక రాజకీయ ఔట్సైడర్ భూమ్మీద అత్యున్న తమైన అధికారాన్ని సాధించాలనుకోవడం అహంకారంగానే కనిపించవచ్చు. కానీ, నేను మన జాతి కోసం, అమెరికన్ జీవితంలోని ప్రతి రంగంలోనూ ప్రతిభను పునరుద్ధరించగలిగే జాతి కోసం దార్శని కతలో భాగంగా పోటీ చేస్తున్నాను. మనం ప్రతిభను పునరుద్ధరించాలి. నా తల్లిదండ్రులు ఈ దేశానికి చట్టబద్ధంగా వచ్చారు, కష్టపడి పనిచేశారు, వేలాది అమెరికన్ల జీవితా లను మెరుగుపర్చిన వ్యాపార సంస్థలను రూపొందించిన ఇద్దరు పిల్లలను పెంచి పెద్దచేశారు. చట్టాన్ని అతిక్రమించి ప్రవేశిస్తున్న వారికి బదులుగా మా తల్లిదండ్రుల వంటి వలస ప్రజలు అవసరం. ఎలాంటి మొహమాటాలకూ తావులేకుండా అమెరికా సరిహద్దులకు భద్రత కల్పించడం, ప్రతిభా ప్రవేశాలకు అనుకూలంగా లాటరీ ప్రాతి పదికతో కూడిన వలస విధానాన్ని నిర్మూలించడం అవసరం. అమెరికాకు వచ్చి విజయాలు పొందినవారి ప్రతిభను మనం తప్పక ప్రోత్సహించాలి. అమెరికా శ్రామిక శక్తిలో దాదాపు 20 శాతం మందిని నియమిస్తున్న ఫెడరల్ కాంట్రాక్టర్లు జాతి ప్రాతిపదికన నియామకాలను చేపట్టడాన్ని తప్పనిసరి చేస్తూ అమెరికా పూర్వ అధ్య క్షుడు లిండన్ బి. జాన్సన్ కార్యనిర్వాహక ఆదేశం 11246 జారీ చేశారు. దీనివల్ల నల్లజాతి, హిస్పానిక్(స్పానిష్ దేశాలు) ఉద్యోగుల పట్ల అగ్రశ్రేణి కంపెనీలు ఎక్కువ అక్కర చూపుతూ– శ్వేత జాతి లేదా ఆసియన్ అమెరికన్లుగా ఉంటున్న అర్హత కలిగిన అభ్యర్థుల పట్ల అనిష్టం ప్రదర్శిస్తున్నాయి. ఇలాంటి కార్యనిర్వాహక ఆదేశాన్ని రద్దు చేయటమే కాకుండా, అక్రమమైన జాతి ప్రాతిపదిక ప్రాధాన్యాలపై విచారణ జరిపించాలని న్యాయ శాఖను ఆదేశిస్తాను. ప్రభుత్వాన్ని నిర్వహించడానికి ఎంపికైనవాళ్లు వాస్తవంగా ప్రభు త్వాన్ని నిర్వహించాలి. కాన్నీ ఎన్నికలలో పాల్గొనని ఆంథోనీ ఫాచీ (అమెరికా ముఖ్య వైద్య సలహాదారు), మెర్రిక్ గార్లండ్ (అమెరికా అటార్నీ జనరల్) వంటి బ్యూరోక్రాట్లు తమ పరిధిని మీరి ప్రవర్తించారు. ఇంకోసారి ఇలాంటి బ్యూరోక్రాట్లు తమ పరిధిని మీరినప్పుడు ఒక అధ్యక్షుడికి రాజ్యాంగం కల్పించిన సాధికారతను నేను తప్పకుండా అమలు చేయడానికి నిబద్ధత వహిస్తాను; వారిని తొలగిస్తాను. ఫెడరల్ ఉద్యోగులకు కల్పించిన సివిల్ సర్వీస్ సంరక్షణలను అవస రమైతే కార్యనిర్వాహక ఆదేశం ద్వారా రద్దు చేస్తాను. వీటికి బదులుగా నిర్దిష్టకాలం మాత్రమే రక్షణ కల్పించే మేనేజీరియల్ నిబంధనలను తీసుకొస్తాను. దేశాధ్యక్షుడు ఎనిమిదేళ్లకు మించి అధికారంలో ఉండ నప్పుడు,›బ్యూరోక్రాట్లకు కూడా దాన్నే వర్తింప జేయాలి. డబ్బును వృథా చేస్తున్న లేదా కాలం చెల్లిన సంస్థలకు నిధులను నిలిపివేసేలా– 1974 నాటి ‘ఇంపౌండ్మెంట్ కంట్రోల్’ చట్టాన్ని రద్దు చేయాలని లేక సవరించాలని అమెరికన్ కాంగ్రెస్ను కోరతాను. సంస్కరించడానికి సాధ్యం కాని సంస్థలను మూసివేస్తాను. వాటి స్థానంలో పునాదుల నుంచి కొత్త సంస్థలను నిర్మిస్తాను. ఏ భావాలనూ సెన్సార్ చేయనప్పుడే ఉత్తమ ఆలోచనలు పుట్టుకొస్తాయి. తమకు అనుకూలంగా లేని రాజకీయ ప్రసంగాలను సెన్సార్ చేయడంపై మన ప్రభుత్వం టెక్నాలజీ కంపెనీలపై ఒత్తిడి తీసుకొస్తోంది. అవి అలా చేసేట్టుగా ప్రత్యేక భద్రతను కల్పిస్తోంది. రాజ్య శక్తులతో కలిసి పనిచేసేలా ఇంటర్నెట్ కంపెనీలు అమెరికన్ రాజ్యాంగ తొలి సవరణకు కట్టుబడి ఉండాలి. ఎలాన్ మస్క్ ట్విట్టర్ విషయంలో చేసినట్టుగా, ఫెడరల్ గవర్నమెంట్ నుంచి ‘స్టేట్ యాక్షన్ ఫైల్స్’ను బహిర్గత పరుస్తాను. రాజ్యాంగం నిషేధించిన కార్య కలాపాలను చేపట్టేలా కంపెనీలను బ్యూరోక్రాట్లు తప్పుడు పద్ధతుల్లో ఒత్తిడిపెట్టినట్టు తెలిపే ప్రతి ఉదంతం దీని ద్వారా బయటికొస్తుంది. ఇంటర్నెట్ని దాటి మన ఆర్థిక వ్యవస్థ మొత్తంగా అభిప్రాయాల సెన్సార్షిప్ విస్తరించింది. నల్లజాతి, గే లేదా ముస్లింగా ఉంటున్నందుకు మీరు ఎవరినైనా ఉద్యోగం లోంచి తొలగించలేనట్లయితే, రాజ కీయ ప్రసంగం కోసం కూడా మీరు ఎవరినీ ఉద్యోగం లోంచి తొలగించకూడదు. అమెరికన్ పౌరహక్కుల కార్యకర్తగా రాజకీయ వ్యక్తీకర ణను ప్రతిష్ఠించడానికి నేను అమెరికన్ కాంగ్రెస్తో కలిసి పనిచేస్తాను. విభేదించే అభిప్రాయాలను కలిగివుండే కార్మికులను వివక్ష నుంచి కాపాడటానికి ప్రస్తుతం ఉనికిలో ఉన్న పౌర హక్కులను అమలు చేస్తాను. మత పరమైన వివక్షపై ఉన్న ఫెడరల్ ప్రభుత్వ నిషేధం ఉద్యోగులను ఏ మతానికీ లోబడనీయకుండా యజమానులను కట్టడి చేస్తోంది. కార్పొరేట్ అమెరికాలో వ్యాపించివున్న మేలుకొలుపు వాదానికి ఇది సరిగ్గా సరిపోయేట్టుగా ఉంది. పరస్పరం పంచుకునే సూత్రాల చుట్టూ మన జాతీయ అస్తి త్వాన్ని పునరుద్ధరించుకున్న తర్వాత, అమెరికాకు అతి పెద్ద విదేశీ ప్రమాదంగా ఉన్న కమ్యూనిస్టు చైనా వికాసాన్ని ఓడించడానికి అవసరమైన దృఢత్వాన్ని సమకూర్చుకోగలం. 1980లలో సోవియట్ యూనియన్ లాగా కాకుండా, చైనా నేడు ఆధునిక అమెరికన్ జీవన శైలికి కావాల్సిన శక్తిని ప్రసాదిస్తోంది. అందుకే మనం ఆర్థిక స్వాతంత్య్రాన్ని ప్రకటించుకోవాలి. చైనాను కనీసం తాకకుండా, అమెరికాను వణికిస్తున్న సరికొత్త వాతావరణ మతం చేస్తున్న డిమాండ్లను వ్యతిరేకించడం ద్వారా మనం ప్రపంచ ఇంధన నాయకత్వాన్ని తిరిగి పొందాలి. తైవాన్ను ఏ విధంగానైనా సరే కాపాడుతూనే సెమీ కండ క్టర్ల తయారీలో స్వయం సమృద్ధిని సాధించాలి. 16 సంవత్సరాల లోపు పిల్లలు టిక్ టాక్ ఉపయోగించకుండా నిషేధం విధించాలి. కోవిడ్–19ను వ్యాప్తి చెందించడంపై చైనాను జవాబుదారీని చేయ డానికి మనం ఆర్థిక తులాదండాన్ని తప్పకుండా ఉపయోగించాలి. చౌర్యం, వ్యాపారమయ ఎత్తుగడలను చైనా ప్రభుత్వం నిలిపి వేసేంతవరకు అవసరమైతే చైనాలోకి అమెరికన్ కంపెనీలు విస్తరించడాన్ని నిషేధించడానికి కూడా మనం సిద్ధపడాలి. మనం నిజంగా ఎవరం అని తిరిగి ఆవిష్కరించుకున్నట్లయితే మళ్లీ కాలానికి తగినట్టుగా మనం ఎదగగలం. అమెరికా బలం మన భిన్నత్వం కాదు, ఆ భిన్నత్వానికి అతీతంగా మనల్ని ఐక్యం చేస్తున్న ఆదర్శాలే మన బలం. ఈ ఆదర్శాలే అమెరికన్ విప్లవాన్ని గెలిపించాయి, అంతర్యుద్ధం తర్వాత దేశాన్ని ఐక్యపరిచాయి, రెండు ప్రపంచ యుద్ధాలను, ప్రచ్ఛన్న యుద్ధాన్ని గెలిపించాయి. ఈ ఆదర్శాలు ఇప్ప టికీ స్వేచ్ఛాయుత ప్రపంచం పట్ల ఆశను కలిగిస్తున్నాయి. వీటిని మనం పునరుద్ధరించినట్లయితే మనల్ని ఏ శక్తీ ఓడించలేదు. వివేక్ రామస్వామి వ్యాసకర్త అమెరికా అధ్యక్ష స్థానం కోసం పోటీ పడనున్నారు (‘వాల్ స్ట్రీట్ జర్నల్’ సౌజన్యంతో) -
విశ్రాంత జీవనం.. హాయిగా..!
ప్రజల ఆయుర్ధాయం పెరుగుతోంది. గతంలో మాదిరి కాకుండా నేటి యువత ప్రైవేటు రంగంలోనే ఎక్కువగా ఉపాధి పొందుతున్నారు. లేదంటే సొంత వ్యాపారాలు, ఇతర స్వయం ఉపాధి మార్గాలతో స్థిరపడుతున్నారు. జీవించి ఉన్నంత కాలం ఉద్యోగ, వ్యాపారాలు నిర్వహించలేం. ఉద్యోగంలో అయితే 58 ఏళ్లకు దిగిపోవాల్సిందే. స్వయం ఉపాధిలోని వారికి వయో పరిమితి లేదు. అయినా కానీ ఏదో ఒక రోజు చేస్తున్న పనికి విరామం పలకాల్సిందే. శారీరక, ఆరోగ్య పరమైన మార్పులు మునుపటి మాదిరిగా పనిచేయనీయవు. కనుక వృద్ధాప్యంలో పనికి విరామం పలికిన తర్వాత జీవన అవసరాలను తీర్చుకోవడం ఎలా అన్నది ముందే ఆలోచించాలి. దీనివల్ల విశ్రాంత రోజుల్లో ప్రశాంతమైన జీవనానికి అవకాశం లభిస్తుంది. ఈ అంశంపై ‘మనీ పాత్శాల’ వ్యవస్థాపకులు వివేక్ లా ఏం చెబుతున్నారో చూద్దాం... రిటైర్మెంట్ అనేది తప్పనిసరి దీర్ఘకాల ప్రణాళిక. అంతేకాదు, జీవితంలో ఖరీదైన లక్ష్యాల్లో ఇది కూడా ఒకటి. ఎందుకంటే రిటైర్మెంట్ తర్వాత మరో 20–30 ఏళ్లు జీవించాల్సి రావడం, అందుకు కావాల్సినంత నిధిని సమకూర్చుకోవడం చిన్న విషయం కాదు. దీనికి డబ్బు విలువను హరించే ద్రవ్యోల్బణ ప్రభావాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలి. ద్రవ్యోల్బణ ప్రభావాన్ని ఎదుర్కొనే స్థాయిలో రిటైర్మెంట్ కోసం కేటాయింపులు చేసుకోవాలి. చేస్తున్న పనికే రిటైర్మెంట్ కానీ, మన జీవన అవసరాలకు కాదు. ఉద్యోగం/వ్యాపారం ఆగిపోయినా, మన జీవన అవసరాలను తీర్చే ఆదాయం ఆగిపోకూడదని అనుకుంటే అందుకు ముందు నుంచి తగిన ఏర్పాట్లు ఉండాలి. ఆర్జన ఆరంభించిన వెంటనే రిటర్మెంట్ ప్రణాళిక మొదలు పెట్టాలి. నిజానికి చాలా మంది యువత దీని ప్రాధాన్యాన్ని గుర్తించడం లేదు. దీంతో రిటైర్మెంట్ తర్వాత జీవితం ఎంతో మందికి సవాలుగా మారుతోంది. వాయిదా సరికాదు.. రిటైర్మెంట్ ఆలస్యం చేసిన కొద్దీ లక్ష్యం భారంగా మారుతుంది. పెట్టుబడి ఎంత ముందుగా ప్రారంభిస్తే కాంపౌండింగ్ ప్రయోజనంతో దీర్ఘకాలంలో అది మంచి నిధిగా మారుతుందని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల పెట్టుబడి ఎన్నో రెట్లు వృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. ఉదాహరణకు 25 ఏళ్ల వయసు నుంచే ప్రతి నెలా రూ.5,000 చొప్పున 60 ఏళ్ల వరకు ఇన్వెస్ట్ చేస్తే.. 35 ఏళ్ల కాలంలో ఎంత సమకూరుతుంది? 12% కాంపౌండింగ్ రాబడి అంచనా ప్రకారం రూ.3.24 కోట్లు సమకూరుతుంది. కేవలం నెలకు రూ.5వేలు అంత పెద్ద నిధిగా మారిందంటే అదే కాంపౌండింగ్ మహిమ. ఒకవేళ ఈ పెట్టుడిని ఒక ఏడాది ఆలస్యంగా మొదలు పెట్టారని అనుకుందాం. అంటే 26 ఏళ్లకు ఇన్వెస్ట్మెంట్ మొదలైతే రూ.37 లక్షలు తక్కువ మొత్తం సమకూరుతుంది. ఏడాది ఆలస్యం చేయడం వల్ల ఏర్పడిన నష్టం రూ.37 లక్షలు. అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ ఆలస్యం చేయకూడని, అన్నింటికంటే ముందు ఆరంభించే పెట్టుబడి ప్రణాళిక రిటైర్మెంట్ ఫండ్ కావాలి. ఉపసంహరించుకునే దశ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకుంటే, రిటైర్మెంట్ తర్వాత సిస్టమ్యాటిక్ విత్డ్రాయల్ మార్గాన్ని ఎంపిక చేసుకోవచ్చు. దీనివల్ల ప్రతీ నెలా నిర్ణయించుకున్న మేర బ్యాంకు ఖాతాకు జమ అవుతుంటుంది. మిగిలిన మొత్తాన్ని ఈక్విటీల్లోనే ఉంచడం వల్ల రాబడులతో అది వృద్ధి చెందుతూ ఉంటుంది. దాంతో ద్రవ్యోల్బణ నష్టం నుంచి రిటైర్మెంట్ ఫండ్ విలువను కాపాడుకోవచ్చు. ఎన్పీఎస్లో ఇన్వెస్ట్ చేసి ఉంటే కనుక రిటైర్మెంట్ నాటికి సమకూరిన మొత్తం నుంచి 60 శాతాన్ని వెనక్కి తీసుకోవచ్చు. దీనిపై పన్ను భారం ఉండదు. అయితే ఈ మొత్తాన్ని తిరిగి మెరుగైన రాబడులను ఇచ్చే సాధనాల్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి. అప్పుడే మిగిలిన 30 ఏళ్ల జీవన అవసరాలకు అనుగుణంగా పెట్టుబడి వృద్ధిని చేసుకోవచ్చు. ప్రణాళిక విషయంలో ఆర్థిక నిపుణుడి సేవలు తప్పకుండా తీసుకోవాలి. రిటైర్మెంట్ నిధిని సమకూర్చుకునే విషయంలో భయం, ఊహాజనిత, ఉద్రేకాలకు అవకాశం ఇవ్వకుండా, క్రమశిక్షణతో ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్లాల్సి ఉంటుంది. గృహ రుణం ఇంకా తీర్చాల్సి ఉన్నా లేదా తమపై కుటుంబ సభ్యులు ఆధారపడి ఉన్నా.. రిటైర్మెంట్ తీసుకున్నప్పటికీ కొన్ని రకాల రక్షణ చర్యలు ఏర్పాటు చేసుకోవాలి. గృహ రుణం తీరేంత వరకు, తమ ఆదాయంపై కుటుంబ సభ్యులు ఆధారపడే కాలానికి టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. అలాగే, హెల్త్ ఇన్సూరెన్స్ కూడా తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలి. ఆర్థిక క్రమశిక్షణ 45–55 ఏళ్లకే రిటైర్మెంట్ తీసుకుని ప్రపంచమంతా తిరిగి రావాలి? ఇది కొందరి లక్ష్యం కావచ్చు. కానీ, 60 ఏళ్లు వచ్చే నాటికి అయినా దీన్ని సాధించగలిగారా? అని ప్రశ్నిస్తే.. ఎక్కువ మంది నుంచి లేదన్నదే సమాధానం వస్తుంది. సంపాదన మొదలైన నాటి నుంచే రిటైర్మెంట్ కోసం ఇన్వెస్ట్ చేయాలని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ, మనలో చాలా మంది ఆర్జించే మొత్తం చెప్పుకోతగ్గ గొప్పగా ఉండదు. దీంతో పరిమిత ఆర్జన, అవసరాల నడుమ.. రిటైర్మెంట్ 60 ఏళ్లప్పుడు కదా, తర్వాత చూద్దాంలే? అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. యుక్త వయసు, ఆరోగ్యం సహకరిస్తున్న రోజుల్లోనే అలా అనుకుంటే.. వృద్ధాప్యానికి చేరువ అవుతున్న సమయంలో రిటైర్మెంట్ ఫండ్ వంటి భారీ లక్ష్యం ఎలా సాధ్యపడుతుంది? ఒక్కసారి ఆలోచించాలి. పిల్లల విద్య, వారి వివాహం, ఇతర బాధ్యతలతో రిటైర్మెంట్కు ముందు వరకు చాలా మంది తీరిక లేకుండా ఉంటారు. కనుక ఏ లక్ష్యాన్నీ నిర్లక్ష్యం చేయడానికి, వాయిదా వేయడానికి లేదు. 25–30 ఏళ్ల కెరీర్లో రోజువారీ అవసరాల్లో ఎలాంటి రాజీ పడకుండా, రిటైర్మెంట్కు కావాల్సినంత నిధిని సమకూర్చుకోవడం ఎలా? ఆర్థిక ప్రణాళిక ఇందుకు మార్గం చూపుతుంది. జీవితంలో ఏవి కావాలని కోరుకుంటున్నారు? అందుకోసం ఏం చేయాలి, ఎలా చేయాలనేది? ఆర్థిక ప్రణాళిక స్పష్టం చేస్తుంది. ఆర్థిక క్రమశిక్షణ ప్రతి ఒక్కరికీ అవసరం. కారణాలు ఏవైనా, రిటైర్మెంట్ నాటికి కావాల్సినంత నిధి సమకూర్చుకోలేకపోతే తిరిగి మునుపటి మాదిరి యువకుల్లా పనిచేయడం సాధ్యపడదు? అప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవాలి. ఉదాహరణకు మీరు 60 ఏళ్లకు రిటైర్మెంట్ తీసుకుంటారని అనుకుంటే, 90 ఏళ్ల వరకు జీవించి ఉండేట్టు అయితే కనీసం 30 ఏళ్ల అవసరాలకు సరిపడా నిధి అవసరమవుతుంది. ఇది చాలా పెద్ద లక్ష్యమే అనడంలో సందేహం లేదు. ఆరోగ్య సంరక్షణ అవసరాలు, పిల్లల విద్య, వారి వివాహాలు, వృద్ధాప్యంలో జీవన అవసరాలు, ద్రవ్యోల్బణం వల్ల పెరిగిపోయే జీవన వ్యయాలను విస్మరించడానికి లేదు. ఉదాహరణకు రిటైర్మెంట్ తర్వాత ప్రతి నెలా అవసరాలు తీర్చుకునేందుకు రూ.3 లక్షలు కావాలని అనుకుంటే.. ఏటా 7 శాతం ద్రవ్యోల్బణం అంచనా ఆధారంగా రూ.10 కోట్ల నిధిని సమకూర్చుకోవాల్సి ఉంటుంది. 35 ఏళ్ల వయసులో ఇన్వెస్ట్మెంట్ ఆరంభించారని అనుకుంటే.. 60 ఏళ్ల వయసు వచ్చే నాటికి మీ చేతిలో 25 ఏళ్లు మిగిలి ఉంటుంది. ఇందుకు గాను ప్రతి నెలా రూ.55,000 చొప్పున ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఇది ఏటా 12% చొప్పున వృద్ధిని చూస్తుందనుకుంటే 60 ఏళ్ల నాటికి రూ.10 కోట్లు సమకూరుతుంది. అందుకే మొదటి నెల వేతనం నుంచే రిటైర్మెంట్ నిధి సమకూర్చుకోవడానికి తొలి అడుగు పడాలి. తల్లిదండ్రులు లేదా తాతలు ప్రభుత్వరంగంలో ఉద్యోగులుగా పనిచేసి రిటైర్మెంట్ అవ్వడంతో, వారికి పెన్షన్ సదుపాయం ఉండేది. కానీ మన పరిస్థితి అలా కాదు. గ్యారంటీడ్ పెన్షన్ అనేది లేదు. ఎవరికి వారే సొంతంగా నిధిని సమకూర్చుకుని, దానిపై ఆదాయం వచ్చేలా ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ కావడంతో మన దేశంలో సగటు ద్రవ్యోల్బణం 4–6 శాతం మధ్యలో ఉంటుందని అంచనా. అంటే నేడు పాకెట్లో ఉన్న రూ.1000 విలువ ఏడాది తర్వాత రూ.96కు తగ్గుతుంది. ఇలా తరిగిపోయే విలువకు తగిన రక్షణగా అదనపు పెట్టుబడి అవసరం ఉంటుంది. మిగులు లేదని చెప్పుకోవద్దు.. రిటైర్మెంట్ కోసం ఇన్వెస్ట్ చేయడానికి వెసులుబాటు లేదని కొందరు చెబుతుంటారు. తర్వాత వీలు చూసుకుని మొదలు పెడదామని, అనుకుంటూ ఉంటుంటారు. కానీ, విలువైన సమయాన్ని వృధా చేసిన తర్వాత ప్రతి నెలా ఎంత మొత్తం పొదుపు చేసినా అది గణనీయమైన వృద్ధిని చూడడానికి కావల్సిందన వ్యవధి ఉండదు. ఇంతకుముందు చెప్పుకున్న ఉదాహరణలోనే 25 ఏళ్లకు కాకుండా, తీరిగ్గా 45 ఏళ్ల వయసులో రిటైర్మెంట్ కోసం ఇన్వెస్ట్మెటు మొదలు పెట్టారని అనుకుందాం. ప్రతి నెలా రూ.50,000 చొప్పున అక్కడి నుంచి 15 ఏళ్లు ఇన్వెస్ట్ చేస్తే.. 12 శాతం కాంపౌండింగ్ రాబడి చొప్పున 2.5 కోట్లు సమకూరుతుంది. 25 ఏళ్ల వయసులో ఆరంభించడం వల్ల కేవలం ప్రతి నెలా రూ.5వేలతోనే రిటైర్మెంట్ నాటికి రూ.3.24 కోట్లు సమకూరుతుంటే.. 20 ఏళ్లు ఆలస్యంగా మొదలు పెట్టడం వల్ల ప్రతి నెలా రూ.50వేల చొప్పున పెట్టుబడి పెట్టాల్సి వస్తోంది. అప్పటికీ సమకూరే మొత్తం కేవలం రూ.2.5 కోట్లు కావడాన్ని గమనించాలి. సమకూర్చుకునేది ఎలా? రిటైర్మెంట్ ప్రణాళికలో రెండు భాగాలు ఉంటాయి. ఒకటి రిటైర్మెంట్ సమయం వచ్చేంత వరకు కావాల్సిన నిధిని సమకూర్చుకోవడం. రిటైర్మెంట్ తర్వాత ఆ నిధి నుంచి ప్రతి నెలా రాబడి పొందడం రెండోది అవుతుంది. 25–30 ఏళ్ల కాల వ్యవధి ఉంటుంది కనుక, పెట్టుబడులకు ఈక్విటీలను మెరుగైన మార్గంగా చూడాలి. దీర్ఘకాలంలో ఈక్విటీలను మించి కాంపౌండెడ్ రాబడులను ఇచ్చిన మెరుగైన సాధనం మరొకటి లేదనే చెప్పుకోవాలి. ఇందుకోసం మ్యూచువల్ ఫండ్స్ ద్వారా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. లేదంటే ఎన్పీఎస్లోనూ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇందుకోసం ఆర్థిక సలహాదారు సూచనలను తప్పకుండా తీసుకోవాల్సి వస్తుంది. నిపుణుల సాయంతో రాబడుల అంచనాలు, కాల వ్యవధి ఆధారంగా పోర్ట్ఫోలియోను ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. రిటైర్మెంట్కు సమయం దగ్గర పడుతుండగా, ఈక్విటీ పెట్టుబడులను క్రమంగా ఉపసంహరించుకుని, డెట్కు మళ్లించుకోవడంలో ఆర్థిక సలహాదారు సాయపడతారు. తద్వారా మీ లక్ష్యాలు నెరవేరతాయి. ఉపసంహరించుకునే దశ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకుంటే, రిటైర్మెంట్ తర్వాత సిస్టమ్యాటిక్ విత్డ్రాయల్ మార్గాన్ని ఎంపిక చేసుకోవచ్చు. దీనివల్ల ప్రతీ నెలా నిర్ణయించుకున్న మేర బ్యాంకు ఖాతాకు జమ అవుతుంటుంది. మిగిలిన మొత్తాన్ని ఈక్విటీల్లోనే ఉంచడం వల్ల రాబడులతో అది వృద్ధి చెందుతూ ఉంటుంది. దాంతో ద్రవ్యోల్బణ నష్టం నుంచి రిటైర్మెంట్ ఫండ్ విలువను కాపాడుకోవచ్చు. ఎన్పీఎస్లో ఇన్వెస్ట్ చేసి ఉంటే కనుక రిటైర్మెంట్ నాటికి సమకూరిన మొత్తం నుంచి 60 శాతాన్ని వెనక్కి తీసుకోవచ్చు. దీనిపై పన్ను భారం ఉండదు. అయితే ఈ మొత్తాన్ని తిరిగి మెరుగైన రాబడులను ఇచ్చే సాధనాల్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి. అప్పుడే మిగిలిన 30 ఏళ్ల జీవన అవసరాలకు అనుగుణంగా పెట్టుబడి వృద్ధిని చేసుకోవచ్చు. ప్రణాళిక విషయంలో ఆర్థిక నిపుణుడి సేవలు తప్పకుండా తీసుకోవాలి. రిటైర్మెంట్ నిధిని సమకూర్చుకునే విషయంలో భయం, ఊహాజనిత, ఉద్రేకాలకు అవకాశం ఇవ్వకుండా, క్రమశిక్షణతో ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్లాల్సి ఉంటుంది. గృహ రుణం ఇంకా తీర్చాల్సి ఉన్నా లేదా తమపై కుటుంబ సభ్యులు ఆధారపడి ఉన్నా.. రిటైర్మెంట్ తీసుకున్నప్పటికీ కొన్ని రకాల రక్షణ చర్యలు ఏర్పాటు చేసుకోవాలి. గృహ రుణం తీరేంత వరకు, తమ ఆదాయంపై కుటుంబ సభ్యులు ఆధారపడే కాలానికి టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. అలాగే, హెల్త్ ఇన్సూరెన్స్ కూడా తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలి. -
అధ్యక్ష బరిలో వివేక్ రామస్వామి.. ‘అమెరికా ఈ పరిస్థితికి చరమగీతం పాడదాం’
వాషింగ్టన్: భారతీయ మూలాలున్న అమె రికన్ యువ పారిశ్రామికవేత్త వివేక్ రామస్వామి ఆ దేశ అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం పోటీపడుతున్నారు. నిక్కీ హేలీ తర్వాత రిపబ్లికన్ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం బరిలో నిలిచిన భారతీయ మూలాలున్న రెండో భారతీయుడు వివేక్ కావడం విశేషం. 37 ఏళ్ల వివేక్ తల్లిదండ్రులు గతంలో కేరళ నుంచి అమెరికాకు వలసవచ్చారు. డొనాల్డ్ ట్రంప్కు పోటీగా దక్షిణ కరోలినా మాజీ గవర్నర్, ఐరాసలో అమెరికా మాజీ రాయబారి నిక్కీ హేలీ ఇటీవలే పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం పోటీపడుతున్నట్లు ప్రకటించి ప్రచారం మొదలుపెట్టడం తెల్సిందే. ‘అమెరికాను మళ్లీ అగ్రస్థానంలో నిలబెట్టేందుకు కృషిచేస్తా. అంతకుముందు మనం అమెరికా గొప్పదనాన్ని మరోసారి పునశ్చరణ చేసుకుందాం. చైనా ఆధిపత్యం వంటి సవాళ్లను అమెరికా ఎదుర్కొంటోంది. అమెరికా సార్వభౌమత్వాన్ని చైనా ఉల్లంఘిస్తోంది. ఒక వేళ రష్యా నిఘా బెలూన్ వచ్చి ఉంటే కూల్చి వెంటనే ఆంక్షలు విధించేవాళ్లం. చైనా విషయంలో ఆంక్షలు ఎందుకు విధించలేకపోయాం?. ఎందుకంటే ఆధునిక ప్రపంచంలో ఉత్పత్తుల కోసం చైనాపై మనం అంతలా ఆధారపడ్డాం. ఆర్థికంగా ఇలా మరో దేశంపై ఆధారపడే పరిస్థితికి చరమగీతం పాడదాం’ అని ఫాక్స్న్యూస్ ప్రైమ్టైమ్ షో సందర్భంగా వివేక్ వ్యాఖ్యానించారు. వివేక్ 2014లో రోవంట్ సైన్సెస్ను స్థాపించారు. హెల్త్కేర్, టెక్నాలజీ సంస్థలను స్థాపించి విజయవంతంగా నిర్వహిస్తున్నారు. 2022లో స్ట్రైవ్ అసెట్ మేనేజ్మెంట్ సంస్థనూ నెలకొల్పారు. అధ్యక్ష అభ్యర్థిగా బరిలో దిగాలంటే ముందుగా వివేక్ రామస్వామి, నిక్కీ హేలీ, డొనాల్డ్ ట్రంప్లలో ఎవరో ఒకరు రిపబ్లిక్ పార్టీలో పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిగా ప్రైమరీ ఎన్నికల్లో నెగ్గాలి. వచ్చే ఏడాది జనవరిలో ఈ ప్రక్రియ మొదలుకానుంది. అధ్యక్ష ఎన్నికలు వచ్చే ఏడాది నవంబర్ ఐదో తేదీన జరుగుతాయి. 2016లో బాబీ జిందాల్, 2020లో కమలాహ్యారిస్, ఈసారి నిక్కీ హేలీ తర్వాత అధ్యక్ష ఎన్నికలకు దిగిన నాలుగో ఇండో–అమెరికన్ వివేక్ రామస్వామికావడం విశేషం. -
అమెరికా అధ్యక్ష రేసులో భారత సంతతి వివేక్ రంగస్వామి!
వాషింగ్టన్: 2024లో అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసులో నిక్కీ హేలీ, మైక్ పాంపియో, మైక్ పెన్స్ వంటి హేమా హేమీలు పోటీలో ఉండబోతున్నారని ఇప్పటికే జోరుగా ప్రచారం జరుగుతోంది. వీరంతా డొనాల్డ్ ట్రంప్ పార్టీ అయిన రిపబ్లికన్ పార్టీకి చెందినవారే. అయితే తాజాగా మరో యువ పారిశ్రామికవేత్త పేరుకూడా గట్టిగా వినపడుతోంది. భారత సంతతికి చెందిన 37 ఏళ్ల వివేక్ రామస్వామికి కూడా అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో నిలబడే అవకాశం ఉందని చాలా మంది చెబుతున్నారు. ఈయన కూడా రిపబ్లికన్ పార్టీకి చెందిన వారే గమనార్హం. శాకాహారి అయిన వివేక్ రంగస్వామి వ్యాపారవేత్తగానే గాక.. ఇన్వెస్టర్గా గుర్తింపుపొందారు. బయోఫార్మాసూటికల్ కంపెనీ 'రోయివంట్ సైన్సెస్'కు వ్యవస్థాపక సీఈఓ. వోకిఇజం, సోషల్లీ రెస్పాన్సిబుల్ ఇన్వెస్టింగ్పై తన అభిప్రాయాలు చెప్పి అందరి దృష్టిని ఆకర్షించారు. అమెరికా ప్రముఖ మేగజీన్ 'ది న్యూయార్కర్'.. వివేక్ రంగస్వామిని 'యాంటీ-వోక్ సీఈఓ'గా అభివర్ణించింది. వోక్యిజం అంటే సామాజికంగా, రాజకీయంగా అందరీ న్యాయం జరగడం లేదని బాధపడే సున్నిత మనస్తత్వం లేదా భావజాలం. అయితే వోకియిజం పిడివాద భావజాలం అని వివేక్ వాదిస్తుంటారు. ఇది ప్రపంచంలోని వాస్తవ సమస్యలకు పరిష్కారాలను కనుగొనడం కంటే సామాజిక న్యాయాన్ని ప్రోత్సహించడంపైనే ఎక్కువ ఆసక్తి కలిగిఉందని చెబుతుంటారు. అందుకే ఈయనను 'యాంటీ-వోక్ సీఈవో' అని న్యూ యార్కర్ అభివర్ణించింది. రాజకీయంగా వివేక్కు ఎలాంటి అనుభవం లేకపోయినప్పటికి రిపబ్లికన్ పార్టీ తరఫున ఆయన అధ్యక్ష రేసులో నిలబడేందుకు సరైన అభ్యర్థి అని చాలా మంది భావిస్తున్నారు. అయితే వివేక్ అభ్యర్థిత్వాన్ని కొందరు స్వాగతిస్తుండగా.. మరికొందరు మాత్రం వ్యతిరేకిస్తున్నారు. ప్రెసిడెన్సీకి వ్యాపార ఆధారిత విధానాన్ని తీసుకురాగల సరికొత్త వ్యక్తిగా అతడ్ని కొందరు చూస్తున్నారు. మరికొందరేమో అతనికి ఏ మాత్రం రాజకీయ అనుభవం లేదని, వోకియిజంపై అతని ఆలోచనలు వాస్తవానికి పూర్తి భిన్నంగా ఉన్నాయని విమర్శలు గుప్పిస్తున్నారు. ఏదేమైనా.. ఒకవేళ వివేక్ రంగస్వామికి అమెరికా అభ్యర్థిగా నిలబడే అవకాశం లభిస్తే మాత్రం అది ప్రతి భారతీయుడికి గర్వకారణంగా చెప్పొచ్చు. చదవండి: ట్రంప్కు షాక్ ఇస్తున్న రిపబ్లికన్లు.. అధ్యక్ష ఎన్నికల్లో సవాల్.. నమ్మినవాళ్లే వ్యతిరేకులుగా.. -
రాముడంటే కేటీఆర్.. చంద్రుడంటే కేసీఆర్.. మంత్రి మల్లారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: అసలు దొంగలను వదిలేసి.. పేదలకు విద్యా దానం చేస్తున్న తమపై ఐటీ దాడులు చేశారని మంత్రి మల్లారెడ్డి అన్నారు. శుక్రవారంలో ఆయన శాసనసభలో మాట్లాడుతూ వివేక్, ఈటల మీద ఐటీ దాడులు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. చాయ్ అమ్మినట్లు పబ్లిక్ ప్రాపర్టీని అమ్ముతున్నారు. ఇప్పుడు సింగరేణిని కూడా అమ్ముతానంటున్నారు’’ అంటూ మంత్రి ధ్వజమెత్తారు. తెలంగాణలో రామచంద్రుల పాలన నడుస్తోంది. రాముడు అంటే రామారావు. చంద్రుడు అంటే కేసీఆర్. ఒకప్పుడు రామరాజ్యం విన్నాం. ఇప్పుడు తెలంగాణకు ఐటీ రాజ్యం తెచ్చిన ఘనత కేటీఆర్కే దక్కుతుంది. ఉద్యమ చంద్రుడు ఇవాళ సూర్యుడు అయ్యాడు. కేసీఆర్ పీఎం అవుతాడు.. కేటీఆర్ సీఎం అవుతాడు’’ అని మంత్రి మల్లారెడ్డి వ్యాఖ్యానించారు. చదవండి: తెలంగాణ సీఎస్కు ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ లేఖ -
HCA పై మాజీ ప్రెసిడెంట్ వివేక్ ఫైర్
-
అమ్మా ఉద్యోగం వచ్చింది ... నాక్కూడా బాబూ!
కేరళలో తల్లి, కొడుకు పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలు రాశారు. ఫలితాలు వచ్చాయి. కొడుక్కి ఉద్యోగం వచ్చింది. ‘అమ్మా... నాకు ఉద్యోగం వచ్చింది’ అన్నాడు తల్లి దగ్గరకు వెళ్లి. ‘నాక్కూడా బాబూ’ అని జవాబు చెప్పిందా తల్లి. ఇద్దరూ ఒకేసారి గవర్నమెంట్ ఉద్యోగులు అయ్యారు. వారిని ఉత్సాహపరిచిన తండ్రి ఆనందంతో కళ్లు తుడుచుకున్నాడు. ఇంత మంచి కుటుంబ కథా చిత్రం ఈ మధ్య చూళ్లేదు మనం. కొబ్బరిచెట్లు సంతోషంతో తలలు ఊపాయి. వీధి అరుగులు చప్పట్లు కొట్టాయి. ఒక సామాన్యమైన ఇంటిలో హటాత్తుగా రెండు గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చేసరికి ఈ సంబరం మనదే అన్నట్టుగా ఊరు ఉంది. దానికి కారణం మొన్న ఆగస్టు 3న కేరళలో ‘పబ్లిక్ సర్వీస్ కమిషన్’ పరీక్షల ఫలితాలు వెలువడ్డాయి. మలప్పురంలో అరిక్కోడ్ అనే ఉళ్లోని తల్లీకొడుకులు న్యూస్మేకర్స్గా నిలిచారు. తల్లి బిందు ‘లాస్ట్ గ్రేడ్ సర్వెంట్స్’ (ఎల్.జి.ఎస్.) విభాగంలో 92వ ర్యాంక్ సాధిస్తే కొడుకు వివేక్ ‘లోయర్ డివిజినల్ క్లర్క్’ (ఎల్.డి.సి.) విభాగంలో 38వ ర్యాంకు సాధించాడు. తల్లి వయసు 42. కొడుకు వయసు 24. పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలకు 40 ఏళ్లు పరిమితిగా ఉన్నా కొన్ని వర్గాలకు 42 ఏళ్లు మరికొన్ని వర్గాలకు 46 ఏళ్ల వరకూ మినహాయింపు ఉంది. తన సామాజికవర్గాన్ని బట్టి పరీక్ష రాయడానికి అర్హత ఉన్న బిందు 42 ఏళ్ల వయసులో ఈ ఉద్యోగం సాధించింది. ఈసారి కాకపోతే ఇంకేముంది... జాతీయస్థాయిలో ఇది విశేష వార్తగా మారింది. లాస్ట్ చాన్స్ బిందు చాలా కాలంగా అంగన్వాడి టీచర్గా పని చేస్తూ ఉంది. ఆ కాంట్రాక్ట్ ఉద్యోగంతో ఆమెకు సంతృప్తి లేదు. ఎప్పటికైనా గవర్నమెంట్ ఉద్యోగం సాధించాలి అనుకునేది. కొడుకు వివేక్ పదో క్లాసుకు వచ్చినప్పటి నుంచి ఆమె పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామినేషన్కు ప్రిపేర్ అవుతూ ఉంది. అంతే కాదు కొడుకుతో కూడా నువ్వు గవర్మెంట్ ఉద్యోగం సాధించాలిరా అని తరచూ చెప్పేది. చిన్నప్పటి నుంచి అతని చేత పత్రికలు చదివించేది. కొడుకు డిగ్రీ అయ్యాక అతనూ ఉద్యోగానికి ప్రిపేర్ అవడం మొదలెట్టాడు. బిందు పట్టుదల చూసి ఆమె భర్త పూర్తిగా మద్దతు పలికాడు. కోచింగ్ లో చేరండి అని చేర్పించాడు. ఇంతకు మునుపు చేసిన అటెంప్ట్స్ ఫలించలేదు. ఈసారి బిందుకు లాస్ట్ చాన్స్. ఈసారి మిస్సయితే ఇక ఎగ్జామ్ రాసే వయసు ఆమె వర్గానికి సంబంధించి దాటేస్తుంది. ఎలాగైనా సాధించాలి అనుకుందామె. కోచింగ్ చేరి బిందు, వివేక్ ఇద్దరూ ఒకే కోచింగ్ సెంటర్లో చేరారు. కలిసి వెళ్లి కోచింగ్ తీసుకుని వచ్చేవారు. ఆ తర్వాత ఎవరికి వారు ప్రిపేర్ అయ్యేవారు. ‘మేము మా గదుల్లోకి వెళ్లి చదువుకునేవాళ్లం. మధ్యలో మాత్రం డౌట్స్ వస్తే ఒకరినొకరం అడిగేవాళ్లం. నోట్సులు ఎక్స్ఛేంజ్ చేసుకునేవాళ్లం’ అన్నాడు వివేక్. సంకల్పం వృధా కాలేదు. ‘ఉద్యోగం వచ్చిందమ్మా’ అని కొడుకు పరిగెత్తుకుని వెళితే ‘నాక్కూడారా’ అని నవ్విందామె. భలే ఉంది కదా... ఈ కుటుంబ కథా చిత్రం. -
పురోహితురాలు.. అమెరికాలో పెళ్లిళ్లు చేస్తున్న సుష్మా ద్వివేది
పురుషులతోపాటు మహిళలు దాదాపు అన్నిరంగాల్లో సమానంగా రాణిస్తున్నారు. ఇప్పటిదాకా నిత్య పూజల నుంచి కైంకర్యాల దాకా అంతా మగ పూజారులు, పండితులు మాత్రమే చూసుకోవడం చూస్తున్నాం. కానీ అమెరికాలో పండితుల పీటమీద సుష్మా ద్వివేది కూర్చుని పెళ్లిళ్లు జరిపిస్తూ కొత్త ట్రెండ్ సెట్టర్గా నిలుస్తోంది. కుల, మత భేదం లేకుండా పెళ్లిళ్లు చేయడమే గాక, పూజలు, వ్రతాలు కూడా నిర్వహిస్తోంది. భారత సంతతికి చెందిన సుష్మ కెనడాలో పెరిగిన అమ్మాయి. 2013లో వివేక్ జిందాల్తో పెళ్లి జరిగింది. వీరి పెళ్లితోపాటు వివేక్ జిందాల్ తోబుట్టువు ఒకరి పెళ్లికూడా అదే సమయంలో ఏర్పాటు చేశారు. కానీ అది ఒక ట్రాన్స్జెండర్ పెళ్లి. దీంతో సుష్మా వాళ్ల పెళ్లి శాస్త్రోక్తంగా జరిగినప్పటికీ తోబుట్టువు పెళ్లి అలా జరగలేదు. అప్పుడు అంతా బాధపడ్డారు. ఆ పెళ్లి కూడా సంప్రదాయబద్ధంగా జరిగితే బావుండును అని సుష్మకు అనిపించింది. కానీ అలా జరగలేదు. ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటోన్న వారికి పరిష్కారం చూపాలని అప్పటి నుంచి ఆలోచించడం ప్రారంభించింది సుష్మ. తొలి బిడ్డ ప్రసవ సమయంలో... నెలలు నిండిన సుష్మ ఆసుపత్రిలో చేరింది. అక్కడ కాన్పు సవ్యంగా జరగడంతో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. అదే సమయంలో ఓ జంటకు పెళ్లి చేయడానికి ఎవరూ ముందుకు రావడం లేదని ఎనస్థీషియా డాక్టర్ ద్వారా తెలిసింది. ఆ జంట పెళ్లికి ముందే బిడ్డకు జన్మనివ్వడమే అందుకు కారణమని ఆమె చెప్పడంతో సుష్మ మరోసారి ఆలోచనలో పడింది. అరగంట ఆలోచించి ఆ జంటకు తానే పెళ్లిచే యిస్తానని చెప్పింది. ప్రసవం అయ్యి బెడ్మీద నుంచి కదలలేని పరిస్థితుల్లో ఉన్న సుష్మ గదిలోకి ఆ జంట రాగా అక్కడ ఉన్న నర్సులు పాట పాడగా ఆ జంటకు పెళ్లి తంతుని ముగించింది సుష్మ. ఈ కార్యక్రమం మొత్తాన్ని వివేక్ ఐఫోన్లో వీడియో తీశారు. ఆ తరువాత ఆ వీడియో బాగా వైరల్ అవ్వడంతో ఒక్కసారిగా సుష్మ పాపులర్ అయ్యింది. అప్పటి నుంచి హిందూ సంప్రదాయంలో ఉన్న పెళ్లిమంత్రాలను నేర్చుకుని పెళ్లిళ్లు చేయడం ప్రారంభించింది. బామ్మ దగ్గర నేర్చుకుని.. ప్రారంభంలో అంతా సుష్మను వ్యతిరేకించినప్పటికీ వాటన్నింటి దాటుకుని ముందుకు సాగుతూ అమెరికాలోనే తొలి మహిళా పురోహితురాలిగా నిలిచింది. ఇదే రంగంలో కొనసాగాలని నిర్ణయించుకున్న తరువాత హిందూ సంప్రదాయాల గురించి లోతుగా తెలిసిన బామ్మతో మాట్లాడి అనేక విషయాలు తెలుసుకుంది. అంతేగాక బామ్మతో కలిసి... పూజలు, పెళ్లికి ఏయేమంత్రాలు చదువుతారు? వాటిని ఎలా ఉచ్చరించాలి? సంప్రదాయ బద్ధంగా చేయాల్సిన క్రతువుల గురించి వివిధ గ్రంథాలను చదివి పెళ్లిమంత్రాలను ఆపోశన పట్టింది. అంతేగాక 88 ఏళ్ల బామ్మ ఇచ్చిన ఉంగరాన్ని తన వేలికి తొడుక్కుని అనేక పౌరోహిత్య కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఇలా ఇప్పటిదాకా దాదాపు యాభై పెళ్లిళ్లు చేసింది. అరగంట పెళ్లి.. ఎంతో చక్కగా పెళ్లిళ్లు చేస్తోన్నసుష్మా.. మరింతమందికి తన సేవలు అందించేందుకు 2016లో ‘పర్పుల్ పండిట్ ప్రాజెక్ట్’ పేరిట న్యూయార్క్లో సంస్థను ప్రారంభించింది. దీనిద్వారా పెళ్లితోపాటు అనేక మతపరమైన సేవలను అందిస్తోంది. దక్షిణాసియాలోని ‘గే’ కమ్యూనిటీ వాళ్లకు అరగంటలో పెళ్లి చేస్తుంది. సంప్రదాయ హిందూ పెళ్లిళ్లను మూడుగంటల్లో పూర్తి చేస్తోంది. అంతేగాక తన భర్త నిర్వహిస్తోన్న ఆర్గానిక్ ఫుడ్ కంపెనీ ‘డెయిలీ హార్వెస్ట్’కు ఉపాధ్యక్షురాలిగా కూడా సేవలందిస్తోంది. ఇద్దరు పిల్లల తల్లి ఒకపక్క సంసారాన్ని, మరోపక్క కంపెనీ బాధ్యతలనూ నిర్వర్తిస్తూనే పౌరోహిత్యం కూడా అంతే సజావుగా నిర్వహించడం చాలా గొప్ప విషయమని కామెంట్లు వస్తున్నాయి. సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన సుష్మ మరిన్ని పెళ్లిళ్లతో ముందుకు సాగాలని కోరుకుందాం. బాలింతగా ఆస్పత్రి బెడ్పైన ఉండి మరీ పెళ్లి జరిపిస్తున్న సుష్మ -
సాగర్ కాల్వలో ముగ్గురి గల్లంతు.. బాలుడిని కాపాడే కంగారులో ఈత రాకున్నా..
సాక్షి, ఖమ్మం: నగరంలోని సాగర్ ప్రధాన కాల్వ లో దానవాయిగూడెం వద్ద ఆదివారం ఈతకు వెళ్లిన ముగ్గురు వ్యక్తులు గల్లంతయ్యారు. ఖమ్మం, కోదాడ, సూర్యాపేట ప్రాంతాల్లోని అభయ్ ఆయుర్వేదిక్ ఆస్పత్రి శాఖల్లో పనిచేసే కేరళకు చెందిన ఏడుగురు వారాంతంలో భాగంగా ఖమ్మంలో కలుసుకున్నారు. సరదాగా సాగర్ కాల్వలో ఈతకు వెళ్లగా ముగ్గురు గల్లంతయ్యారు. కోదాడ నుంచి వచ్చిన ప్రదీప్, షాజీ, సూర్యాపేట నుంచి వచ్చిన అభయ్ సంతోష్, ఖమ్మంలో ఉన్న పరకాల సోను, వివేక్, షిబ్బు తోపాటు, ఖమ్మం మేనేజర్ సోను కుమారుడైన 11 సంవత్సరాల బాలుడు షారోన్ కలిసి అదివారం సరదాగా ఈతకు వెళ్లారు. ప్రదీప్, షాజీ, షిబ్బులు ఈతకోసం కాల్వలో దిగారు. మిగిలినవారు ఒడ్డున కూర్చున్నారు. బాలుడు షారోన్ ప్రమాదవశాత్తు కాల్వలో జారి పడ్డాడు. చదవండి: ('అమ్మ, నాన్నను కలపండి సారూ..’: శాన్విత) ఇది గమనించిన తండ్రి పరకాల సోను దూకగా..ఈత రాకున్నా కాపాడే కంగారులో వివేక్, అభయ్ సంతోష్లు కూడా కాల్వలోకి దూకారు. పిల్లాడిని ప్రదీప్ కాపాడి ఒడ్డుకు తీసుకొచ్చాడు. తండ్రి సోనును ఈతరాని ఇద్దరు వ్యక్తులు గట్టిగా పట్టుకోవడంతో ముగ్గురూ నీటిలో గల్లంతయ్యారు. ఖానాపురం హవేలి ఎస్ఐ మౌలానా ఆధ్వర్యంలో గాలింపు చేపట్టారు. -
బ్రాహ్మణ కోడూరు సచివాలయంలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు
-
టీకాపై వివాదాస్పద వ్యాఖ్యలు: నటుడు మన్సూర్కు బెయిల్
సాక్షి, చెన్నై: సినీ నటుడు మన్సూర్ అలీఖాన్కు మద్రాసు హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. టీకా కొనుగోలు నిమిత్తం రూ. రెండు లక్షలు ఆరోగ్య శాఖకు చెల్లించాలన్న నిబంధనతో ఈ బెయిల్ను కోర్టు మంజూరు చేయడం గమనార్హం. కరోనా టీకా వేయించుకున్న హాస్య నటుడు వివేక్ ఆస్పత్రి పాలు కావడంతో నటుడు మన్సూర్ అలీఖాన్ తీవ్ర ఉద్వేగానికి లోనైన విషయం తెలిసిందే. ఆ తర్వాత వివేక్ మరణించడం వంటి పరిణామాలతో కరోనా టీకా విషయంగా మన్సూర్ తీవ్రంగానే స్పందించారు. దీంతో టీకాపై అనుమానాలు, ఆందోళనలు బయలుదేరాయి. చెన్నై కార్పొరేషన్ కమిషనర్ ప్రకాష్ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు మన్సూర్ అలీఖాన్పై కేసు నమోదు చేశారు. దీంతో అరెస్టు నుంచి గట్టెక్కేందుకు తొలుత సెషన్స్ కోర్టును మన్సూర్ అలీఖాన్ ఆశ్రయించారు. అయితే, ఆయన బెయిల్ పిటిషన్ను కోర్టు తిరస్కరించింది. టీకా కోసం...రూ. రెండు లక్షలు.. సెషన్స్ కోర్టు బెయిల్ నిరాకరించడంతో మద్రాసు హైకోర్టును మన్సూర్ అలీఖాన్ ఆశ్రయించాల్సి వచ్చింది. గురువారం ఈ పిటిషన్ న్యాయమూర్తి దండపాణి నేతృత్వంలోని బెంచ్ ముందుకు విచారణకు వచ్చింది. మన్సూర్ తరఫు న్యాయవాది రాధాకృష్ణన్ వాదన వినిపిస్తూ, పథకం ప్రకారం లేదా, దురుద్దేశంతో ఆయన వ్యాఖ్యలు చేయలేదని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఉద్వేగానికి లోనై ఆ వ్యా ఖ్యలు చేశారని, ఇందుకు పశ్చాత్తాపం కూడా వ్యక్తం చేసినట్టు వివరించారు. వాదనల అనంతరం న్యాయమూర్తి స్పందిస్తూ, ఇలాంటి పరిస్థితుల్లో టీకాలకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడం మంచి పద్ధతి కాదని మందలించారు. విజ్ఞానశాస్త్రంపై నమ్మకం ఉంచాలని, పరిశోధకులు, వైద్యులు, ఫ్రంట్లైన్ వర్కర్లు అంటూ కరోనా కట్టడి కోసం శ్రమిస్తున్నారని గుర్తు చేశారు. చివరకు మన్సూర్ అలీఖాన్కు ముందస్తు బెయిల్ మంజూరు చేశారు. అయితే, కరోనా టీకా కొనుగోలు నిమిత్తం ఆరోగ్యశాఖ కార్యదర్శిని కలిసి రూ. 2 లక్షలు అందజేయాలన్న నిబంధనను విధించారు. -
వివేక్ కుటుంబానికి విజయ్ పరామర్శ
చెన్నై: ఇటీవల గుండెపోటుతో కన్నుమూసిన ప్రముఖ హాస్యనటుడు వివేక్ కుటుంబాన్ని నటుడు విజయ్ పరామర్శించారు. చిరునవ్వే ఆభరణంగా చిత్ర పరిశ్రమలో అజాతశత్రువుగా పేరు తెచ్చుకున్న నటుడు వివేక్. అలాంటి పేరున్న నటుడు ఈ నెల 17వ తేదీ ఈ లోకాన్ని విడిచిన సంగతి తెలిసిందే. ప్రధాని నరేంద్ర మోదీ నుంచి పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు వివేక్ మృతికి సంతాపాన్ని వ్యక్తం చేశారు. పలువురు ఆయన భౌతిక కాయానికి నివాళులర్పించారు. కాగా నటుడు విజయ్ ఆ సమయంలో జార్జియాలో చిత్రీకరణ జరుగుతున్న తన 65 చిత్ర షూటింగ్లో ఉన్నారు. వివేక్ మరణ వార్త తెలిసినా కరోనా నిబంధనల కారణంగా ఆయన భౌతికకాయానికి నివాళులు అర్పించలేని పరిస్థితి. విజయ్ ఆరంభకాలం నుంచి వివేక్ ఆయనతో కలిసి పలు చిత్రాల్లో నటించారు. చివరిగా విజయ్ కథానాయకుడిగా నటించిన బిగిల్ చిత్రంలో వివేక్ కీలక పాత్రను పోషించారు. కాగా జార్జియాలో షూటింగ్ పూర్తి చేసుకుని ఆదివారం చెన్నై చేరుకున్న విజయ్ సోమవారం ఉదయం వివేక్ ఇంటికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. చదవండి: ‘బ్లాక్’ క్యారెక్టర్ లీడ్గా సాగిన చిత్రం -
ప్రభుత్వాలకు ధన్యవాదాలు: నటుడు వివేక్ సతీమణి
తమిళసినిమా: ప్రముఖ హాస్యనటుడు వివేక్ శనివారం ఉదయం కన్నుమూసిన విషయం విదితమే. ఆయన జీవితంలోని పలు విశేషాలను గుర్తుచేసుకుందాం.. వివేక్ చిన్నతనం నుంచి చాలా చలాకీగా ఉండేవారు. దివంగత ప్రధానమంత్రి ఇందిరాగాంధీ పుట్టినరోజు నవంబర్ 19వ తేదీనే వివేక్ కూడా జన్మించారు. వివేక్ రెండో తరగతి చదువుతున్నప్పుడే తన తండ్రితో మాట్లాడి ఇందిరాగాంధీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ లేఖ రాశారు. అందుకు బదులుగా ఇందిరా గాంధీ కూడా వివేక్కు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ లేఖ రాయడం విశేషం. నటుడిగా ఎల్లలు దాటిన వివేక్ చిరకాల కోరిక ఆయన అంతిమదశలో నెరవేరింది. వివేక్.. రజినీకాంత్ నుంచి పలువురు ప్రముఖలతో కలిసి నటించారు. ఒక్క కమలహాసన్ మినహా. ఆ కోరిక ఇండియన్ –2 చిత్రంతో తీరింది. ఆ చిత్రం ఇంకా నిర్మాణంలోనే ఉంది. అదే వివేక్ నటించిన చివరి చిత్రమైంది. మరో విషయం ఏమిటంటే వివేక్ దర్శకుడుగా మెగాఫోన్ పట్టడానికి సలహాలు జరుగుతున్నాయి. ఈ విషయాన్ని సత్య జ్యోతి ఫిలిమ్స్ అధినేత టీజీ త్యాగరాజన్ తన సంతాప ప్రకటనలో వెల్లడించారు. వివేక్ ఆ కల నెరవేరకుండానే నిష్క్రమించారు. ఇదిలా ఉంటే.. అబ్దుల్ కలాంను స్ఫూర్తిగా తీసుకున్న వివేక్ రాష్ట్రం వ్యాప్తంగా కోటి మొక్కలు నాటేందుకు శ్రీకారం చుట్టారు. దీంతో ఆయనకు నివాళులర్పించే విధంగా అభిమానులు ఆదివారం నీలగిరిలో 4 లక్షల మొక్కలను నాటారు. కార్యక్రమంలో పాల్గొన్న నీలగిరి జిల్లా కలెక్టర్ ఇన్నెసెంట్ దివ్య ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించారు. వివేక్ మృతికి ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఇతర పార్టీల నేతలు సంతాపం ప్రకటించిన విషయం తెలిసింది. ఆయన భౌతిక కాయానికి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలను నిర్వహించారు. దీంతో వివేక్ సతీమణి అరుళ్ సెల్వి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు ఆమె ఆదివారం ఉదయం తన స్వగృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పేర్కొన్నారు. చదవండి: వ్యాక్సిన్కు, వివేక్ మృతికి సంబంధం లేదు కమెడియన్ వివేక్ మృతికి ప్రముఖుల నివాళులు.. ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
వ్యాక్సిన్కు, వివేక్ మృతికి సంబంధం లేదు
సాక్షి, చెన్నై: నటుడు వివేక్ గుండెపోటుకు గురయ్యే మరణించారని, వివేకంతో ఆలోచించి వ్యాక్సిన్ పట్ల భయాన్ని వీడండని చెన్నై కార్పొరేషన్ కమిషనర్ ప్రకాష్ కోరారు. చెన్నై పోరూరులో శనివారం ఏర్పాటు చేసిన వ్యాక్సిన్ శిబిరాన్ని ఆయన పరిశీలించారు. మీడియాతో మాట్లాడుతూ.. వివేక్ మరణానికి కరోనా వ్యాక్సినే కారణమని విపరీతంగా ప్రచారం జరిగిపోయింది. ఈ దుష్ప్రచారం వల్ల వ్యాక్సిన్ అంటేనే ప్రజలు భయపడిపోతున్నారు. వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల వివేక్ మరణించలేదని ఆరోగ్యశాఖ అధికారులు, ఆయనకు చికిత్స చేసిన వైద్యులు స్పష్టం చేశారు. ఈ వాస్తవాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజలు ధైర్యంగా వ్యాక్సిన్ వేసుకోవాలని కోరారు. ప్రజల్లో ఉన్న ఈ భయాన్ని పార దోలేందుకు ప్రత్యేక చర్యలు చేపడతామని వివరించారు. టాప్ టెన్లో తమిళనాడు.. రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతూ 8 వేలు దాటింది. దేశవ్యాప్తంగా అత్యధిక కరోనా కేసులు నమోదవుతున్న రాష్ట్రాల్లో తమిళనాడు 8వ స్థానంలో ఉంది. దేశస్థాయిలో రోజుకు సగటున 13.5 శాతం కేసులు నమోదవుతుండగా, తమిళనాడులో 8.5 శాతంగా ఉన్నట్లు ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి డాక్టర్ రాధాకృష్ణన్ తెలిపారు. కరోనా కేసులు పెరుగకుండా వివిధశాఖలతో సమన్వయమై అనేక చర్యలు చేపడుతున్నారు. కరోనా తీవ్రంగా ఉన్న రాష్ట్రాల్లో చేపట్టిన కఠిన చర్యలను తమిళనాడులో కూడా అమలు చేద్దామా అని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ రంజన్ రెండురోజులుగా అధికారులతో కలిసి ఆలోచిస్తున్నారు. ఈనెల 18వ తేదీన ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామిని రాజీవ్రంజన్ కలుసుకుని వైద్య నిపుణుల చేసిన సూచనలను వివరించనున్నారు. సీఎం సూచన మేరకు మరిన్ని కఠిన ఆంక్షలు అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. రాష్ట్రంలో చెన్నై, చెంగల్పట్టు, కాంచీపురం జిల్లాల్లో మాత్రమే కరోనా వ్యాప్తి వేగంగా ఉందని ప్రభుత్వం గుర్తించింది. నగరంలోని 35 శాతం మంది కరోనా బారినపడినట్లు చెబుతున్నారు. చెన్నైలోని ప్రభుత్వ ఆసుపత్రులు కరోనా రోగులతో నిండిపోవడంతో సాధారణ ఇన్పేషంట్ల అడ్మిట్, ఆపరేషన్లను నిలిపివేశారు. రాష్ట్రానికి మరో రెండు లక్షల డోసుల వ్యాక్సిన్: ఈనెల 17 లేదా 18వ తేదీ నాటికి మరో రెండు లక్షల వ్యాక్సిన్ డోసులు తమిళనాడుకు చేరుకుంటాయని ఆరోగ్యశాఖ సంచాలకులు డాక్టర్ సెల్వ వినాయకం తెలిపారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న 5 లక్షల డోసులు మూడు రోజులకు మాత్రమే సరిపోతుంది. శనివారం రాత్రి మరో 2 లక్షల డోసుల వ్యాక్సిన్లు తమిళనాడుకు చేరుకుంటాయి. ఇదిగాక మరో 20 లక్షల డోసుల అవసరం ఉందని తెలిపారు. మాజీ మంత్రికి కరోనా అన్నాడీఎంకే సీనియర్ నేత, మాజీ మంత్రి నత్తం విశ్వనాథన్కు శనివారం కరోనా సోకడంతో దిండుగల్లు జిల్లాలోని ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మాస్క్ వేసుకున్నా జరిమానా.. పుదుక్కోట్టై నగరంలో ఎస్ఐ శివకుమార్ మాస్క్లు ధరించని వారికి జరిమానాలు విధించే విధుల్లో ఉన్నారు. మాస్క్ధరించి వచ్చిన మురుగేశన్ (34)కు ఎస్ఐ రూ.200 జరిమానా విధించాడు. దీంతో సదరు వ్యక్తికి, ఎస్ఐకి మధ్య ఘర్షణ, తోపులాట చోటుచేసుకుంది. ఇందుకు ఆగ్రహించిన ఎస్ఐ.మురుగేశన్ను అరెస్ట్ చేసి పోలీస్టేషన్కు తరలించారు. కమెడియన్ వివేక్ మృతికి ప్రముఖుల నివాళులు.. ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి చదవండి: కోరిక తీరకుండానే వెళ్లిపోయిన వివేక్ కాలానికి కరిగిపోని ‘వివేక్’ నవ్వు -
ఆయన నవ్వులకు నాన్ స్టాప్
-
కోరిక తీరకుండానే వెళ్లిపోయిన వివేక్
సాక్షి, హైదరాబాద్: టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్ ఇలా పరిశ్రమ ఏదైనా తనదైన నటనతో ఆకట్టుకున్న ప్రముఖ హాస్య నటుడు వివేక్. ఆయన అకాల మరణం మొత్తం సినీరంగాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. 500కి పైగా చిత్రాలు, తన మార్క్ కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన వివేక్ తీవ్రమైన గుండెపోటుకు గురై అకస్మాత్తుగా ఈ లోకాన్ని వీడటం తీవ్ర విషాదాన్ని నింపింది. చాలా తొందర పడ్డారు సార్ అంటూ ఆయన హితులు, సన్నిహితులు తీరని ఆవేదన వ్యక్తం చేశారు. నటులు సూర్య, విక్రం, నటి జ్యోతిక, మహానటి ఫేం కీర్తి సురేష్తోపాటు పలువురు ప్రముఖులు వివేక్ మృతదేహానికి నివాళుర్పించారు. సూపర్ స్టార్ రజనీకాంత్ తన ట్విటర్ ద్వారా వివేక్కు సంతాపం తెలియజేస్తూ శివాజీ సినిమా షూటింగ్ నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. నటనపైన మక్కువ మాత్రమే కాదు..వివేక్ ప్రకృతి ప్రేమికుడు కూడా. పర్యావరణ పరిరక్షణకోసం నిరంతరం పాటుపడేవారు. తన నటనా కౌశలంతో పద్మశ్రీ పురస్కారాన్ని సొంతం చేసుకున్న వివేక్ తనకు గురువు మాజీ రాష్ట్రపతి, దివంగత ఏపీజే అబ్దుల్ కలాం అని ఎపుడూ చెబుతూ ఉండేవారు. ఈ క్రమంలోనే కలాం కోరిక మేరకు గ్లోబల్ వార్మింగ్కు వ్యతిరేకంగా ప్రచారంతోపాటు, చెట్ల పెంపకాన్ని తన జీవిత మిషన్గా చేపట్టారు. తన వంతు బాధ్యతగా కోటి చెట్లు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులోభాగంగా 2011 లో భారీ చెట్ల పెంపకం కోసం ‘గ్రీన్ కలాం’ ప్రాజెక్టును ప్రారంభించారు. ఈ మేరకు ఇప్పటికే 33.23 లక్షల మొక్కలు నాటారు. ఈ విషయాన్నే ఆయన అభిమానులు గుర్తు చేసుకుంటున్నారు. కోరిక తీరకుండానే వివేక్ ప్రకృతిలో కలిసిపోయారంటూ కంటతడిపెట్టారు. కానీ ఆయన ఆశయాన్ని ముందుకు తీసుకెళ్లాలని భావిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన ట్విటర్లో పోస్ట్ చేసిన వీడియోలను రీపోస్ట్ చేస్తున్నారు. దీంతో ఆర్ఐపీ వివేక్ సార్ హ్యాష్ట్యాగ్లో ట్రెండింగ్లో నిలిచింది. #RipVivek pic.twitter.com/MSYVv9smsY — Rajinikanth (@rajinikanth) April 17, 2021 Bye Sir. Even in death you were too ahead of your time. We will all miss you terribly. ❤️ There will be laughter and food for thought in the heavens tonight. #VIVEKH pic.twitter.com/zGRcUhEwmt — Siddharth (@Actor_Siddharth) April 17, 2021 Thalaivi Pays Homage to #Vivek sir #RIPVivekSir 💔🙏🏻 pic.twitter.com/enqgAOYmWY — sᴀɴᴅʜʏᴀ 🦄 ᴋᴇᴇʀᴛʜʏ 𝐃𝐞𝐯𝐨𝐭𝐞𝐞 (@Sandy_kitty_) April 17, 2021 We are shocked and saddened.. I missed sharing screen space with you and missed learning so much from a legend like you.. will miss you forever sir. Deepest condolences to the family🙏 #RIPVivekSir pic.twitter.com/DSSxzb7cG6 — Sivakarthikeyan (@Siva_Kartikeyan) April 17, 2021 Gone tooooo soon saar. Life is truly unfair. #RIPVivekSir deepest condolences to friends and family — venkat prabhu (@vp_offl) April 17, 2021 End of an era 💔 pic.twitter.com/QmoCBvMKcI — Hansika (@ihansika) April 17, 2021 -
వివేక్ మృతి పట్ల ప్రముఖుల సంతాపం
-
తమిళనాడు: ప్రముఖ హాస్యనటుడు వివేక్ కన్నుమూత
-
హాస్యనటుడు వివేక్ మృతి.. తమిళనాట దిగ్భ్రాంతి
చెన్నై : ప్రముఖ కోలీవుడ్ హాస్యనటుడు వివేక్ (59) కన్నుమూశారు. గుండెపోటుతో చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. ప్రముఖ దర్శకులు కె. బాలచందర్ పరిచయం చేసిన నటుల్లో వివేక్ కూడా ఒకరు. మొదట స్క్రిప్ట్ రైటర్గా పనిచేసిన వివేక్ 'మనదిల్ ఉరుది వేండం' సినిమాతో నటుడిగా అరంగేట్రం చేశారు. ఆ తర్వాత తమిళంలో టాప్ కమెడియన్గా ఎంతో క్రేజ్ సంపాదించుకున్నారు. ఒకనొక సమయంలో ఆయన లేకుండా తమిళంలో సినిమాలు రిలీజ్ అయ్యేవి కావని, అంతటి పాపులారిటీ ఉండేదని సినీ ప్రముఖులు గుర్తు చేసుకుంటున్నారు. దాదాపు 500కు పైగా చిత్రాల్లో నటించిన ఆయనను 2009లో భారత ప్రభుత్వం పద్మశ్రీతో సత్కరించింది. తెలుగులోనూ డబ్బింగ్ చిత్రాలతో వివేక్ ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు. బాయ్స్, శివాజీ, ప్రేమికుల రోజు, అపరిచితుడు, సింగం వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. వివేక్ కొడుకు ప్రసన్నకుమార్ 13 ఏళ్ల వయసులో మొదడులో రక్తం గట్టకట్టడంతో చనిపోయాడు. అనారోగ్యం కారణంగా వివేక్ తల్లి కూడా మరణించింది. కొడుకు, తల్లి ఆకస్మిక మరణాలతో వివేక్ బాగా కృంగిపోయాడని, అప్పటినుంచి సినిమాలు చేయడం కూడా తగ్గించాడని ఆయన సన్నిహితులు తెలిపారు. గురువారం చెన్నైలో కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న వివేక్.. ప్రజలంతా టీకా తీసుకునేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఇంతలోనే వివేక్ ఆకస్మిక మరణంతో తమిళ చిత్ర పరిశ్రమలో తీవ్ర దిగ్భ్రాంతి నెలకొంది. వివేక్ మృతి పట్ల దేవీశ్రీ ప్రసాద్, ఏఆర్. రెహమాన్, సుహాసిని, ప్రకాశ్రాజ్, రాఘవ లారెన్స్, జీవా, సమంత, ధనుష్, విజయ్, సహా పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. చిన్న వయసులోనే పెద్ద పేరు హాస్యనటుడు వివేక్ మృతిపట్ల తమిళ సీనియర్ నటుడు సత్యరాజ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అద్భుతమైన నటనతో చిన్న కలైవానర్గా పేరుతెచ్చుకుని కోట్లాది అభిమానులను సంపాదించుకున్నారని తెలిపారు. తన తమ్ముడిలాంటి వివేక్ ఇక లేడనే విషయం జీర్ణించుకోలేకపోతున్నానని పేర్కొన్నారు. వివేక్ కుటుంబ సభ్యులకు సత్యరాజ్ ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. ఈమేరకు ఆయన వీడియో సందేశం విడుదల చేశారు. Shattered. Heart broken. How is this even possible vivek. Too young too smart too talented too intelligent to go so early. — Suhasini Maniratnam (@hasinimani) April 17, 2021 OMG..cant believe I woke up to this Shocking news abt Legendary @Actor_Vivek sir🙏🏻 Heartbreaking.. Greatest Comedian of our Times who always incorporated a Social Message into his COMEDY I hav always been his diehard FAN U wl live in our Hearts forever dear Sir🙏🏻💐#ripvivek pic.twitter.com/4ferfSsgDm — DEVI SRI PRASAD (@ThisIsDSP) April 17, 2021 Ahhh.. #vivek ...gone too soon dear friend ..thank you for planting thoughts n trees ...thank you for entertaining and empowering us with your wit and humour..will miss you...RIP pic.twitter.com/oyoOkx8G9q — Prakash Raj (@prakashraaj) April 17, 2021 Frozen in disbelief. Cannot digest that Vivek sir is no more.This is a dark day for all of us . I have lost a valuable friend. Tamil cinema has lost a favorite son. The country has lost a wonderful role model. Om Shanti Vivek 😟😥 pic.twitter.com/ZWvji6m2x5 — Kasturi Shankar (@KasthuriShankar) April 17, 2021 What a great loss 😔. Shocked and saddened .. #RIPVivekSir pic.twitter.com/GVDojaTTOh — Samantha Akkineni (@Samanthaprabhu2) April 17, 2021 చదవండి : ప్రముఖ హాస్యనటుడు వివేక్ కన్నుమూత -
ప్రముఖ హాస్యనటుడు వివేక్ కన్నుమూత
తమిళనాడు: ప్రముఖ హాస్యనటుడు వివేక్ కన్నుమూశారు. నిన్న ఉదయం 11 గంటలకు గుండెపోటుతో చెన్నైలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేరిన ఆయన.. చికిత్స పొందుతూ శనివారం ఉదయం తుది శ్వాస విడిచారు. దాదాపు 500లకు పైగా చిత్రాల్లో వివేక్ నటించారు. దర్శకుడు కె.బాలచందర్ పరిచయం చేసిన నటుల్లో వివేక్ ఒకరు. 'మనదిల్ ఉరుది వేండం' ద్వారా ఆయన సినీ ఆరంగేట్రం చేశారు. రజనీకాంత్, కమల్హాసన్, విజయ్, అజిత్తో కలిసి ఆయన నటించారు. గురువారం చెన్నైలో కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న వివేక్.. ప్రజలంతా టీకా తీసుకునేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఇంతలోనే వివేక్ ఆకస్మిక మరణంతో తమిళ చిత్ర పరిశ్రమలో తీవ్ర దిగ్భ్రాంతి నెలకొంది. చదవండి: ముళ్లపొదల నుంచి ఏడుపులు.. అసలేం జరిగింది..? సీబీఐ మాజీ డైరెక్టర్ రంజిత్ సిన్హా: రాత్రి కరోనా.. తెల్లారే మృతి -
ప్రముఖ హాస్యనటుడికి గుండెపోటు, పరిస్థితి విషమం
సాక్షి, చెన్నై: ప్రముఖ తమిళ హాస్య నటుడు వివేక్ (59) తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు. ఆయనకు తీవ్ర ఛాతీ నొప్పి రావడంతో ఆయనను శుక్రవారం ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చారు. కార్డియాక్ అరెస్ట్తో బాధపడుతున్న వివేక్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని ఆసుపత్రి వర్గాలు ధృవీకరించాయి. కోవిడ్-19 వ్యాక్సిన్ తీసుకున్న మరుసటి రోజే వివేక్ తీవ్ర అనారోగ్యానికి గురి కావడం కలకలం రేపింది. అయితే వ్యాక్సిన్కు, గుండెపోటుకు సంబంధం ఉందా అనే దానిపై ఎలాంటి స్పష్టత లేదు. ప్రస్తుతం ఎక్మో ట్రీట్మెంట్ అందిస్తున్న ప్రైవేట్ ఆసుపత్రి వైద్యుల బృందం ఆయన ఆరోగ్యాన్ని నిశితంగా పర్యవేక్షిస్తోంది కాగా చెన్నై ఓమందూరు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో వివేక్ గురువారం కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు. ఈ సందర్భంగా వైద్యులు, సిబ్బందికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. టీకా మాత్రమే మన ప్రాణాలను కాపాడుతుందంటూ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. -
అతిథి వస్తున్నారు
కేరళలో 1970లలో జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘అధిరన్’. సాయిపల్లవి, ఫాహద్ ఫాజిల్, ప్రకాష్ రాజ్, అతుల్ కులకర్ణి ప్రధాన పాత్రల్లో వివేక్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఈ ఏడాది ఏప్రిల్లో విడుదలై ఘనవిజయం సాధించింది. ఈ చిత్రం ‘అనుకోని అతిథి’ పేరుతో నవంబర్ 15న తెలుగులో రిలీజ్ కానుంది. ఇన్ ట్రూప్ ఫిలిమ్స్ సమర్పణలో జయంత్ ఆర్ట్స్ బ్యానర్పై అన్నంరెడ్డి కృష్ణకుమార్, గోవింద రవికుమార్ తెలుగులో విడుదల చేస్తున్నారు. నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘సైకలాజికల్ థ్రిల్లర్గా రూపొందిన చిత్రమిది. సాయిపల్లవి, ప్రకాశ్రాజ్, అతుల్ కులకర్ణి నటన సూపర్బ్. ప్రభాస్ ‘సాహో’కి నేపథ్య సంగీతం అందించిన జిబ్రాన్ ఈ చిత్రానికి అద్భుతమైన నేపథ్య సంగీతం అందించారు. మలయాళంలోలానే తెలుగులోనూ విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: అను మోతే దత్, సంగీతం: పి.ఎస్. జయహరి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: దక్షిన్ శ్రీన్వాస్, సమర్పణ: దీపా సురేందర్ రెడ్డి. -
వివేక్పై అభిమానుల ఆగ్రహం
చెన్నై,పెరంబూరు: సీనియర్ హాస్యనటుడు వివేక్పై శివాజీగణేశన్ అభిమానులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించిన వివరాలు చూస్తే విజయ్ నటించిన బిగిల్ చిత్ర ఆడియో ఆవిష్కరణ వేదికపై ఆయన చేసిన వ్యాఖ్యలను అన్నాడీఎంకే నాయకులు తీవ్రంగా ఖండించడంతో పాటు, నటుడు విజయ్పై ఎదురు దాడి చేస్తున్న విషయం తెలిసిందే. కాగా అదే వేదికపై నటుడు వివేక్ చేసిన వ్యాఖ్యలు ఆయన్ని ఇరుకున పడేశాయి. 1980లో శివాజీగణేశ్, వైజయంతిమాల జంటగా నటించిన ఇరుంబుతిరై చిత్రంలోని నెంజిల్ కుడియిరుక్కుం అనే పాటను అపహాస్యం చేసే విధంగా వివేక్ చేసిన వ్యాఖ్యలకు శివాజీగణేశన్ సమూగ నల పేర్వై సమాఖ్య తీవ్రంగా ఖండించింది. ఈ విషయమై ఆ సమాఖ్య అధ్యక్షుడు చంద్రశేఖరన్ బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. కొందరు వేదికనెక్కే ఛాన్స్ రాగానే అక్కడ చేరిన ప్రజలను చూసి ఏదేదో మాట్లాడతారన్నారు. అందుకు నటుడు వివేక్ అతీతం కాదన్నారు. ఆయన బిగిల్ చిత్ర ఆడియో ఆవిష్కరణ వేదికపై దివంగత మహానటుడు శివాజీగణేశన్ నటించిన ఇరుంబుతిరై చిత్రంలోని నెంజిల్ కుడిఇరుక్కుం అనే పాటను పరిహాసం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఏ నటుడినైనా పొగుడుకోవచ్చని, ఏ సంగీత దర్శకుడినైనా ప్రశంసించుకోవచ్చని, అయితే ఒకరి ప్రాపకం కోసమే ఎంతో ప్రజాదరణ పొందిన పాటను పరిహసించడం వివేక్కు తగదని అన్నారు. నటుడు వివేక్ ఇంతకు ముందు కూడా పరాశక్తి చిత్రంలో శివాజీగణేశన్ న్యాయస్థానంలో చెప్పే సంభాషణలను ఎగతాళి చేసే విధంగా మాట్లాడారని అన్నారు. ఇక ముందు కూడా వివేక్ ఇలానే ప్రవర్తిస్తే అతనికి వ్యతిరేకంగా పోరాటం చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. వివేక్ వివరణ: కాగా శివాజీగణేశన్ అభిమానుల ఆగ్రహానికి స్పందింవిన నటుడు వివేక్ 1980లో శివాజీగణేశన్ నటించిన ఇరుంబుతిరై చిత్రంలోని నెంజిల్ కుడియిరుక్కుం అనే పాటలో ప్రేమ భావం కలుగుతుందనీ, నటుడు విజయ్ చెప్పిన దానిలో మంత్రశక్తిలా అనిపిస్తోందని తాను చెప్పానరి, అభిమానులు, మనసు కలిగిన వారు అర్థం చేసుకోవాలని నటుడు వివేక్ తన ట్విట్టర్లో పేర్కొన్నారు. -
‘కేసీఆర్ వాటికే పరిమితమయ్యారు’
సాక్షి, మంచిర్యాల : మంచిర్యాల జిల్లా కేంద్రంలో శనివారం బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యాక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, మాజీ మంత్రులు పెద్ది రెడ్డి,మాజీ ఎంపీ వివేకానంద, బోడ జనార్దన్, మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డి హాజరయ్యారు.బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజల మనోభావాలకు అనుగుణంగా బీజేపీ పనిచేస్తుందని, అందుకే ప్రజలు బీజేపీకి బ్రహ్మరథం పడుతున్నారని పేర్కొన్నారు. ప్రజలకు సేవ చేయాలని టీఆర్ఎస్కు మరోసారి అవకాశం కల్పిస్తే కేసీఆర్ ఫామ్ హౌస్కే పరిమితమై అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు. కేంద్రంలో సారూ, కారు, సర్కారు.. అని చెప్పిన కేసీఆర్ బీరు, కారుకే పరిమితం అయ్యారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో తెరాస, కాంగ్రెస్ పార్టీల మధ్య రహస్య ఒప్పందంలో భాగంగానే కేసీఆర్ అవినీతిపై కాంగ్రెస్ నాయకులు మాట్లాడడం లేదని ఆరోపించారు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం కేసీఆర్కు అలవాటుగా మారిందని, కేసీఆర్ 5వేల కోట్ల రూపాయల విలువ గల భవనాలను కూల్చివేసేందుకు కుట్రలు చేస్తున్నారని అభిప్రాయపడ్డారు. ఇక మాజీ ఎంపీ వివేక్ మాట్లాడుతూ.. కేసీఆర్ తన స్వార్థ ప్రయోజనాల కోసం తుమ్మిడి హేట్టి వద్ద ప్రాజెక్టును నిర్మించకుండా కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించారని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టును కమీషన్ల ప్రాజెక్టుగా మార్చిన ఘనత కేసీఆర్కు దక్కుతుందని, రాష్ట్రంలో లక్ష ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన కేసీఆర్ యువకుల జీవితాలతో ఆటలాడుతున్నారని మండిపడ్డారు. పెద్దపల్లి పార్లమెంటు నియోజక వర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేశానని, తనపై అసత్య ప్రచారాలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. -
రాజకీయ ముఖచిత్రం మారుతోంది...
సాక్షి, మంచిర్యాల : జిల్లా రాజకీయ ముఖచిత్రం మారుతోంది. ఇప్పటివరకు పెద్దగా ప్రభావం చూపని బీజేపీ బలోపేతం దిశగా సాగుతోంది. కేంద్రంలో వరుసగా రెండోసారి అధికారంలోకి రావడం, రాష్ట్రంలో నాలుగు పార్లమెంట్ స్థానాలు కైవసం చేసుకోవడంతో అనూహ్యంగా బీజేపీ పుంజుకొంటోంది. తాజాగా పెద్దపల్లి మాజీ ఎంపీ జి.వివేక్ కమలం గూటికి చేరడంతో జిల్లాలో ఆయన వర్గంగా ఉన్న నాయకులు, తటస్థులు, ఇతర పార్టీల వాళ్లు బీజేపీలో చేరేందుకు మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఆశావహుల అడుగులు కమలం వైపు పడుతున్నాయి. త్వరలో బీజేపీలో చేరికలు. మారిన రాజకీయ పరిస్థితుల్లో ఆశావహులంతా బీజేపీ వైపు దృష్టి సారిస్తున్నారు. పక్కనున్న ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ లోక్సభ స్థానాలను బీజేపీ కైవసం చేసుకోవడంతో పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలోనూ అదే ఊపు కనిపిస్తోంది. ఇదే సమయంలో మాజీ ఎంపీ జి.వివేక్ బీజేపీలో చేరడం ఆ పార్టీలో మరింత ఉత్సాహాన్ని నింపింది. వివేక్ కుటుంబానికి జిల్లాలో బలమైన వర్గం ఉండడంతో ఆ వర్గమంతా ఇప్పుడు బీజేపీలో చేరే అవకాశం ఉంది. ముఖ్యంగా వివేక్ పట్టు అధికంగా ఉన్న బెల్లంపల్లి, చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ ప్రభావం కాస్త ఎక్కువగా కనిపించనుంది. బీజేపీలో చేరడానికి ముందు వివేక్ జిల్లాలోని తన ముఖ్య అనుచరులతో మంతనాలు జరిపినట్లు సమాచారం. దీనితో స్థానిక నాయకులు కూడా బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. బెల్లంపల్లి మున్సిపల్ మాజీ చైర్పర్సన్, మాజీ కౌన్సిలర్లు పెద్ద సంఖ్యలో బీజేపీలో చేరనున్నట్లు సమాచారం. అలాగే చెన్నూరు, మంచిర్యాలల్లోనూ మున్సిపల్ ఆశావహులు, టీఆర్ఎస్, కాంగ్రెస్ అసంతృప్తులు కమలం బాట పట్టనున్నారు. త్వరలో నిర్వహించబోయే కార్యక్రమంలో ఈ చేరికలు ఉండనున్నట్లు పార్టీ సీనియర్ నేత ఒకరు తెలిపారు. మున్సిపల్ ఎన్నికలే టార్గెట్ అనూహ్యంగా బలం పెంచుకుంటున్న బీజేపీ రానున్న మున్సిపల్ ఎన్నికలను లక్ష్యంగా చేసుకొంది. జిల్లాలో మంచిర్యాల, లక్సెట్టిపేట, నస్పూరు, క్యాతన్పల్లి, బెల్లంపల్లి, చెన్నూరు మున్సిపాల్టీలున్నాయి. సహజంగానే పట్టణ ప్రాంతాల్లో కాస్త ఎక్కువ ప్రభావం ఉండే బీజేపీ మున్సిపల్ ఎన్నికలకు సిద్ధంగా ఉంది. పైగా ఆర్టికల్ 370 రద్దు అంశం కూడా తమకు బాగా కలిసివస్తుందనే ధీమాతో ఆ పార్టీ నేతలున్నారు. ఈ సమయంలో జిల్లాలో పట్టున్న వివేక్ బీజేపీలో చేరడంతో పార్టీలో జోష్ మరింత పెరిగింది. జిల్లాలో వివేక్ పార్టీకి పెద్ద దిక్కుగా మారనున్నారు. పార్టీలో చేరడంతోనే మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ గెలుపు ద్వారా తన ప్రాభవం చూపించేందుకు వివేక్ పావులు కదుపుతున్నారు. జిల్లాలో బీజేపీకి సగం మున్సిపాల్టీలైనా సాధించిపెట్టి, తనబలాన్ని చూపించాలనే తాపత్రేయంతో ఆయన ఉన్నట్లు సమాచారం. ప్రధానంగా బెల్లంపల్లి, క్యాతన్పల్లి, చెన్నూరు మున్సిపాల్టీలను కైవసం చేసుకొనే దిశగా దృష్టి పెట్టారు. మంచిర్యాల, లక్సెట్టిపేట, నస్పూరుల్లోనూ పాగా వేసేందుకు సన్నహాలు చేస్తున్నారు. ఆ దిశగా బీజేపీలో చేరికలు ఉండనున్నాయి. ఏదేమైనా అదనపు బలాలతో పటిష్టంగా మారుతున్న బీజేపీలో చేరేందుకు మున్సిపల్ ఆశావహులు సమాయత్తమవుతున్నారు. -
అమెరికాలో తెలుగు విద్యార్థి దుర్మరణం
ఐరాల: చిత్తూరు జిల్లా ఐరాల మండలం మిరియం గంగనపల్లెకు చెందిన యువకుడు అమెరికాలో శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందాడు. కుటుంబసభ్యుల వివరాల ప్రకారం...గ్రామానికి చెందిన పత్తిపాటి ఉమాపతి నాయుడు బెంగళూరులో రియల్ ఎస్టేట్ రంగంలో స్థిరపడ్డాడు. ఆయన కుమారుడు వివేక్ (28) అమెరికాలోని నార్త్ కెరోలిన స్టేట్ యూనివర్శిటీలో ఎమ్ఎస్ చదివేందుకు ఆరు నెలల క్రితం వెళ్లాడు. ప్రమాదవశాత్తూ శుక్రవారం 11.55 నిమిషాలకు (భారత కాలమానం ప్రకారం) యూనివర్శిటీ సమీపంలో రోడ్డు ప్రమాదానికి గురై మరణించాడు. అక్కడి పోలీసులు కేసు నమోదు చేశారు. వివేక్ మృతదేహాన్ని బుధవారం మిరియంగంగనపల్లెకు తరలించనున్నారు. -
రాజకీయాల్లోకి వస్తా : ప్రముఖ హాస్యనటుడు
సాక్షి, చెన్నై : నేనూ రాజకీయాల్లోకి వస్తానని నటుడు వివేక్ అన్నారు. హాస్యనటుడిగా పేరుగాంచిన ఈయన సోమవారం కోడైకెనాల్లోని ఒక ప్రైవేట్ కళాశాలలో మొక్కలు నాటే కార్యక్రమంలో అమెరికాకు చెందిన మిత్రుడితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివేక్ మీడియాతో మాట్లాడుతూ తమిళనాడు మంచి నీళ్లు లేని రాష్ట్రంగా మారుతోందనే భయాన్ని వ్యక్తం చేశారు. కాలువలు, చెరువులను శుద్ధి చేసే కార్యక్రమాలను యువత చేపట్టాలని పిలుపునిచ్చారు. వర్షాన్ని కురిపించే శక్తి చెట్లకు ఉందన్నారు. కాబట్టి విద్యార్థులు మొక్కలు నాటే ప్రయత్నం చేయాలన్నారు. ఇంటర్ నుంచి డిగ్రీకి వెళ్లే విద్యార్థులు ప్రతి ఏడాది ఒక మొక్క చోప్పున నాటినా పర్యావరణాన్ని కాపాడగలుతారన్నారు. తాను అబ్దుల్కలాం సూచన మేరకు రాష్ట్రంలో కోటి మొక్కలను నాటే పథకాన్ని చేపట్టానని తెలిపారు. అందులో ఇప్పటికి 30 లక్షల 23 వేల మొక్కలను నాటానని చెప్పారు. అదే విధంగా రానున్న వర్షాకాలంలో పర్యాటకులు పర్యావరణాన్ని కాపాడుకోవాలని హితవు పలికారు. కాగా నటుడు, మక్కళ్నీది మయ్యం పార్టీ అధ్యక్షుడు ఇటీవల చేసిన వ్యాఖ్యల గురించి అడుగుతున్నారని, అది ఆయన వ్యక్తిగతం అని అన్నారు. అదే విధంగా నటుడు రజనీకాంత్ కచ్చితంగా రాజకీయాల్లోకి వస్తారని అన్నారు. తనకు రాజకీయాల గురించి తెలియదని, ప్రస్తుతానికి తనకలాంటి ఆలోచన లేదనిచెప్పారు. అయితే త్వరలో తాను రాజకీయాల్లోకి వచ్చినా ఆశ్చర్యం పడాల్సిన అవసరం లేదని నటుడు వివేక్ పేర్కొన్నారు. -
నాపై కేసీఆర్ ఆటబొమ్మలు తప్పుడు ప్రచారం..
సాక్షి, హైదరాబాద్ : టీఆర్ఎస్ అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కు మాజీ ఎంపీ గడ్డం వివేక్ వెంకటస్వామి బహిరంగ లేఖ రాశారు. ప్రభుత్వ సలహాదారు పదవితో పాటు టీఆర్ఎస్కు వివేక్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఒక పథకం ప్రకారమే తాను పోటీ చేసే అవకాశం లేకుండా కేసీఆర్ చివరి క్షణంలో పెద్దపల్లి లోక్ సభ టికెట్ నిరాకరించారని ఆయన తన లేఖలో ఆరోపించారు. ఈ సందర్భంగా వివేక్ తీవ్రస్థాయిలో టీఆర్ఎస్ పార్టీ విమర్శలు గుప్పించారు. చదవండి... (టీఆర్ఎస్కు వివేక్ రాజీనామా) ‘కేసీఆర్ ఆటబొమ్మలు కొందరు నా మీద తప్పుడు ఆరోపణలు ప్రచారం చేస్తున్నారు. పార్టీకి వ్యతిరేకంగా పోటీ చేసిన వ్యక్తికి టికెట్ ఇవ్వడాన్ని బట్టే ఎవరు ద్రోహం చేశారో తెలిపోయింది. నా తండ్రి కాకా, నేను తెలంగాణ సాధనే లక్ష్యంగా రాజీలేని పోరాటం చేశాం. తెలంగాణ మేలు కోసమే కేసీఆర్ ఆహ్వానిస్తే పార్టీలోకి వచ్చాను. తెలంగాణ కోసం పని చేయడం, ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా లొంగకుండా పోరాడడమే పార్టీకి ద్రోహం చేయడమా?. పార్టీ బలహీనంగా ఉన్నచోట పటిష్టం చేయడానికి పని చేయడమే నేను చేసిన ద్రోహమా?. 2014లో టీఆర్ఎస్ ఇద్దరు ఎంపీలే ఉంటే నేను తోటి ఎంపీలతో కలిసి బిల్లు ఆమోదం కోసం జాతీయ పార్టీలపై ఒత్తిడి తేవడమే నేను చేసిన ద్రోహమా?. చదవండి....(వివేక్ ఔట్.. వెంకటేశ్కే టికెట్) తెలంగాణ సాధనలో కాకా సేవలకు గుర్తింపుగానే ట్యాంక్ బండ్పై విగ్రహం పెట్టారు. టికెట్ హామీ ఇచ్చి కూడా నన్ను పెద్దపల్లికి దూరంగా ఉంచడానికే కేసీఆర్ తొత్తులు కొందరు పనిచేశారు. ప్రభుత్వ సలహాదారుగా ఎలాంటి ప్రయోజనాలు తీసుకోకపోగా, ఆ పదవి వల్లే హైదరాబాద్ క్రికెట్ సంఘం అధ్యక్షుడి పదవి పోగొట్టుకోవాల్సి వచ్చింది. ఇదే నేను చేసిన ద్రోహం కావచ్చు. నా ప్రజలకు నన్ను దూరం చేయడానికి చేసిన ఈ ద్రోహం నాకు దిగ్భ్రాంతి కలిగిస్తోంది. ఉద్యమంలో ఏ పాత్ర లేనివాళ్లకు, కనీసం జై తెలంగాణ అని నినాదం కూడా చేయనివాళ్లకు టికెట్లిచ్చారు. తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలకు విరుద్ధంగా ఉద్యమకారులను పక్కన బెట్టారు. (కేసీఆర్ నమ్మించి గొంతు కోశారు: వివేక్) తెలంగాణకు, ప్రజలకు వ్యతిరేకంగా పని చేసినవాళ్లే ఇప్పుడు పార్టీకి పెద్ద ముఖాలుగా ఉండడం బాధిస్తోంది. ప్రజాస్వామిక తెలంగాణ సాధించాలన్న ఆశయం నెరవేరకపోగా నియంతృత్వ పోకడలను ప్రజల మీద రుద్దుతున్నారు. ఈ విషయాన్ని జనం త్వరలోనే గుర్తిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా అభిమానులు, మద్దతుదారులు కోరుతున్నా కూడా సమయం తక్కువగా ఉండడం వల్ల పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నా. జీవితాంతం తెలంగాణ ప్రజల మేలు కోసం పనిచేస్తూనే ఉంటా. కష్టకాలంలో తోడున్న మద్దతుదారులకు ధన్యవాదాలు.’ అని వివేక్ ఆ లేఖలో పేర్కొన్నారు. (‘వివేక్ దళితుడు కాదు’) -
టీఆర్ఎస్కు వివేక్ గుడ్బై
సాక్షి, హైదరాబాద్ : అనుకున్నట్లే జరిగింది. లోక్సభ ఎన్నికల్లో పెద్దపల్లి టికెట్ ఆశించి భంగపడిన మాజీ ఎంపీ గడ్డం వివేక్ సోమవారం టీఆర్ఎస్కు రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామా లేఖను పార్టీ అధిష్టానానికి పంపించారు. తనకు ఎంపీ టికెట్ ఇవ్వనందుకు ప్రభుత్వ సలహాదారు పదవికి రాజీనామా చేసిన ఆయన...ఇవాళ అధికారికంగా టీఆర్ఎస్ను వీడారు. కేసీఆర్ నమ్మకద్రోహం వల్లే తనకు టికెట్ రాలేదని, నమ్మించి గొంతు కోశారని వివేక్ ఆరోపణలు గుప్పించారు. తనకు టికెట్ ఇవ్వకుండా ఉండేందుకే చివరి వరకూ అభ్యర్థులను ప్రకటించలేదని ఆయన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ సలహాదారు పదవి ఇచ్చినా, ప్రోటోకాల్ మాత్రం పాటించలేదన్నారు. తెలంగాణ ఉద్యమకారులకు టీఆర్ఎస్లో అవమానాలే జరుగుతాయని వివేక్ విమర్శించారు. కాగా టీఆర్ఎస్ టికెట్ రాకపోవడంతో వివేక్ బీజేపీలో చేరతారనే ప్రచారం గత రెండు రోజులుగా జరిగింది. అయితే ఎన్నికలకు సమయం తక్కువగా ఉండటం వల్ల స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసేందుకు ఆయన ధైర్యం చేయలేదు. దీంతో వివేక్ ఏకంగా లోక్సభ ఎన్నికలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. చదవండి...(కేసీఆర్ నమ్మించి గొంతు కోశారు: వివేక్) సోమవారం నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ కావడంతో కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు, రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి కుంతియా తదితరులు వివేక్తో సంప్రదింపులు జరిపినా ఎలాంటి హామీ ఇవ్వలేదని సమాచారం. కాగా పార్టీ అభ్యర్థిగా గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి రెండుసార్లు బయటకు వచ్చిన నేపథ్యంలో సెంటిమెంట్గా కూడా మరోసారి పార్టీలో చేరేందుకు వివేక్ ససేమిరా అన్నారట. (అన్న రాజకీయాల కోసం.. తమ్ముడి తప్పటడుగులు!) -
‘వివేక్ దళితుడు కాదు’
సాక్షి, పెద్దపల్లి : అధికారం కోసమే మాజీ ఎంపీ వివేక్ గతంలో టీఆర్ఎస్లో చేరారని చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ విమర్శించారు. గోదావరిఖనిలో శనివారం ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ..అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులను ఓడించేందుకు వివేక్ సోదరులు పథకాలు రచించారని ఆరోపించారు. ఎమ్మెల్యేల విజ్ఞప్తిలను హైకమాండ్ గుర్తించే వివేక్కు టికెట్ ఇవ్వలేదన్నారు. అధికారం లేనిదే వివేక్ సోదరులకు నిద్రపట్టదని అందుకే పార్టీలు మారుతూ ఉంటారని ఎద్దేవా చేశారు. వివేక్ దళితుడు కాదని ధనవంతుడని విమర్శించారు. దేశంలో ఎన్నో రాష్ట్రాల్లో ఫ్యాక్టరీలు స్థాపించిన వివేక్ సోదరులు... పెద్దపల్లిలో ఎన్ని ఫ్యాక్టరీలు నిర్మించారో చెప్పాలన్నారు. -
వివేక్ దారెటు..?
సాక్షి, భూపాలపల్లి: టీఆర్ఎస్ పెద్దపల్లి ఎంపీ టికెట్ వివేక్కు దక్కకపోవడంతో జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. మొన్నటి వరకు ఆయనకే సీటు వరిస్తుందని అనుకున్నప్పటికీ చివరి నిమిషంలో అభ్యర్థి పేరు మారడం హాట్ టాపిక్గా మారింది. జిల్లాలోని కాటారం, మహదేవాపూర్, మల్హర్, పలిమెల, మహాముత్తారం మండలాలు పెద్దపల్లి లోక్సభ పరిధిలోకి వస్తాయి. కాగా ఇన్నాళ్లుగా వివేక్కే సీటు పక్కా అనుకున్న వారికి చివరిలో షాక్ తగిలింది. వివేక్ను కాదని కొత్తగా వచ్చిన బోర్లకుంట వెంకటేష్ నేతకు టికెట్ ఇవ్వడంతో నియోజకవర్గ ప్రజలతో పాటు జిల్లాలో కూడా ఆసక్తికర చర్చ నడుస్తోంది. ప్రస్తుతం వివేక్ దారి ఎటనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. బీజేపీ నుంచి పోటీ చేస్తారనే ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. దశాబ్దాలుగా చుట్టూ పక్కల నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలుగా ఎవరుండాలని నిర్ణయించిన వెంకటస్వామి కుటుంబానికి ప్రస్తుతం టికెట్ రాలేదనే వార్తలు వాట్సాప్, ఫేస్బుక్లో చక్కర్లు కొడుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలే కొంప ముంచాయా.. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చోటుచేసుకున్న కొన్ని పరిణామాలే వివేక్ టికెట్ దక్కకపోవడానికి కారణంగా తెలుస్తోంది. వివేక్ టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా పని చేశారని పలువురు ఎమ్మెల్యేలు గతంలో బహిరంగంగానే విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికల్లో వివేక్ సోదరుడు మాజీ మంత్రి వినోద్ చెన్నూర్ నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ టికెట్ను ఆశించి భంగపడ్డారు. దీంతో ఆయన బెల్లంపల్లి నియోజకవర్గం నుంచి బీఎస్పీ తరఫున పోటీ చేసి టీఆర్ఎస్ అభ్యర్థి చిన్నయ్య చేతిలో ఓటమిపాలయ్యారు. తన అన్న గెలుపు కోసం టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా పని చేశారని పెద్దపల్లి లోక్సభ పరిధిలోని మంచిర్యాల, చెన్నూ ర్, బెల్లంపల్లి, ధర్మపురి, రామగుండం, పెద్దపల్లి ఎమ్మెల్యేలు బాహాటంగానే విమర్శించినట్లు సమాచారం. ఎమ్మెల్యే సూచనల మేరకే టీఆర్ఎస్ పెద్దలు వివేక్కు పెద్దపల్లి ఎంపీ సీటు నిరాకరించినట్లు జిల్లా ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇలా వచ్చాడు.. అలా పట్టాడు.. కొత్తగా పార్టీలో చేరిన బోర్లకుంట వెంకటేష్ నేతకు పెద్దపల్లి టికెట్ వరించింది. వెంకటేష్ నేత గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. జిల్లాను ఆనుకుని ఉన్న చెన్నూర్ నియోజకవర్గం నుంచి బరిలో నిలిచాడు. ఇదే నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ తరఫున బాల్క సుమన్ పోటీ చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఒక దశలో బాల్క సుమన్కు వెంకటేష్ నేత గట్టిపోటీని ఇచ్చారు. గతంలో వ్యతిరేకంగా పనిచేసిన వీరిద్దరు ప్రస్తుతం టీఆర్ఎస్ గెలుపు కోసం కలిసి పని చేస్తున్నారు. ఇటీవలే స్వయంగా బాల్క సుమన్ దగ్గర ఉండి వెంకటేష్ నేతను టీఆర్ఎస్లో చేర్పించారు. దీంతో చివరి నిమిషం దాకా వివేక్కే అనుకున్న టికెట్ వెంకటేష్ నేత తలుపు తట్టింది. కాగా ప్రస్తుతం జిల్లాలో ఉన్న వివేక్ అనుకూలవర్గం టీఆర్ఎస్కు సహకరిస్తుందా అని ప్రజలు మాట్లాడుకుంటున్నారు. త్వరలో బీజేపీలో వివేక్ చేరుతారంటూ జిల్లాలో వార్తలు వినిపిస్తున్నాయి. -
అన్న రాజకీయాల కోసం.. తమ్ముడి తప్పటడుగులు!
తెలంగాణ రాష్ట తొలి సీఎంను ఓ దళితుడినే చేస్తానని కేసీఆర్ ప్రకటించిన సమయంలో.. ఆ జాబితాలో ఉన్న కీలక వ్యక్తుల్లో పెద్దపల్లి మాజీ ఎంపీ, ప్రభుత్వ ప్రత్యేక సలహాదారుడు గడ్డం వివేకానంద ఒకరు. కానీ, ఆ తర్వాత జరిగిన పరిణామాలతో తన తండ్రి జి.వెంకటస్వామి కాలంనాటి నుంచి వారసత్వంగా వస్తున్న పెద్దపల్లి ఎంపీ సీటు కూడా టీఆర్ఎస్ పార్టీ తరపున తెచ్చుకోలేకపోయారు. అన్న వినోద్ విషయంలో తమ్ముడు వివేక్ వేసిన తప్పటడుగులే ఆయన రాజకీయ భవిష్యత్తుపై ప్రభావం చూపించిందా అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. 2013లో తెలంగాణ ఉద్యమం చివరిదశలో ఉన్నప్పుడు కాంగ్రెస్ ఎంపీగా ఉంటూనే తన సోదరుడు వినోద్తో కలిసి టీఆర్ఎస్లో చేరిన ఆయన ఎన్నికలముందు తిరిగి కాంగ్రెస్లో చేరారు. అప్పట్లో వివేక్కు టీఆర్ఎస్ పార్టీ నుంచి పెద్దపల్లి ఎంపీ సీటు ఖరారైనప్పటికీ.. తన సోదరుడు వినోద్కు చెన్నూరు టికెట్ ఇవ్వని కారణంగా పార్టీని వీడారు. దీంతో 2014 సార్వత్రిక ఎన్నికల సమయంలో వివేక్ టీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్లో చేరడంతో అనూహ్యంగా బాల్క సుమన్కు పెద్దపల్లి ఎంపీ టికెట్టు దక్కింది. అనంతరం కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన వివేక్పై టీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన బాల్క సుమన్ ఘనవిజయం సాధించారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తరువాత కేసీఆర్తో ఉన్న సాన్నిహిత్యంతో పెద్దపల్లి టికెట్ హామీతో వివేక్ మరోసారి టీఆర్ఎస్లో చేరారు. వివేక్కు కేసీఆర్ కూడా తగిన ప్రాధాన్యం ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా నియమించారు. అంతేకాకుండా రానున్న సార్వత్రిక ఎన్నికల సమయంలో వివేక్కు ఎలాంటి ఆటంకం కలగకూడదని పెద్దపల్లి సిట్టింగ్ ఎంపీ బాల్క సుమన్ను చెన్నూరు అసెంబ్లీ నుంచి పోటీ చేయించారు. అయితే డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో అన్న వినోద్ విషయంలో వివేక్ వ్యవహరించిన తీరు, పెద్దపల్లి లోక్సభ పరిధిలోని టీఆర్ఎస్ పార్టీలో ముసలం పుట్టించి చివరికి వివేక్కు సీటు దక్కకుండా చేసింది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా వివేక్ సోదరుడు వినోద్కు టీఆర్ఎస్ పార్టీ నుంచి టికెట్ దక్కలేదు. దీంతో బీఎస్పీ నుంచి వినోద్ పోటీ చేశారు. అయితే అక్కడ టీఆర్ఎస్ అభ్యర్థి చిన్నయ్యకు వ్యతిరేకంగా తన సోదరుడిని గెలిపించేందుకు వివేక్ కృషి చేశారని స్థానిక నేతలు కేసీఆర్కు ఫిర్యాదు చేశారు. అదే సమయంలో పెద్దపల్లి ఎంపీ నియోజక వర్గపరిధిలోని మిగతా ఎమ్మెల్యేలు కూడా తమను ఓడించేందుకు వివేక్ ప్రయత్నించారని కేసీఆర్ దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై కేటీఆర్కు వివేక్ వివరణ కూడా ఇచ్చుకున్నారు. అంతేకాకుండా వివేక్ తిరిగి టీఆర్ఎస్లో చేరిననాటి నుంచి సిట్టింగ్ ఎంపీగా ఉన్న బాల్కసుమన్ నడుమ విభేదాలు కొనసాగుతూ వచ్చాయి. వివేక్కు కేసీఆర్, కేటీఆర్ స్థాయిలో పరిచయాలున్నా, స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలను కలుపుకుని పోవడంలో వైఫల్యం చెందారు. ఈ పరిణామాల నేపథ్యంలో వివేక్ను కాదని చివరి నిమిషంలో పార్టీలో చేర్చుకొని మరీ బోర్లకుంట వెంకటేశ్ నేతకానికి పెద్దపల్లి ఎంపీ అభ్యర్థిగా కేసీఆర్ చాన్స్ ఇచ్చారు. రెండు సందర్భాల్లోనూ అన్న వినోద్ కోసం వివేక్ చేసిన తప్పిదాలే ఆయన రాజకీయ భవిష్యత్తుపై నీలినీడలు కమ్ముకునేలా చేశాయని స్థానికంగా చర్చ జరుగుతుంది. -
‘కొప్పుల’ను ఓడించేందుకు వివేక్ ప్రోద్బలం, 3 కోట్లు..!
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్: పెద్దపల్లి లోక్సభ పరిధిలో రాజకీయం రంగులు మారుతోంది. శాసనసభ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన టీఆర్ఎస్ పార్టీలో అంతర్మథనం మొదలైంది. పెద్దపల్లి లోక్సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలోని రెండు స్థానాల్లో టీఆర్ఎస్ పరాజయం పాలైంది. మంథనిలో పుట్ట మధు, రామగుండంలో సోమారపు సత్యనారాయణ భారీ తేడాతో ఓటమి పాలుకాగా, ధర్మపురిలో సీనియర్ శాసనసభ్యుడు కొప్పుల ఈశ్వర్ అతి కష్టంగా విజయం సాధించారు. రాష్ట్రవ్యాప్తంగా టీఆర్ఎస్ భారీ మెజారిటీతో గెలిస్తే పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోనే ఇలాంటి ఫలితాలు రావడానికి ‘బలమైన’ శక్తులు పనిచేశాయని ఓడిన ఇద్దరితోపాటు గెలిచిన ఎమ్మెల్యేలు కూడా భావిస్తున్నారు. భవిష్యత్ రాజకీయ వ్యూహంలో భాగంగానే మాజీ ఎంపీ జి.వివేక్ లోక్సభ పరిధిలో ఫలితాలను శాసించేందుకు యత్నించారని వారు భావిస్తున్నారు. భగ్గుమంటున్న పార్టీ శ్రేణులు ఇటీవల దర్మపురి నియోజకవర్గం టీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులు వివేక్పై బాహాటంగానే విమర్శలు చేశారు. పార్టీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ను ఓడించేందుకు వివేక్ వర్గీయులు రూ.3 కోట్లు ఖర్చు చేశారని, వివేక్ ప్రోద్బలంతోనే ఇది జరిగిందని వారి ఆరోపణ. బెల్లంపల్లి నుంచి తన సోదరుడు వినోద్ను బీఎస్పీ అభ్యర్థిగా బరిలోకి దింపి, తమ నేతను ఓడించేందుకు విచ్చలవిడిగా ఖర్చు చేశారని చిన్నయ్య వర్గీయులు ఆరోపిస్తున్నారు. చెన్నూరులో వివేక్ ఆఖరులో మాత్రమే ప్రచారానికి వచ్చారని బాల్క సుమన్ అనుచరులు గుర్తు చేస్తున్నారు. రామగుండంలో రెబెల్గా పోటీ చేసిన కోరుకంటి చందర్కు వివేక్ వర్గీయులు మద్ధతుగా నిలిచినట్లు సోమారపు అనుచరుల ఆరోపణ. వివేక్ కారణంగా భారీ మెజారిటీ కోల్పోయినట్లు మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్రావు అనుచరులు చెబుతున్నారు. మంథనిలో పుట్టా మధు కోసం వివేక్ ప్రచారం చేసినా, ఫలితమివ్వలేదు. ఈ నేపథ్యంలో పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గం పరిధిలోని దాదాపు ఐదు సెగ్మెంట్లలో పోటీ చేసిన అభ్యర్థులు, వారి అనుచరు ల్లో వివేక్ పట్ల అసంతృప్తి పెల్లుబుకుతోంది. దీంతో పెద్దపల్లి ఎంపీ సీటుపై సందిగ్ధం నెలకొంది. వివేక్కు లోక్సభ సీటిస్తే ఒప్పుకునేది లేదని సగానికి పైగా ఎమ్మెల్యేలు స్పష్టం చేస్తున్నారు. -
హెచ్సీఏ నుంచి విశాక లబ్ధి పొందలేదు
హైదరాబాద్: రాజకీయ లబ్ధి కోసమే తమ సంస్థపై బురద చల్లుతున్నారని విశాక ఇండస్ట్రీస్ ప్రతినిధి వలీనాథ్ ఆరోపించారు. హెచ్సీఏ నుంచి విశాక లబ్ధి పొందిందని వస్తోన్న వార్తల్లో నిజం లేదని ఆయన స్పష్టం చేశారు. కొద్ది నెలలుగా ఉద్దేశపూర్వకంగానే కొందరు తమపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఆయన ఆగ్రహించారు. బుధవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో లీగల్ అడ్వైజర్ రజనీకాంత్తో కలిసి ఆయన పాల్గొన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన రాజీవ్గాంధీ స్టేడియం నిర్మాణం కోసం కోట్లాది రూపాయలు అప్పు తెచ్చి మరీ ఖర్చుపెట్టిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. స్టేడియం నిర్మాణం కోసం ఎవ్వరూ ముందుకు రాకపోవడంతో ఆ బృహత్తర కార్యక్రమాన్ని విశాక భుజాన వేసుకుందని చెప్పారు. ఆ సమయంలో స్టేడియానికి విశాక ఇండస్ట్రీస్ పేరు పెడతామని ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపారు. చేసుకున్న అగ్రిమెంట్లకు విలువ ఇవ్వని హెచ్సీఏ ఈ విషయాన్ని రాజకీయం చేసి విశాక పేరును తొలిగించిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అంశంలో కోర్టు తీర్పు కూడా విశాకకు అనుకూలంగా వచ్చిందన్న విషయాన్ని గుర్తుచేశారు. -
‘వీహెచ్ మానసిక పరిస్థితి సరిగ్గా లేదనుకుంటా’
హైదరాబాద్: అంబర్పేట్ క్రికెట్ క్లబ్ అధ్యక్షుడు, మాజీ ఎంపీ వి. హనుమంతరావు తనపై నిరాధారమైన ఆరోపణలు చేస్తూ పబ్బం గడుపు కుంటున్నారని హెచ్సీఏ అధ్యక్షుడు జి. వివేకానంద ఆగ్రహం వ్యక్తం చేశారు. హెచ్సీఏ నుంచి రూ. 12 కోట్లు... విశాక ఇండస్ట్రీస్ తీసుకుందన్న వీహెచ్ ఆరోపణల్లో నిజం లేదని ఆయన స్పష్టం చేశారు. ఎలాంటి ఆధారాలు లేకుండా తనపై తప్పుడు ఆరోపణలు ఎందుకు చేస్తున్నారో అర్థం కావట్లేదని అసహనం వ్యక్తం చేశారు. శనివారం ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వీహెచ్పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వీహెచ్ మానసిక పరిస్థతి సరిగ్గా లేదంటూ వాగ్బాణాలు విసిరారు. ‘వీహెచ్ ఆరోపణలన్నీ నిరాధారమైనవి. విశాక ఇండస్ట్రీస్ డబ్బు తీసుకుందనడంలో నిజం లేదు. 2004లో స్టేడియం కట్టే సమయంలో విశాక ఇండస్ట్రీస్ నుంచి రూ. 4.32 కోట్లు స్పాన్సర్షిప్ చేశాం. 2011లో అర్షద్ ఆయూబ్ మా అగ్రిమెంట్ను అక్రమంగా రద్దు చేశారు. దీనిపై మేము ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్లో అప్పీల్ చేస్తే... హెచ్సీఏ రూ. 25.92 కోట్లు విశాకకు పెనాల్టీగా ఇవ్వాలని ఆర్బిట్రేషన్ తీర్పునిచ్చింది. కానీ తర్వాత జరిగిన ఎస్జీఎంలో విశాకతో వివాదాన్ని కోర్టు బయట తేల్చుకోవాలని నిర్ణయించుకున్న హెచ్సీఏ... అందుకు అనుగుణంగా వ్యవహరించింది. అప్పటి హెచ్సీఏ కార్యదర్శి జాన్ మనోజ్ సివిల్ కోర్టు జడ్జి ఎదుట విశాకతో తమ వివాదం ముగిసిందంటూ మెమో సమర్పించాడు. ఇందుకు ప్రతిఫలంగా విశాకకు రూ. 17.50 కోట్ల రూపాయలు చెల్లిస్తున్నట్లు ఆ మెమోలో పేర్కొన్నాడు. కానీ ఇప్పటివరకు చిల్లిగవ్వ కూడా హెచ్సీఏ నుంచి విశాకకు అందలేదు’ అని ఆయన వివరించారు. హెచ్సీఏ అధ్యక్ష పదవికి పోటీపడిన అజహరుద్దీన్, కార్యదర్శి శేష్ నారాయణ్, మాజీ అధ్యక్షుడు అర్షద్ ఆయూబ్, మాజీ కార్యదర్శి జాన్ మనోజ్ అందరిపై కేసులున్నాయని... వీరంతా తనను విమర్శిస్తున్నారని వివేక్ మండిపడ్డారు. -
న్యాయ పోరాటానికి సిద్ధం
హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్సీఏ) అధ్యక్ష పదవిలో కొనసాగేందుకు తనకు అర్హత లేదంటూ అంబుడ్స్మన్ ఇచ్చిన తీర్పుపై న్యాయపోరాటం చేస్తానని జి.వివేకానంద్ ప్రకటించారు. దీనిపై హైకోర్టులో అప్పీల్కు వెళుతున్నట్లు, వీలైనంత తొందరగా తనకు న్యాయం లభిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. శుక్రవారం వివేకానంద్ ప్రెస్ క్లబ్లో మీడియాతో మాట్లాడారు. లోధా సూచనల ప్రకారం తాను అన్ని వివాదాస్పద అంశాలపై అంబుడ్స్మన్ నరసింహారెడ్డికి ముందే స్పష్టత ఇచ్చానని... అయితే ఆయన తన వివరణను పరిగణనలోకి తీసుకోకుండా ప్రత్యర్థి వర్గానికి అనుకూలంగా వ్యవహరించడం దురదృష్టకరమని వివేక్ అన్నారు. ప్రధానంగా రెండు అంశాలను పరిగణనలోకి తీసుకుంటూ తనపై అనర్హత వేటు వేశారన్న మాజీ ఎంపీ, ఆ రెండూ తనకు వర్తించవని స్పష్టం చేశారు. ‘లాభదాయక పదవిలో ఉంటున్నానని, కేబినెట్ హోదా ఉందని అంబుడ్స్మన్ తీర్పులో ఉంది. అయితే నేను ఏనాడూ ప్రభుత్వ పదవి కోసం ప్రమాణ స్వీకారం చేయలేదు. కేబినెట్లో లేను. అది నిజమైతే ఎన్నికల సమయంలోనే రిటర్నింగ్ అధికారి నా దరఖాస్తును తిరస్కరించేవారు. హెచ్సీఏ నియమావళిలో కూడా దీని గురించి ఎక్కడా లేదు. రెండోదైన పరస్పర విరుద్ధ ప్రయోజనాల ఘర్షణ (కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రస్ట్) పరిధిలో కూడా నేను లేను. ఎందుకంటే హెచ్సీఏ, విశాక ఇండస్ట్రీస్ మధ్య ఒప్పందం 2016లోనే ముగిసింది కాబట్టి ఇప్పుడు నేను విశాక ద్వారా ఎలాంటి లాభం పొందడం లేదు’ అని వివేక్ వెల్లడించారు. గురువారం లోధా కమిటీ సిఫారసులపై వాదనల సందర్భంగా ఎవరెవరు అనర్హులు అవుతారో అనే దానిపై సుప్రీం కోర్టు స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చింది కాబట్టి దాని ఆధారంగా హైకోర్టులో తాజాగా పోరాటానికి సిద్ధమైనట్లు వివేక్ తెలియజేశారు. ఒకప్పుడు రూ. 4.3 కోట్లు ఇచ్చిన తమతో హెచ్సీఏ ఒప్పందాన్ని ఉల్లంఘించి, ఆ తర్వాత నష్టపరిహారంగా రూ. 17.5 కోట్లు చెల్లిస్తామని కోర్టులోనే పిటిషిన్ దాఖలు చేసింది కాబట్టి విశాక–హెచ్సీఏ ఒప్పందం ముగిసిన అధ్యాయమని వివేక్ వ్యాఖ్యానించారు. హెచ్సీఏలో అవినీతికి అలవాటు పడిన వారిని కాదని సొంత డబ్బులతో ఆట అభివృద్ధికి కృషి చేస్తున్న తనను విమర్శించడంలో అర్థం లేదని ఆయన అన్నారు. -
వెళ్లండి.. మళ్లీ రాకండి
ఇంటి నుంచి బయటికెళ్లేటప్పుడు, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఇంటికి వెళ్లి, అక్కణ్ణుంచి వచ్చేటప్పుడు ‘వెళ్లొస్తాం’ అంటాం. కానీ హాస్పిటల్కి వెళితే మాత్రం వెళ్తాం అని మాత్రమే డాక్టర్స్కు చెబుతాం. ఎందుకంటే.. మళ్లీ అనారోగ్యంతో హాస్పిటల్కి రాకూడదని, లైఫ్లో ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో. ప్రజెంట్ నటి నయనతారకు కూడా వెళ్తాం అని చెప్పగానే ‘వెళ్లండి.. మళ్లీ రాకండి’ అంటున్నారట. అర్థం కాలేదా? ఆమె డాక్టర్ అని చెప్తున్నాం. అజిత్ హీరోగా శివ దర్శకత్వంలో రూపొందుతున్న ‘విశ్వాసం’లో నయనతార నాయికగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ ముంబైలో స్టార్ట్ అయ్యిందని సమచారం. ఇందులో నయనతార డాక్టర్గా నటిస్తున్నారట. అలాగే ఈ సినిమాలో అజిత్ డబుల్ రోల్ చేస్తున్నారన్న వార్త షికారు చేస్తోంది. వివేక్, యోగిబాబు, కోవై సరళ తదితరులు నటిస్తున్న ఈ సినిమాకు డి. ఇమ్మాన్ స్వరాలు అందిస్తున్నారు. ఈ సినిమాను సంక్రాంతికి తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి రిలీజ్ చేయాలని చిత్రబృందం ప్లాన్ చేస్తోందని సమాచారమ్. -
సంక్రాంతికి...
పొంగల్ బాక్సాఫీస్పై అజిత్ గురిపెట్టాడా? అంటే అవుననే అంటున్నాయి కోలీవుడ్ వర్గాలు. శివ దర్శకత్వంలో అజిత్ హీరోగా తమిళంలో రూపొందుతున్న సినిమా ‘విశ్వాసం’. నయనతార కథానాయిక. వివేక్, యోగిబాబు, బోస్ వెంకట్ కీలక పాత్రలు చేస్తున్నారు. ‘వీరమ్, వేదాళం, వివేగం’ సినిమాల తర్వాత అజిత్–శివ కాంబినేషన్లో రూపొందుతున్న ‘విశ్వాసం’ చిత్రాన్ని ఈ ఏడాది దీపావళికి రిలీజ్ చేయాలనుకున్నారు. తాజాగా ఈ సినిమా సంక్రాంతికి విడుదల కానుందని కోలీవుడ్ టాక్. సెకండ్ షెడ్యూల్ ఈరోజు నుంచి స్టార్ట్ అవుతుంది. తన కెరీర్లో వంద సినిమాలకు సంగీతం అందించిన డి. ఇమ్మాన్ తొలిసారి అజిత్తో వర్క్ చేస్తున్నారు. హాస్యనటుడు యోగిబాబు కెరీర్లో ‘విశ్వాసం’ 100వ సినిమా కావడం విశేషం. -
ఫ్యామిలీ ‘వార్’
చిన్నమ్మ శశికళ కుటుంబంలోఅంతర్యుద్ధం తెర మీదకు వచ్చింది.మేనమామ దివాకరన్ను ఢీకొనేందుకు మేనల్లుడు దినకరన్ సిద్ధం అయ్యారు.ఈ ఇద్దరి మధ్య చాపకింద నీరులా సాగుతూ వచ్చిన ఇంటిపోరు అనర్హత వేటు పడ్డ ఎమ్మెల్యే వెట్రివేల్ ట్వీట్ రూపంలో తాజాగా వెలుగులోకి వచ్చింది. సాక్షి, చెన్నై : దివంగత సీఎం జయలలిత నెచ్చెలి, చిన్నమ్మ శశికళ కుటుంబం నుంచి వార్తల్లో వ్యక్తులుగా శశికళ సోదరుడు దివాకరన్, అన్న జయరామన్ పిల్లలు వివేక్, కృష్ణప్రియ, అక్క వనితామణి కుమారుడు దినకరన్ ఉంటున్నారు. చిన్నమ్మ జైలు జీవితం తదుపరి కుటుంబానికి పెద్ద దిక్కుగా దివాకరన్, రాజకీయ ప్రతినిధిగా దినకరన్ అడుగులు వేస్తున్నారు. ఆస్తుల పంపకాల వ్యవహారం కుటుంబంలో అంతర్యుద్ధానికి దారితీసినట్టు కొంత కాలంగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం ఉప ప్రధాన కార్యదర్శిగా, చిన్నమ్మ ప్రతినిధిగా దినకరన్ రాజకీయ బలోపేతం కోసం తీవ్రంగానే శ్రమిస్తున్నారు. అదే సమయంలో కుటుంబం వ్యక్తుల నిర్వహణలో ఉన్న సంస్థల్లో దినకరన్ జోక్యం వివాదానికి మరింత ఆజ్యం పోస్తున్నట్టు సమాచారం. దీంతో ఎవరికి వారు అన్నట్టు ముందుకు సాగుతుండడం జైల్లో ఉన్న చిన్నమ్మను కుంగదీస్తున్నట్టు తెలిసింది. భర్తమరణంతో పెరోల్ మీద వచ్చిన సమయంలో ఈ విభేదాలు చిన్నమ్మను ఉక్కిరిబిక్కిరి చేయడంతోనే ముందస్తుగానే ఆమె జైలుకు వెళ్లినట్టుగా మద్దతుదారులు సైతం వ్యాఖ్యానిస్తున్నారు. ఎవరెన్ని వివాదాలు సృష్టించినా, ఒత్తిడి తెచ్చినా చిన్నమ్మ మాత్రం దినకరన్కు అండగా నిలబడ్డట్టు చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలో సోమవారం ఫేస్బుక్లో చిన్నమ్మ విశ్వాసపాత్రుడు, అనర్హత వేటు పడ్డ ఎమ్మెల్యే వెట్రివేల్ పోస్టుచేసిన ఓ ట్వీట్ ఫ్యామిలీ వార్ను తెర మీదకు తీసుకొచ్చింది. వెట్రివేల్ ట్వీట్ దివాకరన్ ఎవరికో వత్తాసు పలికే రీతిలో స్పందించడం మొదలెట్టినట్టుందని వెట్రివేల్ ట్విట్టర్లో విమర్శించారు. స్వలాభం కోసం పాకులాడవద్దని పరోక్షంగా దివాకరన్కు హెచ్చరించారు. తమలో గందరగోళ పరిస్థితుల్ని సృష్టించే ప్రయత్నాలు చేయవద్దని చురకలంటించారు. సీఎం ఎడపాడి పళనిస్వామి మద్దతుదారుడు ఛత్రపతి శివగిరి ద్వారా అనర్హత వేటు పడ్డ ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా స్పందించడం మొదలెట్టినట్టుందని ఆరోపించారు. ఎవరెన్ని కుట్రలు చేసినా, కుతంత్రాలు పన్నినా చిన్నమ్మ బలాన్ని, దినకరన్ ఎదుగుదలను అడ్డుకోలేరని హెచ్చరించారు. దినకరన్ బలాన్ని నీరుగార్చేందుకు కొత్త ప్రయత్నాల్లో పడ్డట్టు స్పష్టం అవుతోందన్నారు. రాజకీయ తెరపైకి జయ ఆనందన్ దినకరన్ మీద తీవ్ర ఆగ్రహంతో ఉన్న దివాకరన్ చిన్నమ్మ ప్రతినిధిగా తన కుమారుడు జయ ఆనందన్ను రాజకీయ తెరపైకి తెచ్చే ప్రయత్నాల్లో ఉన్నట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. దినకరన్ను దెబ్బతీయడానికి ఆయన అధికార పక్షంతో చాపకింద నీరులా ఒప్పందాలు చేసుకున్నట్టు చర్చ సాగుతోంది. అలాగే, దినకరన్ వెన్నంటి నడిచేందుకు సిద్ధంగా ఉన్న మరో ఐదుగురు ఎమ్మెల్యేల గురించి వివరాలను దివాకరన్ శిబిరం సీఎంకు లీక్ చేసినట్టు ప్రచారం ఊపందుకుంది. ఈ సమయంలో రెండు రోజుల క్రితం ఆయన సీఎం పళనిస్వామికి అనుకూలంగా ఉన్న వారితో సంప్రదింపులు సాగించినట్టు సమాచారం. చిన్నమ్మను త్వరితగతిన జైలు నుంచి బయటకు తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తానని, అనర్హత వేటు పడ్డ వారితో పాటు 21 మంది ఎమ్మెల్యేలు తన వెంటే ఉన్నట్టు వ్యాఖ్యానించినట్టు ప్రచారం ఊపందుకుంది. ఈ పరిస్థితుల్లో ఆ కుటుంబంలో సాగుతున్న వివాదాలను తేటతెల్లంచేస్తూ, దివాకరన్కు చురకలు అంటించే విధంగా వెట్రివేల్ ట్వీట్ చేయడం చర్చకు దారితీసింది. మేనమామను ఢీకొట్టేందుకు దినకరన్ రెడీ అన్నట్టుగా స్పందించడమే కాదు.. తామెప్పుడు చిన్నమ్మ మద్దతుదారులే గానీ, దివాకరన్కు కాదు అని స్పష్టం చేయడం గమనార్హం. మేమంతా వారివెంటే.. అనర్హత వేటు పడ్డ ఎమ్మెల్యేలు అందరూ ఒకే నినాదంతో చిన్నమ్మే ప్రధాన కార్యదర్శిగా, దినకరన్ ఉప ప్రధాన కార్యదర్శిగా ముందుకు సాగుతామని వెట్రివేల్ స్పష్టంచేశారు. తమ పయనం శశికళ, దినకరన్ల వెంటే అని, మరెవరి వెనుక నడవాల్సిన అవసరం తమకు లేదని దివాకరన్ను ఉద్దేశించి తీవ్రంగా స్పందించడం గమనార్హం. రాజకీయంగా దినకరన్ బలపడుతుండడంతోనే, తన కుమారుడి భవిష్యత్తు దృష్ట్యా, దివాకరన్ కొత్త ప్రయత్నాలకు సిద్ధపడ్డ విషయం అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం వర్గాల దృష్టికి చేరినట్టు తెలిసింది. తాజా పరిస్థితులతో ఢీకి రెడీ అన్నట్టుగా వ్యూహంతో వెట్రివేల్ ద్వారా మేనమామకు దినకరన్ చెంపపెట్టు సమాధానం ఇచ్చినట్టు చర్చ ఊపందుకుంది. -
నన్ను కెలకొద్దు!
ఎల్ఎల్బీ విద్యార్హత విషయంలో తన పరువును బజారు కీడ్చే రీతిలో, తన కుటుంబాన్ని హేళన చేస్తూ వ్యాఖ్యలు చేయడం మానుకోకుంటే, కోర్టు మెట్లు ఎక్కిస్తా అనిమత్స్య శాఖ మంత్రి జయకుమార్కు చిన్నమ్మ మేనల్లుడు వివేక్ హెచ్చరికలు చేశారు. తనను దయచేసి కెలకొద్దు అని హితవు పలికారు. సాక్షి, చెన్నై : విదేశీ కోటాలో ఎల్ఎల్బీ సీటు పొంది.. దొడ్డి దారిలో చిన్నమ్మ శశికళ మేనల్లుడు, జయ టీవీ సీఈవో పట్టా పొందినట్టు ఏసీబీ గుర్తించిన విషయం తెలిసిందే. దీంతో ఆయన్ను అరెస్టు చేయడానికి తగ్గ కసరత్తులు సాగుతున్నట్టు సమాచారాలు వెలువడ్డాయి. ఈ విషయంగా మత్స్య శాఖ మంత్రి జయకుమార్ నోరు జారారు. వివేక్ను ఉద్దేశించి, ఆయన కుటుంబాన్ని గురిపెట్టి విరుచుకుపడ్డారు. వివేక్ను అరెస్టుచేసి కటకటాల్లోకి నెట్టడం ఖాయం అని ధీమా వ్యక్తంచేశారు. ఆ కుటుంబమే మోసగాళ్ల కుటుంబంగా పేర్కొంటూ తీవ్రంగానే పదాలను ప్రయోగించారు. ఇది కాస్త వివేక్లో ఆగ్రహాన్ని రేపింది. జయకుమార్కు హెచ్చరికలు చేస్తూ గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. అందులో మంత్రి అన్న విషయాన్ని కూడా పరిగణనలోకి తీసుకోకుండా జయకుమార్ మీద వివేక్ శివాలెత్తారు. నన్ను కెలకొద్దు : తన గురించి జయకుమార్కు ఏం తెలుసునని, ఇష్టారాజ్యంగా నోరు జారుతున్నారంటూ మండిపడ్డారు. తానూ యూజీ ఆస్ట్రేలియాలోనూ, పీజీ పూణెలో పూర్తి చేసినట్టు వివరించారు. ఎవరి సహకారం, సిఫారసు లేకుండా స్వశక్తితో తాను ఐటీసీ సంస్థలో ఉద్యోగాన్ని సంపాదించి విధులు నిర్వర్తించానన్నారు. న్యాయ శాస్త్రం చదవాలన్న ఆశతో ఎల్ఎల్బీ పూర్తి చేశానన్నారు. ఎన్నో కళాశాలలు ఉన్నా, డాక్టర్ అంబేడ్కర్ కళాశాలను తాను ఎంపిక చేసుకున్నానన్నారు. తనకు సింగపూర్ సిటిజన్ గుర్తింపు ఉందని, తన సోదరి అక్కడే ఉన్న దృష్ట్యా, తనకు కూడా అక్కడి పౌరుడిగా గుర్తింపు దక్కి ఉన్నట్టు వివరించారు. అందుకే తాను విదేశీ కోటాలతో సింగపూర్ పౌరసత్వం ఆధారంగా చేరానన్నారు. ఇందుకు తగ్గ ఆధారాలన్నీ తన వద్ద ఉన్నాయన్నారు. తనను ఎవరైనా అధికారులు ప్రశ్నిస్తే చట్టపరంగా అన్ని వివరాలను వారి ముందు ఉంచేందుకు సిద్ధం అన్నారు. కేసులు పెడితే చట్టపరంగా ఎదుర్కొంటానన్నారు. అయితే, మంత్రి పదవిలో ఉన్న జయకుమార్ తనను, తన కుటుంబాన్ని టార్గెట్ చేసి, అనాగరికంగా వ్యాఖ్యలు చేస్తున్నారని మండి పడ్డారు. తానేదో పెద్ద మోసాగాడినైనట్టు, పెద్ద నేరం చేసినట్టుగా అరెస్టు చేయిస్తా, కటకటాల్లో పెట్టిస్తా అని స్టేట్మెంట్లు ఇచ్చుకోవడం మానుకుంటే మంచిదని మంత్రిని హెచ్చరించారు. తనను కెలక వద్దు అని, కెలికిన పక్షంలో కోర్టు మెట్లు ఎక్కించాల్సి ఉంటుందని హెచ్చరించారు. అధికారం చేతిలో ఉంటే ఇష్టారాజ్యంగా వ్యాఖ్యలు చేస్తారా..? బెదిరిస్తారా..? అని ధ్వజమెత్తారు. తనను గాని, తన కుటుంబాన్ని గాని అవమాన పరిచే విధంగా గానీ, హేళన చేసే విధంగా గానీ, వ్యాఖ్యలు చేయడం మానుకోకుంటే , తీవ్రంగా తానూ స్పందించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఇంకాచెప్పాలంటే, జయకుమార్ పబ్లిసిటీ కోసం తీవ్రంగానే ప్రయత్నిస్తున్నట్టున్నారని ఎద్దేవా చేశారు. తనకు ఏమీ తెలియకున్నా, అన్ని తెలిసిన వాడి వలే ప్రతి విషయంలోనూ జోక్యం చేసుకోవడం బట్టి చూస్తే, ఆయన పబ్లిసిటీ వ్యామోహం స్పష్టం అవుతోందని విమర్శించారు. -
తీగ లాగితే...డొంక కదిలింది
అన్నా వర్సిటీ వీసీగా రాజారాం, అంబేడ్కర్ న్యాయ వర్సిటీ వీసీగా వనంగా ముడిగతంలో సాగించిన అవినీతి బండారం రెండు రోజుల క్రితం వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ ఇద్దరి ఇళ్లల్లో సాగిన దాడుల మేరకు లభించిన సమాచారాలు ఏసీబీ వర్గాల్నే విస్మయంలో పడేశాయి. ఈ ఇద్దరి అవినీతికి హద్దే లేదన్నట్టుగా ఏసీబీకిఆధారాలు చిక్కి ఉండడం గమనార్హం. అలాగే, ప్రొఫెసర్ల నియామకం, విదేశీ కోటా సీట్ల కేటాయింపుల్లో సాగిన అక్రమాలుబయటపడ్డాయి. ఇందులో ఓ సెలబ్రెటీ సైతం తెరమీదకు వచ్చాడు. అమ్మ జయలలిత నెచ్చెలి, అమ్మ మున్నేట్ర కళగం ప్రధానకార్యదర్శి చిన్నమ్మ శశికళ సోదరుడు జయరామన్, వదిన ఇలవరసి పుత్రుడువివేక్ను ఏసీబీ తమ జాబితాలో చేర్చిఉండడం చర్చకు దారితీసింది. జయ టీవీ సీఈవోగా ఉన్న వివేక్ ఎల్ఎల్బీనిఅక్రమమార్గంలోనే పూర్తిచేసినట్టుగాఏసీబీ గుర్తించింది. సాక్షి, చెన్నై : ఓ కేసులో తీగ లాగితే.. డొంక కదిలినట్టు చిన్నమ్మ మేనల్లుడు వివేక్ ఎల్ఎల్బీ బండారం బయటపడింది. విదేశీ కోటాలో ఎల్ఎల్బీని చెన్నైలో ఆయన పూర్తిచేసి ఉండడం వెలుగులోకి వచ్చింది. దీంతో ఏసీబీ ఆయన మీదే కాదు, మరో 75మంది మీద గురిపెట్టింది. అలాగే, ఆరుగురు అన్నా వర్సిటీ ప్రొఫెసర్ల మీద సైతం కేసులు నమోదయ్యాయి. ఆరుగురు ప్రొఫెసర్లు అన్నా వర్సిటీలో రాజారాం పర్యవేక్షణలో 21 మంది ప్రొఫెసర్లు, 33 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు, మరో 54 సహాయ ప్రొఫెసర్ల నియమకాలు గతంలో జరిగి ఉన్నాయి. ఈ నియామకాల్లో అక్రమాలు జరిగినట్టు గుర్తించిన ఏసీబీ తీవ్ర విచారణలో నిమగ్నం అయింది. ఇందులో మంగళవారం నాటికి ఆరుగురు అనర్హుల్ని అధికారులు గుర్తించారు. వారి మీద కేసు నమోదు చేశారు. ఇందులో నలుగురు అసిస్టెంట్, ఒక సహాయ, ఒక ప్రొఫెసర్ ఉండడం గమనార్హం. వీరంతాఆయా పదవులకు అనర్హులే అయినా, రాజా రాం చేతివాటం రూపంలో అర్హులుగా అవతరించారని తెలిసింది. రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు పుచ్చుకుని వీరికి రాజారాం అర్హత కల్పించినట్టు ఏసీబీ గుర్తించింది. ఆరుగురి మీద కేసు నమోదు చేశారు. వీరిలో బయోమెట్రికల్ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ జయ శ్రీ, కెమికల్ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ హెలన్, ఎలక్ట్రానిక్ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ బాలమురుగన్, మెటీరియల్ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్లు మందాకిని, అరివానందన్, ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్ విభాగం ప్రొఫెసర్ విజయలక్ష్మి ఉన్నారు. కేసు నమోదుతో వీరిని అరెస్టు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే, మరో 14 మంది పేర్లు సైతం ఏసీబీ పరిశీలనలో ఉన్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. వివేక్ మెడకు ఎల్ఎల్బీ ఉచ్చు అంబేడ్కర్ న్యాయ కళాశాలలో సాగిన అక్రమాలపై ఏసీబీ తీవ్ర విచారణ సాగిస్తోంది. వనంగాముడితో పాటుగా అక్రమాల్లో భాగస్వాములుగా ఉన్న ప్రొఫెసర్ శర్వాణి, రిజిస్ట్రార్ బాలాజీ, అసిస్టెంట్ రిజిస్ట్రార్ అశోక్కుమార్, అసిస్టెంట్ ప్రొఫెసర్ జయశంకర్, పరిపాలనాధికారి రమేష్ మీద ఏసీబీ కేసులు నమోదు చేసింది. వీరి అరెస్టుకు రంగం సిద్ధం అవుతున్న నేపథ్యంలో ఎల్ఎల్బీ ఉచ్చు చిన్నమ్మ మేనళ్లుడు వివేక్ మెడకు తగలడం గమనార్హం. అంబేడ్కర్ వర్సిటీలో ప్రతి ఏటా పదిహేను శాతం సీట్లను ఎన్ఆర్ఐ కోటాకు కేటాయించేవారు. గతంలో సాగిన కేటాయింపుల్లో 75 మంది విద్యార్థులు అక్రమంగా విదేశీ కోటా సీట్లను చేజిక్కించుకున్నట్టు ఎసీబీ గుర్తించింది. వీరి జాబితా సిద్ధం చేయగా, అందులో వివేక్ పేరు తెర మీదకు వచ్చింది. విదేశీ కోటా సీట్లను అక్రమంగా పొంది వివేక్ ఎల్ఎల్బీ పూర్తి చేసినట్టు గుర్తించారు. దీంతో ఆ 75 మంది విద్యార్థులతో పాటు వివేక్ పేరును తమ జాబితాల్లోకి ఎక్కించి విచారణకు సిద్ధం అయ్యారు. ఇక, ఒక్కో విద్యార్థి ఎన్ఆర్ఐ కోటా నిమిత్తం రూ.20 లక్షల వరకు వనంగాముడి అండ్ బృందానికి చెల్లించినట్టు విచారణలో వెలుగు చూసి ఉండడం గమనార్హం. -
ఆ తీర్పును కొట్టేయండి: వివేక్
సాక్షి, హైదరాబాద్: తమపై అనర్హత వేటు వేస్తూ హెచ్సీఏ అంబుడ్స్మన్ జస్టిస్ ఎల్.నర్సింహారెడ్డి ఈ నెల 8న ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్సీఏ) అధ్యక్ష, కార్యదర్శులుగా వ్యవహరించిన జి.వివేక్, టి.శేష్ నారాయణ్లు హైకోర్టును ఆశ్రయించారు. అంబుడ్స్మన్ తీర్పుపై వీరు వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలపై విచారణ జరిపిన హైకోర్టు పూర్తిస్థాయి వాదనల నిమిత్తం తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఆకుల వెంకట శేషసాయి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. అంబుడ్స్మన్ ముందు వివేక్కు వ్యతిరేకంగా మాజీ ఎంపీ వి.హనుమంతరావు, మాజీ క్రికెటర్ అజహరుద్దీన్ తదితరులు పిటిషన్ దాఖలు చేశారు. శేష్ నారాయణ్కు వ్యతిరేకంగా సాగర్ క్రికెట్ క్లబ్ కార్యదర్శి బాబూరావు పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై విచారణ జరిపిన అంబుడ్స్మన్ జస్టిస్ నర్సింహారెడ్డి, హెచ్సీఏకు అధ్యక్షుడిగా ఉన్న వివేక్, హెచ్సీఏతో వాణిజ్యపరమైన ఒప్పందం ఉన్న విశాక ఇండస్ట్రీస్కు డైరెక్టర్గా వ్యవహరించడం విరుద్ధ ప్రయోజనాల కిందకు వస్తుందంటూ ఈ నెల 8న తీర్పునిచ్చారు. అలాగే హెచ్సీఏ అవినీతి కేసుల్లో దాఖలైన చార్జిషీట్ల్లో శేష్ నారాయణ్ పేరు ఉన్నందున ఆయన కార్యదర్శిగా కొనసాగడానికి వీల్లేదని జస్టిస్ నర్సింహారెడ్డి తన తీర్పులో పేర్కొన్నారు. తమ తమ విషయాల్లో అంబుడ్స్మన్ ఇచ్చిన తీర్పును రద్దు చేయాలని ఇరువురు కూడా తమ పిటిషన్లలో కోర్టును కోరారు. విశాక ఇండస్ట్రీస్తో తనకున్న సంబంధాలరీత్యా తన కంపెనీకీ, హెచ్సీఏకు మధ్య ఉన్న వివాదంపై తీసుకునే నిర్ణయాల్లో తాను పాలు పంచుకోనని, ఈ విషయంలో మార్గదర్శకం చేయాలని అంబుడ్స్మన్/హెచ్సీఏ ఎథిక్స్ ఆఫీసర్ను రాతపూర్వకంగా కోరానని, అయితే ఇప్పటి వరకు దానిపై ఆయన స్పందించకపోగా... ఇప్పుడు తనను అనర్హుడిగా ప్రకటిస్తూ తీర్పునిచ్చారని వివేక్ తెలిపారు. తాను హెచ్సీఏ అధ్యక్షుడిగా అనర్హుడినని ప్రకటించడానికి తాను ప్రభుత్వ సలహాదారుగా ఉండటాన్ని కూడా అంబుడ్స్మన్ కారణంగా చూపారని, వాస్తవానికి ఈ విషయం అంబుడ్స్మన్ న్యాయ పరిధికి సంబంధించింది కాదని ఆయన స్పష్టం చేశారు. లోధా కమిటీ సిఫారసుల ప్రకారం చార్జిషీట్లో పేరు ఉన్న వ్యక్తికి అనర్హత వర్తిస్తుందని ఎక్కడా చెప్పలేదని శేష్ నారాయణ్ తన పిటిషన్లో వివరించారు. ఈ విషయాన్ని అంబుడ్స్మన్ పట్టించుకోలేదన్నారు. చార్జ్షీట్లో పేరున్నంత మాత్రాన అనర్హుడిగా ప్రకటించడం సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధమన్నారు. కాబట్టి అంబుడ్స్మన్ తీర్పును కొట్టేయాలని కోరారు. -
ఆత్మరక్షణ విద్యలు ఇతివృత్తంగా ‘ఎళుమిన్’
తమిళసినిమా: హాస్యనటుడు వివేక్కు కథానాయకుడిగా రాణించాలన్న కోరిక ఎప్పటి నుంచో ఉంది. అలా ఒకటి రెండు చిత్రాల్లో నటించినా నాన్దా బాలా అనే ఒక్క చిత్రం మాత్రమే తెరపైకి వచ్చినా, అదీ ఆశించిన విజయం సాధించలేదు. తాజాగా ఆయన ప్రధాన పాత్రలో ఎళుమిన్ అనే చిత్రం తెరకెక్కుతోంది. ఇందులో వివేక్కు భార్యగా నటి దేవయాని నటిస్తున్నారు. వీరితో పాటు ప్రవీణ్, శ్రీజిత్, వినీత్, సుఖేశ్, కీర్తిక, దీపిక, అళగం పెరుమాళ్, ప్రేమ్ ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు వీపీ.విజీ కథ, కథనం, మాటలు, దర్శకత్వం బాధ్యతలను నిర్వహిస్తున్నారు. వైఎం మీడియాస్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి గోపీ జగదీశ్వరన్ ఛాయాగ్రహణం, సంగీతాన్ని గణేశ్ చంద్రశేఖర్ అందిస్తున్నారు.చిత్ర వివరాలను దర్శకుడు వీపీ.విజీ తెలుపుతూ ఆత్మరక్షణ విద్యలపై ఆసక్తి కలిగిన ఐదుగురు చిన్నారులు ఆ విద్యల్లో ఘనత సాధించడమే ఎళుమిన్ చిత్ర ఇతివృత్తం అని చెప్పారు. విశ్వనాథన్ అనే వ్యక్తి కొడుకు అర్జున్ మరో ఐదుగురు పిల్లలు మంచి స్నేహితులని, ఈ పిల్లలు ఆత్మరక్షణ విద్యలు కుంగ్ఫూ, కరాటే, బాక్సింగ్, కర్రసాముల్లో శిక్షణ పొందుతారన్నారు. అయితే ఆర్థిక స్తోమత లేని ఐదుగురు పిల్లలకు తల్లిదండ్రుల నుంచే ఆటంకాలు ఎదురవుతాయని చెప్పారు. అలాంటి సమయంలో అర్జున్ తల్లిదండ్రులు వారికి అండగా నిలుస్తారని తెలిపారు. ఇందులో విశ్వనాథన్గా నటుడు వివేక్, ఆయన భార్యగా దేవయాని నటిస్తున్నారని చెప్పారు. ఈ ఐదుగురు పిల్లలు జీవితంలో ఎదురయ్యే ఆటంకాలను, పరిస్థితుల ప్రభావాలను అధిగమించి వారి లక్ష్యాన్ని ఎలా సాధించారన్నదే ఎళుమిన్ చిత్ర కథ అని తెలిపారు. ఇందులో రిస్కీ ఫైట్స్ సన్నివేశాల్లో కూడా చిన్నారులు అద్భుతంగా నటించారని చెప్పారు. వీరి నిజ జీవితంలో కూడా రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని గెలుపొందారని దర్శకుడు తెలిపారు. -
క్రికెట్ అభివృద్ధికి హెచ్సీఏ ఏం చేసింది?
హైదరాబాద్: క్రికెట్ అభివృద్ధి కోసం హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్సీఏ) తీసుకున్న చర్యలేమిటో వివరించాలని ‘ది తెలంగాణ క్రికెట్ అసోసియేషన్’ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే ఎ.లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. శనివారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తమ కార్యదర్శి గురువారెడ్డితో కలిసి హెచ్సీఏపై ధ్వజమెత్తారు. వివేక్ దిగిపోవాలని వారి కమిటీ సభ్యులే డిమాండ్ చేస్తున్నారని అన్నారు. ఇప్పటికే క్రికెట్ కోసం ఏం చేశారో వివరించాలని హెచ్సీఏను బీసీసీఐ కోరడంతో ఏం తోచని సందిగ్ధావస్థలో ఉన్నారని ఆరోపించారు. టీటీఎల్ను నిర్వహించే హక్కు వివేక్కు లేదని పేర్కొన్నారు. టీటీఎల్లో తెలంగాణ వారు చాలా తక్కువ మంది ఉన్నారన్న లక్ష్మీనారాయణ డబ్బులు తీసుకొని ఆ మ్యాచ్లు నిర్వహిస్తున్నారని ఆరోపించారు. వివేక్ బినామీ పేర్ల మీద క్రికెట్ క్లబ్లు నడుపుతున్నారని, త్వరలో అన్నీ బయట పడతాయని దుయ్యబట్టారు. -
హెచ్సీఏపై నిప్పులు చెరిగిన అజారుద్దీన్
సాక్షి, హైదరాబాద్ : హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ)పై టీమిండియా మాజీ కెప్టెన్ అజారుద్దీన్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. లోథా సిఫార్సులను హెచ్సీఏ అమలు చేయడం లేదని ఆయన ఆరోపించారు. హెచ్సీఏ పాలకవర్గం ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని అజారుద్దీన్ విమర్శించారు. ఆయన శనివారమిక్కడ మీడియా సమావేశంతో మాట్లాడుతూ...‘ నేను రాజకీయంగా ఉత్తరప్రదేశ్ నుంచి పోటీ చేశానని క్రికెటర్గా యూపీ నుంచి రిజిస్ట్రర్ ఎలా చేసుకుంటాను. హెచ్సీఏ అందరిని పక్కదారి పట్టిస్తోంది. గ్రామీణ క్రీడాకారులకు అవకాశం ఇవ్వడం లేదు. జిల్లా, రూరల్ ప్రాంతాల నుంచి కూడా మంచి క్రీడాకారులు ఉన్నారు. హెచ్సీఏ నిర్వహించే టీ20 లీగ్ అంతా నిబంధనలకు విరుద్ధంగా జరుగుతోంది. ఆ లీగ్కు వివేక్ తన తండ్రి పేరు పెట్టడంపై అందరి ఆమోదం తీసుకోలేదు. హెచ్సీఏ లోగోతో వివేక్ తండ్రి వెంకటస్వామి పేరుతో టీ20 లీగ్ నిర్వహించడం నిబంధనలకు విరుద్ధమే. ఇక బీసీసీఐ నుంచి నాకు క్లియరెన్స్ రాలేదని ఆరోపించారు. కానీ నాకు హైకోర్టు క్లీన్చిట్ ఇచ్చింది. దీనిపై నేను బీసీపీఐకి నివేదిక పంపాను. కోర్టు ఆదేశాలను బయటకు రానీయకుండా హెచ్సీఏ అధ్యక్షుడు వివేక్ తప్పు చేశారు. చదువుకున్న వ్యక్తులు ఇలా ప్రవర్తించడం బాధాకరం. దీనిపై నేను చట్టపరంగా ముందుకు వెళతా. నాకు తెలంగాణ క్రికెట్ అసోసియేషన్తో ఎలాంటి సంబంధం లేదు. అయితే నన్ను ఓ సెలబ్రెటీగా అందరూ ఆహ్వానిస్తారు’ అని తెలిపారు. -
'వివేక్ చెప్పేవన్నీ అవాస్తవాలే'
-
అజారుద్దీన్ మనవాడా, కాదా? : వీహెచ్
సాక్షి, హైదరాబాద్ : హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్సీఏ)పై కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావు మరోసారి నిప్పులు చెరిగారు. మాజీ క్రికెటర్ అజారుద్దీన్ ను హెచ్సీఏ సమావేశానికి అనుమతించకపోవడంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అజారుద్దీన్ కి జరిగిన అవమానం పై పాకిస్తాన్ కోడై కూస్తుందన్నారు. అవసరం ఉంటే అజార్ భాయ్ అంటారు.. అవసరం తీరాక హట్ ఛలో అంటారా..? అని ధ్వజమెత్తారు. అజారుద్దీన్ మనవాడా కాదా?.. అనేది సీఎం కేసీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు. అజారుద్దీన్ హెచ్సీఏ మెంబర్ కాదని మొన్నటి వరకు హెచ్సీఏ ప్రెసిడెంట్ వివేక్ అన్నారు. కోర్టు అజారుద్దీన్ కి క్లీన్ చీట్ ఇచ్చినా హెచ్సీఏ అనుమతి ఇవ్వడం లేదన్నారు. అజారుద్దీన్ పై కుట్రతో వివేక్ ఇలా చేస్తున్నారని హనుమంతరావు నిప్పులు చెరిగారు. తాను రాజకీయ కుట్రలతో హెచ్సీఏ మీటింగ్ కి వస్తున్నానని వివేక్ కరీంనగర్ లో మాట్లాడారని హనుమంతరావు అన్నారు. 8నెలల కింద నెలకొల్పిన ప్యానల్ కి శేష నారాయణ సెక్రెటరీ, వివేక్ ప్రెసిడెంట్ అయ్యారన్నారు. ప్రస్తుత ప్యానల్ కి ఎన్నో సంవత్సరాలు హెచ్సీఏని పాలించిన వినోద్ కి పెద్ద పోస్ట్ కట్టపెట్టాలని వివేక్ అంటే దానికి శేష నారాయణ ఒప్పుకోనందుకే ఆయన పై సస్పెన్షన్ వేటు వేశారని తెలిపారు. ఉప్పల్ స్టేడియంకి వివేక్ తండ్రి వెంకటస్వామి పేరు పెట్టడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారన్నారు. స్టేడియంలో ఇచ్చే టికెట్ల మీద విశాఖ సంస్థ పెరుపెట్టుకొని విక్రయాలు చేస్తున్నారన్నారు. ఆ తరువాత ఐపీఎల్ వాళ్లను బెదిరించి రూ. లక్షలు వసూళ్లు చేశారని ఆరోపించారు. వివేక్, వినోద్లు కలిసి హెచ్సీఏని దోచుకుంటున్నారని మండిపడ్డారు. వెంకట స్వామి పేరుతో జరుగుతున్న టోర్నమెంట్లపై రూ.12లక్షలు వసూళ్లు చేస్తున్నారని పేర్కొన్నారు. తన ఎంపీ నిధులు రాజీవ్ గాంధీ స్విమ్మింగ్ ఫూల్, ఫుట్ బాల్ గ్రౌండ్, రాజీవ్ గాంధీ పేరుమీద పిల్లలకు స్టైఫండ్ ఇస్తున్నా, ఇది తన రికార్డ్ అని హనుమంతరావు అన్నారు. తెలంగాణ క్రికెట్ అని క్లబ్ ఉంటే నష్టం ఏంటని కేసీఆర్ ని ప్రశ్నించారు. అజారుద్దీన్ అంతర్జాతీయ క్రీడాకారుడు ఆయన సేవలు వినియోగించుకుంటే తప్పేముందని సూచించారు. హెచ్సీఏ జరిపే టోర్నమెంట్ లలో ఓపెన్ ఆక్షన్ ఎందుకు పెట్టరో సమాధానం చెప్పాలన్నారు. కోర్టు ఇచ్చిన ఆదేశాలను కూడా వివేక్ తప్పుపడుతున్నారని హనుమంతరావు అన్నారు. సానియా మీర్జా, పీవీ సింధు గెలుస్తే డబ్బులు, భూములు సీఎం కేసీఆర్ ఇస్తున్నారు. హెచ్సీఏ మీ అయ్య జాగిరా..? అంటూ తీవ్రస్థాయిలో విమర్శించారు. పక్క రాష్టంలో క్రీడలు ఎలా ఉన్నాయి.. తెలంగాణలో ఎలా ఉన్నాయి. వివేక్ రాజకీయంగా ఏమైనా చేసుకో కానీ, క్రీడలను నిర్లక్ష్యం చెయ్యకు అంటూ వీహెచ్ మండిపడ్డారు. సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయి ఇటు ప్రభుత్వంలో జీతం తీసుకుంటూ హెచ్సీఏలో ప్రెసిడెంట్ గా ఎలా కొనసాగుతారని ప్రశ్నించారు. -
'వివేక్ వెంటనే రాజీనామా చేయాలి'
హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) అధ్యక్ష పదకి జి. వివేక్ వెంటనే రాజీనామా చేయాలని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి డీకే అరుణ డిమాండ్ చేశారు. ప్రభుత్వ సలహాదారుగా ఉన్న వివేక్ హెచ్సీఏలో కొనసాగడానికి ఎంతమాత్రం అర్హత లేదన్నారు. తెలంగాణ క్రికెట్ అసోసియేషన్(టీసీఏ)కి భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు అనుమతి ఇచ్చే విషయంలో అడ్డుకుంటామని వివేక్ స్వయంగా చెప్పడం నిజంగా సిగ్గుచేటన్నారు. ఇలా చెప్పడం తెలంగాణ యువతను క్రికెట్ దూరం చెయ్యడం కాదా.. అని అరుణ ప్రశ్నించారు. తెలంగాణ ఏర్పాటు జరిగిన తరువాత టీసీఏ..బీసీసీఐ అనుమతి కోసం యత్నంచడంలో తప్పేముందని అరుణ నిలదీశారు. ఈ సందర్భంగా టీసీఏను 1986లో పాల్వాయి గోవర్ధన్ స్థాపించిన సంగతిని గుర్తు చేశారు. అదే సమయంలో హెచ్సీఏ ఏనాడూ గ్రామీణ ప్రాంతాల్లో టోర్నమెంట్ నిర్వహించి, ప్రోత్సహకాలు అందించిన దాఖలాలు లేవని విమర్శించారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత కూడా హెచ్సీఏ గ్రామాల్లోకి వెళ్లిన దాఖలాలు లేవని మండిపడ్డారు. టీసీఏపై హెచ్సీఏ కక్షసాధింపు చర్యలకు పాల్పడుతుందని అనడానికి వివేక్ వ్యాఖ్యలు ఉదాహరణగా ఆమె పేర్కొన్నారు. హెచ్సీఏపై లెక్కలేనటువంటి ఆరోపణలున్నాయని, రూ. 140 కోట్ల అవినీతి జరిగినట్లు ఏసీబీలో కేసులో ఉన్నాయన్నారు. ఇక్కడ జరపని టోర్నమెంట్లను జరిపినట్లు చూపిస్తూ అవినీతికి పాల్పడుతున్నారని డీకే అరుణ దుయ్యబట్టారు. ఇదిలా ఉంచితే, తెలంగాణలో మహిళా క్రికెటర్లకు ఎంతమాత్రం ప్రోత్సాహం లేదని, దీనిలో భాగంగా గ్రామీణ ప్రాంతాల యువతి, యువకులకు ప్రోత్సాహం ఇచ్చేందుకు టీసీఏ కంకణం కట్టుకుని పనిచేస్తోందన్నారు. హెచ్సీఏలో వివేక్ కుటుంబ పాలన కొనసాగిస్తూ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారన్నారు. హెచ్సీఏ అవినీతిపై అసెంబ్లీలో చర్చకు తీసుకొస్తామని హెచ్చరించిన అరుణ.. హెచ్సీఏలో ఏమి జరిగినా జవాబు చెప్పాల్సిన బాధ్యత వివేక్పై ఉందన్నారు. టీసీఏకి త్వరలో బిసిసిఐ అనుమతి వచ్చే విధంగా ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. టీసీఏ కి వస్తున్న ఆదరణ ఓర్వలేక వివేక్ ఆరోపణలకు దిగుతున్నారని అరుణ ఆరోపించారు. హెచ్సీఏలో తొమ్మిదేళ్లుగా కొనసాగుతున్న వివేక్ దాన్ని దృష్టిలో పెట్టుకుని రాజీనామా చేయాలన్నారు. -
అక్కడ అద్భుతం- ఇక్కడ అవినీతిమయం
ఢిల్లీ: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్సీఏ)లో అక్రమాలు జరుగుతున్నాయని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావు ఆరోపించారు. హెచ్సీఏలో వివేక్ అవినీతికి పాల్పడుతున్నాడని, ఇప్పటికి రూ.12 కోట్లు దోచుకున్నాడని అన్నారు. ఆర్బిట్రేషన్ పేరుతో రూ.25 కోట్లకు స్కెచ్ వేశారన్నారు. ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ అద్భుతంగా పనిచేస్తుంటే హెచ్ సిఎ అవినీతిలో కూరుకుపోయిందని విమర్శించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ హెచ్సీఏ అక్రమాలపై దృష్టి పెట్టాలని వీహెచ్ విజ్ఞప్తి చేశారు. -
ఐటీ అల్టిమేటం
ఐటీ దాడుల్లో ఆధారాలు లభించినా, కొన్ని కీలకరికార్డులు, దస్తావేజుల ఒరిజినల్స్ తమ చేతికి చిక్కని దృష్ట్యా, వాటన్నింటిని రెండ్రోజుల్లోపు సమర్పించాల్సిందే అని చిన్నమ్మ కుటుంబం, సన్నిహితులకు ఐటీ వర్గాలు అల్టిమేటం ఇచ్చాయి ఆరుగురికి సమన్లు జారీ చేసినట్టు విశ్వసనీయ సమాచారం. ఇక, విచారణ నిమిత్తం చిన్నమ్మ శశికళ అన్న జయరామన్ కుమార్తెలు కృష్ణప్రియ, షకీల బుధవారం ఆదాయ పన్ను శాఖ కార్యాలయం మెట్లను ఎక్కారు. ఐటీ దాడులు సహజమేఅని, ఇందులో రాజకీయం లేనే లేదంటూ కృష్ణప్రియ వ్యాఖ్యానించడం గమనించ దగ్గ విషయం. సాక్షి, చెన్నై : చిన్నమ్మ శశికళ కుటుంబాన్ని గురిపెట్టి సాగిన ఐటీ దాడులు, సోదాలు ముగియడంతో విచారణల వేగం పెరిగింది. అధికారుల పరిశీలనలో అక్రమార్జన బండారం బయటపడుతోంది. అదే సమయంలో కొన్ని సంస్థల్లో పెట్టుబడులు, ఆస్తులకు సంబంధించిన దస్తావేజుల వివరాలు లభించినా, ఒరిజినళ్లు దాడుల్లో తమకు చిక్కకపోవడంతో అధికారులు సందిగ్ధంలో పడ్డట్టు సమాచారం. ప్రధానంగా కీలక ఆస్తులు, పెట్టుబడులకు సంబంధించిన ఒరిజినల్స్ ఎక్కడ దాచారన్న చర్చ బయలుదేరింది. దాచి పెట్టిన వాళ్లే వాటిని బయటకు తీసి, తమకు అప్పగించే రీతిలో ఐటీ వర్గాలు గడువును నిర్ణయిస్తూ అల్టిమేటం ఇవ్వడం గమనార్హం. వివేక్ చుట్టూ ఉచ్చు చిన్నమ్మ శశికళ అన్నయ్య జయరామన్, ఇళవరసి దంపతుల కుమారుడు వివేక్ చుట్టూ ఐటీ ఉచ్చు బిగుస్తున్న విషయం తెలిసిందే. వివేక్ పేరిట అత్యధికంగా ఆస్తులు, పెట్టుబడులు ఉన్నట్టు గుర్తించి, ఆ దిశలో విచారణ వేగం పెరిగింది. తమకు లభించిన ఆధారాలను పరిశీలించే క్రమంలో కొన్ని ఆస్తులు, పెట్టుబడులకు సంబంధించిన ఒరిజినల్ డాక్యుమెంట్లు లభించని దృష్ట్యా, వాటన్నింటిని రెండు రోజుల్లో తమకు స్వయంగా సమర్పిస్తే సరి..! అన్న హెచ్చరికతో వివేక్కు సమన్లు వెళ్లినట్టు సమాచారం. ఇక, వివేక్ సన్నిహితులుగా భావిస్తున్న సురానా ఫైనాన్స్, శ్రీలక్ష్మి జువలరీస్ తెన్నరసు, సునీల్, సెంథిల్, విండ్ ఎనర్జీ సుబ్రమణ్యంలకు సైతం ఒరిజినల్స్ సమర్పించే విధంగా హెచ్చరికతో కూడిన సమన్లు వెళ్లినట్టు సమాచారం. జాస్ సినిమాస్ కొనుగోలు వ్యవహారంతో పాటు, అనేక డాక్యుమెంట్లు జిరాక్స్లుగా తేల్చిన అధికారులు , దాచిపెట్టిన వాటిని బయటకు తీస్తారా..? లేదా, రిజిష్ట్రేషన్ల శాఖను ఆశ్రయించి, వివరాల్ని రాబట్టి, కఠినంగా వ్యవహరించమంటారా.? అన్న హెచ్చరికతో ఈ సమన్లు జారీ చేసినట్టు ఐటీ కార్యాలయంలో చర్చ. మనో వేదనలో చిన్నమ్మ, ఇళవరసి ఈ దాడులు, విచారణల పుణ్యమా అని పరప్పన అగ్రహార చెరలో ఉన్న శశి కళ, ఇళవరసిలకు మనశ్శాంతి కరువైనట్టు సమాచారం. ఈ ఇద్దరు తీవ్ర మనోవేదనలో ఉన్నట్టు సమాచారం. అలాగే, దినకరన్కు చిన్నమ్మ లేఖ రాసినట్టు సమాచారం. ఆ లేఖలో ఐటీ దాడులు, వాటిని ఎదుర్కొనేందుకు తగ్గ వ్యూహాలు, ప్రశ్నలకు ఇవ్వాల్సిన సమాధానాల గురించి వివరించిన ట్టు తెలిసింది. ఈ లేఖ బుధవారం దినకరన్కు అందించినట్టుంది. అందుకే కాబోలు, ఆయన తరఫున ప్రతినిధులు ఓ ప్రకటన వెలువరించడం గమనార్హం. గత రెండు రోజులుగా మౌనంగా ఉన్న దినకరన్, తాజాగా జారీచేసిన ప్రకటనలో చిన్నమ్మ కుటుంబంలో ఉన్న వాళ్లంతా చదువుకున్న వాళ్లేనని, బాధ్యత గల సంస్థల్ని నిర్వర్తిస్తున్నారని, మోసాలతో, పన్ను ఎగవేతతో కాలం నెట్టుకు రావాల్సినంత దిగజారే పరిస్థితిలో లేదన్నట్గుగా ఆ ప్రకటన ఉండడం గమనార్హం. జీవనానికి చేతిలో చిల్లిగవ్వ కూడా లేని పరిస్థితి నుంచి రాలేదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని హితవు పలికి ఉన్నారు. విచారణకు కృష్ణ ప్రియ, షకీల చిన్నమ్మ శశికళకు తోడుగా పరప్పన అగ్రహార చెరలో ఇళవరసి కూడా శిక్ష అనుభవిస్తున్న విషయం తెలిసిందే. ఈమె కుమారుడు వివేక్ను ఐటీ గురిపెట్టింది. ఇక, ఆమె కుమార్తెలు కృష్ణప్రియ, షకీలలను కూడా ఐటీ వర్గాలు విచారణకు పిలిచాయి. బుధవారం ఆ ఇద్దరు తమ భర్తలతో కలిసి నుంగంబాక్కంలోని ఐటీ కార్యాలయానికి వచ్చారు. ఈ ఇద్దర్ని వేర్వేరుగా కూర్చోబెట్టి ఐటీ వర్గాలు ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేసినట్టు సమాచారం. ప్రధానంగా కృష్ణప్రియ ఆధీనంలోని సంస్థలతో పాటు ఆమె నిర్వహిస్తున్న స్వచ్ఛంద సంస్థకు విదేశాల నుంచి పెద్ద ఎత్తున నగదు బదిలీలు సాగి ఉండడాన్ని పరిగణించి, అందుకు తగ్గ ప్రశ్నల్ని సంధించినట్టు సంకేతాలు వెలువడ్డాయి. అనేక ప్రశ్నలకు ఆమె దాటవేత ధోరణి అనుసరించగా, షకీల అయితే, సమాధానాలు ఇవ్వకుండా మౌనం వహించినట్టు సమాచారం. ఈ విచారణ అనంతరం మీడియాతో కృష్ణప్రియ మాట్లాడుతూ, ఐటీ విచారణకు పూర్తి సహకారం అందించామన్నారు. తన ఇంట్లో నుంచి ఎలాంటి రికార్డులు పట్టుకు వెళ్ల లేదని స్పష్టం చేశారు. ఐటీ దాడులు సహజమేనని, దీనిని వ్యతిరేకించడం, ఖండించడం అనవసరంగా పేర్కొన్నారు. ఈ దాడులు, విచారణల్లో ఎలాంటి రాజకీయ దురుద్దేశం లేదని తాను భావిస్తున్నట్టు పేర్కొన్నారు. మళ్లీ విచారణకు రావాలని ఆదేశించారని, ఎప్పుడు పిలిచినా సంపూర్ణ సహకారం ఇవ్వడానికి తాను సిద్ధంగా ఉన్నట్టు పేర్కొన్నారు. అలాగే, జయ టీవీ మేనేజర్ నటరాజన్ సైతం విచారణకు హాజరు అయ్యారు. కొడనాడు చుట్టూ ఐటీ విచారణ చిన్నమ్మ కుటుంబంతో పాటు నీలగిరి జిల్లాలోని కొడనాడు ఎస్టేట్, గ్రీన్ టీ ఎస్టేట్ల చుట్టూ సాగుతోంది. ఇక్కడ సోదాలు ముగిసినా, ఐటీ అధికారులు విచారణ మాత్రం ముగించలేదు. తమ విచారణను ముమ్మరం చేశారు. కొడనాడు ఎస్టేట్ మేనేజర్ నటరాజన్, పక్కనే ఉన్న గ్రీన్ టీ ఎస్టేట్ మేనేజర్ పళనికుమార్లతో పాటు 20 మందిని ఒకరి తర్వాత మరొకరు చొప్పున విచారించే పనిలో నిమగ్నమై ఉన్నారు. ప్రధానంగా ఇక్కడ పాత నోట్లు బయటపడడమే కాకుండా, అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇక్కడి నుంచే రాష్ట్ర వ్యాప్తంగా నోట్ల కట్టలు ఓట్ల కొనుగోలుకు పంపించినట్టు ఓ జాబితా అధికారులకు చిక్కినట్టు సమాచారం. అందుకే ఆ జాబితా ఆధారంగా విచారణ ముమ్మరంగా సాగుతున్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. ములాఖత్కు వివేక్ మేనత్త శశికళ, తల్లి ఇళవరసిలతో ములాఖత్కు వివేక్ కసరత్తుల్లో ఉన్నారు. ఇందుకు తగ్గట్టు న్యాయవాదులు పరప్పన అగ్రహార చెరలో వినతి పత్రాన్ని సమర్పించారు. పరప్పన అగ్రహార చెరలో శశికళ, ఇళవరసిలతో న్యాయవాదులు మూర్తి రావు, కృష్ణప్ప సమావేశం కావడం వెలుగు చూసింది. తాజా, పరిణామాల నేపథ్యంలోనే ఈ భేటీ సాగి ఉంటుందని, చట్టపరంగా ఎదుర్కొనేందుకు తగ్గ కసరత్తుల్లో ఉన్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. అయితే, ఆ న్యాయవాదుల్ని మీడియా ప్రశ్నించగా, తల్లి ఇళవరసిని కలిసేందుకు వివేక్ సమయం కోరి ఉన్నారని, అందుకు తగ్గ వినతి పత్రం, వివేక్ రాసిన లేఖ జైలు వర్గాలకు సమర్పించామని పేర్కొన్నారు. కాగా పీఎంకే వ్యవస్థాపకుడు రాందాస్ దీనిపై మాట్లాడుతూ ఐటీ దాడుల్లో వెలుగుచూసిన అన్ని వివరాలను బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. శశికళ కుటుంబానికి సంబంధించిన కేసులన్నీ ప్రత్యేక న్యాయమూర్తిని నియమించి విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. -
అత్యధిక ఆస్తులు ఆ ముగ్గురి పేర్లలోనే..
చిన్నమ్మ శశికళ కుటుంబంలో ముగ్గురు వ్యక్తులు ఐటీ వర్గాలకు కీలకం అయ్యారు. ఆ ముగ్గురి చుట్టే వేల కోట్ల ఆస్తుల రికార్డులు తిరుగుతున్నట్టు సమాచారం. ఆ ముగ్గురు ఎవరో కాదు.. చిన్నమ్మ తమ్ముడు దివాకరన్, అన్న జయరామన్ కుమారుడు వివేక్, కుమార్తె కృష్ణప్రియ కావడం గమనార్హం. రూ.30 వేల కోట్ల మేరకు చిన్నమ్మ ఫ్యామిలీకి ఆస్తులు ఉన్నట్టు ప్రాథమిక విచారణలో వెలుగుచూసినట్టుగా ఓ నివేదిక ఢిల్లీకి పంపించడం చర్చకు దారితీసింది. ఇక, వివేక్ ఇంట మూడు తుపాకులు బయటపడ్డట్టు తెలిసింది. కొడనాడులో మంగళవారం ఆరో రోజు కూడా సోదాలు జరిగాయి. అక్కడున్న అమ్మ, చిన్నమ్మ గదుల్ని తనిఖీ చేయడం లక్ష్యంగా ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలకోసం ప్రత్యేక బృందం వేచి చూస్తుండడంతో అక్కడ మరెన్ని రికార్డులు వెలుగులోకి వస్తాయో అని ఉత్కంఠమొదలైంది. సాక్షి, చెన్నై : చిన్నమ్మ శశికళ కుటుంబాన్ని గురిపెట్టి సాగిన ఐటీ దాడుల్లో బయటపడ్డ రికార్డుల్ని పరిశీలించే పనిలో ప్రత్యేక బృందాలు నిమగ్నమై ఉన్నాయి. ఆ మేరకు ముఫ్పై వేల కోట్ల ఆస్తులు ఉన్నట్టు ప్రాథమిక విచారణలో గుర్తించినట్టు సమాచారం. అలాగే, ఏడు కోట్ల మేరకు నగదు, ఐదు కోట్ల మేరకు బంగారం ఉన్నట్టు తేల్చారు. వజ్రాల విలువను తేల్చేందుకు ఐటీ వర్గాలు ప్రత్యేక నిపుణుల్ని రంగంలోకి దించే పనిలో ఉన్నాయి. 1,400 కోట్ల మేరకు పన్ను ఎగవేతతో పాటుగా 16 బ్యాంక్ లాకర్లను సీజ్ చేసినట్టు, అందులో ఉన్న తనిఖీలు జరపాల్సి ఉన్నట్టుగా పేర్కొంటూ, సమగ్ర వివరాలతో ఓ ప్రాథమిక నివేదిక ఢిల్లీకి చెన్నై నుంచి పంపించి ఉండడం గమనార్హం. అలాగే, వివేక్ ఇంట మూడు తుపాకులు బయటపడ్డట్టు, ఇందులో రెండింటికి మాత్రమే లైసెన్స్ ఉన్నట్టుగా, విదేశీ వాచ్లు, ఇతర వస్తువులు తదితర వివరాల్ని సైతం పొందుపరిచి ఉన్నట్టు తెలిసింది. ఈ నివేదిక ఆధారంగా త్వరలో సీబీఐ, ఈడీ వర్గాలు రంగంలోకి దిగే అవకాశాలు కన్పిస్తున్నాయి. వారే కీలకం చిన్నమ్మ శశికళ, ఆమె ప్రతినిధి దినకరన్ మీద కన్నా ఆ కుటుంబంలోని ముగ్గురి మీద ఐటీ వర్గాల గురి కీలకంగా పడి ఉంది. వారి పేర్ల మీదే అత్యధికంగా ఆస్తులు ఉన్నట్టు, పెట్టుబడులు, సంస్థలు ఉన్నట్టు విచారణలో తేల్చి ఉన్నారు. ఆ ముగ్గురిలో ఒకరు చిన్నమ్మ తమ్ముడు దివాకరన్ కాగా, మరో ఇద్దరు అన్నయ్య జయరామన్ కుమారుడు వివేక్, కుమా ర్తె కృష్ణ ప్రియ కావడం గమనార్హం. ఇందులో వివేక్ తొలి టార్గెట్లో ఉంచిన ట్టు సమాచారం. తదుపరి బంధువులు డాక్టర్ శివకుమార్, విక్రమ్, జయ ఆనందన్, షకీలా, కార్తికేయన్ పేరిట ఆస్తులు అత్యధికంగా ఉన్నట్టు సమాచారం. వీరందరూ విదేశాలకు చెక్కేయకుండా ముందస్తుగా విమానాశ్రయాలకు సమాచారం పంపించి ఉన్నారు. అలాగే, ఆ ముగ్గురు కీలక వ్యక్తులు పాస్ట్ పోర్టుల్ని సీజ్చేసినట్టు తెలిసింది. వివేక్, జాస్ ప్రతినిధుల విచారణ వివేక్ వద్ద కొన్ని గంటల పాటుగా ఐటీ వర్గాలు విచారించాయి. పట్టుబడ్డ రికార్డులు, నగలు, నగదు, పెట్టుబడుల గురించి ప్రశ్నల వర్షం కురిపించారు. ఐటీ వర్గాలు అడిగిన ప్రశ్నలన్నింటికీ తాను సమాధానాలు ఇచ్చినట్టు మీడియాకు వివేక్ వివరించారు. నుంగంబాక్కంలోని ఇంటి వద్ద వర్షంలో తడుస్తూ మరీ మీడియాతో ఆయన మాట్లాడారు. అనేక ప్రశ్నలకు సమాధానం దాటవేయగా, కొన్నింటికి మాత్రం సమాధానం ఇచ్చారు. సంస్థల్లో పెట్టుబడులు, రికార్డుల గురించి ప్రశ్నించారని, అలాగే, వివాహ సమయంలో తన భార్యకు ఇచ్చిన నగల గురించి అడిగినట్టు వివరించారు. తమ సంస్థ తర్వాత సినిమా పంపిణీల వ్వవహారం గురించి ప్రశ్నించారని పేర్కొన్నారు. తమ సంస్థల్లో ఎలాంటి అవకతవకలకు ఆస్కారం లేదని, ఆదాయ పన్ను సక్రమంగానే చెల్లించామన్నారు. ఆదాయ పన్ను తనిఖీల్లో లోగుట్టు ఉన్నట్టు తాను భావించడం లేదన్నారు. తాను అన్ని సక్రమంగానే చెల్లించానని, తప్పుచేస్తే తానైనా, మంత్రి అయినా, మీరైనా శిక్షించబడుతారని, తనవైపు ఎలాంటి తప్పు లేదని ధీమా వ్యక్తంచేశారు. దయచేసి తప్పుడు ప్రచారం మాత్రం చేయవద్దని, ఐటీ ఎప్పుడు పిలిచినా విచారణకు వెళ్లి సంపూర్ణ సహకారం అందించేందుకు తాను సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. ఇక, జాస్ సినిమాస్కు చెందిన ముగ్గురు ప్రతినిధుల వద్ద ఐటీ వర్గాలు కొన్ని గంటల పాటుగా విచారించారు. బుధవారం దివాకరన్ను విచారించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొడనాడులో ఆరో రోజు తనిఖీలు అన్నిచోట్లా ఐటీ దాడులు ముగిసినా కొడనాడులో మాత్రం ఆరో రోజు మంగళవారం కూడా కొనసాగింది. గ్రీన్ టీ ఎస్టేట్ ఎలా చిన్నమ్మ గుప్పెట్లోకి వచ్చిందో అన్న విషయంగా తాజా పరిశీలన, తనిఖీలు సాగాయి. ఆరుగురు అధికారుల బృందం అక్కడే తిష్ట వేశారు. తేయాకు పతనం సమయంలో గ్రీన్టీ ఎస్టేట్ వేలంకు వచ్చినట్టు, దానిని బలవంతంగా చిన్నమ్మ తన గుప్పెట్లోకి తీసుకున్నట్టు విచారణలో తేలినట్టు సమాచారం. ఇక, కొడనాడు ఎస్టేట్లో అమ్మ జయలలిత, చిన్నమ్మ శశికళకు ప్రత్యేక గదులున్నాయి. ఈ రెండింటిలో తనిఖీలకు ఐటీ వర్గాలు నిర్ణయించాయి. అయితే, ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చిన అనంతరం ఇక్కడ తనిఖీలు సాగనున్నాయి. ఈ దృష్ట్యా, ఈ రెండు గదుల్లో ఎలాంటి రికార్డులు బయటకు వస్తాయోనన్న ఉత్కంఠ బయలుదేరింది. తప్పు చేసిన వాళ్లకు శిక్ష తప్పదు తప్పుచేసి, అక్రమ మార్గంలో ఆస్తుల్ని గడించిన వారికి శిక్ష తప్పదని కేంద్ర సహాయ మంత్రి పొన్ రా«ధాకృష్ణన్ హెచ్చరించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, అన్నాడీఎంకేను వాళ్లే సర్వనాశనం చేసుకుంటున్నారని, ఇందులో తలదూర్చాల్ని అవసరం కేంద్రానికి లేదన్నారు. చిన్నమ్మ ఆస్తులు గడించడం వెనుక అమ్మ ప్రమేయం ఉండవచ్చా..? అనే ప్రశ్నకు సమాధానం ఇస్తూ, వెనుక ఎవరు ఉన్నారు.. ముందు ఎవరు నడిపిస్తున్నారు..! అన్న విషయాలన్నీ విచారణలో నిగ్గుతేలుతాయని సమాధానం ఇచ్చారు. ఇక, తమిళనాడు కాంగ్రెస్ సీనియర్ నేత ఈవీకే ఎస్ ఇళంగోవన్ పేర్కొంటూ, పరప్పన అగ్రహార చెరలో ఉన్న శశికళను బయటకు తీసుకు వచ్చి ఐటీ దాడులపై విచారణ చెన్నైలో జరగాలని, అందుకు తగ్గ చర్యలు తీసుకోవాలని డిమాండ్చేశారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు తిరునావుక్కరసర్ పేర్కొంటూ, అన్నాడీఎంకేను తమ గుప్పెట్లోకి తీసుకోవడం, ఓ శిబిరాన్ని పూర్తిగా తమలో కలుపుకోవడం లక్ష్యంగానే ఐటీని కేంద్రం ఉసిగొల్పిందని ఆరోపించారు. -
చిక్కుల్లో ‘చిన్నమ్మ’ ఫ్యామిలీ
చిన్నమ్మ శశికళ కుటుంబీకులు చిక్కుల్లో పడ్డారు. వారి మెడకు ఐటీ ఉచ్చు బిగియనుంది. సోదాల్లో లభించిన ఆధారాల మేరకు ఒక్కొక్కర్ని వేర్వేరుగా విచారించేందుకు అధికారులు నిర్ణయించారు. ఆ కుటుంబానికి చెందిన వారందరికీ సమన్లు జారీచేస్తున్నారు. జయ టీవీ, జాస్ సినిమాస్ సీఈవో వివేక్ను తమ కార్యాలయంలో ఉంచి ఐటీ వర్గాలు విచారించే పనిలో పడ్డాయి. దివాకరన్ను విచారించేందుకు రంగం సిద్ధం అయింది. ఇక, ఆ కుటుంబానికి సన్నిహితంగా ఉన్న పుహలేంది, డాక్టర్ శివకుమార్, పూంగుండ్రన్ల వద్ద విచారణ సాగుతోంది. ఐటీ అధికారులకు లభించిన రికార్డులు, బ్యాంక్ లావాదేవీల వివరాల మేరకు చిన్నమ్మ కుటుంబీకులు, సన్నిహితులు పెద్ద నోట్ల రద్దు సమయంలో రూ.250 కోట్ల మేరకు పాత కరెన్సీని కొత్తవిగా మార్చినట్టుగా పరిశీలనలో తేలింది. కొన్నిచోట్ల పాత నోట్లను మార్చ లేక అలాగే, వదిలి పెట్టి ఉండటాన్ని గుర్తించారు. తన కుటుంబాన్ని ఐటీ చుట్టుముట్టడంతో పరప్పన అగ్రహార చెరలో ఉన్న చిన్నమ్మ కలవరంలో పడ్డట్టు సంకేతాలు వెలువడ్డాయి. ఈ దాడులపై మాట్లాడితే ఎక్కడ తమను టార్గెట్ చేస్తారో అనే భయంతో చిన్నమ్మ ప్రతినిధి దినకరన్ మద్దతు అన్నాడీఎంకే వర్గాలు ఐటీ దాడుల గురించి నోరు మెదపడం లేదు. సాక్షి, చెన్నై: చిన్నమ్మ శశికళ కుటుంబాన్ని గురిపెట్టి ఐటీ అధికారులు గురువారం రంగంలోకి దిగిన విషయం తెలిసిందే. ఐదో రోజుగా సోమవారం కూడా సోదాలు సాగాయి. జయ టీవీ, నమదు ఎంజీఆర్ పత్రిక కార్యాలయాలు, జాస్ సినిమాస్, ఈ సంస్థల సీఈఓ వివేక్ నివాసం, ఆయన సోదరి కృష్ణ ప్రియ నివాసం మిడాస్ స్పిరిట్స్ అండ్ లిక్కర్లతో పాటు ఎనిమిది చోట్ల తాజాగా తనిఖీలు సాగాయి. అలాగే, రాయపేటలోని ఓ ప్రైవేటు భవన నిర్మాణ సంస్థలో హఠాత్తుగా తనిఖీలు చేసి, కొన్ని రికార్డులను ఐటీ వర్గాలు స్వాధీనం చేసుకు న్నాయి. సాయంత్రానికి అన్ని చోట్ల తనిఖీలు ముగియడంతో చిన్నమ్మ కుటుంబీకుల్ని, సన్నిహితుల్ని విచారణ వలయంలోకి తీసుకొ చ్చే పనిలో ఐటీ వర్గాలు నిమగ్నం అయ్యాయి. పరిశీలనలో 500మంది అధికారులు 1800మంది అ«ధికారులు ఏకకాలంలో ఐటీ దాడులకు దిగి స్వాధీనం చేసుకున్న రికార్డులు, దస్తావేజులు, నగదు, నగలు, ఇతర ఆస్తులు, పెట్టుబడులకు సంబంధించిన వివరాల డాక్యుమెంట్లు, ఇలా అన్నింటినీ చెన్నైలోని ఐటీ కార్యాలయానికి తరలించారు. నుంగంబాక్కంలో ఉన్న ఐటీ కార్యాలయంలో సూట్ కేసుల్లో, బాక్సుల్లో, గోనె సంచుల్లో ఉన్న వాటన్నింటిని సమగ్రంగా పరిశీలించేందుకు అధికారుల బృందం రంగంలోకి దిగింది. ఐదు వందల మందితో కూడిన అధికారుల బృందాలు క్షుణ్ణంగా డాక్యుమెంట్లను పరిశీలించే పనిలో నిమగ్నం అయ్యాయి. ఆ మేరకు చిన్నమ్మ శశికళ పెరోల్ మీద బయటకు వచ్చిన సమయంలో ఆస్తులను బంధువులు, సన్నిహితులు, నమ్మిన బంటుల వలే ఉన్న పనివాళ్లు, కారు డ్రైవర్లు తదితరుల బినామీల పేరిట డాక్యుమెంట్లను మార్చి ఉండడం పరిశీలనలో వెలుగు చూసినట్టు సమాచారం. కొడనాడులో పాత నోట్లు తమకు లభించిన రికార్డులు, బ్యాంక్ లావాదేవీల వివరాల మేరకు చిన్నమ్మ కుటుంబీకులు, సన్నిహితులు పెద్ద నోట్ల రద్దు సమయంలో రూ.250 కోట్ల మేరకు పాత కరెన్సీని కొత్తవిగా మార్చినట్టుగా పరిశీలనలో తేలింది. అలాగే, కొన్ని చోట్ల ఆ నోట్లను మార్చ లేక అలాగే, వదిలి పెట్టి ఉండడాన్ని గుర్తించారు. ప్రధానంగా కొడనాడు ఎస్టేట్లో పెద్ద ఎత్తున పాత నోట్లు, మూడు కేజీల బంగారం బయటపడ్డట్టు సంకేతాలు వెలువడ్డాయి. అక్కడి మేనేజర్ చంద్రశేఖర్ను రహస్య ప్రదేశంలో ఉంచి ఐటీ వర్గాలు విచారిస్తున్నాయి. ఇక, ఈ ఎస్టేట్ను తన తండ్రి వద్ద నుంచి బలవంతంగా లాక్కున్నట్టు ఇంగ్లాండ్కు చెందిన గ్రేక్ జాన్స్ కుమారుడు పీటర్ గ్రేక్ జాన్స్ అమ్మ జయలలిత మరణం తదుపరి ఆరోపణలు గుప్పిస్తూ వస్తున్నారు. ప్రస్తుతం ఐటీ దాడుల నేపథ్యంలో చట్టవిరుద్ధంగా తమ ఆస్తిని శశికళ కుటుంబం దోచుకుందని, ఇక చట్టపరంగా తాను మళ్లీ స్వాధీనం చేసుకుంటానన్న పీటర్ ధీమా వ్యక్తం చేశారు. 355 మంది విచారణకు రంగం సిద్ధం సోదాలు ముగియడంతో చిన్నమ్మ కుటుంబీకులు ఒక్కొక్కర్ని విచారించేందుకు రంగం సిద్ధం అయింది. మొత్తంగా 355 మందికి సమన్లు రెడీ అయ్యాయి. వీటిలో తొలి సమన్ను దినకరన్ మద్దతుదారుడు పుహలేంది, అమ్మ జయలలిత వైద్యుడు డాక్టర్ శివకుమార్, అమ్మ సహాయకుడు పూంగుండ్రం అందుకున్నారు. ఈ ముగ్గురు సోమవారం ఐటీ కార్యాలయం మెట్లు ఎక్కారు. వీరి వద్ద ప్రత్యేక బృందం అధికారులు గుచ్చి గుచ్చి పలు ప్రశ్నలకు సమాధానాలు రాబట్టే యత్నం చేసినట్టు తెలిసింది. పుహలేందిని మరోమారు బుధవారం విచారణకు రావాలని ఆదేశించడం గమనార్హం. ఇక, చిన్నమ్మ సోదరుడు దివాకరన్ సమన్లు అందుకున్నారు. మన్నార్గుడి నుంచి చెన్నైకి పయనం అయ్యారు. ముందుగా తన రూపంలో ఐటీ దాడుల్ని ఎదుర్కొని తనయుడి వివాహ సమయంలో కష్టాలు పడ్డ మిత్రుడు కృష్ణమీనన్ను దివాకరన్ కలిశారు. ఆయన కుమారుడ్ని, కోడల్ని ఆశీర్వదించిన అనంతరం చెన్నైకి బయలుదేరారు. ప్రధానంగా దివాకరన్ చుట్టూ డొనేషన్ల పేరిట నగదు మార్పిడి, తన కళాశాల ద్వారా పెద్ద నోట్ల రద్దు సమయంలో సాగిన వ్యవహారాలు, ఇతర ఆస్తులతో పాటుచిన్నమ్మను గురి పెట్టి ప్రశ్నల వర్షం కురిపించేందుకు ఐటీ సిద్ధమైనట్టు సంకేతాలు వెలువడ్డాయి. తదుపరి ఒక్కొక్కర్ని వేర్వేరు సమయాల్లో తమ ముందు హాజరయ్యే విధంగా సమన్ల జారీలో మరో బృందం నిమగ్నం అయింది. ఇక, కాంచీపురం జిల్లా పడప్పైలోని ఆ కుటుంబానికి చెందిన మిడాస్ లిక్కర్స్ను తాత్కాలికంగా సీజ్ వేయడానికి తగ్గ ప్రయత్నాలు సాగుతున్నట్టు సమాచారం. ఈ పరిస్థితుల్లో వివేక్ను ఐటీ వర్గాలు తమ వాహనంలో ఎక్కించుకుని వెళ్లడంతో చిన్నమ్మ కుటుంబీకుల మెడకు ఉచ్చు బలంగానే బిగిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. జయ టీవీ వద్ద హాడావుడి (ఇన్సెట్) విచారణకు హాజరై వస్తున్న పుహలేంది వివేక్ వద్ద విచారణ శశికళ అన్న జయరామన్, ఇలవరసి దంపతుల కుమారుడు వివేక్(27) అమ్మ జయలలిత ఇంట పెరిగిన వివేక్ ఆమె రేషన్ కార్డులోనూ చోటు దక్కించుకుని ఉండడం గమనార్హం. ఆర్థిక శాస్త్రం అభ్యసించిన వివేక్ కొంత కాలం ఓ జాతీయ సంస్థలో పనిచేశారు. తదుపరి పరిణామాల నేపథ్యంలో జాస్ సినిమాస్కు డైరెక్టర్ అయ్యారని చెప్పవచ్చు. గత ఏడాది కీర్తనను వివాహం చేసుకున్న వివేక్, అమ్మ మరణం తదుపరి ఆ కుటుంబంలోనే ఆర్థిక వ్యవహారాల పర్యవేక్షిస్తూ కీలక వ్యక్తిగా మారాడని చెప్పవచ్చు. పది సంస్థలకు డైరెక్టర్గా, జయ టీవీ, నమదు ఎంజీఆర్ పత్రిక, జాస్ సినిమాస్లకు సీఈఓగా అవతరించారు. అందుకే కాబోలు ఆయన ఇంట ఉన్నతాధికారులు రంగంలోకి దిగి మరీ సోదాలు సాగించారు. అన్నిచోట్లా విచారణ ముగించిన ఐటీ వర్గాలు చిట్టచివరగా, సాయంత్రం ఐదున్నర గంటల సమయంలో వివేక్ను తమ వాహనంలో ఎక్కించుకుని ఐటీ కార్యాలయానికి తీసుకెళ్లడంతో చిన్నమ్మ కుటుంబంలో ఆందోళన రెట్టింపు అయింది. కీర్తన, ఆమె సోదరుడు ప్రభుల్ని సైతం అధికారులు ప్రశ్నించడం గమనార్హం. ఓ సినీ నటుడికి వాటా పుదుచ్చేరిలో దినకరన్ సన్నిహితుడిగా ఉన్న తెన్నరసుకు చెందిన శ్రీలక్ష్మి జ్యెవెలరీస్లో లభించిన ఆధారాల మేరకు రూ.160కోట్ల నగదును కొత్త నోట్లుగా మార్చి ఉండడాన్ని ఐటీ అధికారులు గుర్తించారు. అలాగే, ఈ జ్యువెలరీస్లో లెక్కలోకి రాని బంగారం బయటపడడమే కాకుండా, ఇందులో ఓ సినీ నటుడికి వాటా కూడా ఉన్నట్టు విచారణలో తేలినట్టు తెలిసింది. దీంతో ఆ నటుడి కోసం ఆరా తీస్తున్నారు. అలాగే, అంబత్తూరు సమీపంలో ఆదివారం రాత్రి సాగిన సినిమా తరహా చేజింగ్లో ఓ ఇన్నోవాను గుర్తు తెలియని వ్యక్తులు ముగ్గురు వదిలి పెట్టి ఉడాయించారు. అందులో ఐదు బాక్స్లు ఉన్నట్టు, వాటిని ఐటీ అధికారులు తమ గుప్పెట్లోకి తీసుకుని పరిశీలిస్తున్నట్టు సమాచారం. చిన్నమ్మ కుటుంబం అమ్మ జయలిత గొడుగు నీడలో బాగానే అక్రమార్జన సాగించినట్టు రికార్డుల పరిశీలనలో వెలుగులోకి వస్తున్నట్టుగా ఐటీ కార్యాలయ పరిసరాల్లో చర్చ ఊపందుకుంది. దినకరన్ శిబిరం గప్చుప్ చిన్నమ్మ ప్రతినిధి దినకరన్ మద్దతు అన్నాడీఎంకే వర్గాలు ఐటీ దాడుల గురించి నోరు మెదపడం లేదు. ఇందుకు కారణం, నోరు తెరిస్తే, ఎక్కడ తమను టార్గెట్ చేస్తారనో అని వారిలో ఆందోళన నెలకొనడమే. ఇప్పటికే దినకరన్కు సన్నిహితంగా ఉన్న ముఖ్య నాయకుల్ని గురిపెట్టి ఉన్న దృష్ట్యా, మౌనంగా ఉంటే మంచిదనే నిర్ణయంతో అనర్హత వేటు పడ్డ ఎమ్మెల్యేలతో పాటు, ఆ శిబిరం జిల్లాల కార్యదర్శులు అనేకమంది ఉన్నారు. దినకరన్కు మద్దతుగా వ్యాఖ్యల తూటాల్ని పేల్చుతూ వచ్చిన పుహలేంది ఐటీ కార్యాలయం మెట్లు ఎక్కడం గమనార్హం. ఇక, దినకరన్ సన్నిహితుడు , అనర్హత వేటు పడ్డ ఎమ్మెల్యే తంగతమిళ్ సెల్వన్ ఒక్కరే స్పందిస్తుండగా, మిగిలిన వారెవరూ నోరు మెదపడం లేదు. ఇక, సోమవారం దినకరన్ సైతం గప్చుప్ అన్నట్టుగా వ్యవహరించడం గమనార్హం. కాగా, చిన్నమ్మ ఫ్యామిలీ ఆస్తులన్నీ ప్రజల నుంచి కొల్లగొట్టినవేనని, వాటన్నింటినీ స్వాధీనం చేసుకోవాల్సిందేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు తమిళి సై సౌందరరాజన్ డిమాండ్ చేశారు. కలవరంలో చిన్నమ్మ పరప్పన అగ్రహార చెరలో శశికళ, ఇలవరసి శిక్ష అనుభవిస్తున్న విషయం తెలిసిందే. తన కుటుంబాన్ని టార్గెట్ చేసి ఐటీ సోదాలు సాగడంతో చిన్నమ్మ కలవరంలో పడ్డట్టు సంకేతాలు వెలువడ్డాయి. అర్ధరాత్రి వరకు ఆమె జైల్లోని టీవీ వద్ద వార్తల్ని చూస్తున్నట్టు, ఉదయాన్నే పత్రికల్ని తెప్పించుకుని సమాచారాల్ని తెలుసుకుంటున్నట్టు తెలిసింది. తనయుడు వివేక్ను ఐటీ వర్గాలు వాహనంలో ఎక్కించుకు వెళ్లిన సమాచారంతో ఇళవరసి తీవ్ర మనో వేదనలో పడ్డట్టు సమాచారం. -
టార్గెట్ ఎనిమిది మంది, ‘వివేక్’ మెడకు ఉచ్చు
సాక్షి, చెన్నై: ఆదాయ పన్ను శాఖ విచారణ వలయంలోకి చిన్నమ్మ శశికళ కుటుంబం, సన్నిహితులు, సహాయకులు మూడు వందల మందిని తీసుకొచ్చారు. వీరిలో ఎనిమిది మంది టాప్ లిస్టులో ఉన్నారు. వీరందరికీ సమన్లు సిద్ధం చేస్తున్నారు. ఒకరి తర్వాత మరొకరు విచారణను ఎదుర్కోవాల్సి ఉంది. ఇక, ఇళవరసి కుమారుడు వివేక్ మెడకు మాత్రం ఉచ్చు బిగిసే అవకాశాలు ఉన్నట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. 27 ఏళ్ల వయసు కల్గిన వివేక్ వెయ్యి కోట్ల మేరకు ఆస్తులు, పెట్టుబడుల్ని కల్గి ఉన్నట్టు ఐటీ దాడుల్లో వెలుగు చూసి ఉండడంతో చిన్నమ్మ కుటుంబంలో ఉత్కంఠ తప్పడం లేదు. అన్నాడీఎంకే అమ్మ జయలలిత నెచ్చెలి శశికళ కుటుంబాన్ని, సన్నిహితుల్ని గురి పెట్టి ఐటీ దాడులు గురువారం నుంచి సాగుతున్న విషయం తెలిసిందే. తొలిరోజు 187 చోట్ల, రెండోరోజు 147 చోట్ల, మూడో రోజు 40 చోట్ల తనిఖీలు జరిగాయి. ఇక, నాలుగో రోజుగా 20 చోట్ల తనిఖీల్లో ఐటీ వర్గాలు నిమగ్నమయ్యారు. ప్రధానంగా ఐటీ విభాగంలో ఉన్నతాధికారులుగా ఉన్న వాళ్లు నాలుగో రోజు రంగంలోకి దిగడంతో తదుపరి అడుగులు ఎలా ఉంటాయోనన్న చర్చ బయలు దేరింది. టార్గెట్ 8 మంది: ఐటీ చరిత్రలో తమిళనాడులో కనీవిని ఎరుగని రీతిలో ఏకకాలంలో, రోజుల తరబడి సాగుతున్న ఈ దాడులపై సర్వత్రా దృష్టి పెట్టారు. రాజకీయ పక్షాలు కొన్ని విమర్శలు గుప్పిస్తుంటే, మరికొన్ని ఐటీ దాడుల్ని ఆహ్వానిస్తున్నాయి. ఈ చర్చ ఓ వైపు సాగుతుంటే, మరో వైపు నాలుగు రోజులుగా చిన్నమ్మ ఫ్యామిలీ, సన్నిహితులకు కంటి మీద కునుకు కరువైందని చెప్పవచ్చు. పట్టువదలని విక్రమార్కుడిలా తిష్ట వేసిన ఐటీ వర్గాలు అణువణువు సోదాలు చేస్తూ, లభించిన ఆధారాలను, వివరాలను ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు అందిస్తున్నారు. ఇప్పటి వరకు సేకరించిన వివరాలు, లభించిన ఆధారాలు, రికార్డులు, పెట్టుబడులు, ఆస్తులు, నగలు, నగదులకు సంబంధించి విచారణను ముమ్మరం చేయడానికి సిద్ధం అయ్యారు. ఇందు కోసం ఓ జాబితాను సిద్ధం చేస్తున్నారు. మూడు వందల మందిని విచారణ వలయంలోకి చేర్చి, ఒక్కొక్కర్ని తమ కార్యాలయం మెట్లు ఎక్కించేందుకు ఐటీ వర్గాలు రంగం సిద్ధం చేస్తున్నాయి. ఈ జాబితాలో టాప్ 8 మందిని తొలుత టార్గెట్ చేశారు. ఇందులో శశికళ భర్త నటరాజన్, సోదరుడు దివాకరన్, అక్కకుమారులు దినకరన్, భాస్కరన్, అన్న కుమారుడు వివేక్, కుమార్తె కృష్ణ ప్రియ, న్యాయవాది సెంథిల్, జ్యోతిష్కుడు చంద్రశేఖర్ ఉన్నట్టు సమాచారం. వివేక్ మెడకు ఉచ్చు: టాప్ 8 మందిలో తొలి పేరుగా వివేక్ను చేర్చినట్టు సమాచారం. ఇందుకు కారణం, 27 ఏళ్ల వయస్సు కల్గిన వివేక్ వెయ్యి కోట్ల మేరకు ఆస్తుల్ని, పెట్టుబడుల్ని తన గుప్పెట్లో ఉంచుకున్నట్టుగా ఐటీ దాడుల్లో వెలుగు చూడడమే. జయ టీవీ, నమదు ఎంజీయార్, జాస్ సినిమాస్ ఇలా మరికొన్ని సంస్థలకే ఆయనే అధిపతి అన్నట్టుగా ఆధారాలు చిక్కడంతోనే వివేక్ను తొలి జాబితాలో చేర్చినట్టు తెలిసింది. తదుపరి చిన్నమ్మ సోదరుడు దివాకరన్ను గురి పెట్టి ఉండడంతో, మున్ముందు ఐటీ వర్గాల విచారణలు ఎలాంటి మలుపులు తిరుగుతాయోనన్న ఉత్కంఠ తప్పడం లేదు. అదే సమయంలో వివేక్ను అరెస్టు కూడా చేయవచ్చనట్టు ప్రచారం ఊపందుకుంది. శశికళ భర్త నటరాజన్ను టార్గెట్ చేసినా, ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితిని బట్టి విచారణకు పిలిచేందుకు చర్యలు చేపట్టారు. ప్రస్తుతం లభించిన ఆధారాల మేరకు మొత్తం ఆస్తుల వివరాల్ని, పట్టుబడ్డ వాటి గురించిన వివరాల్ని లెక్కించే పనిలో ఐటీ వర్గాలు బిజీగా ఉన్నాయి. వీరు తమకు ఇచ్చే నివేదిక ఆధారంగా రంగంలోకి దిగేందుకు సీబీఐ, ఈడీ వర్గాలు సిద్ధం అవుతుండం గమనార్హం.లగ్జరీ కార్లు: ఆదివారం 20 చోట్ల దాడులు జరగ్గా, పట్టుబడ్డ రికార్డుల సమగ్ర పరిశీలన మేరకు లగ్జరీ కార్ల కొనుగోళ్లలోనూ పన్ను ఎగవేత వెలుగులోకి వచ్చినట్టు తెలిసింది. విదేశాల నుంచి పలు కార్లు అక్రమ మార్గంలో దిగుమతి చేసుకుని ఉండడాన్ని గుర్తించారు. దివాకరన్ వద్ద విచారణ: మన్నార్ కుడిలోని దివాకరన్, ఇళ్లు, కార్యాలయాలు, ఫామ్ హౌస్, కళాశాలల్లో ఐటీ వర్గాలు తనిఖీలు ముగించాయి. ఆయన కళాశాలలోని ఓ గదిని ఐటీ వర్గాలు తమ గుప్పెట్లోకి తీసుకుని సీల్ వేశాయి. మన్నార్కుడిలో లభించిన రికార్డులు, ఇతర వాటిని 14 కార్లో యాభై మంది అధికారులు చెన్నైకు తరలించడం గమనార్హం. అలాగే, మరి కొందరు అధికారులు దివాకరన్ను రహస్య ప్రదేశంలో ఉంచి విచారిస్తున్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. పుదుచ్చేరికి చంద్రశేఖర్: శశికళ జ్యోతిష్కుడు చంద్రశేఖర్ ఇంట్లో , న్యాయవాది సెంథిల్ ఇంట్లో విచారణ ముగిసింది. జ్యోతిష్కుడి ఇంట్లో చిన్నమ్మ ఫ్యామిలికీ సంబంధించిన అనేక దస్తావేజులు ఐటీ వర్గాలకు చిక్కినట్టు సమాచారం. అలాగే, రాష్ట్ర మంత్రి ఒకరు ఈ జ్యోతిష్కుడితో మరీ సన్నిహితంగా ఉండడంతో ఆయన ఎవరో అని ఆరా తీస్తున్నారు. దీంతో చంద్రశేఖర్ను విచారించేందుకు ఐటీ వర్గాలు పుదుచ్చేరికి తరలించారు. అక్కడి శ్రీలక్ష్మి జ్యువెలరీస్ అధినేత తెన్నరసును సైతం విచారించేందుకు చర్యలు చేపట్టారు. మోసం చేసి ఆస్తులు గడించారు: అమ్మ జయ లలితను మోసగించిన శశికళ కుటుంబం ఆస్తుల్ని గడించిందని అన్నాడీఎంకే సీనియర్ నేత కేపీ మునుస్వామి ఆరోపించారు. ప్రస్తుతం జరుగుతున్న దాడుల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రమేయం లేనే లేదని స్పష్టం చేశారు. అమ్మకు తెలియకుండా ఏళ్ల తరబడి మోసాలకు, అక్రమాలకు పాల్పడ్డారని మండిపడ్డారు. రాజకీయం చేయొద్దు: ఐటీ దాడుల్ని రాజకీయం చేయవద్దు అని కేంద్ర సహాయ మంత్రి పొన్ రాధాకృష్ణన్ పేర్కొన్నారు. ఐటీ పరిశీలనలో తేలిన అంశాలు, లభించిన ఆధారాల మేరకు దాడులు సాగుతున్నాయని తెలిపారు. బీజేపీ మీద నిందల్ని వేయడం మంచి పద్ధతి కాదని హితవు పలికారు. శశికళ కుటుంబాన్ని మాత్రమే ఐటీ టార్గెట్ చేయలేదని, ఇతర రాష్ట్రాల్లో బీజేపీకి చెందిన వారిని సైతం గురి పెట్టి తనిఖీలు, సోదాలు సాగుతున్న విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు. అన్నాడీఎంకేను ముక్కలు చేయాల్సిన అవసరం గానీ, రాజకీయ కక్ష సాధింపులకు దిగాల్సినంత విరోధంగా ఇక్కడి వారితో బీజేపీ పెద్దలకు లేదని స్పష్టం చేశారు. ఇక, పీఎంకే అధినేత రాందాసు పేర్కొంటూ, శశికళ బంధువులు కూడబెట్టిన ఆస్తులను జప్తు చేయాలని, వాటన్నింటిని కేంద్రం స్వాధీనం చేసుకోవాలని కోరారు. మమ్మల్ని తరిమేయడానికి కుట్ర: తిరువణ్ణామలైలో దైవ దర్శనానికి వెళ్లిన దినకరన్ మీడియాతో మాట్లాడుతూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు తమిళిసై సౌందరరాజన్ వ్యాఖ్యలు బట్టి చూస్తే, ఈ రాష్ట్రం నుంచే కాదు దేశం నుంచి తమ కుటుంబాన్ని తరిమి వేయడానికి కుట్ర జరుగుతున్నట్టుందని అనుమానం వ్యక్తం చేశారు. అమ్మ జయలలిత ఆస్పత్రిలో ఉన్నప్పుడు ఆమె కోరిక మేరకు వీడియో తీశామని, అది తన వద్దే ఉందన్నారు. వైద్య చికిత్సలు, అమ్మకు సంబంధించిన వీడియో తన వద్దే ఉందని, దానిని ఐటీ వర్గాలు తీసుకెళ్ల లేదని స్పష్టం చేశారు. ఈ దాడులతో రాజకీయంగా తాను వెనుక బడ లేదని, ప్రజల మదిలో స్థానం సంపాదించుకున్నట్టు పేర్కొన్నారు. ప్రజలు అంతా గమనిస్తున్నారని పేర్కొంటూ, పదవి చేతిలో ఉంది కదా అని మంత్రులు ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేయడం శోచనీయమని విమర్శించారు. మంత్రి సీవీ షణ్ముగం లాంటి వాళ్లు ఎందరో ఎలా ఎమ్మెల్యే సీట్లు దక్కించుకున్నారో అన్న వివరాల్ని బయట పెడితే..అంటూ, ఓ మారు గుర్తుంచుకోండని మంత్రులకు హితవు పలికారు. కేసుల్ని ధైర్యంగా ఎదుర్కొంటామని, చట్టపరంగా ముందుకు సాగుతామని ధీమా వ్యక్తం చేశారు. మహా అయితే, అరెస్టు చేస్తారేగానీ, కాల్చి చంపరుగా అని ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. -
స్కూల్ బ్యాగ్లో పాము
విద్యార్థిని కాటేసిన రక్త పింజర దొన్కల్ గ్రామంలో ఘటన ఇందల్వాయి(నిజామాబాద్ రూరల్) : స్కూల్ బ్యాగ్లోకి చొరబడిన పాము విద్యార్థిని కాటేసింది. స్థానికుల కథనం ప్రకారం.. మండలంలోని దొన్కల్ గ్రామానికి చెందిన వివేక్ స్థానిక ప్రభుత్వ పాఠశాలలో ఒకటో తరగతి చదువుతున్నాడు. ఇంట్లో ఉంచిన స్కూల్ బ్యాగులోకి పాము చొరబడింది. ఇది గమనించిన వివేక్ సోమవారం ఉదయం ఆ బ్యాగ్ను తీసుకొని స్కూల్కు వెళ్లాడు. క్లాస్రూంలో పుస్తకాల కోసమని బ్యాగులో చేతు పెట్టగా, అందులో ఉన్న రక్త పింజర కాటు వేసింది. విషయం తెలుసుకున్న తోటి విద్యార్థులు, ఉపాధ్యాయులు ఆందోళనకు గురయ్యారు. వివేక్ను వెంటనే ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి, యాంటీ వీనమ్ ఇంజక్షన్లు చేయించి, మెరుగైన చికిత్స కోసం జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. పాము కాటు వల్ల విద్యార్థి చేయి వాచిందని, పెద్దగా ప్రమాదం ఏమి లేదని వైద్యులు చెప్పినట్లు ఉపాధ్యాయులు తెలిపారు. -
వివేక్, పలక్లకు టైటిల్స్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ స్టేట్ ర్యాంకింగ్ ఇంటర్ స్కూల్ టేబుల్ టెన్నిస్ (టీటీ) టోర్నమెంట్లో వివేక్ సాయి, జి.పలక్ సత్తా చాటారు. హైదర్గూడలోని సెయింట్ పాల్స్ హైస్కూల్ వేదికగా జరిగిన ఈ టోర్నీలో క్యాడెట్ బాలబాలికల విభాగాల్లో వీరిద్దరూ విజేతలుగా నిలిచి టైటిళ్లను కైవసం చేసుకున్నారు. ఆదివారం జరిగిన క్యాడెట్ బాలుర ఫైనల్లో వివేక్ సాయి (హెచ్వీఎస్) 2–11, 11–6, 11–7, 13–11తో ఆయుష్ (ఏడబ్ల్యూఏ)పై గెలుపొందాడు. సెమీస్ మ్యాచ్ల్లో ఆయుష్ 13–11, 7–11, 8–11, 11–8, 11–7తో జతిన్ దేవ్ (ఎస్పీహెచ్ఎస్)పై, వివేక్ 11–9, 11–13, 11–9, 11–5తో ఇషాంత్ (ఏడబ్ల్యూఏ)పై గెలిచారు. బాలికల విభాగంలో పలక్ (జీఎస్ఎం) 8–11, 11–7, 11–2, 11–4తో మెర్సీని ఓడించింది. సెమీఫైనల్ మ్యాచ్ల్లో మెర్సీ 11–3, 11–7, 11–2తో ప్రీతిపై, పలక్ 11–6, 14–12, 11–6తో అనన్య (జీఎస్ఎం)పై గెలుపొందారు. ఇతర విభాగాల వివరాలు జూనియర్ బాలుర క్వార్టర్స్: సరోజ్ సిరిల్ (ఎంఎల్ఆర్) 11–2, 11–4, 11–4, 11–6తో అనూప్ (స్టాగ్ అకాడమీ)పై, అమన్ ఉల్ రహమాన్ (స్టాగ్ అకాడమీ) 11–8, 11–7, 11–4, 11–2తో సౌరభ్పై, కేశవన్ (ఎంఎల్ఆర్) 11–8, 11–13, 11–3, 9–11, 11–4, 8–11, 12–10తో విశాల్ (జీఎస్ఎం)పై, సాయి తేజేశ్ (జీఎస్ఎం) 14–12, 8–11, 9–11, 4–11, 11–6, 11–9, 11–8తో అద్వైత్ (ఏడబ్ల్యూఏ)పై నెగ్గారు. పురుషుల క్వార్టర్స్: అరవింద్ 7–11, 15–13, 11–8, 11–7, 11–8తో అమన్పై, సాయి తేజేశ్ 11–8, 11–7, 11–6, 4–11, 11–8తో జుబేర్ ఫరూఖిపై, చంద్రచూడ్ (జీఎస్ఎం) 11–8, 11–8, 11–8, 11–6తో హర్‡్ష లహోటి (హెచ్వీఎస్)పై గెలిచారు. మహిళల క్వార్టర్స్: నైనా 11–9, 11–4, 11–5, 12–10తో పలక్ షాపై, మోనిక 11–4, 14–12, 11–5, 11–9తో లాస్యపై, ప్రణీత 11–8, 11–7, 11–8, 11–8తో వినిచిత్ర యాదవ్ (స్టాగ్ అకాడమీ)పై నెగ్గారు. సబ్ జూనియర్ బాలుర సెమీఫైనల్: అద్వైత్ 12–10, 6–11, 12–10, 12–10, 11–6తో వెంకట ధనుశ్పై, కేశవన్ 7–11, 9–11, 8–11, 11–4, 12–10, 11–6, 11–2తో కార్తీక్పై విజయం సాధించారు. బాలికలు: అంజలి 11–13, 11–9, 9–11, 11–7, 11–8, 7–11, 11–8తో ఐశ్వర్యపై, మెర్సీ 12–10, 11–8, 4–11, 7–11, 8–11, 11–9, 11–9తో భవితపై గెలుపొందారు. -
వ్యాయామ విద్యను విస్తరించాలి
జాతీయ సదస్సులో హెచ్సీఏ అధ్యక్షుడు వివేక్ వ్యాఖ్య ఉస్మానియా యూనివర్సిటీ: ఆరోగ్యంతో పాటు చురుగ్గా ఉండేందుకు వ్యాయామ విద్యను మరింత విస్తరించాలని హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్సీఏ) అధ్యక్షుడు వివేక్ అన్నారు. శనివారం ఓయూ క్యాంపస్ దూరవిద్య కేంద్రంలో ‘ఫిజికల్ ఎడ్యుకేషన్, ఫిట్నెస్ అండ్ స్పోర్ట్స్ సైన్స్–2017’ అనే అంశంపై జాతీయ సదస్సు ప్రారంభమైంది. ఓయూ వ్యాయామ విద్య విభాగం ఆధ్వర్యంలో జరుగుతోన్న ఈ కార్యక్రమానికి ఫిజికల్ ఎడ్యుకేషన్ కళాశాల ప్రిన్సిపాల్, సదస్సు చైర్మన్ ప్రొఫెసర్ లక్ష్మీకాంత్ రాథోడ్ అధ్యక్షత వహించగా, వివేక్ ముఖ్య అతిథిగా విచ్చేసి సదస్సును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... దేశవ్యాప్తంగా వ్యాయామ విద్య విస్తరించాలన్నారు. పాఠశాల స్థాయి నుంచే క్రీడల పట్ల అవగాహన కల్పిస్తూ విద్యార్థుల్లో వ్యాయామ విద్యపై ఆసక్తిని పెంచాలన్నారు. విశ్వవిద్యాలయాల కృషితోనే ఇది సాధ్యమవుతుందన్నారు. హెచ్సీఏ తరఫున ఓయూ క్యాంపస్లో ఆధునిక హంగులతో క్రికెట్ పిచ్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. శాట్స్ చైర్మన్ ఎ. వెంకటేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ... ఓయూలో సింథటిక్ ట్రాక్ను కూడా నిర్మిస్తామని చెప్పారు. రెండు రోజుల పాటు జరిగే ఈ అంతర్జాతీయ సదస్సుకు దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి, పది దేశాల నుంచి 450 ప్రతినిధులు హాజరయ్యారని సదస్సు కన్వీనర్ ప్రొఫెసర్ రాజేశ్ కుమార్ చెప్పారు. అధ్యాపకులు, పరిశోధన విద్యార్థుల నుంచి 300 పరిశోధన పత్రాలను సమర్పించనున్నట్లు చెప్పారు. అనంతరం సావనీర్ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఔటా అధ్యక్షులు ప్రొఫెసర్ భట్టు సత్యనారాయణ, వ్యాయామ విద్య వీసీ ప్రొఫెసర్ సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొని ప్రసంగించారు. -
చితి రగిలింది..గుండె పగిలింది!
తిరుపతి తుడా : ‘రేయ్! బాలాజీ..లెయ్ రా..రేయ్!..ఎందుకు రా ఇంత పనిచేశావు? ఏం ఖర్మ పట్టిందిరా నీకు? ఏరోజూ నిన్ను ఒక్క మాట కూడా అనలేదు కదరా! మూడు నెలల ముందే దేశమంతా తిప్పాను..అందరితో ఎంతో సంతోషంగా ఫొటోలు కూడా తీసుకున్నావ్ కదరా!..మంచి డాక్టరనవుతానని ఎన్నో చెప్పావు..మాకు తలకొరివి పెట్టాల్సిన వాడివి.. నీకు నేను పెట్టాల్సి వచ్చింది..అయ్యో! దేవుడా..’అని అంత్యక్రియల సమయంలో తన కుమారుడి మృతదేహం వద్ద భాస్కర్రెడ్డి గుండెలవిసేలా రోదించడం పలువురిని విచలితుల్ని చేసింది. తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలోని కిమ్స్ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ నాల్గవ సంవత్సరం చదువుతున్న తిరుపతికి చెందిన బండారు వివేక్ (23) బుధవారం అక్కడ హాస్టల్ గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకోవడం విదితమే. శుక్రవారం ఉదయం స్థానిక దేవేంద్ర థియేటర్ రోడ్డులోని హరిశ్చంద్ర శ్మశానవాటికలో దహనక్రియలు నిర్వహించారు. కుమారుడి చితికి నిప్పంటించిన సమయంలో భాస్కర్రెడ్డి..బాలాజీ.. బాలాజీ (వివేక్ను ముద్దుగా పిలిచే పేరు) అంటూ బిగ్గరగా రోదిస్తుంటే ఆయన్ను ఓదార్చడం ఎవరి తరమూ కాలేదు. మిత్రుడా! ఇక సెలవు కిమ్స్ వైద్య కళాశాల నుంచి వివేక్ రూమ్మెంట్స్, సహచరులు, కిమ్స్ ఫిజికల్ డైరెక్టర్/హాస్టల్ ఇన్చార్జి నాగరాజ ఇక్కడ అంత్యక్రియల్లో వివేక్కు కన్నీటి వీడ్కోలు పలికారు. వివేక్ ఎంతో మంచి స్టూడెంట్, మిత భాషి అని, ఎప్పుడూ స్టడీస్, లైబ్రరీ తప్ప మరే ఇతర వ్యాపకాలు లేవని, మంచి డాక్టర్ అవుతాడని తామంతా భావించామని, అతను ఆత్మహత్య చేసుకోవడం ఇప్పటికీ తాము జీర్ణించుకోలేకపోతున్నామని కిమ్స్ ఫిజికల్ డైరెక్టర్ ఆవేదన వ్యక్తం చేశారు. వివేక్ మిగిల్చిన జ్ఞాపకాల తడితో అక్కడి నుంచి సహచరులు అమలాపురానికి భారంగా కదిలారు. వైద్య కళాశాలల్లో కౌన్సెలింగ్కు నాస్తి! వైద్య కళాశాలల్లో మానసిక రుగ్మతలతో బాధపడే వారికి ఉద్దేశించిన కౌన్సెలింగ్కు ఏనాడో స్వస్తి పలికారని, కౌన్సెలింగ్ అంటూ ఉంటే విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడే వారు కారని కొందరు సీనియర్ వైద్య ఉద్యోగులు అభిప్రాయపడ్డారు. ఎస్వీ మెడికల్ కళాశాలలో కొన్నేళ్ల క్రితం కౌన్సెలింగ్ ప్రక్రియకు శ్రీకారం చుట్టారని, ఒత్తిళ్లతో సతమవుతున్న విద్యార్థులు తమ సమస్య ఏమిటో చెప్పడంతో దానికి పరిష్కారం చూపి, మంచి ఫలితాలు రాబట్టారని, తర్వాత కాలంలో ఎస్వీ మెడికల్ కాలేజీతో సహా ఏ కాలేజీ కూడా కౌన్సెలింగ్ జోలికి వెళ్లలేదని తెలిపారు. వివేక్ ఆత్మహత్య ఉదంతంతోనైనా ప్రభుత్వం మేల్కొనాలని హితవు పలికారు. -
ముగ్గురి ఆత్మహత్య
∙అమలాపురంలో తిరుపతికి చెందిన వైద్య విద్యార్థి ∙కాణిపాకంలో యువకుడు ∙పలమనేరు మండలంలో వివాహిత ∙ఉరి వేసుకుని మృతి వేర్వేరు కారణాలతో జిల్లా వాసులు ముగ్గురు ఉరి వేసుకుని బలవన్మరణం చెందారు. తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో చదువుతున్న తిరుపతికి చెందిన వైద్య విద్యార్థి, ఐరాలలో ఓ యువకుడు, పలమనేరు మండలంలో ఓ వివాహిత ఆత్మహత్య చేసుకున్నారు. మానసిక ఒత్తిడితో వైద్య విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం అక్కడి విద్యార్థులను దిగ్భ్రాంతికి గురిచేసింది. తల్లిదండ్రులకు తీరని దుఃఖాన్ని మిగిల్చింది. అమలాపురం రూరల్: తూర్పు గోదావరి జిల్లా అమలాపురం కిమ్స్ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ నాలుగో సంవత్సరం చదువుతున్న తిరుపతికి చెందిన బండారం వివేక్ (23) కళాశాల హాస్టల్ గదిలో ఉరి వేసుకుని బుధవారం మధ్యాహ్నం ఆత్మహత్య చేసుకున్నాడు. మానసిక ఒత్తిడి వల్లే ఈ అఘాయిత్యానికి పాల్పడి ఉండవచ్చని తోటి విద్యార్థులు, పోలీసులు అనుమానిస్తున్నారు. మానసిక ఒత్తిడి తగ్గటానికి వివేక్ మందులు వాడుతున్నట్లు తోటి విద్యార్థులు తెలిపారు. క్రమశిక్షణతో ఉండే వివేక్ చదువులో చురుగ్గానే ఉంటాడని, మితభాషి అని స్నేహితులు చెప్పారు. వివేక్ బుధవారం కళాశాలకు వెళ్లకుండా హాస్టల్ గదిలోనే ఉండిపోయాడు. మధ్యాహ్నం కళాశాల నుంచి హాస్టల్కు వచ్చిన రూమ్మేట్స్ సాయికృష్ణ, శ్రీకాంత్ తలుపు గడియ వేసి ఉండటంతో ఎంత పిలిచినా స్పందించకపోవటంతో తలుపులు పగులగొట్టారు. వివేక్ ఫ్యాన్కు ఉరివేసుకుని వేలాడుతుండటం చూసి దిగ్భ్రాంతి చెందారు. వివేక్ను కిందికి దింపి కిమ్స్ హాస్పిటల్కు తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. డీఎస్పీ ఏవీఎల్ ప్రసన్నకుమార్, తాలూకా ఎస్సై ఎం.గజేంద్రకుమార్ వివేక్ మృతదేహాన్ని, హాస్టల్ గదిని పరిశీలించారు. ఈనెల 21 నుంచి నాలుగో సంవత్సరం పరీక్షలు రాయాల్సి ఉండడంతో ఎక్కువగా చదువుతున్నాడని స్నేహితులు చెబుతున్నారు. వివేక్ తండ్రి భాస్కరరెడ్డి తిరుపతిలోని ఎస్బీఐలో అధికారిగా పనిచేస్తున్నారు. డీఎస్పీ విలేకరులతో మాట్లాడుతూ, వివేక్ మానసిక సమస్యలతో ఆత్మహత్య చేసుకున్నట్లు దర్యాప్తులో తేలిందని చెప్పారు. వివేక్ ఆత్మహత్యకు ముందు తన వ్యక్తిగత ట్యాబ్లో ఉరి వేసుకోవడానికి సంబంధించిన వివరాలను తెలుసుకునే ప్రయత్నం చేసినట్లు ఆధారాలు కనిపించాయన్నారు. కిమ్స్ వైస్ చైర్మన్ మోహనరాజు వివేక్ మృతదేహాన్ని పరిశీలించారు. తల్లిదండ్రులకు ఫోన్ చేసి విచారం వ్యక్తం చేశారు. లాడ్జిలో ఉరి వేసుకుని యువకుడి మృతి కాణిపాకం: స్థానికంగా ఒక లాడ్జిలో యువకుడు ఉరి వేసుకుని మృతి చెందిన సంఘటన బుధవారం ఉదయం వెలుగులోకి వచ్చింది. ఏఎస్ఐ యతిరాజులు కథనం మేరకు.. తిరుపతిలోని రైల్వే కాలనీకి చెందిన చంద్రారెడ్డి (29) మంగళవారం రాత్రి ఇక్కడ లాడ్జిలో రూము తీసుకున్నారు. బుధవారం మధ్యాహ్నం వరకు రూము తలుపులు తెరవకపోవడంతో లాడ్జి సిబ్బంది అనుమానించారు. కిటికీలోంచి రూములోకి చూడగా ఉరి వేసుకుని ఉన్న యువకుడు కనిపించాడు. అనంతరం పోలీసులకు సమాచారమివ్వడంతో వారు కుటుంబ సభ్యులకు తెలియజేశారు. మృతుడు ఐరాల మండలం ఎం.జంగాలపల్లెకు చెందినవాడని, ప్రస్తుతం తిరుపతిలో నివాసం ఉంటున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారని పోలీసులు చెప్పారు. ఏ కారణాల చేత ఆత్మహత్య చేసుకున్నాడో దర్యాప్తులో తేలాల్సి ఉంది. పలమనేరు మండలంలో వివాహిత.. గంగవరం: వివాహిత ఆత్మహత్య చేసుకున్న సంఘటన పలమనేరు మండలం తొప్పనపల్లెలో బుధవారం సాయంత్రం వెలుగుచూసింది. వివరాలు..గ్రామానికి చెందిన సుబ్రమణ్యం, ఆయన భార్య పద్మ(35) తరచూ గొడవ పడేవారు. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం ఆమె పొలం పనులకు వెళ్లి సాయంత్రం ఇంటికి వచ్చి వంటచేసింది. కిటికీకి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆలస్యంగా గమనించిన ఇరుగుపొరుగు వారు పోలీసులకు, 108కు సమాచారం చేరవేశారు. అయితే మృతికి కారణాలేమిటో పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది. -
శశికళ కొత్త ఎత్తుగడ
చెన్నై: తమిళనాట అన్నాడీఎంకే రాజకీయాలు మరోసారి ఊహించని మలుపులు తిరుగుతూ రక్తికట్టిస్తున్నాయి. ముఖ్యమంత్రి పళనిస్వామి, మాజీ సీఎం పన్నీరు సెల్వం వర్గాల విలీనం విషయంలో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పన్నీరు వర్గం చేస్తున్న డిమాండ్లపై పళని సానుకూలంగా స్పందించకపోవడం, ఇరు వర్గాలు విమర్శలకు దిగడంతో విలీన చర్చలపై సందిగ్ధత ఏర్పడింది. ఈ విలీనం ఓ హైడ్రామా అని, కమలం పెద్దల కనుసన్నల్లో ఈ డ్రామా సాగుతోందని డీఎంకే కార్య నిర్వాహక అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ ఆరోపించారు. ఇదిలావుండగా పార్టీని తన గుప్పిట్లో పెట్టుకోవడానికి శశికళ కొత్త ఎత్తుగడ వేసినట్టు ప్రచారం జరుగుతోంది. శశికళ తన వదిన (అన్న భార్య) ఇళవరసి కుమారుడు వివేక్ను తెరపైకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. అన్నాడీఎంకే ఉప ప్రధాన కార్యదర్శిగా వివేక్ను నియమించి, ఆయన ద్వారా చక్రం తిప్పాలని భావిస్తున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. చిన్నమ్మ ప్రతిపాదనకు ఆమెకు నమ్మినబంటు అయిన సీఎం పళనిస్వామి కూడా సుముఖంగా ఉన్నట్టు తెలుస్తోంది. అక్రమాస్తుల కేసులో శశికళ, ఇళవరసి ఇద్దరూ బెంగళూరులోని అగ్రహార జైలులో శిక్షను అనుభవిస్తున్నారు. శశికళ తన మేనల్లుడు దినకరన్ను పార్టీ ఉపప్రధాన కార్యదర్శిగా నియమించిన సంగతి తెలిసిందే. కాగా దినకరన్ తీరు పట్ల శశికళ ఆగ్రహంగా ఉన్నట్టు వార్తలు వచ్చాయి. ఆర్కే నగర్ ఉప ఎన్నికల సందర్భంగా పార్టీ గుర్తు (టోపీ) ఎంచుకోవడంలో దినకరన్ సమర్థంగా వ్యవహరించలేదని ఆమె పార్టీ నాయకుల వద్ద ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక పార్టీ గుర్తు (రెండాకులు) కోసం ఈసీ అధికారికి లంచం ఇవ్వజూపిన కేసులో దినకరన్ను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ పరిణామాలు చిన్నమ్మకు ఆగ్రహం తెప్పించాయి. దినకరన్ను పార్టీ ఉప ప్రధాన కార్యదర్శి పదవి నుంచి పళని వర్గం తొలగించింది. ఈ నేపథ్యంలో శశికళ.. వివేక్ను పార్టీ ఉప ప్రధాన కార్యదర్శిగా నియమించి, పార్టీపై పట్టు చేజారకుండా చూడాలని భావిస్తున్నట్టు సమాచారం. -
ప్రమోషన్తో సినిమా హిట్ కాదు!
‘‘ఓ చెత్త సినిమా గురించి వంద రోజులు పబ్లిసిటీ చేసినా హిట్ కాదు, అది ఫ్లాపే. సినిమాలో సత్తా ఉంటే ప్రేక్షకులు థియేటర్లకు వస్తారు. అంతే గానీ... పబ్లిసిటీ ఎక్కువ చేస్తే సినిమా హిట్టవుతుందనుకోవడం భ్రమే. ఫ్లాప్ సినిమాలను పబ్లిసిటీ కాపాడిన సందర్భాలు నేనెప్పుడూ చూడలేదు’’ అన్నారు నయనతార. ఈ మలయాళీ కుట్టీ మీడియా ముందుకు రావడం అరుదు. సినిమాకి సంతకం చేసే ముందే నిర్మాతలకు ఖరాకండీగా పబ్లిసిటీ కార్యక్రమాలకు రానని చెప్పేస్తారనేది జగమెరిగిన సత్యం. మరి, సడన్గా పబ్లిసిటీ గురించి ఇంత పెద్ద లెక్చర్ ఎందుకు ఇస్తున్నారంటే... ‘‘పబ్లిసిటీ కార్యక్రమాలకు హాజరుకాని కథానాయికల పారితోషికంలో కోత విధించాలి’’ అని ప్రముఖ తమిళ నటుడు వివేక్ ఇటీవల ఓ కార్యక్రమంలో అన్నారు. పైకి పేరు చెప్పకున్నా ఆయన నయనతారనే విమర్శించారనే సంగతి అందరికీ అర్థమైంది. తాజా ఇంటర్య్వూ లో వివేక్ వ్యాఖ్యలను నయనతార దగ్గర ప్రస్తావించగా – ‘‘ఆయన నా గురించే అన్నారని తెలుసు. కానీ, నిజం ఏంటంటే... చాలాసార్లు నిర్మాతలు నా పారితోషికం పూర్తిగా ఇవ్వకపోతే ఆ డబ్బులను వదిలేశా. నిర్మాతల పరిస్థితి అర్థం చేసుకుని, కొన్ని సినిమాలకు నేనే పారితోషకం తగ్గించుకున్నా. పబ్లిసిటీ కార్యక్రమాలకు హాజరుకావాలా? వద్దా? అనేది హీరోయిన్ల ఇష్టం. నిర్మాత లకు ఏ సమస్య లేనప్పుడు మిగతా వాళ్లకు ఎందుకు? ఇటువంటి వ్యాఖ్యలు విన్నప్పుడు బాధ కలుగుతుంది’’ అన్నారు. ‘‘మీకో విషయం తెలుసా? దర్శక–నిర్మాతలు నా దగ్గరకి కథతో వచ్చినప్పుడే పబ్లిసిటీ కార్యక్రమాలకు రానని చెబుతా’’ అని నయనతార స్పష్టం చేశారు. -
తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకొని..
-
చక్కపోడు పోడురాజా అంటున్న సంతానం
సినిమా జనాల్లోకి వెళ్లడానికి టైటిల్ చాలా ప్రధాన పాత్ర పోషింస్తుందన్నది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన చిత్రాల పేర్ల విషయంలో నటుడు సంతానం చాలా జాగ్రత్త వహిస్తున్నారని చెప్పవచ్చు.హాస్యనటుడి నుంచి కథానాయకుడిగా ఎదిగిన ఈ సక్సెస్ఫుల్ నటుడు గత చిత్రం దిల్లుకు దుడ్డు కలెక్షన్ల వర్షం కురిపించింది.ఇప్పుడాయన చేతిలో పలు చిత్రాలు ఉన్నాయి. వాటిలో సర్వర్సుందరం త్వరలో తెరపైకి రావడానికి రెడీ అవుతోంది.తాజాగా శ్రీతేనాండాళ్ ఫిలింస్ సంస్థలో ఒక చిత్రం, వీటీవి.ప్రొడక్షన్స సంస్థలో ఒక చిత్రం అంటూ చాలా బిజీగా ఉన్నారు. కాగా వీటీవీ గణేశ్ తన వీటీవీ.ప్రొడక్షన్స పతాకంపై నిర్మిస్తున్న చిత్రానికి చక్కపోడు రాజాపోడు అనే టైటిల్ను నిర్ణయించారు. ఇందులో సంతానం ఇంతకు ముందు పోషించని సరికొత్త పాత్రలో నటిస్తున్నారట. ధనవంతుడై తండ్రి వ్యాపార వ్యవహారాలను చూసుకునే ఎలాంటి చీకూ చింతా లేని యువకుడిగా నటిస్తున్నారని చిత్ర వర్గాలు వెల్లడించారు. విశేషం ఏమిటంటే ఇందులో కథలో భాగంగా సాగే హాస్య పాత్రలో నటుడు వివేక్ నటిస్తున్నారు. నవ నటి భైరవి నాయకిగా పరిచయం అవుతున్న ఈ చిత్రంలో వీటీవీ.గణేశ్, పవర్స్టార్ శ్రీనివాసన్, రోబోశంకర్ వంటి వారు వినోదభరిత పాత్రల్లో నటిస్తుండగా సంపత్, శరత్లోహిత్దాలు ప్రతి నాయకులుగా నటిస్తున్నారు. జీఎస్.సేతురామన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి చాయాగ్రహణం అభినందన్, ఎడిటింగ్ను ఆంథోని, ఫైట్స్ను కణల్కన్నన్ కంపోజ్ చేస్తున్నారు. -
వివేక్ అజేయ సెంచరీ
సాక్షి, హైదరాబాద్: లయోలా అకాడమీ జూనియర్ కాలేజ్ జట్టు బ్యాట్స్మన్ వివేక్ సింగ్ (92 బంతుల్లో 137 నాటౌట్; 10 ఫోర్లు, 9 సిక్సర్లు) అజేయ సెంచరీతో చెలరేగాడు. ప్రత్యర్థి బౌలర్లపై ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. దీంతో దయానంద్ అండర్-19 క్రికెట్ టోర్నమెంట్లో భాగంగా కీట్స్ జూనియర్ కాలేజ్తో జరిగిన మ్యాచ్లో 155 పరుగుల తేడాతో ఆ జట్టు ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన లయోలా జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్లకు 349 పరుగులు చేసింది. వివేక్ సింగ్ అజేయ సెంచరీతో చెలరేగగా... అభిషేక్ (82), వైష్ణవ్ రెడ్డి (49) వేగంగా ఆడారు. అనంతరం బ్యాటింగ్కు దిగిన కీట్స్ జూనియర్ కాలేజ్ 42.2 ఓవర్లలో 194 పరుగులకు ఆలౌటైంది. మన్నాస్ (101), ధీరజ్ విశాల్ (52) ఆకట్టుకున్నారు. లయోలా బౌలర్లలో ప్రతీక్ కుమార్ 3 వికెట్లు పడగొట్టాడు. ఇతర మ్యాచ్ల స్కోర్లు జాన్సన్ గ్రామర్ స్కూల్: 147 (జాన్సన్ 71; తరుణ్ రాజ్ 3/19, సాత్విక్ 4/22), సెరుుంట్ పీటర్స్: 148/3 (కరణ్ 38, తరుణ్ రాజ్ 52 నాటౌట్). భవన్స కాలేజ్: 185/9 (అకీబ్ 59; సారుు పూర్ణానంద్ 3/34), గీతాంజలి స్కూల్: 186/3 (యశ్ 104 నాటౌట్, సారుు పూర్ణానంద్ 41). క్రీసెంట్ మోడల్ స్కూల్: 256/5 (రోహన్ 84, వివేక్ 79నాటౌట్), సెయింట్ మర్యాస్: 68 (రోహన్ 4/18). -
‘ఉద్యోగం, పరిహారం ఇవ్వలేదు’
సిమ్లా: ప్రభుత్వ ఉద్యోగం, రూ. 5 లక్షల పరిహారం ఇస్తామని హిమచల్ ప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన హామీ ఇంతవరకు అమలు కాలేదని అమరజవాను బల్దేవ్ కుమార్ శర్మ కుమారుడు వివేక్ వాపోయాడు. ఉద్యోగం ఇవ్వలేమంటూ కొద్ది రోజుల క్రితం ప్రభుత్వం నుంచి తనకు లేఖ వచ్చిందని చెప్పాడు. తన తండ్రి పారా మిలటరీ దళానికి చెందినందున ఉద్యోగం ఇవ్వలేకపోతున్నామని ప్రభుత్వం తెలిపిందన్నాడు. తనకు ఇచ్చిన హామీని ప్రభుత్వం కొద్ది నెలల్లోనే మరిచిపోయిందని ఆవేదన వ్యక్తం చేశాడు. అమరజవాన్ల కుటుంబాలను ప్రత్యక్షంగా సందర్శించి, వారు పడుతున్న బాధలు చూడాలని పాలకులకు సూచించాడు. ప్రభుత్వం వాగ్దానం చేసి నెరవేర్చకపోవడం శోచనీయమని పేర్కొన్నాడు. నిలబెట్టుకోనప్పుడు హామీ ఇవొద్దని వివేక్ కోరారు. మే నెలలో మణిపూర్ లో జరిగిన దాడిలో 29 అస్సాం రైఫిల్స్ కు చెందిన బల్దేవ్ కుమార్ శర్మ మృతి చెందిన సంగతి తెలిసిందే. -
మూడో రౌండ్లో కుషాల్, వివేక్
సాక్షి, హైదరాబాద్: బోడెపూడి శ్రీకాంత్ స్మారక స్టేట్ ర్యాంకింగ్ టేబుల్ టెన్నిస్ (టీటీ) టోర్నమెంట్లో కుషాల్, వివేక్ మూడో రౌండ్లోకి దూసుకెళ్లారు.ఖమ్మంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో ఖమ్మం జిల్లా టీటీ సంఘం, గ్లోబల్ టేబుల్ టెన్నిస్ అకాడమీ సంయుక్తంగా ఈ టోర్నమెంట్ను నిర్వహిస్తున్నారుు. క్యాడెట్ బాలుర విబాగంలో శుక్రవారం జరిగిన రెండో రౌండ్లో జి. వివేక్ సారుు (హెచ్వీఎస్) 11-9, 7-11, 11-6, 11-6తో తరుణ్ యాదవ్ (స్టాగ్ అకాడమీ)పై గెలుపొందగా... గ్లోబల్ టీటీ అకాడమీకి చెందిన కుషాల్ 11-7, 7-11, 11-9, 11-7తో అగస్త్య (ఎల్బీఎస్)ను ఓడించాడు. ఇతర మ్యాచ్ల్లో త్రిశూల్ మెహ్రా (ఎల్బీఎస్) 13-11, 8-11, 11-8, 10-12, 11-8తో వరుణ్ అమర్నాథ్ (జీఎస్ఎం)పై, రిత్విక్ (స్టాగ్ అకాడమీ) 11-4, 11-7, 11-8తో ఆయూష్ (ఏడబ్ల్యుఏ)పై, ప్రకీత్ (ఏడబ్ల్యుఏ) 11-7, 15-13, 7-11, 11-8తో శ్రేష్ట్ (ఏడబ్ల్యుఏ)పై, జతిన్ (ఎస్పీహెచ్ఎస్) 11-6, 11-9, 11-5తో క్షితిజ్ మల్పానీ (హెచ్వీఎస్)పై, వేణు మాధవ్ (జీఎస్ఎం) 11-8, 11-9, 12-10తో ఇషాంత్ (ఏడబ్ల్యుఏ)పై గెలుపొందారు. మరోవైపు సబ్ జూనియర్ విభాగంలో రఘురామ్, ఆయూష్ రెండో రౌండ్లోకి ప్రవేశించారు. తొలిరౌండ్లో రఘురామ్ (నల్గొండ) 11-4, 11-8, 11-9తో శ్రేష్ట్ (ఏడబ్ల్యుఏ)పై, ఆయూష్ (ఏడబ్ల్యుఏ) 11-9, 6-11, 11-7, 11-2తో హర్ష్ భట్నాగర్పై విజయం సాధించారు. అంతకుముందు జరిగిన టోర్నీ ప్రారంభోత్సవంలో ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్, తెలంగాణ రాష్ట్ర టేబుల్ టెన్నిస్ సంఘం అధ్యక్షుడు ఎ. నరసింహారెడ్డి, కార్యదర్శి పి. ప్రకాశ్రాజు పాల్గొన్నారు. సబ్ జూనియర్ బాలుర తొలి రౌండ్ ఫలితాలు: కుషాల్ (జీటీటీఏ) 11-7, 11-5తో రాఘవ్ (హెచ్వీఎస్)పై, రాజు (ఏడబ్ల్యుఏ) 11-2, 11-2, 11-2తో మణి (వరంగల్)పై, శ్రేయస్ (హెచ్వీఎస్) 11-9, 13-11, 9-11, 13-11తో అథర్వ (ఏడబ్ల్యుఏ)పై, రిత్విక్ (స్టాగ్ అకాడమీ) 11-4, 12-10, 11-5తో ప్రీతమ్ (నల్గొండ)పై, విశాల్ (జీఎస్ఎం) 11-4, 11-8, 11-3తో రిత్విక్ రోషన్ (వరంగల్)పై, ఆర్య భట్ (హెచ్వీఎస్) 11-8, 11-9, 14-12తో ప్రకేత్ (ఏడబ్ల్యుఏ)పై, శ్రీరంగ (హెచ్వీఎస్) 11-5, 11-4, 13-11తో నిత్యన్ రెడ్డి (నల్గొండ)పై, సారుునాథ్ రెడ్డి (హెచ్వీఎస్) 11-2, 11-1, 11-2తో మహేశ్(ఆదిలాబాద్)పై, ఆగస్త్య (ఎల్బీఎస్) 11-9, 13-11, 9-11, 11-3తో హితేన్ సారుు (ఎస్పీహెచ్ఎస్)పై, ఇషాంత్ (ఏడబ్ల్యుఏ) 11-3, 11-6, 11-5తో మధుకర్ (ఆదిలాబాద్)పై, ప్రణవ్ (ఏడబ్ల్యుఏ) 11-0, 11-1, 11-1తో చక్రవర్తి (వరంగల్)పై విజయం సాధించారు. -
కరెంట్ షాక్ తగిలి బాలుడు మృతి
నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లా దోమకొండలో ఓ బాలుడు ప్రమాదవశాత్తూ కరెంట్ షాక్ తగిలి మరణించాడు. వివరాలు ఇలా ఉన్నాయి... వివేక్ (16) అనే బాలుడు బుధవారం వేకువజామున ప్రమాదవశాత్తూ కరెంటు షాక్కు గురయ్యాడు. దీంతో కుటుంబ సభ్యులు అతడిని చికిత్స నిమిత్తం కామారెడ్డిలోని రుద్ర ఆసుపత్రికి తరలించారు. అయితే అతడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కాద్దిసేపటికే మరణించాడు. బాలుడి మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. -
మీరు చేస్తే సంసారం.. మేం చేస్తే వ్యభిచారమా?
కాంగ్రెస్పై ముఖ్యమంత్రి కేసీఆర్ నిప్పులు నాడు మా 26 మంది ఎమ్మెల్యేల్లో 10 మందిని చేర్చుకోలేదా? రాష్ట్రం వ చ్చాక కూడా కాంగ్రెస్, టీడీపీ కుట్రలు చేశాయి బెర్లిన్ గోడ బద్దలైనట్టు మళ్లీ రెండు రాష్ట్రాలు కలుస్తాయన్నాడు చంద్రబాబు.. ఈ ప్రభుత్వం ఎల్లుండే పడిపోతుందన్నడు భట్టి తెలంగాణకు నీళ్లు వద్దన్న తెలుగుదేశం పార్టీతో కాంగ్రెస్ జతకట్టడం ఏం నీతో జానారెడ్డి చెప్పాలి రాష్ట్రం రాజకీ య, ఆర్థిక సుస్థిరత సాధించాలి.. తెలంగాణకు టీఆర్ఎస్సే రక్షణ కవచం మేం పిలవడం లేదు.. అభివృద్ధిని చూసి వారే వస్తున్నారు టీఆర్ఎస్లో చేరిన ఎంపీ గుత్తా, ఎమ్మెల్యేలు భాస్కర్రావు, రవీంద్రకుమార్, కాంగ్రెస్ నేతలు వివేక్, వినోద్ సాక్షి, హైదరాబాద్: ‘‘నాడు తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనే ధ్యేయంగా ఉద్యమం కోసం గెలిచిన 26 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో 10 మందిని చేర్చుకున్నారు. ఆనాడు లేని నీతి ఇప్పుడెలా గుర్తుకొచ్చింది? సరిగ్గా ఎన్నికల ముందు మా ఎంపీ విజయశాంతిని, ఎమ్మెల్యే అరవిందరెడ్డిని చేర్చుకోలేదా..? మీరు చేస్తే సంసారం.. మేం చేస్తే వ్యభిచారమా..?’’ అని సీఎం కేసీఆర్ కాంగ్రెస్పై నిప్పులు చెరిగారు. రాష్ట్రం రాజకీయ, ఆర్థిక సుస్థిరత సాధించాలని, తెలంగాణకు రక్షణ కవచం టీఆర్ఎస్ పార్టీ మాత్రమేనని స్పష్టంచేశారు. బుధవారం కాంగ్రెస్కు చెందిన నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్రెడ్డి, మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్రావు, దేవరకొండ నియోజకవర్గం సీపీఐ ఎమ్మెల్యే రవీంద్రకుమార్, కాంగ్రెస్ మాజీ ఎంపీ జి.వివేక్, మాజీ మంత్రి జి.వినోద్, పలువురు స్థానిక ప్రజాప్రతినిధులు టీఆర్ఎస్లో చేరారు. తెలంగాణ భవన్లో జరిగిన కార్యక్రమంలో సీఎం కేసీఆర్ నేతలకు గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఎంపీ గుత్తా మాత్రం టీఆర్ఎస్ కండువా కప్పుకోలేదు. కాంగ్రెస్ నుంచి ఒక జెడ్పీ వైస్ చైర్మన్, ముగ్గురు ఎంపీపీలు, ఆరుగురు జెడ్పీటీసీ సభ్యులు, ఒక మున్సిపల్ చైర్పర్సన్, ఐదుగురు కౌన్సిలర్లు టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. కాంగ్రెస్, టీడీపీ నేతల తీరును తూర్పారబట్టారు. ప్రసంగం ఆయన మాటల్లోనే.. నేను బతికా.. ప్రజలు ఆనందపడ్డరు.. రోశయ్య సీఎంగా ఉన్న సమయంలో 14ఎఫ్ మార్పిడికి నిరసనగా ఆమరణ దీక్షకు దిగా. కేంద్రం దిగి వచ్చింది. తెలంగాణ ఇచ్చింది. దీక్ష సమయంలో నేను చావాల్సింది.. కానీ చావలేదు. ప్రజలు ఆనందపడ్డరు. అంతకుముందు ఎన్నోసార్లు తెలంగాణ కోసం మేం మూకుమ్మడి రాజీనామాలు చేసి పోటీకి వెళ్తే మాపై పోటీకి వచ్చారు. కానీ ప్రజలు మమ్ముల్నే గెలిపించారు. రాష్ట్రం వచ్చాక కూడా అనేక చర్యలకు పాల్పడ్డరు. ఎన్నికల్లో టీఆర్ఎస్ ఒంటరిగా పోటీ చేస్తే 63 సీట్లలో గెలిచినం. మరో 14 సీట్లలో వెయ్యిలోపు ఓట్ల తేడాతో ఓడిపోయినం. బాబు మామూలు కుట్రలు చేయలే.. తెలంగాణ ప్రకటించిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు మామూలు కుట్రలు చేయలేదు. బెర్లిన్ గోడ బద్దలై జర్మనీ ప్రజలు కలసిపోయినట్లు ఏపీ, తెలంగాణ మళ్లీ కలసిపోతయని మాట్లాడిండు. కాంగ్రెస్ నాయకుడు మల్లు భట్టి విక్రమార్క అయితే.. ఎల్లుండే ప్రభుత్వం పడిపోతదన్నడు. నేను సీఎంగా బాధ్యతలు తీసుకోక ముందే కుట్రలు చేసిండ్రు. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ నాకు ఫోన్ చేసి ఇంటికొచ్చిండు. టీడీపీ, కాంగ్రెస్ ఏకమై టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడకుండా కుట్రలు చేస్తున్నయని చెప్పిండు. రాష్ట్రపతి పాలన తెచ్చే కుట్రలు చేస్తున్నరని చెప్పిండు. రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా ఇదేందన్నడు. టీఆర్ఎస్కు మద్దతిస్తామని తెల్లారే ప్రకటించిండు. కాంగ్రెస్, టీడీపీ నేతల లక్ష్యం ఒక్కటే.. తెలంగాణ రాష్ర్టం ఏర్పడొద్దు. ఏర్పడితే బతకొద్దు. జానారెడ్డి రాష్ట్రం భ్రష్టు పడుతోందని అంటున్నడు. కాదు కాదు.. కాంగ్రెస్ భ్రష్టు పడుతోంది. కేసీఆర్కు ఒక్కటే నీతి.. తెలంగాణ రాష్ట్రం తన శక్తి మీద తాను నిలబడాలి. రాజకీయ సుస్థిరత, ఆర్థిక సుస్థిరత సాధించాలి. సమైక్యవాదుల కుట్రలకు బలికావొద్దు. బలంగా ఉండాలి. తెలంగాణకు రక్షణ కవచం టీఆర్ఎస్ పార్టీ మాత్రమే. 2019 కంటే ముందే రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వస్తుందని చంద్రబాబు అంటడు. చంద్రబాబూ.. ప్రభుత్వం కూలిపోతుందని అనడం ఏం నీతి? అది సక్రమమైన ఆలోచనా? రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వం ఉండగానే అట్లెట్ల అంటడు? తెలంగాణకు నీళ్లు వద్దంటడు. పాలేరు ఉప ఎన్నికల్లో టీడీపీ, కాంగ్రెస్ జతకట్టడం ఏ రకమైన నీతో జానారెడ్డి చెప్పాలి. అచ్చంపేట ఎన్నికల్లో అందరూ కలసి కూటమి కడతరు. ఇదేం నీతి? మీరు చేస్తే నీతి.. మేం చేస్తే అవినీతా? అభివృద్ధిని చూసే వస్తున్నారు.. టీఆర్ఎస్లోకి వలస వస్తున్న వారిని మేం పిలవడం లేదు. జరుగుతున్న అభివృద్ధిని చూసి వస్తున్నరు. ఇవి చిల్లర మల్లర రాజకీయ చేరికలు కావు. వీటిని అలా చూడటం లేదు. చాలా మందికి అనుమానాలు, అపోహలు ఉన్నాయి. సీపీఐ ఎమ్మెల్యే రవీంద్రకుమార్ సొంత నిర్ణయంతో వచ్చారు. మేం రమ్మన లేదు. ఎమ్మెల్యే భాస్కర్రావు కూడా ఏడాదిన్నరగా మాతో టచ్లో ఉన్నారు. అమ్ముడుపోయారని, కేసీఆర్ కొన్నాడని అంటున్నారు. మాజీ ఎంపీ వివేక్ కేవలం తన తండ్రి కోరిక మేరకే టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వెళ్లారు. వెళ్లే ముందు నాకు చెప్పి వెళ్లారు. మీ పాలనలో మంచి పనులు జరుగుతున్నాయి. కలసి పనిచేస్తానని, మళ్లీ పార్టీలోకి వస్తానన్నారు. సుఖేందర్రెడ్డి, నేనూ ఆప్త మిత్రులం. 1996లోనే శ్రీరాంసాగర్ డ్యామ్పై కూర్చుని తెలంగాణ గురించి ఇద్దరం మాట్లాడుకున్నాం. ఆంధ్రా ప్రాంతానికి నీళ్లు తీసుకుపోయే నాగార్జున సాగర్ వైష్ణవాలయంలా ఉంటే.. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు శివాలయంలా ఉందన్న. ఏపీలో ఉన్నన్ని రోజులు తెలంగాణకు న్యాయం జరగద ని ఆ రోజే చెప్పిన. 2001లో నేనే ఉద్యమం మొదలు పెట్టా. తెలంగాణది వందేళ్ల దుఃఖం. సమైక్య రాష్ట్రంలో చేరి కష్టాలు పడ్డాం. ఇప్పుడు ప్రతి పేద కుటుంబానికి మేలు చేస్తాం. పేదరికాన్ని రూపుమాపుతం. 2019లోగానే కోటి ఎకరాలకు సాగునీరు అందిస్తం. సాదా బైనామాల రిజిస్ట్రేషన్కు గడువు పొడిగింపు ఈ సమావేశానికి వచ్చే ముందే సీసీఎల్ఎతో మాట్లాడా. సాదా బైనామాల రిజిస్ట్రేషన్లకు డిమాండ్ ఉంది. రాష్ట్రవ్యాప్తంగా సాదా బైనామాలకు సంబంధించి 6 లక్షల మంది ఆర్వోఆర్ పట్టాలు పొందారు. మరో వారం రోజుల పాటు దరఖాస్తు చేసుకునేందుకు గడువు పొడిగిస్తున్నాం. చరిత్రలో ఎవరూ ఈ ఆలోచన చేయలేదు. దీంతోపాటు హైదరాబాద్లో పేదలకు ఇప్పటికే లక్ష మందికి పట్టాలిచ్చాం. తెలంగాణ సమాజాన్ని సుస్థిరం చేయడమే మా లక్ష్యం. నేను మళ్లీ చెబుతున్నా.. టీఆర్ఎస్కు ప్రజలే బాసులు. సొల్లు కబుర్లు వద్దు. నిర్మాణాత్మక సలహాలివ్వండి. కేసీఆర్ను తిడితే ఏం జరగదు. 2019లోనూ గెలిచేది కూడా టీఆర్ఎస్సే. -
మళ్లీ భయపెట్టడానికి రెడీ!
‘మయూరి’ వంటి హారర్ చిత్రంతో ప్రేక్షకులను భయపెట్టిన నయనతార మరోసారి భయపెట్టేందుకు రెడీ అవుతున్నారు. మురగదాసు రామస్వామి దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో ఈ చిత్రం తెరకెక్కనుంది. సురక్ష్ ఎంటర్టైన్మెంట్ మీడియా పతాకంపై తెలుగులో మల్కాపురం శివకుమార్ నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన చిత్ర విశేషాలు చెబుతూ- ‘‘ఇప్పటి వరకూ వచ్చిన హారర్ చిత్రాలకు పూర్తి భిన్నంగా వైవిధ్యమైన కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కనుంది. ప్రతి సన్నివేశం ప్రేక్షకుల్లో ఆసక్తిని కలిగిస్తుంది. నయనతార పాత్ర ఆసక్తికరంగా ఉంటుంది. ఈ నెల 18 నుంచి చిత్రీకరణ ప్రారంభిస్తాం. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అని తెలిపారు. ఈ చిత్రానికి కెమేరా: దినేష్, సంగీతం: వివేక్. -
వారి చర్య మాతృద్రోహం
గుత్తా, వివేక్, వినోద్, భాస్కర్రావులపై వీహెచ్ ధ్వజం సాక్షి, హైదరాబాద్: అధికారంలో ఉన్నంతకాలం పదవులను అనుభవించి స్వార్థ ప్రయోజనాల కోసం పార్టీపై నిందలు వేసి టీఆర్ఎస్లోకి వెళ్తున్న గుత్తా, వివేక్, వినోద్, భాస్కర్రావులది మాతృద్రోహమని ఏఐసీసీ కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు మండిపడ్డారు. సోమవారం హైదరాబాద్లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ అంతర్గత ప్రజాస్వామ్యం కేవలం కాంగ్రెస్ లోనే ఉందని, టీఆర్ఎస్లో ప్రజాస్వామ్యం ఎంతుందో త్వరలోనే వారికి తెలుస్తుందన్నా రు. పార్క్ హయత్ పక్కన ఉన్న స్థలాన్ని దక్కించుకోవడానికి వివేక్, వినోద్, సాగునీటి పనుల కాంట్రాక్టుల కోసం గుత్తా టీఆర్ఎస్లో చేరుతున్నారన్నారు. గుత్తా విలువ లు, ఆత్మను అమ్ముకున్నారని, కాంగ్రెస్ పార్టీలో సభ్యత్వం లేకు న్నా ఎంపీ టికెట్ వచ్చే లా సహకరించిన జైపాల్రెడ్డి, జానారెడ్డిలకు ద్రోహం చేసి టీఆర్ఎస్లోకి వెళ్తున్నారని దుయ్యబట్టారు. పార్టీ మారడం వ్యభిచారంతో సమానమని చెప్పిన గుత్తా ఇప్పుడు ఎలా మారుతున్నారన్నారు. దమ్ముంటే ఎంపీ పదవికి గుత్తా రాజీనామా చేసి పోటీ చేయాలని వీహెచ్ సవాల్ విసిరారు. పార్టీ మారే నాయకులు పందికొక్కులకన్నా ప్రమాదకరమని, వారి అసలు స్వరూపం కేసీఆర్కు కూడా త్వరలోనే తెలుస్తుందని వీహెచ్ హెచ్చరించారు. పదవులకు రాజీనామా చేయాలి... కాంగ్రెస్ పార్టీ టికెట్పై గెలిచి టీఆర్ఎస్లో చేరనున్న ఎంపీ గుత్తా, ఎమ్మెల్యే భాస్కర్రావు, కాంగ్రెస్ మద్దతుతో గెలిచిన సీపీఐ ఎమ్మెల్యే రవీంద్రకుమార్ నాయక్ వెంటనే పదవులకు రాజీనామా చేయాలని నల్లగొండ డీసీసీ అధ్యక్షుడు బి.బిక్షమయ్యగౌడ్, టీపీసీసీ కోశాధికారి గూడూరు నారాయణరెడ్డి డిమాండ్ చేశారు. కాంట్రాక్టులు, పదవుల కోసమే వారు పార్టీలు మారుతూ బంగారు తెలంగాణ అంటూ సిగ్గులేకుండా మాట్లాడుతున్నారన్నారు. పార్టీ మారడం అంటే తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీని మోసం చేయడమేనన్నారు. టీఆర్ఎస్కు బుద్ధి చెప్పే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నా రు. మిషన్ భగీరథ అక్రమాలపై 120 కిలోల పేపర్లను సేకరించిన గుత్తా టీఆర్ఎస్ను బ్లాక్మెయిల్ చేశారని ఆరోపించారు. -
బంగారు తెలంగాణ కోసమే...
టీఆర్ఎస్లోకి వెళుతున్నామన్న గుత్తా, వివేక్, భాస్కర్రావు, రవీంద్రకుమార్ సాక్షి, హైదరాబాద్: బంగారు తెలంగాణ నిర్మాణంలో ముఖ్యమంత్రి కేసీఆర్కు సహకరించాలనే టీఆర్ఎస్లో చేరుతున్నామని నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్రెడ్డి, మాజీ ఎంపీ జి.వివేక్, మాజీ మంత్రి జి.వినోద్, మిర్యాలగూడ కాంగ్రెస్ ఎమ్మెల్యే భాస్కర్రావు, దేవరకొండ సీపీఐ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్నాయక్ ప్రకటించారు. హైదరాబాద్లోని వివేక్ నివాసంలో సోమవారం విలేకరులతో వారు మాట్లాడారు. బుధవారం టీఆర్ఎస్లో చేరాలని నిర్ణయించుకున్నామన్నారు. ఓటర్లు ఒత్తిడి తెచ్చారు: గుత్తా కాంగ్రెస్ పార్టీని వీడాల్సి రావడం బాధాకరంగానే ఉందని గుత్తా, వివేక్, వినోద్, భాస్కర్రావు పేర్కొన్నారు. అయితే పార్టీలోని అంతర్గత కలహాలు, నాయకుల మధ్య విబేధాలతో తాము తీవ్రంగా కలత చెందామన్నారు. సీనియర్ల మధ్య అంతర్గత విభేదాలు నాయకులను అయోమయానికి, గందరగోళానికి గురిచేస్తున్నాయని గుత్తా ఆరోపించా రు. వీటి వల్ల పార్టీ బలహీనపడుతోందన్నా రు. షోకాజ్ నోటీసులు ఇచ్చి పార్టీని కాపాడుకునే పరిస్థితి కాంగ్రెస్కు వచ్చిందన్నారు. టీఆర్ఎస్లో చేరాలంటూ తన ఓటర్లు ఒత్తిడి తెచ్చారని గుత్తా చెప్పారు. కాంగ్రెస్ పార్టీ తనకు అప్పగించిన బాధ్యతను సమర్థంగా నిర్వహించానని...ఎంపీగా పోటీ చేయడానికి పార్టీ రెండుసార్లు అవకాశం ఇచ్చిందని ఆయన గుర్తుచేసుకున్నారు. పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీని తెలంగాణ దేవతగా గుత్తా అభివర్ణించారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, బంగారు తెలంగాణ నిర్మాణం కోసం టీఆర్ఎస్లో చేరుతున్నట్లు చెప్పారు. సమయం, సందర్భాన్ని బట్టి ఎంపీ పదవికి రాజీనామా చేస్తానన్నారు. పదవులు ఇస్తామని టీఆర్ఎస్ ఇప్పటిదాకా తనకు కమిట్మెంట్ ఇవ్వలేదన్నారు. జిల్లాలో ఏర్పాటవుతున్న యాదాద్రి పవర్ప్లాంటు, నల్లగొండ జిల్లా అభివృద్ధికోసం సీఎం కేసీఆర్తో కలసి పనిచేస్తానని ప్రకటించారు. పథకాలు ఆకర్షించాయి: వివేక్ డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, మిషన్ కాకతీయ వంటి పథకాలు తనను ఎంతగానో ఆకర్షించాయని మాజీ ఎంపీ వివేక్ చెప్పారు. పార్టీలోకి వస్తే బాగుంటుందని ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా అడిగారని వెల్లడించారు. పార్టీలో ఇప్పటిదాకా సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. సీపీఐ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ నాయక్ మాట్లాడుతూ దేవరకొండ నియోజకవర్గంలో కృష్ణా పుష్కరాల కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం రూ. 300 కోట్లు కేటాయించిందన్నారు. ఇప్పటిదాకా కేసీఆర్ను తాను కలవలేదని, కేవలం నియోజకవర్గ అభివృద్ధి కోసమే టీఆర్ఎస్లో చేరుతున్నానని చెప్పారు. -
'కాంగ్రెస్ను వీడుతున్నందుకు బాధగా ఉంది'
హైదరాబాద్ : త్వరలో టీఆర్ఎస్లో చేరుతున్నట్లు ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు భాస్కర్రావు, రవీంద్ర నాయక్, మాజీ ఎంపీ వివేక్, మాజీమంత్రి వినోద్ తదితరులు సోమవారం అధికారికంగా ప్రకటించారు. ఈ నెల 15న సీఎం కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరుతున్నట్లు తెలిపారు. ఎంపీ గుత్తా, మాజీ ఎంపీ వివేక్, మాజీ మంత్రి వినోద్, మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్ రావు, దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్ర నాయక్లు అధికార పార్టీలో చేరనున్నారు. మాజీ ఎంపీ వివేక్ నివాసంలో సమావేశమై ... పార్టీ మార్పుపై చర్చించారు. భేటీ అనంతరం ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ అభివృద్ధి కోసమే టీఆర్ఎస్లో చేరుతున్నట్లు తెలిపారు. అయితే కాంగ్రెస్ను వీడుతున్నందుకు బాధగా ఉందన్నారు. అవసరం అయితే ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని గుత్తా స్పష్టం చేశారు. మాజీ ఎంపీ వివేక్ మాట్లాడుతూ రెండేళ్లలో కేసీఆర్ ఎన్నో మంచి పథకాలు చేపట్టారన్నారు. దేవరకొండ అభివృద్ధి కోసమే టీఆర్ఎస్లో చేరుతున్నట్లు ఎమ్మెల్యే రవీంద్ర నాయక్ తెలిపారు. కాగా కాంగ్రెస్లో అంతర్గత విభేదాలు తమని కలిచి వేశాయన్నారు. అదే సమయంలో కేసీఆర్ తమను పార్టీలోకి ఆహ్వానించారని... ఆయనతో కలిసి రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. -
అందుకే పోటీ చేయలేకపోయా: వివేక్
హైదరాబాద్ : తనకు పెద్దపల్లి నియోజకవర్గంతో ఉన్న అనుబంధం కారణంగానే వరంగల్ ఉప ఎన్నిక బరిలో దిగలేకపోయానని కాంగ్రెస్ మాజీ ఎంపీ వివేక్ అన్నారు. వరంగల్ నుంచి తనను పోటీ చేయాలన్న కాంగ్రెస్ శ్రేణులకు, ప్రజలకు ఆయన ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. పార్టీ టికెట్ లభించిన రాజయ్యకు తన మద్దతు పూర్తిగా ఉంటుందని వివేక్ తెలిపారు. కాగా వివేక్ ను బరిలోకి దించేందుకు అధిష్టానం ప్రయత్నించినా, ఆయన మాత్రం మొదటి నుంచి పోటీ చేసేందుకు సుముఖంగా లేరు. దీంతో రాజయ్యకు లైన్ క్లియర్ అయింది. -
నటుడు వివేక్కు పుత్రశోకం
చెన్నై : హాస్య నటనతో అశేష సినీ అభిమానుల్ని సంతోషపరచిన వివేక్ పుత్రశోకంతో తల్లడిల్లిపోతున్నారు. ఆయన కొడుకు ప్రసన్నకుమార్(13) అనారోగ్యం కారణంగా గురువారం చెన్నైలో మృతి చెందారు. విషజ్వరంతో బాధపడుతూ 40 రోజులుగా నగరంలోని ఒక ప్రయివేట్ ఆస్పత్రిలో అత్యవసరం వైద్య చికిత్స పొందుతు వచ్చాడు. కోలుకోలేక గురువారం కన్ను మూశారు. వివేక్ కొడుకు మరణ వార్తతో తమిళ చిత్రపరిశ్రమ దిగ్భ్రాంతికి గురైంది. సినీ ప్రముఖలు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. -
15 ఏళ్ల బాలికపై అత్యాచారం
మీరట్(ఉత్తరప్రదేశ్): 15 ఏళ్ల బాలికపై అత్యాచారం జరిగిన ఘటన ఉత్తరప్రదేశ్ లోని మీరట్ నగరంలో పరతాపూర్ ప్రాంతంలో సోమవారం వెలుగుచూసింది. బాలిక ఒంటరిగా ఉన్న సమయంలో ఓ వ్యక్తి ఇంట్లోకి చొరబడి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. నిందితుడు వివేక్పై బాధితురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతడిపై కేసు నమోదు చేసినట్టు చెప్పారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్టు పోలీసులు పేర్కొన్నారు. తదుపరి విచారణ కొనసాగుతుందనీ, నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్టు పోలీసులు తెలిపారు. -
'ఏడాదైనా పాలన గాడిలో పడలేదు'
హైదరాబాద్: కేసీఆర్ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై టీటీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ, ఎమ్మెల్యే వివేక్ బుధవారమిక్కడ మండిపడ్డారు. కేసీఆర్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తయినా పాలన గాడిలో పడలేదని వారు ఆరోపించారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు దృష్టి పెట్టకపోవడంతోనే సమ్మెలు, ఉద్యమాలు జరుగుతున్నాయని వారు విమర్శించారు. ఉపాధి హామీ, మున్సిపల్, రెవిన్యూతోపాటు అన్ని శాఖ ఉద్యోగులు రోడ్డున పడ్డారన్నారు. ఉద్యమ న్యాయకుడిగా అధికారులు, పాలకుల ఇళ్ల ముందు చెత్తవేయాలని గతంలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను గుర్తు చేశారు. కేసీఆర్ చెప్పిన ఈ మాటలను ప్రస్తుతం మున్సిపల్ ఉద్యోగులు మళ్లీ ఆయనకే అప్పచెబుతున్నారన్నారు. వెంటనే ఉద్యోగుల సమస్యలు పరిష్కరించి ప్రజల సమస్యలు తీర్చాలని ఎల్.రమణ, వివేక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ సోమేష్ కుమార్ అదికార పార్టీ తొత్తులా వ్యవహరిస్తున్నారని ఈ సందర్భంగా ఎల్ రమణ, వివేక్ ఆరోపించారు. -
'టీఆర్ఎస్లో చేరాలని ఒత్తిడి తెచ్చారు'
హైదరాబాద్ సిటీ: టీఆర్ఎస్లో చేరాలని తమపై కొందరు ఒత్తిడిచేశారని టీటీడీపీ ఎమ్మెల్యేలు రాజేందర్ రెడ్డి, వివేకానంద్ లు బుధవారం ఏసీబీకి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అనంతరం ఎమ్మెల్యేలు విలేకర్లతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు హరీశ్ రావు, కేటీఆర్లు టీడీపీ నుంచి టీఆర్ఎస్లోకి రావాలని ఒత్తిడి తెచ్చారని, పార్టీలోకి వస్తే కార్పొరేషన్ పదవి ఇస్తామని, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేందుకు నిధులు కేటాయిస్తామని ఆశచూపినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన కొన్ని రోజులకు ఈ కేసులు పెట్టడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇన్ని రోజులు గుర్తుకు రానిది ఓటుకు నోటు కుంభకోణం బయటపడిన తర్వాతే టీడీపీ నాయకులు ఫిర్యాదు చేయడంతో ఓటుకు నోటు కేసు మరో మలుపు చోటుచేసుకుంది. -
ఓరుగల్లుకు వీరుడెవరు?
►వరంగల్ ఉప ఎన్నికపై కాంగ్రెస్లో తర్జనభర్జన ► రాజయ్యతో పాటు వివేక్, సర్వే, దామోదర, అద్దంకి పేర్లపై చర్చ ► ముందుగానే క్షేత్రస్థాయిలో దూసుకువెళ్లాలని వ్యూహం ► టీఆర్ఎస్తో ముఖాముఖి పోటీ ఉంటుందని అంచనా సాక్షి, హైదరాబాద్: వరంగల్ లోక్సభ స్థానానికి ఉప ఎన్నిక ఖాయమైన నేపథ్యంలో పార్టీ అభ్యర్థి ఎంపికపై టీపీసీసీ ప్రాథమిక చర్చలు జరుపుతోంది. వరంగల్ ఎంపీగా ఉన్న కడియం శ్రీహరి రాష్ట్రమంత్రివర్గంలో ఉపముఖ్యమంత్రిగా చేరడం, ఎమ్మెల్సీగా ఎన్నికకావడంతో ఈ స్థానానికి రాజీనామా చేశారు. దీనితో వరంగల్ లోక్సభ సీటుకు ఉప ఎన్నిక అనివార్యమైంది. మరో మూడు నాలుగు నెలల్లో ఉప ఎన్నిక జరగనున్న నేపథ్యంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ దీనిపై దృష్టిని కేంద్రీకరించింది. బలమైన అభ్యర్థిని ముందుగానే ప్రకటించి, క్షేత్రస్థాయి నుంచి వెంటనే పని ప్రారంభించాలనే యోచనలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఉంది. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన సిరిసిల్ల రాజయ్య అభ్యర్థిత్వంపై టీపీసీసీ ఎక్కువ సానుకూలంగా ఉంది. అలాగే మాజీ ఎంపీ జి.వివేక్, మాజీ కేంద్రమంత్రి సర్వే సత్యనారాయణ, మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, టీపీసీసీ అధికారప్రతినిధి అద్దంకి దయాకర్ తదితరుల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. పార్టీ గ్రామ, మండల స్థాయి నాయకులంతా అధికారంలో ఉన్న టీఆర్ఎస్లో చేరిన నేపథ్యంలో గ్రామ స్థాయి నుంచి పార్టీ శ్రేణుల్లో విశ్వాసం కల్పించేవిధంగా కార్యక్రమాలు, పర్యటనలను చేపట్టాలని స్థూలంగా నిర్ణయించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన ఏడాదికాలంలో టీఆర్ఎస్ ప్రభుత్వం పలు రంగాల్లో వైఫల్యం చెందిందని, ప్రజల్లో సెంటిమెంటు కూడా తగ్గిందనే అంచనాల్లో కాంగ్రెస్ పార్టీ ఉందని తెలుస్తోంది. పార్టీ నాయకులు టీఆర్ఎస్లో చేరినా ప్రజల్లో విస్తృత ప్రచారంతో ఉప ఎన్నికల్లో గెలుస్తామని అంచనా వేస్తోంది. వీలైనంత త్వరగా అభ్యర్థి ఎంపిక పూర్తిచేయాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోం ది. కాగా, ఆర్థికంగా బలమైన మూలాలున్న పారిశ్రామికవేత్త, మాజీ ఎంపీ జి.వివేక్ పేరును కొందరు కాంగ్రెస్ ముఖ్యులు ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. గత ఎన్నికల్లో ఓడిపోయిన సిరిసిల్ల రాజయ్యను అభ్యర్థిగా ఎంపిక చేస్తే సానుభూతి పనిచేస్తుందని మరికొందరు నేతలు వాదిస్తున్నారు. ఎన్నికల కోణంలో రాహుల్ టూర్ వరంగల్ జిల్లాలో పార్టీకి బలమైన నాయకత్వం ఉన్నా గ్రామ, మండల స్థాయి నాయకత్వం టీఆర్ఎస్లోకి భారీగా వలసపోయింది. ఈ నేపథ్యంలో తగిన వ్యూహం రచించాలని టీపీసీసీ నేతలు యోచిస్తున్నారు. ఇందులో భాగంగా ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్గాంధీ పర్యటనను కూడా ఎన్నికల కోణంలో నిర్వహించాలని టీపీపీసీ భావిస్తోంది. వరంగల్ లోక్సభ సీటు పరిధిలోని స్టేషన్ ఘన్పూర్, పాలకుర్తి, పరకాల, వరంగల్ తూర్పు, వరంగల్ పశ్చిమ, వర్ధన్నపేట, భూపాలపల్లి శాసనసభ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యేలు ఎవరూ లేరు. టీడీపీకి ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నా పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి కూడా టీఆర్ఎస్లో చేరారు. టీడీపీ బలం నామమాత్రమై పోయిన ఈ పరిస్థితుల్లో టీఆర్ఎస్తో ముఖాముఖి పోటీ మాత్రమే ఉంటుందని కాంగ్రెస్ ముఖ్యనేతలు అంచనా వేస్తున్నారు. -
'అది బూటకపు ఎన్కౌంటర్'
-
'అది బూటకపు ఎన్కౌంటర్'
సూర్యాపేట: తన కుమారుడికి మావోయిస్టులతో ఎలాంటి సంబంధాలు లేవని ఛత్తీస్గఢ్లో ఎన్కౌంటర్లో మరణించిన వివేక్ తండ్రి యోగానందాచార్యులు స్పష్టం చేశారు. అది బూటకపు ఎన్కౌంటర్, కావాలనే పోలీసులు వివేక్ని చంపారని తల్లిదండ్రులు ఆరోపించారు. తమ కుటుంబం ఆది నుంచి సమాజ సేవకే పరితపించిందని పేర్కొన్నారు. వివేక్ సూర్యాపేటలో ఇంటర్ వరకు చదివాడని తెలిపారు. అనంతరం న్యాయశాస్త్రం చదివేందుకు యూనివర్సిటీకి వెళ్లాడని చెప్పారు. తన కుమారుడిని ప్రాణాలతో పట్టుకుని చట్టపరిధిలో శిక్షించకుండా, ఎన్కౌంటర్ చేయడం బాధ కల్గించిందన్నారు. వివరాలు..బీజాపూర్ జిల్లా ఎలిమేడు పోలీసుస్టేషన్ పరిధిలోని లంకపల్లి అటవీప్రాంతంలో శుక్రవారం సాయంత్రం పోలీసులకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. శనివారం మృతదేహాలను ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తీసుకొచ్చి పోస్టుమార్టం నిర్వహించారు. మృతిచెందిన వారిలో నల్లగొండ జిల్లా సూర్యాపేటకు చెందిన వివేక్ అలియాస్ రఘు(25) ఉన్నారు. వివేక్ హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీలో న్యాయ విద్యనభ్యసిస్తూ మధ్యలోనే మానేశాడు.ఏడు నెలల కాలంగా మావోయిస్టు కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొన్న వివేక్ దళంలో కంప్యూటర్ ఆపరేటర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. -
కన్నీ‘టి’ పిలుపు
మానవ సంబంధాల విలువను విభిన్న కోణంలో చూపించే నాటకం ‘మా చాయ్’. పొట్టచెక్కలయ్యేలా నవ్వించే సీన్లతో పాటు.. ఎద కరిగించే సన్నివేశాలతో సాగుతుంది. కథలోకి వెళ్తే.. యశ్వంత్ తల్లి చనిపోతుంది. అతడిని ఓదార్చేందుకు మిత్రులు వివేక్, సమీర్ వెళ్తారు. తల్లి పోయిన బాధ యశ్వంత్లో ఏ మాత్రం కనిపించదు. స్నేహితులతో టీ, సిగరెట్లు, మందూ తాగుతూ యశ్వంత్ ఆదరమరచి నిద్రపోతాడు. లేవగానే ‘మా-చాయ్’ అని అంటాడు. ఫొటోలోంచి నవ్వుతున్న తల్లిని చూసి గుండెలు అవిసేలా ఏడుస్తాడు. ఇదీ కథ. ఈ నాటకం ఆదివారం రాత్రి 7.30 గంటలకు బంజారాహిల్స్ రోడ్ నంబర్ 1లోని లామకాన్లో ప్రదర్శించనున్నారు. ఫోన్: 7893022911 -
చెరువులో పడి ముగ్గురు బాలురు మృతి
నెల్లూరు: చేపల వేటకు వెళ్లిన ముగ్గురు బాలురు ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందారు. ఈ సంఘటన ఆదివారం నెల్లూరు జిల్లా దగదర్తి మండలం పత్తెపల్లి కౌరుగుంట గ్రామపంచాయతీ పరిధిలోని సున్నంబట్టి చెరువు వద్ద జరిగింది. వివరాలు..సున్నంబట్టి గ్రామానికి చెందిన ముగ్గురు బాలురు ఆదివారం సెలవు దినం కావడంతో చెరువులో చేపలు పట్టేందుకు వెళ్లారు. ఆరవ తరగతి చదువుతున్న బెల్లంకొండ వివేక్(11), గుంజు పవన్(11), నెల్లూరు అజయ్(13)లు చెరువులో చేపలు పట్టేందుకు వెళ్లారు. అయితే ప్రమాదవశాత్తు చెరువులో పడటంతో ఈత రాకపోవడంతో మృతి చెందారు. విషయం తెలిసిన గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను వెలికితీశారు. అనంతరం పోస్ట్మార్టంకు తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ముగ్గురు బాలురు చనిపోవడంతో గ్రామంలో ఒక్కసారిగా విషాదఛాయలు అలుముకున్నాయి. -
వివేక్ వస్తారా!
*సీఎంను కలిసిన మాజీ ఎంపీ వివేక్ *త్వరలో వరంగల్ ఎంపీ స్థానానికి ఎన్నికలు *పోటీ చేసే అవకాశం ఉందని ప్రచారం *రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ హన్మకొండ : వరంగల్ రాజకీయాల వైపు కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ జి వివేక్ అడుగులు వేస్తున్నారంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. త్వరలోనే వరంగల్ ఎంపీ స్థానానికి ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్తో వివేక్ బుధవారం సమావేశం కావడం జిల్లాలో చర్చకు దారితీసింది. వివేక్ తన తండ్రి వెంకటస్వామి స్మారక భవనం నిర్మాణం విషయంపై సీఎంను కలిసినట్లు విలేకరులతో చెప్పారు. టీఆర్ఎస్లో చేరడం లేదంటూ స్పష్టం చేశారు.అయినా వివేక్ టీఆర్ఎస్లోకి పునరాగమనం చే సి వరంగల్ ఎంపీ బరిలో నిలబడతారనే ఊహాగానాలకు చెక్ పడలేదు. తాజా రాజకీయ పరిణామాలతో ఎంపీ శ్రీహరి డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించారు.దీంతో ఆయనవరంగల్ ఎంపీ స్థానానికి రాజీనామా చేయూ ల్సి ఉంటుంది. టీఆర్ఎస్ తరఫున ఎవరు అభ్యర్థిగా ఉంటారనే అంశం ఆసక్తికరంగా మారింది. 2014 ఎన్నికల్లో పెద్దపెల్లి ఎంపీ స్థానం నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేసి వివేక్ ఓటమి పాలయ్యారు. ఆ ఎన్నికలకు రెండు నెలల ముందు వరకు ఆయన టీఆర్ఎస్లోనే కొనసాగారు. ఎన్నికల సమయంలో ఆయన కాంగ్రెస్లో చేరారు. ఇటీవల వివేక్ తండ్రి, కాంగ్రెస్ సీనియర్ నేత వెంకట స్వామి మృతి చెందిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం తరఫున వెంకటస్వామి సేవలకు గుర్తుగా ఆయన పేరిట స్మారక భవనం నిర్మిం చేందుకు సీఎం సానుకూలత వ్య క్తం చేశారు. అప్పటి నుంచి టీఆర్ఎస్ నేతలకు వివేక్కు మధ్య మాటల బంధం కుదిరింది. అంతేకాక వివేక్ ఆర్థికంగా స్థితి మంతుడు, గతంలో ఎంపీగా పనిచేసి న అనుభవం ఉంది. ఢిల్లీలో కూడా ఆయనకు మంచి సంబంధాలే ఉన్నాయి. సమస్యలపై గళమెత్తేందుకు వివేక్ సరైన నేత అనే వాదనలు ముందుకొచ్చాయి. -
నాకు ఎక్కడా బ్రాంచ్లు లేవు
నాకు ఎక్కడా బ్రాంచీలు లేవంటున్నారు సీనియర్ హాస్యనటుడు గౌండర్ మణి. ఈ బ్రాం చీల వ్యవహారం ఏమిటని ఆశ్చర్య పడుతున్నారా.! ప్రస్తుతం హాస్యనటులుగా దుమ్ము రేపుతున్న సంతానం, వివేక్, వడివేలుకు ముందు తరం హాస్యనటుడు గౌండర్ మణి. 1990 ప్రాంతంలో సెంథిల్, గౌండర్మణి కామెడీ లేని సినిమా ఉండదు. ఆ తర్వాత హీరోగా, విలన్గా కొన్ని చిత్రాలు చేసిన గౌండర్ మణి చాలాకాలం తెర మరుగయ్యారు. తాజాగా మళ్లీ హీరో అవతారంతో తెరపైకి రానున్నారు. ఆయన నటించిన తాజా చిత్రం 49వో, వ్యవసాయ దారుల ఇతి వృత్తాన్ని ఆవిష్కరించే ఈ చిత్రంలో గౌండర్ మణి పాత్ర చాలా వైవిధ్య భరితంగా ఉంటుంది. ఈ చిత్ర నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని తెర మీదకు త్వరలో రానుంది. తాజాగా, ఎనక్కు వేరు ఎంగుం కిలైగల్ కడయాదు (నాకు ఎక్కడా బ్రాంచీలు లేవు) చిత్రంలో గౌండర్ మణి సరికొత్త గెటప్తో కనిపించబోతున్నారు. ఈ చిత్రం తనదైన మార్కు చిత్రంగా , వినోదాల విందు గా ఉంటుందని దర్శకుడు గణపతి బాల కుమారన్ అంటున్నారు. ఈయన దర్శకుడు సుశీంద్రన్ శిష్యు డు. ఈ చిత్రం గురించి ఆయన తెలుపుతూ, మంచి కథలను ఎంపిక చేసుకుని నటిస్తున్న గౌండర్మణికి తన కథనచ్చడంతో నటించేందుకు వెం టనే అంగీకరించారన్నారు. ఇందులో గౌండర్ మణి సినిమా షూటింగ్లకు అద్దెకు నడిపే క్యారవన్ వ్యాన్ యజమానిగా నటిస్తున్నారని వివరించారు. ఆ విధంగా ఆయన చెన్నై నుంచి మదురైకు వెళ్లే మధ్యలో జరిగే వినోద భరిత సంఘటనల సమాహారమే ఈ చిత్ర ఇతి వృత్తంగా పేర్కొన్నారు. జయరాం ప్రొడక్షన్స్ పతాకంపై జే షణ్ముగం నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ చెన్నై, తిరుచ్చి, మదురై, రామనాధపురం ప్రాంతాల్లో చిత్రీకరిస్తున్నట్టు తెలిపారు. -
విఐపి రిపోర్టర్ - కుత్భుల్లాపూర్ ఎమ్మెల్యే వివేక్
-
పీసీసీ చీఫ్ రేసులో లేను: వివేక్
కరీంనగర్ : పీసీసీ అధ్యక్ష పదవి రేసులో లేనని మాజీ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత వివేక్ స్పష్టం చేశారు. ఆయన శుక్రవారమిక్కడ మాట్లాడుతూ రుణమాఫీ వల్లే టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిందని అన్ఓనారు. రైతులకు తొమ్మిది గంటల విద్యుత్ ఇవ్వాల్సిందేనని వివేక్ డిమాండ్ చేశారు. మరోవైపు మాజీమంత్రి డీకే అరుణ.... తెలంగాణ పీసీసీ అధ్యక్ష పదవి కోసం తన ప్రయత్నాలు ముమ్మరం చేశారు. పొన్నాల లక్ష్మయ్యను పదవి నుంచి తప్పించనున్నట్లు సంకేతాలతో ఆమె గత మూడు రోజులుగా హస్తనలోనే మకాం వేసి...అధిష్టానంతో చర్చలు జరుపుతున్నారు. -
త్వరలో టీ పీసీసీ చీఫ్ పదవి ఖాళీ?
కాలం ... చేసిన గాయాన్ని మానిపిస్తుందంటారు. కానీ కాంగ్రెస్ పార్టీకి ఓటమి గాయం మాత్రం రోజురోజుకు పెద్దదవుతోంది. తెలంగాణ ఇస్తే ఆ రాష్టంలో తప్పక అధికారంలోకి వస్తామన్న ఆ పార్టీ నాయకుల ఆశపై ఇటీవల జరిగిన ఎన్నికల ఫలితాలు నీళ్లు చల్లాయి. దాంతో తెలంగాణలో పార్టీ ఓటమికి మీరంటే మీరని ఆ పార్టీ అధ్యక్షుడు పొన్నాల... సీనియర్ నేతలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. దాంతో ఆ పంచాయితీ కాస్తా పార్టీ అధిష్టానం వద్దకు చేర్చింది. దాంతో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడితోపాటు సీనియర్ నేతలతో అధిష్టానం చర్చించింది. గ్రేటర్ ఎన్నికలు బూల్లెట్లా దూసుకొస్తున్నాయి... ఆ ఎన్నికల్లోనైనా సత్తా చాటాలని ఢిల్లీ అధిష్టానం సదరు నాయకులకు తలంటింది. పొన్నాల పీసీసీ అధ్యక్షుడిగా ఉంటే ఆ ఎన్నికలు కూడా హుష్ కాకీ అన్నట్లు ఎగిరిపోతాయని సీనియర్ నాయకులు వెల్లడించారు. రాష్ట్రంలో పీసీసీ చీఫ్ను తప్పిస్తేనే కానీ పార్టీ బతికి బట్టకట్టదని సదరు నేతలు అధిష్టానం వద్ద కుండ బద్దలు కొట్టారు. పీసీసీ చీఫ్ పోన్నాలను మార్చండి... గ్రేటర్ ఎన్నికల సంగతి మేం చూసుకుంటామంటూ కాంగ్రెస్ అధినాయకత్వానికి భరోసా ఇచ్చారు. దాంతో అధిష్టానం కూడా పీసీసీ చీఫ్ పొన్నాలకు చెక్ పెట్టాలనే ఆలోచనలో ఉందని తెలుస్తోంది. దాంతో తాము పీసీసీ చీఫ్ రేసులో మేమున్నాంటూ తెలంగాణ నాయకులు ఇప్పటికే హస్తిన బాట పడుతున్నారు. తనకే పీసీసీ పదవి ఇవ్వాలంటూ పెద్దపల్లి మాజీ ఎంపీ వివేక్ పార్టీ వ్యవహారాల బాధ్యుడు దిగ్విజయ్ సింగ్ను ఇటీవలే హస్తినలో కలసి విజ్ఞప్తి చేశారని తెలుస్తోంది. -
'వారిది న్యాయమైన పోరాటం'
హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్ధులపై లాఠీచార్జ్ను కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ఎంపీలు మధుయాష్కీ, వివేక్, రాజయ్య, పొన్నం ప్రభాకర్ ఖండించారు. ఉద్యోగాల కోసం విద్యార్ధుల చేస్తున్నది న్యాయమైన పోరాటమని సమర్థించారు. ఇంటికో ఉద్యోగమన్న హామీని సీఎం కేసీఆర్ నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. ఓయూ విద్యార్ధుల పోరాట ఫలితంగానే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వచ్చిందన్న వాస్తవాన్ని టీఆర్ఎస్ నాయకులు మర్చిపోరాదని అన్నారు. తమకు ఉద్యోగాలు రావన్న విద్యార్ధుల ఆందోళనపై టీఆర్ఎస్ ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్టు ఉద్యోగుల పర్మినెంట్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించడంతో విద్యార్థులు ఆందోళన బాట పట్టారు. -
తొలగింపు.. కొనసాగింపు
‘గురుకుల్’ కూల్చివేతలపై స్థానికుల నిరసన ఇద్దరు ఎమ్మెల్యేల అరెస్ట్ హైదరాబాద్: గురుకుల్ ట్రస్టులో బుధవారం కూడా కూల్చివేతలు కొనసాగాయి. ఉదయాన్నే జీహెచ్ఎంసీ అధికారులు పోలీసు బలగాలతో వచ్చి బృందాలుగా విడిపోయి నిర్మాణాలను తొలగిం చారు. మంగళవారం 16 భవనాలను పడగొట్టిన అధికారులు.. బుధవారం 8 నిర్మాణాలను పాక్షికంగా కూల్చివేశారు. తొలగింపు ప్రక్రియును నిరసిస్తూ స్థానిక కార్పొరేటర్ జగదీశ్వర్గౌడ్ ఆధ్వర్యంలో స్థానికులు ఆందోళనకు దిగారు. అధికారులకు, కేసీఆర్కు వ్యతిరేకంగా నినదించారు. దీంతో పోలీసులు కార్పొరేటర్తో సహా 28 మందిని, ఏడుగురు మహిళలను అరెస్ట్ చేసి నార్సింగిలోని ఎస్ఓటీ కార్యాలయానికి తరలించారు. కాగా కూల్చివేతలను అడ్డుకునేందుకు మాదాపూర్ వస్తున్న శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, వివేక్, కార్పొరేటర్లు అశోక్గౌడ్, రంగారావు, భానుప్రసాద్ను పోలీసులు అరెస్ట్ చేసి రాయదుర్గం పోలీస్ స్టేషన్కు తరలించారు. పెద్దల భవనాలు వదిలి రాజకీయ అండ లేని వారి భవనాలను కూల్చివేస్తున్నారని ఎమ్మెల్యేగాంధీ ఆరోపించారు. పాత నోటీసులను పరిశీలిస్తున్న జీహెచ్ఎంసీ అధికారులు నోటీసులు లేకుండా గురుకుల్ ట్రస్టులో కూల్చివేతలు ఎలా చేస్తారని హైకోర్టు ప్రశ్నించడంతో జీహెచ్ఎంసీ పాత రికార్డుల తనిఖీ పనిలో పడింది. కూల్చివేతలకు ముందు, తరువాత నిర్మాణాల యజమానులకు ఇచ్చిన కొన్ని నోటీసులను బయటకు తీస్తున్నారు. వీటిని అవసరమైతే హైకోర్టుకు సమర్పించేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. -
అనుమానమే నిజమైంది..
స్వరూపది హత్యే భర్త దెబ్బలకేmమృతిచెందినట్లు నివేదిక భర్త, బావ రిమాండ్ పరారీలో అత్తమామ జమ్మికుంట: జమ్మికుంట మండ లం కొత్తపల్లికి చెందిన ఎనమనగండ్ల స్వరూప(25) మృతి కేసును పోలీసులు ఛేదించారు. గత నెల 30న ఆమె అనుమానాస్పదంగా మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే అందరి అనుమానమే నిజమైంది. భర్తే హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. భర్త కొట్టిన దెబ్బలకే చనిపోయినట్లు పోస్టుమార్టం నివేదిక తెలిపింది. స్వరూప భర్త సాగర్, బావ రమేశ్ను అరెస్టు చేశారు. అత్తమామలు సమ్మక్క, అయిలయ్య పరారీలో ఉన్నారు. వివరాలు సీఐ బాలస్వామి కథనం ప్రకారం.. కొత్తపల్లికి చెందిన సాగర్తో వరంగల్ జిల్లా దూంపళ్లగూడెం పరిధిలోని ఎల్బీనగర్కు చెందిన స్వరూప వివాహం తొమ్మిదేళ్ల క్రితం జరిగింది. వీరికి వివేక్(6), శ్రీవర్షిని(3) సంతానం. అదనపు కట్నం కోసం రెండేళ్లుగా స్వరూపను భర్త వేదింపులకు గురిచేశాడు. గత నెల 30 ఇంట్లో ఎవరు లేని సమయంలో భార్యను చితకబాదాడు. ఈక్రమంలో ఆమె తలను గోడకేసి బాదడంతో అక్కడికక్కడే మృతిచెందింది. భర్త సాగర్, అత్తమామలు, బావ కలిసి స్వరూప ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు చిత్రీకరించారు. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా చేపట్టిన విచారణలో వాస్తవాలు తెలిశాయి. సంఘటన దాచిపెట్టే ప్రయత్నం చేసిన సాగర్ తల్లిదండ్రులతోపాటు అన్న రమేశ్పై కేసు నమోదు చేశారు. సాగర్, రమేశ్ను రిమాండ్కు తరలించారు. మృతురాలి అత్తమాలు సమ్మక్క,అయిలయ్య పరారీలో ఉన్నారు. -
ఆవిర్భావ వేడుకలకు సమాయత్తం
ఆదిలాబాద్, న్యూస్లైన్ : తెలంగాణ ఇచ్చింది తామేనన్న నినాదంతో ఎన్నికలకు వెళ్లినా తాజాగా జరిగిన ఎన్నికల్లో జిల్లా లో ఘోర పరాజయాన్ని కాంగ్రె స్ పార్టీ మూటగట్టుకుంది. కాగా, ముథోల్ నియోజకవర్గంలో పార్టీ అభ్యర్థి గెలుపు వారికి కొంత ఊరటం కలిగించింది. పరాజయంపై కాంగ్రెస్ శ్రేణుల్లో అంతర్మథనం మొదలైంది. పరిస్థితి ఎలా ఉన్నా తెలంగాణ కల కాంగ్రెస్ పార్టీతోనే సాకారమైందని చెప్పేందుకు కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రయత్నిస్తున్నారు. తద్వారా రానున్న రోజుల్లో పార్టీని బలోపేతం చేయాలని లక్ష్యంతో ముందుకు కదులుతున్నారు. ఇందులో భాగంగా జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ నేపథ్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించేందుకు ఆ పార్టీ సమాయత్తమైంది. జిల్లా ఇన్చార్జీగా వివేక్ తెలంగాణ ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించాలని టీపీసీసీ నుంచి జిల్లా కాంగ్రెస్ పార్టీకి ఆదేశాలు వెలువడ్డాయి. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసెందుకు తెలంగాణలోని అన్ని జిల్లాలకు ఇన్చార్జీలను నియమించింది. జిల్లా ఇన్చార్జీగా పెద్దపెల్లి మాజీ ఎంపీ జి.వివేక్ను నియమించారు. జూన్ 1న జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ కార్యకర్తలు, ఎన్ఎస్యూఐ, యూత్ కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్, వివిధ అనుబంధ సంఘాలతో పార్టీ నేతలు సమావేశం కానున్నారు. ఇందులో ఎన్నికల్లో ఓడిపోయిన అభ్యర్థులతోపాటు గెలిచిన ముథోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి కూడా పాల్గొననున్నారు. ప్రధానంగా తమ పార్టీకి ఓట్లు రాకున్నప్పటికి పర్వాలేదని, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు మాత్రం కాంగ్రెస్సే పాటు పడిందని ప్రజల్లోకి తీసుకెళ్లాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. 1,100 మంది అమరుల త్యాగ ఫలితంగా తెలంగాణ ఏర్పడిందని, సోనియాగాంధీ కృతనిశ్చయంతోనే రాష్ట్రం సాకారమయ్యిందని ప్రజలకు చెప్పదలచారు. అదే సమయంలో అధికార పార్టీ ఇచ్చిన హమీలు వాగ్ధానాలు అమలు చేయక పోతే నిలదీసేందుకు సిద్ధమవుతున్నారు. కాగా ఆవిర్భావ దినోత్సవ జూన్ 2వ తేదీన జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో తెలంగాణ జెండా ఆవిష్కరణ, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు డీసీసీ అధ్యక్షుడు సి.రాంచంద్రారెడ్డి తెలిపారు. నియోజక వర్గ కేంద్రాల్లోనూ జెండావిష్కరణ కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. పార్టీ కార్యకర్తలు తెలంగాణ వచ్చిన సంబరాలను ఘనంగా నిర్వహించాలని పేర్కొన్నారు. -
'వందకోట్లతో నీవు... వంద కేసులున్నా నేను'
కరీంనగర్ : పెద్దపల్లి కాంగ్రెస్ అభ్యర్థి వివేక్పై టీఆర్ఎస్ తరపున పెద్దపల్లి ఎంపీ స్థానానికి పోటీ చేస్తున్న బాల్క సుమన్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణ ఉద్యమానికి ద్రోహం చేసి వివేక్ మళ్లీ కాంగ్రెస్లో చేరారని ఆయన శనివారమిక్కడ మండిపడ్డారు. 'వందకోట్లతో నీవు ఎన్నికల్లో పోటీ చేస్తుంటే... ఉద్యమంలో వంద కేసులున్నా నేను బరిలోకి దిగుతున్నా' అని సుమన్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ రాజకీయ ప్రయోజనాలు ఆశించకుండా మూడేళ్ల ముందే తెలంగాణను ప్రకటిస్తే 1200మంది విద్యార్థుల ప్రాణాలు దక్కేవన్నారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న తనపై వందల కేసులుంటే....వివేక్ వందల కోట్లకు పడగలెత్తిన వారని సుమన్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ది కౌరవ సైన్యం...మాది పాండవ సైన్యం, సెంటు వాసనతో వాళ్లు... చెమట వాసనతో మేము, ధనబలం వాళ్లది...జన బలం మాది అని ఆయన అన్నారు. తెలంగాణ సాధించిన ఘటన టీఆర్ఎస్దైతే... తామే సాధించామని కాంగ్రెస్ నాయకులు చెప్పుకోవటం సిగ్గుచేటన్నారు. -
అన్నా.. కలిసిపోదామే!
హైకమాండ్ ఆదేశాలతో శ్రీధర్బాబు ఇంటికెళ్లిన వివేక్ విభేదాలు పక్కనబెట్టి ఐక్యంగా వెళదామని విజ్ఞప్తి హైదరాబాద్: మాజీ మంత్రి శ్రీధర్బాబు, పెద్దపల్లి పార్లమెంట్ సభ్యుడు జి.వివేక్ ఒక్కటయ్యారు. తమ మధ్యనున్న రాజకీయ విభేదాలను ప్రస్తుతానికి పక్కనబెట్టారు. ఈ విషయంలో కాంగ్రెస్ రాష్ర్ట వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్సింగ్ చూపిన చొరవ ఫలించింది. నిజానికి వివేక్ టీఆర్ఎస్ని వీడి మళ్లీ కాంగ్రెస్లో చేరడాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన శ్రీధర్బాబు తన మనసులోని మాటను హైకమాండ్ పెద్దలకు తెలిపి నిరసన వ్యక్తం చేశారు. హైకమాండ్ పెద్దలు దిగ్విజయ్, జైరాం రమేశ్లకు ఫోన్ చేసి పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు అండగా ఉన్న నేతలను పక్కనబెట్టి మరో పార్టీ నుంచి వచ్చిన వివేక్ సూచించిన వారికి టికెట్లు ఎలా ఇస్తారని నిలదీశారు. దీంతో దిద్దుబాటు చర్యలకు దిగిన దిగ్విజయ్ ఆదివారం శ్రీధర్బాబుకు ఫోన్ చేసి బుజ్జగించారు. ఎన్నికల్లో కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. అదే సమయంలో వివేక్కు ఫోన్చేసి శ్రీధర్బాబుతో సఖ్యతగా ఉండాలని ఉపదేశించారు. ఈ నేపథ్యంలో వెంటనే శ్రీధర్బాబు నివాసానికి వెళ్లిన వివేక్ పాత విబేధాలను పక్కనబెట్టాలని కోరారు. శ్రీధర్బాబు తన పట్ల ఆగ్రహంగా ఉన్నారని గ్రహించిన వివేక్ తన తండ్రి వెంకటస్వామిని రంగంలోకి దించారు. ఆదివారం రాత్రి శ్రీధర్బాబుకు ఫోన్ చేసిన కాకా.. కొన్ని తప్పులు జరిగిన మాట వాస్తవమేనని, కలిసిమెలిసి ఎన్నికల్లోకి వెళ్లాలని సర్దిచెప్పారు. దీనిపై మాట్లాడేందుకు ఇంటికి రావాలని కోరారు. తొలుత శ్రీధర్బాబు నిరాకరించినా.. కాకా పట్టుబట్టడంతో వచ్చారు. ఈ నేపథ్యంలో సోమవారం పలువురు టీ-కాంగ్రెస్ నేతలను కూడా వివేక్ అల్పాహారానికి ఆహ్వానించారు. అనంతరం వారితో మీడియా సమావేశాన్ని నిర్వహించి, తామందరం ఐక్యంగా ఉన్నామనే సంకేతాలను పంపేందుకు యత్నించారు -
ఎన్నికల వేళ టీఆర్ఎస్కు షాక్
శ్రీరాంపూర్, న్యూస్లైన్ : ఎన్నికల వేళ టీఆర్ఎస్ పార్టీకి గట్టిషాక్ తగిలింది. పెద్దపల్లి ఎంపీ వివేక్ ఆయన సోదరుడు వినోద్లు సోమవారం టీఆర్ఎస్ విడిచి సొంత గూటికి చేరారు. డిల్లీలో దిగ్విజయ్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో నియోజకర్గంలో టీఆర్ఎస్ శ్రేణుల్లో ఆందోళన మొదలైంది. పార్టీకి ఎదురుదెబ్బ త గలడమే కాకుండా ఆయనతోపాటు గతంలో కాంగ్రెస్ విడిచి టీఆర్ఎస్లోకి వచ్చిన నేతలకు ఇప్పడు ఎన్నికల వేళ ఎటూ వెళ్లాలనే సందిగ్ధం నెలకొంది. వివేక్ వర్గీయులు చాలా మంది జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల బరిలో నిలిచారు. మంచిర్యాల మున్సిపల్ ఎన్నికల్లో కూడా కొందరు ఆయనను నమ్మి పోటీలో ఉన్నారు. ఇప్పుడు వారి పరిస్థితి గందరగోళంగా మారింది. ఎన్నికల వేళ ఏం చేయాలో అర్థం కాక అభ్యర్థులు తలలు పట్టుకుంటున్నారు. వివేక్ వెంట వెళ్లాలనుకున్న ఇప్పడికిప్పుడు సాధ్యం కాదు. కారణం టీఆర్ఎస్ బీ-ఫామ్లతో పోటీలో ఉండి పార్టీ మారితే గెలుపు గల్లంతే. ఎన్నికల వేళ వివేక్ తమను విడిచిపోవడం బాధగా ఉందని ఆయన వర్గీయ నేత ఒకరు న్యూస్లైన్కు వాపోయారు. గడ్డు పరిస్థితులే.. వివే క్ పార్టీ మారడంతో రాచకొండ కుటుంబం గడ్డు పరిస్థితులను ఎదుర్కొవలసి వస్తున్నది. మాజీ మున్సిపల్ చైర్మన్ రాచకొండ కృష్ణారావు కుటుంబం కాంగ్రెస్లో ఎన్నో ఏళ్ల పని చేసింది. వివేక్ తండ్రి వెంకటస్వామి నుంచి వివేక్ వరకు వారిని అంటిపెట్టుకొని రాజకీయంగా ఎదుగు తూ వచ్చారు. ఇంతకు ముందు కాంగ్రెస్లో ది వాకర్రావు, ఎంపీ వివేక్, ప్రేంసాగర్రావు మూ డు గ్రూపులు ఉన్నప్పుడు వారు వివేక్ బలంలో రాణించారు. కొద్దికాలం క్రితం వివేక్ కాంగ్రెస్ ను విడిచి టీఆర్ఎస్లో చేరడంతో ఆయనతోపాటు టీఆర్ఎస్లో చేరారు. ఇప్పుడు మళ్లీ కాం గ్రెస్లోకి వివేక్ చేరడంతో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా ఈ మున్సిపల్ ఎన్నికల్లో కృష్ణారావు భార్య మంజుల మం చిర్యాల 18వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ లో ఉంది. ఆమె గెలిచి, టీఆర్ఎస్ ఎక్కువ స్థా నాలను కైవసం చేసుకొంటే మున్సిపల్ చైర్మన్ పదవి ఆమెకే ఇస్తానని ముందే వివేక్ వారికి హామీ ఇచ్చారు. దీనికి సంబంధించి వారు ఇప్పటికే ప్యానల్ సిద్ధం చేసి పెట్టుకున్నారు. కృష్ణారావు తమ్ముడు వెంకటేశ్వర్రావు కూడా ఆయన భార్య ఆశలతను మంచిర్యాల జెడ్పీటీసీగా బరి లో ఉంది. ఈ టిక్కెట్ పార్టీలో చాలా కాలంగా పని చేస్తున్న మండల అధ్యక్షుడు వంగ తిరుప తి, యువజన విభాగం తూర్పు జిల్లా అధ్యక్షు డు బేర సత్యనారాయణను కాదని ఎంపీ వివేక్ ఒత్తిడితో ఆశలతకే టిక్కెట్ ఇచ్చారు. ఆశలత గెలిస్తే ఆమెకు జెడ్పీ చైర్మన్ ఇప్పించడానికి సన్నాహాలు చేశారు. కొన్ని ఎంపీటీసీ స్థానాలు వివేక్ ఒత్తిడితో ఇవ్వడం జరిగింది. నేడు ఆ అభ్యర్థులతో పాటు పార్టీ నాయకత్వం కూడా ఆందోళన చెందుతుంది. వివేక్ మనుషులుగా ముద్ర పడ్డ అభ్యర్థులు ఇప్పడు వివేక్ వెంట పోయే పరిస్థితి లేకుండా చట్రంలో ఇరుక్కున్నారు. పోటీలో లేని కొందరు నాయకులు ఆయన వెంట నడిస్తే ఎన్నికల్లో అభ్యర్థులకు ఎదురీత తప్పదని పార్టీ నేతలు ఆందోళన చెందుతున్నారు. ఏది ఏమైన వివేక్ పార్టీ మారడంతో టీఆర్ ఎస్ పార్టీకి నష్టం చేసే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. చైర్మన్ పదవులు దక్కేనా.. ఇదిలా ఉంటే ఎంపీ ఆశీస్సులతో మున్సిపల్, జెడ్పీ చైర్మన్ పదవులు అలంకరించవచ్చనుకు న్న వారికి ఇప్పుడు ఒక్క సారిగా సీన్ మారింది. వివేక్ వర్గీయులుగా ఉన్న వీరు గెలిచిన తరువాత చైర్మన్ పదవులకు దివాకర్రావు సహకరిస్తారా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. -
సొంత గూటికి వలస పక్షులు
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : మాజీ ఎంపీ అల్లోల ఇంద్రకరణ్రెడ్డి ఎట్టకేలకు కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు. వారం రోజులుగా ఢిల్లీలో మకాం వేసిన ఆయన సోమవారం కాంగ్రెస్ అధినేత్రి సోనియాను కలిశాక, కాంగ్రెస్లో చేరుతున్నట్లు ప్రకటించారు. టీఆర్ఎస్లో కొనసాగుతున్న వెంకటస్వామి(కాకా) తనయులు ఎంపీ వివేక్, మాజీ మంత్రి వినోద్లు కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. తనతోపాటే సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప కూడా కాంగ్రెస్లో చేరుతారని ఇంద్రకరణ్రెడ్డి ప్రకటించారు. ఐకే రెడ్డి గతంలో కాంగ్రెస్లో ఉన్నప్పుడు జిల్లా రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు. ఇన్నాళ్లు తటస్థంగా ఉన్న ఆయ న టీఆర్ఎస్లో చేరుతారని అప్పట్లో ప్రచారం జరిగింది. ఈ ప్రచారానికి తెరదించుతూ ఎట్టకేలకు సోమవారం కాంగ్రెస్లో చేరారు. కాంగ్రెస్ సీనియర్ నాయకులు వెంకటస్వామి తనయులు పెద్దపల్లి ఎంపీ జి.వివేక్ కూడా సొంత గూటికి చేరుకోవడంతో ఆయన వర్గీయులు కూడా కాంగ్రెస్ వైపు వెళుతున్నారు. మాజీ మంత్రి జి.వినోద్ టీఆర్ఎస్ పార్టీ బెల్లంపల్లి నియోజకవర్గ ఇన్చార్జి బాధ్యతల్లో ఉన్నారు. కొంత కాలంగా ఆయన పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఆయన కాం గ్రెస్ తరఫున చెన్నూరు నుంచి పోటీ చేసే అవకాశాలున్నాయి. సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప కూడా కొంత కాలంగా తటస్థంగా ఉన్నారు. ఐకే రెడ్డి కాంగ్రెస్లో చేరడంతో కోనప్ప కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారు. హస్తంలో ఇక టిక్కెట్ల రాజకీయం ఈ నలుగురు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడంతో కాంగ్రెస్లో టిక్కెట్ల రాజకీయాలు కొత్త మలుపులు తిరుగనున్నాయి. ఇంద్రకరణ్రెడ్డి కాంగ్రెస్లో చేరడంతో నిర్మల్, ఆదిలాబాద్, సిర్పూర్ నియోజకవర్గాల్లో ఏదో ఒకస్థానంలో పోటీ చేయాలని భావిస్తుండటంతో అక్కడ టిక్కెట్ ఆశిస్తున్న వారి ఆశలకు గండిపడే అవకాశం ఉంది. సిర్పూర్లో కోనేరు కోనప్ప తిరిగి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనుండటంతో అక్కడి టిక్కెట్ ఆశిస్తున్న వారితో ఉత్కంఠ మొదలైంది. టిక్కెట్ విషయంలో అధిష్టానం నుంచి స్పష్టమైన హామీ వచ్చాకే ఐకే రెడ్డి ఢిల్లీలో సోమవారం ఉగాది రోజున కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. సోనియా సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఈయన కాంగ్రెస్ అభ్యర్థిగా ఏ స్థానం నుంచి బరిలో దిగుతారనే అంశంపై ఒకటీ రెండు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశాలున్నాయని ఆయన అనుచరులు పేర్కొంటున్నారు. నిర్మల్ ‘సిట్టింగ్’ పదిలమేనా? సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఈసారి టిక్కెట్లు ఖాయమని కాంగ్రెస్ వర్గాలు భావించాయి. జిల్లా కాంగ్రెస్ కమిటీ పంపిన జాబితాలో సిట్టింగ్ స్థానాల్లో ఎమ్మెల్యే ఒక్కరి పేరే ప్రతిపాదించింది. కొత్తగా పనితీరు అంశం తెరపైకి రావడంతో ఆ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో ఒకింత ఆందోళనలో పడ్డారు. పనితీరు బాగాలేని చోట్ల ప్రత్యామ్నాయ అభ్యర్థిని బరిలోకి దించుతామని కాంగ్రెస్ అధిష్టానం ఇప్పటికే సంకేతాలిచ్చింది. కాగా మహేశ్వర్రెడ్డి పనితీరుపై నిర్మల్లో తీవ్ర అసంతృప్తి ఉంది. స్థానిక ప్రజలకు అందుబాటులో ఉండరనే విమర్శలు ఆయన ఎదుర్కొంటున్నారు. మహేశ్వర్రెడ్డిని నిర్మల్ నుంచి కాకుండా, ప్రత్యామ్నాయ స్థానం నుంచి బరిలోకి దించితే ఈ అసంతృప్తిని అధిగమించ వచ్చనే యోచనలో అధిష్టానం ఉన్నట్లు కాంగ్రెస్ వర్గాల్లో ఉహాగానాలు వ్యక్తమవుతున్నాయి. సిర్పూర్ ‘సీటు’కు తీవ్ర పోటీ సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనప్ప కూడా కాంగ్రెస్లో చేరుతారని ఇంద్రకరణ్రెడ్డి ప్రకటించారు. కోనప్ప ఐకే రెడ్డికి ప్రధాన అనుచరుడు. ఇప్పుడు సిర్పూర్ తెరపైకి కోనప్ప రాకతో ఇక్కడి టిక్కెట్ ఆశిస్తున్న వారిలో పోటీ మరింత పెరగనుంది. ఇక్కడి నుంచి మాజీ ఎమ్మెల్సీ ప్రేంసాగర్రావు, ఏఐసీసీ సభ్యులు సుల్తాన్ అహ్మద్, ఏపీపీఎస్పీ సభ్యుడు పి.రవీందర్రావు తదితరులు టిక్కెట్ రేసులో ఉన్నారు. ఇప్పుడు కోనప్ప రాకతో టికెట్ కోసం గట్టిగా పోటీ పడుతున్న వారి సంఖ్య మరింత పెరిగినట్లయింది. చెన్నూర్ ఆశావహులపై వినోద్ నీళ్లు టీఆర్ఎస్ పార్టీ బెల్లంపల్లి నియోజకవర్గం ఇన్చార్జిగా ఉన్న మాజీ మంత్రి జి.వినోద్ కూడా కాంగ్రెస్లో చేరారు. ఇప్పుడు ఆయన చెన్నూరు నుంచి పోటీ చేస్తారనే ప్రచారం నెలకొంది. మంత్రిగా పనిచేసిన సమయంలో ఆయన చెన్నూరు నుంచే ప్రాతినిధ్యం వహించారు. వినోద్ టీఆర్ఎస్లోకి వెళ్లడంతో చెన్నూరులో బలమైన నేతలెవరూ తెరపైకి రాలేదు. సొత్కు సంజీవరావు, డి.శ్రీనివాస్, ఎం.సంపత్, వినయ్ తదితరులు కాంగ్రెస్ టిక్కెట్ ఆశించారు. ఇప్పుడు వినోద్ రాకతో వీరి ఆశలపై నీళ్లు చల్లినట్లే అవుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. టీఆర్ఎస్లో కొనసాగిన ఎంపీ వివేక్ ఇప్పుడు మళ్లీ పెద్దపల్లి ఎంపీగా కాంగ్రెస్ తరఫున బరిలోకి దిగుతారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
టీఆర్ఎస్ పై వివేక్ ప్రభావం ఉండదు: ఈటెల
హైదరాబాద్: ఎన్నికల ముందు వలసలు సాధారణమేనని టీఆర్ఎస్ పార్టీ నేత ఈటెల రాజేందర్ అన్నారు. టీఆర్ఎస్ పార్టీని ఎంపీ వివేక్ వీడి కాంగ్రెస్ లో చేరడంపై ఈటెల స్పందిస్తూ..వివేక్ కాంగ్రెస్లోకి వెళ్లినా టీఆర్ఎస్ పై ప్రభావం ఉండదు అని వ్యాఖ్యలు చేశారు. రానున్న ఎన్నికల్లో బీజేపీ, సీపీఐ, జేఏసీ వాదులతో కలిసి వెళ్లాలని అనుకుంటున్నామని ఈటెల ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. వివేక్ తోపాటు మరికొంత మంది ఎంపీలు, నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉందని ఊహాగానాలు వెలువడుతున్నాయి. అయితే కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్ లో చేరిన మరో ఎంపీ మందా జగన్నాథం తాను పార్టీ వీడే ప్రస్తక్తి లేదన్నారు. తాను టీఆర్ఎస్ పార్టీలోనే దళితులకు న్యాయం జరుగుతుందని.. ఆ పార్టీలోనే కొనసాగుతానని ఆయన స్పష్టం చేశారు. తాను ఎన్ని త్యాగాలు చేసినా కాంగ్రెస్ పార్టీ గుర్తించలేదని ఆయన విమర్శించారు. -
'టీఆర్ఎస్లోనే కొనసాగుతా'
తాను టీఆర్ఎస్లోనే కొనసాగుతానని ఎంపీ మందా జగన్నాథం సోమవారం న్యూఢిల్లీలో స్పష్టం చేశారు. ఆ పార్టీ తరఫున ఇప్పటికే ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించానని తెలిపారు. టీఆర్ఎస్తోనే దళితులకు న్యాయం జరుగుందని తాను ముమ్మాటికి నమ్ముతున్నానని చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో ఎవరు ఎన్ని త్యాగాలు చేసిన ఆ పార్టీ అధిష్టానం గుర్తించలేదన్నారు. టీఆర్ఎస్ నుంచి ఎంపీ వివేక్ ఈ రోజు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈ నేపథ్యంలో వివేక్ పార్టీ మారినట్లు మీరు ఏమైనా కాంగ్రెస్లో చేరుతారా అన్న విలేకర్ల ప్రశ్నకు మందా జగన్నాథంపై విధంగా సమాధానం ఇచ్చారు. కాంగ్రెస్ నుంచి పెద్దపల్లి ఎంపీ వివేక్ కొద్ది కాలం క్రితం టీఆర్ఎస్లో చేరారు. అయితే కాంగ్రెస్ పార్టీ ఇటీవల తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేసింది. దాంతో వివేక్ టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి... ఈ రోజు న్యూఢిల్లీలో కాంగ్రెస్ పెద్దల సమక్షంలో ఆయన ఆ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. -
'టీఆర్ఎస్ ఏ ముఖంతో బీజేపీతో పొత్తు పెట్టుకుంటుంది'
తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్తో పొత్తుకు ససేమిర అని ఇప్పడు బీజేపీతో పొత్తుకు యత్నిస్తోన్న టీఆర్ఎస్పై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి డి.శ్రీధర్ బాబు నిప్పులు చెరిగారు. సోమవారం హైదరాబాద్లో శ్రీధర్ బాబు మాట్లాడుతూ... పార్లమెంట్లో తెలంగాణ బిల్లును ఓడించేందుకు బీజేపీ యత్నించిందని ఆయన ఆరోపించారు. అలాంటి బీజేపీతో టీఆర్ఎస్ ఏ ముఖంతో పొత్తు పెట్టుకుంటుందంటూ ప్రశ్నించారు. బీజేపీతో పొత్తు పెట్టుకుంటే ప్రజలే టీఆర్ఎస్కు బుద్ధి చెబుతారని అన్నారు. కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లోకి... మళ్లీ కాంగ్రెస్లోకి వచ్చిన జిల్లాకు చెందిన పెద్దపల్లి ఎంపీ వివేక్ చేరికపై తనకు సమాచారం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ విధానాన్ని నమ్మి తామంతా పని చేశామని... కానీ వివేక్ వంటి వారు కాంగ్రెస్పై నమ్మకం లేక పార్టీని విడిచి వెళ్లారన్నారు. వివేక్ మళ్లీ తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరికపై క్షేత్రస్థాయిలో కార్యకర్తల అభిప్రాయాలను తమ పార్టీ అధిష్టానానికి వివరిస్తామన్నారు. -
కాంగ్రెస్లో చేరిన కాకా తనయులు
న్యూఢిల్లీ: కాంగ్రెస్ కురువృద్ధుడు జి.వెంకటస్వామి(కాకా) తనయులు వివేక్, వినోద్లు టీఆర్ఎస్ను వీడి తిరిగి సొంతగూటికిచేరారు. సోమవారం వీరిద్దరూ ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీతో సమావేశమయ్యారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కాంగ్రెస్లో చేరినట్టు ప్రకటించారు. ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారని, ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారని వివేక్ అన్నారు. కాగా తెలంగాణపై బీజేపీ వెనక్కి తగ్గిందని విమర్శించారు. గతంలో తెలంగాణ కోసమే కాంగ్రెస్ను వీడామని, తెలంగాణ ఇచ్చినందున మళ్లీ కాంగ్రెస్లో చేరుతున్నామని చెప్పారు. వివేక్ బ్రదర్స్ కోరిన స్థానాల టికెట్లు ఇచ్చేందుకు సైతం హైకమాండ్ సుముఖత వ్యక్తం చేసినట్లు కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. కాంగ్రెస్లో చేరేందుకు గ త మూడు రోజులుగా ఢిల్లీలో హైకమాండ్ పెద్దలతో మంతనాలు నెరిపిన ఈ ఇద్దరు సోదరులు.. ఆదివారం రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్సింగ్తో సుమారు గంట పాటు చర్చలు జరిపారు. తాము పార్టీని వీడినా ఏనాడూ కాంగ్రెస్పైగానీ, అధినేత్రి సోనియాగాంధీపైగానీ వ్యతిరేకంగా మాట్లాడలేదని, కేవలం ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా నడుచుకోవాలని మాత్రమే కోరుతూ వచ్చామని చెప్పారు. వివేక్ సిట్టింగ్ స్థానమైన పెద్దపల్లి ఎంపీతో పాటు, వినోద్కు చెన్నూరు అసెంబ్లీ టికెట్లు ఇచ్చేందుకు దిగ్విజయ్ నుంచి హామీ లభించినట్లు సమాచారం. ఎంపీ వివేక్, రాజ్యసభ మాజీ సభ్యుడు కె కేశవరావు, నాగర్ కర్నూల్ ఎంపీ మందా జగన్నాథంలు కాంగ్రెస్ పార్టీని వీడి గతేడాది జూన్ 2 న టీఆర్ఎస్ లో చేరారు. అయితే అప్పట్నుంచే వివేక్ పార్టీ వ్యవహారాల్లో అంటీ ముట్టనట్టు ఉంటూ వస్తున్నారు. -
సోనియాతో కాకా తనయుల భేటీ
న్యూఢిల్లీ: కాంగ్రెస్ కురువృద్ధుడు జి.వెంకటస్వామి(కాకా) తనయులు వివేక్, వినోద్లు టీఆర్ఎస్ను వీడి తిరిగి సొంతగూటికిచేరేందుకు రంగం సిద్ధమైంది. సోమవారం వీరిద్దరూ ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీతో సమావేశమయ్యారు. కాంగ్రెస్లో చేరే విషయంపై సోనియా, వివేక్ బ్రదర్స్ మధ్య చర్చలు జరిగినట్టు సమాచారం. సోనియా వీరిద్దరినీ పార్టీలోకి ఆహ్వనించారని, ఇదే రోజు వీరిద్దరూ కాంగ్రెస్ కండువా కప్పుకోవచ్చని తెలుస్తోంది. కాసేపట్లో కాకా తనయులు మీడియా సమావేశంలో మాట్లాడే అవకాశముంది. వివేక్ బ్రదర్స్ కోరిన స్థానాల టికెట్లు ఇచ్చేందుకు సైతం హైకమాండ్ సుముఖత వ్యక్తం చేసినట్లు కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. కాంగ్రెస్లో చేరేందుకు గ త మూడు రోజులుగా ఢిల్లీలో హైకమాండ్ పెద్దలతో మంతనాలు నెరిపిన ఈ ఇద్దరు సోదరులు.. ఆదివారం రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్సింగ్తో సుమారు గంట పాటు చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ఏ పరిస్థితుల్లో కాంగ్రెస్ను వీడాల్సి వచ్చిందో దిగ్విజయ్కు వివేక్ వివరణ ఇస్తూ.. తెలంగాణపై మొదటి నుంచి గట్టిగా పోరాడుతున్న తాము హైకమాండ్పై ఒత్తిడి పెంచేందుకే పార్టీని వీడామని వివరించారు. తాము పార్టీని వీడినా ఏనాడూ కాంగ్రెస్పైగానీ, అధినేత్రి సోనియాగాంధీపైగానీ వ్యతిరేకంగా మాట్లాడలేదని, కేవలం ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా నడుచుకోవాలని మాత్రమే కోరుతూ వచ్చామని చెప్పారు.వివేక్ సిట్టింగ్ స్థానమైన పెద్దపల్లి ఎంపీతో పాటు, వినోద్కు చెన్నూరు అసెంబ్లీ టికెట్లు ఇచ్చేందుకు దిగ్విజయ్ నుంచి హామీ లభించినట్లు సమాచారం. ఎంపీ వివేక్, రాజ్యసభ మాజీ సభ్యుడు కె కేశవరావు, నాగర్ కర్నూల్ ఎంపీ మందా జగన్నాథంలు కాంగ్రెస్ పార్టీని వీడి గతేడాది జూన్ 2 న టీఆర్ఎస్ లో చేరారు. అయితే అప్పట్నుంచే వివేక్ పార్టీ వ్యవహారాల్లో అంటీ ముట్టనట్టు ఉంటూ వస్తున్నారు. -
సొంతగూటికి నేడు వివేక్ బ్రదర్స్
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ కురువృద్ధుడు జి.వెంకటస్వామి(కాకా) తనయులు వివేక్, వినోద్లు తిరిగి సొంతగూటికిచేరేందుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ మేరకు కాంగ్రెస్ హైకమాండ్ నుంచి గ్రీన్ సిగ్నల్ లభించిందని, ఇక వారి చేరిక లాంఛనమే అని సమాచారం. వివేక్ బ్రదర్స్ కోరిన స్థానాల టికెట్లు ఇచ్చేందుకు సైతం హైకమాండ్ సుముఖత వ్యక్తం చేసినట్లు కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. అన్నీ అనుకూలిస్తే సోమవారం వీరు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొంటారని తెలిసింది. కాంగ్రెస్లో చేరేందుకు గ త మూడు రోజులుగా ఢిల్లీలో హైకమాండ్ పెద్దలతో మంతనాలు నెరిపిన ఈ ఇద్దరు సోదరులు.. ఆదివారం రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్సింగ్తో సుమారు గంట పాటు చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ఏ పరిస్థితుల్లో కాంగ్రెస్ను వీడాల్సి వచ్చిందో దిగ్విజయ్కు వివేక్ వివరణ ఇస్తూ.. తెలంగాణపై మొదటి నుంచి గట్టిగా పోరాడుతున్న తాము హైకమాండ్పై ఒత్తిడి పెంచేందుకే పార్టీని వీడామని వివరించారు. తాము పార్టీని వీడినా ఏనాడూ కాంగ్రెస్పైగానీ, అధినేత్రి సోనియాగాంధీపైగానీ వ్యతిరేకంగా మాట్లాడలేదని, కేవలం ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా నడుచుకోవాలని మాత్రమే కోరుతూ వచ్చామని చెప్పారు. తెలంగాణ ప్రజల అభివృద్ధి, సంక్షేమాన్ని కాంక్షిస్తూ తిరిగి కాంగ్రెస్లో చేరేందుకు సిద్ధంగా ఉన్నామని వివరించారు. దీనిపై సానుకూలంగా స్పందించిన దిగ్విజయ్, పార్టీలో చేరేందుకు సుముఖుత వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఇదే సమయంలో వివేక్ సిట్టింగ్ స్థానమైన పెద్దపల్లి ఎంపీతో పాటు, వినోద్కు చెన్నూరు అసెంబ్లీ టికెట్లు ఇచ్చేందుకు దిగ్విజయ్ నుంచి హామీ లభించినట్లు సమాచారం. స్పష్టమైన హామీ లభించడంతో ఇద్దరు నేతలు పార్టీ పెద్దల సమక్షంలో కాంగ్రెస్లో చేరతారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. కాగా, ఇదే సమయంలో వివేక్ సోదరులు టీఆర్ఎస్తో పొత్తులపై జరిపిన చర్చలు మాత్రం విఫలమయ్యాయని తెలుస్తోంది. దాదాపు అన్ని స్థానాలకు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పూర్తవుతున్న సమయంలో ఇంకా చర్చలకు తావులేదని దిగ్విజయ్ స్పష్టం చేసినట్లు తెలిసింది. కాంగ్రెస్లో చేరే విషయమైనా, మరే నిర్ణయమైనా సోమవారం వెల్లడిస్తానని ఎంపీ వివేక్ ఆదివారం ‘సాక్షి’కి తెలిపారు. కాంగ్రెస్లో తిరిగి చేరాలని తనపై కాంగ్రెస్ హైకమాండ్ నుంచి ఒత్తిడి ఉందన్నారు. -
కాంగ్రెస్ గూటికి కాకా తనయులు!
-
కాంగ్రెస్ గూటికి కాకా తనయులు!
న్యూఢిల్లీ : కేంద్ర మాజీ మంత్రి వెంకటస్వామి తనయులు వివేక్, వినోద్ టీఆర్ఎస్ను వీడనున్నారా? మళ్లీ సొంత గూటికి చేరేందుకు ప్రయత్నిస్తున్నారా? జోరందుకుంటున్న ఈ ఊహాగానాలు నిజమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఆదివారం వీరిద్దరూ ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ను ఆయన ఇంటికెళ్లి కలవడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరుస్తోంది. ఎవరికీ అనుమానం రాకుండా మామూలు కారులో దిగ్విజయ్ ఇంటికెళ్లడం గమనార్హం. కాంగ్రెస్ పార్టీలో చేరే విషయంపై వివేక్, వినోద్లు డిగ్గీ రాజాతో చర్చించినట్టు సమాచారం. గంటకు పైగా సమావేశమయ్యారు. వీరిద్దరూ త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరుతారని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. వివేక్, వినోద్ టీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరతారనే ప్రచారం గత కొద్దిరోజులుగా జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ విషయాన్ని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ కూడా ఖండించకపోవటం విశేషం. వివేక్ తాజా ఎంపీ కాగా, వినోద్ మాజీ మంత్రి. ఎంపీ వివేక్, రాజ్యసభ మాజీ సభ్యుడు కె కేశవరావు, నాగర్ కర్నూల్ ఎంపీ మందా జగన్నాథంలు కాంగ్రెస్ పార్టీని వీడి గతేడాది జూన్ 2 న టీఆర్ఎస్ లో చేరారు. అయితే అప్పట్నుంచే వివేక్ పార్టీ వ్యవహారాల్లో అంటీ ముట్టనట్టు ఉంటూ వస్తున్నారు. -
ఢిల్లీలో ఎంపీ వివేక్, మళ్లీ సొంత గూటికే!
న్యూఢిల్లీ : కరీంనగర్ జిల్లా పెద్దపల్లి వివేక్ మళ్లీ సొంత గూటికి చేరబోతున్నారు. గత కొద్దిరోజులుగా ఆయన టీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరతారనే ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఆ కథనాలను వివేక్ ఖండించారు కూడా. ఈ మేరకు ఆయన టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ను కలిసి వివరణ కూడా ఇచ్చారు. కాగా శుక్రవారం వివేక్ మరోసారి కేసీఆర్తో ఆయన ఫామ్హౌస్లో భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలో శనివారం వివేక్ ఢిల్లీలో ప్రత్యక్షం అవటం ....ఆయన తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారనే ఊహాగానాలకు బలం చేకూరుతోంది. వివేక్ కాంగ్రెస్లో చేరుతారనే ప్రచారాన్ని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ కూడా ఖండించకపోవటం విశేషం. ఎంపీ వివేక్, రాజ్యసభ మాజీ సభ్యుడు కె కేశవరావు, నాగర్ కర్నూల్ ఎంపీ మందా జగన్నాథంలు కాంగ్రెస్ పార్టీని వీడి గతేడాది జూన్ 2 న టీఆర్ఎస్ లో చేరారు. అయితే అప్పట్నుంచే వివేక్ పార్టీ వ్యవహారాల్లో అంటీ ముట్టనట్టు ఉంటూ వస్తున్నారు. ఈ మధ్య ఆయన పార్టీ వీడి కాంగ్రెస్ లో చేరతారని ఊహాగానాలు వినిపించాయి. ఈ నేపథ్యంలో వివేక్ తనంతట తానుగా వెళ్లి కెసిఆర్ ను కలిసి తన వాదన వినిపించారు. -
టీఆర్ఎస్ వీడేది లేదు: వివేక్
గత కొద్ది కాలంగా టీఆర్ ఎస్ అధినేత వ్యవహార శైలి విషయంలో అసంతృప్తిగా ఉన్న పెద్దపల్లి ఎంపీ వివేక్ బుధవారం ఆయన్ను కలుసుకున్నారు. తాను టీఆర్ ఎస్ ను వీడేది లేదని, తన విషయంలో వస్తున్న వార్తలన్నీ ఊహాగానాలేనని ఆయన కెసిఆర్ కి చెప్పారు. తాను టీఆర్ ఎస్ నుంచే ఎన్నికల్లో పోటీ చేస్తానని ఆయన చెప్పారు. ఎంపీ వివేక్, రాజ్యసభ మాజీ సభ్యుడు కె కేశవరావు, నాగర్ కర్నూల్ ఎంపీ మందా జగన్నాథంలు కాంగ్రెస్ పార్టీని వీడి గతేడాది జూన్ 2 న టీఆర్ ఎస్ లో చేరారు. అయితే అప్పట్నుంచే వివేక్ పార్టీ వ్యవహారాల్లో అంటీ ముట్టనట్టు ఉంటూ వస్తున్నారు. ఈ మధ్య ఆయన పార్టీ వీడి టీఆర్ఎస్ లో చేరతారని ఊహాగానాలు వినవస్తున్నాయి. ఈ నేపథ్యంలో వివేక్ తనంతట తానుగా వెళ్లి కెసిఆర్ ను కలిసి తన వాదన వినిపించారు. -
చంద్రబాబుకు కొత్తవాదన తగదు
ఢిల్లీ: రాష్ట్ర విభజనకు అనుకూలంగా టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు లేఖ ఇచ్చారని, ఇప్పుడు సమన్యాయమంటూ కొత్త వాదన వినిపించడం తగదని తెలంగాణ ఎంపీలు వివేక్, మందా జగన్నాథం విమర్శించారు. సీమాంధ్ర ఎంపీలు లోక్సభను అడ్డుకోవడం తగదని సలహా ఇచ్చారు. సీమాంధ్ర ఎంపీలు అమర్యాదగా ప్రవర్తిస్తున్నారన్నారు. ఎంపి కోమటిరెడ్డి రాజగోపాల్ మాట్లాడుతూ సీమాంధ్ర నేతలు తమ సహనాన్ని పరీక్షించవద్దన్నారు. రేపు తెలంగాణ బిల్లు లోక్సభకు వస్తుంద చెప్పారు. ఉభయసభల్లో తెలంగాణ బిల్లు ఆమోదం పోందుతుందన్నారు. ఇదిలా ఉండగా, లోక్సభ సెక్రటరీ జనరల్ను అసభ్య పదజాలంతో దూషించిన ఎంపీ శివప్రసాద్ను ఎంపీ జగన్నాదం అడ్డుకున్నారు. అవిశ్వాస తీర్మానం పెట్టాలని శివప్రసాద్ నినాదాలు చేశారు. జగన్నాథం అతనిని అడ్డకొని వారించారు. -
' సీఎం... ఎల్కేజీ నుంచి అబద్దాల కోరే '
సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ఎల్కేజీ నుంచి అబద్దాల ఆడేవారని ఆయన చిన్ననాటి స్నేహితుడు పెద్దపల్లి ఎంపీ వివేక్ ఎద్దేవా చేశారు. ఆదివారం మెదక్ విచ్చేసిన ఆయన మీడియాతో మాట్లాడారు. తన సహ విద్యార్థిగా కిరణ్ ఆడిన ఎన్నో తొండి ఆటలు చిన్నానాటి నుంచి చూస్తున్నట్లు ఆయన చెప్పారు. అలాగే తెలంగాణ విషయంలో మరో అబద్దపు ఆటకు కిరణ్ తెర తీశారని వివేక్ ఆరోపించారు. అయితే హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చిన్ననాటి నుంచి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, ఎంపి వివేక్లు ఎల్కేజీ నుంచి కలసి చదువుకున్నారు. దీంతో మెదక్ వచ్చిన వివేక్ను విభజన బిల్లుపై సీఎం అవలంభించిన వైఖరిపై విలేకర్లు అడిగిన ప్రశ్నకు పై విధంగా సమాధానం చెప్పారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభకు వచ్చిన రాష్ట్ర విభజన బిల్లు అసంపూర్తిగా ఉందని, ఈ నేపథ్యంలో ఆ బిల్లును తిప్పి రాష్ట్రపతికి పంపాలని సభా నాయకుడిగా స్పీకర్కు నోటీసులు జారీ చేశారు. దాంతో ఆ బిల్లును తిప్పి రాష్ట్రపతికి పంపనున్నారు. అయితే విభజన బిల్లును తిప్పి పంపడంపై తెలంగాణ ప్రాంతానికి చెందిన అన్ని పార్టీల నేతలు సీఎం కిరణ్పై నిప్పులు చెరుగుతున్న సంగతి తెలిసిందే. -
33 ప్రేమ కథలు సినిమా స్టిల్స్
-
ముఖ్యమంత్రికి సంపాదనే లక్ష్యం: ఎంపీ వివేక్
ముఖ్యమంత్రి కిరణ్పై ఎంపీ వివేక్ మరోసారి మండిపడ్డారు. సంపాదనే లక్ష్యంగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అడ్డదారిలో ఫైళ్లు క్లియర్ చేస్తున్నారంటూ తీవ్రంగా ఆరోపణలు గుప్పించారు. కేంద్ర మంత్రుల బృందానికి కిరణ్ తప్పుడు నివేదికలు ఇచ్చారని, ఆయనకు ఏమాత్రం నైతిక విలువలు ఉన్నా.. వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని వివేక్ డిమాండ్ చేశారు. ఇటీవలి కాలంలో జరుగుతున్న ఫైళ్ల క్లియరెన్సుపై వెంటనే సీబీఐ విచారణ జరిపించాలని ఆయన అన్నారు. -
కన్నీటి స్వాగతం
సాక్షి ప్రతినిది, ఆదిలాబాద్ : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో పంట నష్టపోయి గుండె చెదిరిన రైతులను ఓదార్చేందుకు టీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యే లు, నాయకులు ఆదివారం జిల్లాలో సుడిగాలి పర్యటన చేశా రు. ఉత్తర తెలంగాణ ప్రాంతానికి చెందిన పలువురు ఎంపీ లు, ఎమ్మెల్యేలు, నాయకులు రెండు బృందాలుగా తూర్పు, పశ్చిమ ప్రాంతాల్లో పర్యటించారు. ఎంపీ డాక్టర్ జి.వివేక్, కరీంనగర్ జిల్లా సిరిసిల్ల, రామగుండం ఎమ్మెల్యేలు కల్వకుంట్ల తారక రామారావు, సోమారపు సత్యనారాయణ, చెన్నూరు ఎమ్మెల్యే నల్లాల ఓదేలు, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మన్రావు తదితరులు తూర్పు ప్రాంతంలో తిరిగారు. ఆదిలాబాద్, ముథోల్ ఎమ్మెల్యేలు జోగు రామన్న, సముద్రాల వేణుగోపాలాచారి, నిజామాబాద్ జిల్లా బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్రెడ్డితోపాటు ఎమ్మెల్యే ఏనుగు రవీందర్రెడ్డి, టీఆర్ఎస్ పశ్చిమ జిల్లా అధ్యక్షుడు లోక భూమారెడ్డి పశ్చిమ ప్రాంతంలోని ఐదు నియోజకవర్గాల్లో పర్యటించారు. ఉదయం 10 గంటలకు మొదలైన ప్రజాప్రతినిధుల పర్యటన రాత్రి 9.30 గంటలకు ముగిసింది. వర్షాలు, వరదల కారణంగా దెబ్బతిన్న పంటలను పరిశీలించడంతోపాటు, గుండె చెదిరి ఆత్మహత్యలకు పాల్పడిన రైతుల కుటుంబాలను వారు పరామర్శించారు. నిర్మల్, సిర్పూరు, చెన్నూరు, బోథ్, ముథోల్, ఆదిలాబాద్ తదితర నియోజకవర్గాల్లో రెండు జట్లుగా ఏర్పడిన టీఆర్ఎస్ ఎంపీ, ఎమ్మెల్యేల బృందాలు గుండె చెదిరిన రైతు కుటుంబాలను ఓదార్చే ప్రయత్నం చేశాయి. ప్రజాప్రతినిధులతో అన్నదాతల వేదన ప్రజాప్రతినిధులతో అన్నదాతలు వారి గోడు వెల్లబోసుకున్నారు. ముథోల్ నుంచి ఆదిలాబాద్ వరకు... కౌటాల నుంచి చెన్నూరు వరకు ఎవరినీ కదిలించినా కన్నీళ్లే కనిపించాయి. ఆరుగాలం అనేక కష్టన ష్టాల కోర్చిన రైతన్నకు తుపాన్, వరదలు నష్టాలను మిగిల్చగా పంటలను పరిశీలించేందుకు వెళ్లిన ప్రజాప్రతినిదుల బృందాలకు అన్నదాతల వేదనలే ఎదురయ్యాయి. నిర్మల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్రెడ్డి, రవీందర్రెడ్డి, వేణుగోపాలాచారి, జోగు రామన్నలు పర్యటించారు. ఈ సందర్భంగా పలు గ్రామాల్లో ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలను పరామర్శించారు. దిలావర్పూర్ మండలంలోని రాంపూర్ గ్రామంలో ఆత్మహత్యకు పాల్పడిన రైతు శేఖ్ మౌలానా కుటుంబాన్ని, దిలావర్పూర్లోని కోడె పెద్దొళ్ల ముత్యం కుటుంబాన్ని, సారంగాపూర్ మండలం కౌట్ల(బి)లో ఆత్మహత్యలకు పాల్పడ్డ కౌలు రైతు తండ్రి, కుమారుడు బర్ల భీమన్న, బర్ల శంకర్ కుటుంబాలను పరామర్శించారు. ఒక్కో కుటుంబానికి రూ.10వేల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ముథోల్, భైంసా మండలం వానల్పాడ్, తిమ్మాపూర్ గ్రామశివారుల్లోని రైతులతో ఎమ్మెల్యేలు మాట్లాడారు. బాధిత రైతులకు న్యాయం జరిగేలా చూస్తామన్నారు. ఆదిలాబాద్ మండలంలోని అంకోలి గ్రామంలో ఆత్మహత్యలు చేసుకున్న రైతులు పోశమల్లు, దాండ్ల రాములు కుటుంబ సభ్యులను పరామర్శించారు. రాష్ట్రంలోనే అత్యధిక వర్షపాతం జిల్లాలో నమోదైందని, దీంతోపాటు అత్యధికంగా రైతు ఆత్మహత్యలు జరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. నష్టపరిహారం అందజేయడంలో జాప్యం చేయకుండా పెట్టుబడి పెట్టిన దానికైన రూ.18వేల నుంచి రూ. 20వేల వరకు ఎకరానికి నష్టపరిహారం అందజేయాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. రైతుబిడ్డగా స్పందిస్తానన్న కలెక్టర్ బాబు చేతికి వచ్చిన పంట నేలపాలు కావడంతో జిల్లాలో అత్యధికంగా రైతు ఆత్మహత్యలు చోటుచేసుకుంటున్నాయని ఈ మేరకు జిల్లా రైతుల ను ఆదుకునేందుకు ప్రభుత్వానికి తక్షణమే నివేదిక పంపాలని టీఆర్ఎస్ ఎమ్మెల్యేల బృందం కలెక్టర్ అహ్మద్ బాబుని కలిసింది. తడిసిన ధా న్యం, సోయాబీన్ పంటలను మార్క్ఫెడ్ ద్వా రా కొనుగోలు చేసి ప్రభుత్వం ప్రకటించిన మద్ద తు ధరను అందజేయాలని, 421 జీవోను అమ లు చేసి రైతు కుటుంబాలను ఆదుకోవాలని కోరారు. జిల్లాలో వరద ప్రాంతాలను సందర్శిం చి దెబ్బతిన్న పంటలను పరిశీలించి ఆత్మహత్యలకు పాల్పడిన రైతు కుటుంబాలు, బాధితుల ను కలుసుకున్న అనంతరం టీఆర్ఎస్ ఎమ్మెల్యే ల బృందం కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో కలెక్టర్ అహ్మద్బాబును కలిసి వినతి పత్రాన్ని అం దజేశారు. సానుకూలంగా స్పందించిన కలెక్టర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతుల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని, తాను కూడా రైతు బిడ్డనేనని పేర్కొన్నారు. అంతకు ముందు జిల్లా వ్యాప్తంగా రెండు బృందాలుగా పర్యటించిన టీఆర్ఎస్ ఎంపీ, ఎమ్మెల్యేలు, నాయకులు వేర్వేరుగా మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వంపై దుమ్మెత్తి పోశారు. సీఎం కిరణ్కుమార్రెడ్డి తెలంగాణ ప్రాంతంపై చూపెడుతున్న వివక్షతోనే ఇక్కడి రైతాంగానికి పరిహా రం అందడలేదని, ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి పరిహారం అందజేసేందుకే తాము పర్యటిస్తున్నట్లు పేర్కొన్నారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు ఇటీవల కురుస్తున్న వర్షాలతో నష్టపోయిన బాధితులను పరామర్శించి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు తూర్పు, పశ్చిమ జిల్లాల్లోని బెల్లంపల్లి, చెన్నూరు, సిర్పూర్, నిర్మల్, ముథోల్, బోథ్, ఆదిలాబాద్ నియోజకవర్గాల్లోని పంటలను పరిశీలించడం జరిగిందన్నారు. ఆత్మహత్యలకు పాల్పడ్డ రైతు కుటుం బాలకు 2004లో 241 జీవో విడుదల చేసి వైఎస్సార్ పీఎం నిధి ద్వారా రూ.50 వేలు, సీఎం సహాయ నిధిద్వారా రూ.లక్ష ఇచ్చారన్నారు. ప్రస్తుతం ప్రభుత్వం ఏమి ఇవ్వడం లేదని వారు పేర్కొన్నారు. గతంలో సీఎం కిరణ్ అధ్యక్షతన రచ్చబండ కార్యక్రమం చేపట్టిన మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్సాగర్రావు ప్రస్తుతం రైతులు నష్టపోతున్నా ఎందుకు పట్టించుకోవడంలేదని కూడ వారు విమర్శించారు. -
సిఎం పాఠశాలస్థాయి నుంచే తొండి చేసేవారు:ఎంపి వివేక్
హైదరాబాద్: ముఖ్య మంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పాఠశాల స్థాయి నుంచే తొండి చేసేవారని ఎంపి వివేక్, మాజీ ఎంపి కె.కేశవరావు అన్నారు. స్కూల్స్థాయి నుంచే సిఎంకు ఓడిపోవడం అలవాటన్నారు. సిఎంను వెంటనే అరెస్ట్ చేయాలని వారు డిమాండ్ చేశారు. సిఎంకు ఒక్క సర్పంచ్ను కూడా గెలిపించే సత్తాలేదన్నారు. సిఎం ఇరుప్రాంత ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. సిఎంకు మానసికస్థితి సరిగాలేదన్నారు. -
ముఖ్యమంత్రిని బర్తరఫ్ చేయాలి: ఎంపీ వివేక్ డిమాండ్
ముఖ్యమంత్రి డబ్బులిచ్చి, రెచ్చగొట్టేవారిని ప్రోత్సహిస్తున్నారని ఎంపీ వివేక్ ఆరోపించారు. తన ప్రకటనలతో ఇరు ప్రాంతాల్లో ఉద్రిక్తతలు రెచ్చగొడుతున్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపైనే ముందుగా పీడీ యాక్ట్ పెట్టాలని ఆయన అన్నారు. ముఖ్యమంత్రిని వెంటనే ఆ పదవి నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. కాగా, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం రాకుండా ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డి, డీజీపీ దినేశ్ రెడ్డిలే ప్రధానంగా అడ్డుపడుతున్నారని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆరోపించారు. ఏపీ ఎన్జీవోలు నిర్వహిస్తున్న 'సేవ్ ఆంధ్రప్రదేశ్' సభకు దీటుగా తెలంగాణ ప్రాంతంలో శుక్రవారం అర్ధరాత్రి నుంచే బంద్ పాటించాలని ఆయన పిలుపునిచ్చారు. మరోవైపు, శనివారం నాటి తెలంగాణా బంద్ విషయంలో బీజేపీలో చీలిక ఏర్పడింది. బంద్కు మద్దతు ఇవ్వాలని ఒక వర్గం, వద్దని మరో వర్గం పరస్పరం వాదించుకున్నట్లు తెలుస్తోంది. దీంతో ఏం చేయాలో తెలియక బీజేపీ నాయకులు సతమతం అవుతున్నారు. -
కాంగ్రెస్లో తిరిగి చేరతానన్న వార్తలు ఊహాగానాలే: వివేక్