comedian
-
కమెడియన్ ధనరాజ్తో గొడవలు- విడాకులు.. క్లారిటీ ఇచ్చిన భార్య
టాలీవుడ్లో కమెడియన్గా ఎంతో గుర్తింపు తెచ్చుకున్నాడు ధనరాజ్ (Dhanraj). బుల్లితెర నుంచి వెండితెరకు సాగిన అతడి ప్రయాణంలో భార్య శిరీష వెన్నంటే నిలబడిందని ఎన్నోసార్లు ఎమోషనలయ్యాడు. తాజాగా శిరీష తొలిసారి ఓ ఇంటర్వ్యూకు హాజరై ఎన్నో విషయాలు చెప్పుకొచ్చింది. శిరీష (Dhanraj Wife Sirisha) మాట్లాడుతూ.. ధనరాజ్ది విజయవాడ. నాది ఖమ్మం. నేను క్లాసికల్ డ్యాన్సర్ను. ధనరాజ్ ఫిలిం నగర్లో ఓ డ్యాన్స్ స్టూడియో పెట్టినప్పుడు టీచర్ కోసం వెతుకుతున్నారు. అలా నన్ను కలిశాడు. క్యాన్సర్తో కన్నుమూసిన ధనరాజ్ తల్లిఅదృష్టమో, దురదృష్టమో తెలీదు కానీ నేను పరిచయమైన రోజే అతడి అమ్మ క్యాన్సర్తో చనిపోయింది. ఆమె వెళ్లిపోతూ నన్ను అతడికి ఇచ్చిందని ధనరాజ్ ఫీలయ్యాడు. తల్లి అంత్యక్రియలు చేయడానికి కూడా డబ్బు లేకపోతే నా దగ్గరున్న బంగారం ఇచ్చేశాను. నవంబర్లో ఆమె చనిపోతే మార్చిలో మా పెళ్లి జరిగింది. మాది ప్రేమ వివాహం. అది కూడా నేనే ప్లాన్ చేశాను. రేపు మన పెళ్లి అనగానే సరేనని తలూపాడు. ఇంట్లో వాళ్లను కాదని 15 ఏళ్లకే పెళ్లి చేసుకున్నాను. మా పెళ్లయ్యాకే అతడికి పేరొచ్చిందిమా పెళ్లయిన మూడో రోజే జగడం సినిమా రిలీజైంది. అక్కడి నుంచి ధనరాజ్కు అవకాశాలు, ఫేమ్ మొదలైంది. అయితే ఆయన నిర్మాతగా ధనలక్ష్మి తలుపు తడితే అని ఓ సినిమా తీశాడు. అది నాకిష్టం లేదు. ఆయన మాత్రం కచ్చితంగా ఆడుతుందని నమ్మి తీశాడు. ఒకవేళ సినిమా పోతే జీరో నుంచి మొదలుపెట్టాల్సిందే! నేను అనుకున్నట్లుగానే జీరో నుంచి మళ్లీ స్టార్ట్ చేశాం.. సోషల్ మీడియాలో మా గురించి ఏవేవో పుకార్లు రాస్తుంటారు. పదిరోజులు మాట్లాడుకోంఆ మధ్య మేము రోడ్డున పడ్డామని రాశారు. ఇల్లు కూడా అమ్మేశామని ప్రచారం చేశారు. ఇప్పుడేమో విడాకులు తీసుకుంటున్నట్లు పుకార్లు! మా మధ్య చిన్నచిన్న గొడవలు జరుగుతుంటాయి. వారం, పది రోజులపాటు మాట్లాడుకోం. అంతేకానీ విడాకులు తీసుకునేంత సీన్ ఏం లేదు. మేము సంతోషంగా ఉన్నాం. ఏవి పడితే అవి రాయొద్దు. ఇకపోతే ధనరాజ్ ఫ్రెండ్స్ మా ఇంటికి వస్తూ ఉంటారు. సుడిగాలి సుధీర్ నాకు ఎక్కువ క్లోజ్. ప్రస్తుతానికైతే వాడు పెళ్లే చేసుకోను అంటున్నాడు. మరి ఏం చేస్తాడో చూడాలి! అని శిరీష చెప్పుకొచ్చింది.చదవండి: ఆలియాను చూసి ఈర్ష్య పడ్డా.. ఈమెకేంటి.. లైఫ్ సెట్టు అనుకున్నా! -
హవా హవాయీ!.. నిర్మలా సీతారామన్ టార్గెట్గా కునాల్ కమ్రా వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేపై వ్యంగ్య కామెడీతో వివాదానికి కేంద్ర బిందువుగా మారిన స్టాండప్ కమేడియన్ కునాల్ కమ్రా తాజాగా మరో వివాదానికి తెర తీశారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను, ఆమె ఆర్థిక విధానాలను విమర్శిస్తూ సూపర్ హిట్ హిందీ సినిమా ‘మిస్టర్ ఇండియా’లోని ఐకానిక్ పాట ‘హవా హవాయీ’ని పేరడీ చేశారు. ‘ఆప్ కా ట్యాక్స్ కా పైసా హో రహా హవా హవాయీ (జనాలు కట్టే పన్నుల డబ్బులు గోల్మాల్ అవుతున్నాయి)’అంటూ బుధవారం విడుదల చేసిన వీడియోలో చెణుకులు విసిరారు.తాజాగా కునాల్ కమ్రాన్.. ‘ట్రాఫిక్ బఢానే ఏ హై ఆయీ, బ్రిడ్జెస్ గిరానే ఏ హై ఆయీ, కెహతే ఇస్ కో తానాషాహీ (అది ఉన్నదే ట్రాఫిక్ కష్టాలు పెంచేందుకు, బ్రిడ్జిలను కూలగొట్టేందుకు. నియంతృత్వం అంటారు దాన్ని)’ అంటూ అధికార బీజేపీ తీరుపైనా వ్యంగ్యా్రస్తాలు సంధించారు. అయితే తమ పాటను అనుమతి లేకుండా వాడుకోవడం ద్వారా కామ్రా కాపీరైట్ను ఉల్లంఘించారని టీ సిరీస్ ఆరోపించింది. ఈ క్రమంలోనే తాజా పేరడీని యూట్యూబ్లో బ్లాక్ చేయించింది. దీన్ని కామ్రా తీవ్రంగా తప్పుబట్టారు. మరోవైపు షిండే ఉదంతంలో విచారణకు హాజరయ్యేందుకు వారం గడువు కావాలన్న కామ్రా విజ్ఞప్తిని ముంబై పోలీసులు తిరస్కరించారు. తక్షణం విచారణకు రావాలంటూ రెండోసారి సమన్లు జారీ చేశారు. బుధవారం ఆయనపై ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు. ఇదిలా ఉండగా.. అంతకుముందు మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేను టార్గెట్ చేసిన కునాల్ కమ్రా.. క్లబ్లో ఆయనపై సంచలన ఆరోపణలు చేశారు. షిండేను దోశద్రోహి అంటూ విమర్శిస్తూ పేరడి పాట పాడారు. దీంతో, శివసేన కార్యకర్తలు ఆగ్రహంతో క్లబ్పై దాడిపై చేశారు. అనంతరం, పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. The video has been blocked from YouTube by T-Series due to copyright.So before deleting the video from X, watch it yourself and share it with others to see it.#kunalkamra pic.twitter.com/pCZ67v6zmX— Dhruv Rathee (Parody) (@DhruvRatheeIN) March 26, 2025 -
సంతృప్తే సదానందం
బ్రహ్మాండమైన హాస్యనటుడు బ్రహ్మానందం. కానీ తనని మించిన హాస్య నటులు చాలామంది ఉన్నారని ఆయన అంటున్నారు. ఎలా అంటే..? ‘చుట్టూ ఉన్నవాళ్లని చూస్తూ... ఆనందపరుస్తూ... నవ్విస్తూ ఉండగలిగితే నీ అంతటి హాస్య నటుడు ఇంకొకడు లేడు’ అన్నారు బ్రహ్మానందం. సంతృప్తే సంతోషం అనే ఈ సదానందం ‘వరల్డ్ హ్యాసీనెస్ డే’ సందర్భంగా ‘సాక్షి’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పంచుకున్న విశేషాలు.→ ఆనందానికి మీరిచ్చే నిర్వచనం? ఆనందం అనేది ఓ అనుభూతి... ఓ భావోద్వేగం. నవ్వు కూడా ఓ అనుభూతి. కేవలం శబ్దం కాదు. ఇక ఆనందం ఒక్కొక్కరిది ఒక్కో రకంగా ఉంటుంది. నువ్వు చేసే పని ద్వారా నువ్వు ΄పొందే అనుభూతే ఆనందం. మన మనసుకి ఏదైతే ఆనందాన్నిస్తుందో అదే ఆనందానికి నిర్వచనం.→ ఒక మనిషి నవ్వుతూ ఉన్నాడంటే ఆనందంగా ఉన్నట్టేనా? ఉన్నట్టు కాదు. నవ్వు నిస్సహాయతలోనూ వస్తుంది. అలానే ఏడుస్తున్నాడంటే విపరీతమైన బాధలోనూ ఉన్నట్టు కాదు. మనం ఒక ట్రాజెడీ నాటకం చూస్తున్నప్పుడు ఏడుస్తుంటాం. కానీ అది మన వ్యక్తిగత బాధ కాదు. మనం చూస్తున్న దాని ద్వారా ΄పొందిన అనుభూతి. ‘వియ్ కెన్ గెట్ హ్యాపీనెస్ ఫ్రమ్ ట్రాజెడీనెస్ ఆల్సో’. ఇక మనిషి భావాలను బట్టి అతను బయటకు కనిపించేది... అతని లోపల జరిగేది ఒకటే అనుకోలేం.→ చిన్నప్పుడు మీరు ఆర్థికపరమైన, ఇంకా ఎన్నో ఒడిదొడుకులు చూశారు. సో... మీకు పరిపూర్ణమైన ఆనందం పరిచయమైనది ఎప్పుడు? నే¯ð ప్పుడూ ఆనందం ఇలా ఉంటుంది... దుఃఖం ఇలా ఉంటుందీ అనుకోలేదు. రెండింటినీ వేరువేరుగా చూడలేదు... తెలియదు కూడా. ఆర్థిక సమస్యలుంటే దుఃఖం, అవి లేకుంటే ఆనందం అనుకోలేదు. ఒక మహర్షిలా తలకిందులుగా తపస్సు చేసి, నేర్చుకున్నటువంటి జ్ఞానం కాదిది. స్వతహాగానే ఏర్పడింది. ఈ పూట భోజనం ఉండదే అని బాధపడిపోలేదు. బట్టలు సరిగ్గా లేవా... ఓకే అనుకునేవాణ్ణి. అమ్మ పెట్టిందే బాగుందనుకోవడం.... నాన్న ఇచ్చినవే బాగున్నాయనుకోవడం. ఆనందాన్ని, దుఃఖాన్ని విభజించడం రాకపోవడం నాకు అలవాటుగా మారిపోయింది. ప్రస్తుతానికి అన్నీ ఉన్నాయి. బావుంది. అలాగని బ్రహ్మానందపడిపోలేదు. అప్పటి ఆ దుఃఖం తెలియకపోవడంవల్లే ఇప్పటి ఈ ఆనందం కూడా మనసుకి ఎక్కలేదు అనుకుంటుంటా. అయినా ప్రతిదీ లోతుగా విశ్లేషించి చూడక్కర్లేదు. సౌకర్యం ఇచ్చేది ఆనందం అంటా. అలాగే అసౌకర్యం ఆనందం ఇవ్వనిది కాదు కానీ విషాదం అని మాత్రం అనను.→ స్థితప్రజ్ఞతతో ఉండటం అనేది మీకు చిన్నప్పుడే అలవాటైందనుకోవచ్చా? ఏమో... ఏది ఏమైనా జీవితం నేర్పినపాఠాలు కొన్ని ఉంటాయి. పేదరికమంటే నాకు విపరీతమైన ఇష్టం. అందుకే నేను పేదవాళ్లకి సహాయం చేసినా బయటకు చెప్పను... కానీ చేస్తూనే ఉంటా. ఇక పేదరికం అనేది మన దగ్గర ఏది లేదో దాన్ని సంపాదించడానికి కృషి చేసే అవకాశాన్ని కల్పిస్తుంది. నీ దగ్గర తిండి, డబ్బు, గౌరవం లేకపోతే వాటిని ఎలా సంపాదించుకోవాలా అని ఆలోచిస్తావు. అలా నీకు లేనిదాన్ని ΄పొందడానికి దారి చూపించే ఓ మంచి మార్గం పేదరికం. అందులో నుంచి ఎలా బయటకు రావాలనే తపన ఉండాలి తప్ప మనకు లేదు... వాడికి ఉంది అని పోల్చి చూసుకోవడాలు ఉండకూడదు. ఈ లేదూ... ఉంది అనే ఆలోచనల్లో కన్నీళ్లు తప్ప ఏమీ మిగలవు.→ పేరుకు తగ్గట్టు మీరు బ్రహ్మానందాన్ని పంచుతున్నారు... ‘నాకీ పేరు ఎందుకు పెట్టాలనిపించింది’ అని మీ తల్లిదండ్రులను ఎప్పుడైరా అడిగారా?ఇలా మన గురించి ఒకరు అనుకుంటే హ్యాపీగా ఉంటుందేమో. నేనెప్పుడూ వాళ్లని అడగలేదు. అడుగుదామనే స్థాయికి చేరుకునే సరికి వాళ్లు పెద్దవాళ్లై పోయారు. మేం ఎనిమిది మంది సంతానం. నేను ఏడోవాడిని. ఏదో పేరు పెట్టారు... అనుకున్నానంతే. ఇప్పుడీ స్థితికి వచ్చాక నా తల్లిదండ్రులు పెట్టిన పేరుకి జస్టిఫికేషన్ జరిగిందని అనుకుంటుంటాను.→ స్ట్రెస్లో ఉన్నప్పుడు కొందరు మీ కామెడీ సీన్లు చూసి, రిలీఫ్ అవుతుంటారు. మరి... మీ స్ట్రెస్ బస్టర్? నేనెప్పుడూ ఆనందంగా ఉంటాను. నా ఫిలాసఫీ చె΄్పాను కదా. బాధ, ఆనందం వేరు వేరు అనుకోను. కెరటం ఎగిసినప్పుడు విజయం అని, కిందపడినప్పుడు అపజయం అనీ అనుకుంటాం. కానీ అవి రెండూ ఒకటే. అలాగే ఆనందం, బాధ కూడా. గతంలో ఇదే ప్రశ్న అడిగి ఉండుంటే, మంచి భోజనం తింటే ఆనందం అనేవాణ్ణేమో. కానీ ఇప్పుడు ఈ 70 ఏళ్ల వయసులో తినే ఓపిక, తిన్నా అరిగించుకునే ఓపిక రెండూ లేవు. ‘ఏంటోనండీ ఓ ముద్ద తినలేకపోతున్నాం’ అనుకోవాలి. దీన్ని మళ్లీ బాధ అంటున్నాం. ఇది కూడా బాధ కాదు. ఆనందం, బాధ... ఈ రెండూ మన ఆలోచనా విధానం మీదే ఆధారపడి ఉంటాయి.→ మీ లైఫ్లో డల్ మూమెంట్స్ ఉంటాయా? సూర్యుడే డల్ అయిపోతాడు సాయంత్రానికి. మనమెంత? ఇదంతా ఓ నిరంతర ప్రక్రియ. అయితే కోరి డల్నెస్ తెచ్చుకోవడం వేరు... రావడం వేరు. సాగుతున్నప్పుడు డల్నెస్ అదే వస్తుంది. ఎలాగంటే ఇప్పుడు నాకు నాలుగు గంటలకల్లా కాఫీ ఇవ్వాలనుకోండి... ఓ రెండు నిమిషాలు లేట్ అయిందంటే... ఏంటో ఇవ్వడానికి ఆలస్యం చేస్తున్నారని డల్ అయిపోవచ్చు... ఏముందీ కాస్త లేట్ అయిందని కూల్గానూ ఉండొచ్చు. సో... డల్నెస్ అనేది సాగనప్పుడు రాదు. జీవితం అనేది మన చేతిలో స్టీరింగ్ లాంటిది. ఎటు తిప్పుతున్నామనేది మన చేతుల్లోనే ఉంటుంది.→ ఇప్పుడు యువత చిన్న చిన్న విషయాలకే విపరీతంగా బాధపడిపోతున్న ధోరణి కనబడుతోంది... వాళ్లకి ఏం చెబుతారు? ఇప్పుడు యువత ఆనందంగా లేరని చెప్పలేం. అయితే ఇప్పుడు యూత్లో ఎక్కువమంది కష్టపడకుండా ఎలాగైనా డబ్బులు సంపాదించుకోవాలనే దాని మీద దృష్టి పెడుతున్నట్లున్నారు. అలా కాకుండా కష్టపడి పని చేసి, సక్సెస్ సాధించాలి. వేరే ఇతర మార్గాల వైపు... అంటే సులువైన మార్గాల్లో వెళ్లి సంపాదించుకుంటే, కష్టపడి సాధించేదాంట్లో దొరికే తృప్తి దొరకదు. ఇలాంటివన్నీ సాధ్యమైనంత వరకూ చెప్పే ప్రయత్నం చేయాలి. మన హిందూ ధర్మం గొప్పదనం ఏంటంటే... ఎదుటివారిని బాధించకుండా ఉండటం. ఎవరి అభిప్రాయం వారిది అని గౌరవించడం. → ప్రస్తుతం దాదాపు అందరి జీవితం ఒత్తిడి అయిపోయిన ఫీలింగ్...ఒత్తిడి లేకుండా ఎప్పుడుంది? పూర్వం కూడా ఒత్తిడి జీవితమే. ఇప్పుడు ఉరుకుల పరుగుల జీవితం అంటున్నాం. మరి... జనాభా పెరిగిపోయారు కదా. సమస్యలు పెరిగాయి. భక్తి పెరిగింది. అన్ని రకాలుగా పెరుగుదలలు ఉన్నప్పుడు ఒత్తిడి కూడా వస్తుంది. అలాగే ఒత్తిడి సహజంగా రావడం... లేదా మనం తెచ్చుకుంటే రావడం... రెండు రకాలుగానూ వస్తుంది.ప్రస్తుతం నెగటివిటీ వైపే చాలామంది ఆకర్షితులవుతున్నారు... ఈ పరిస్థితి గురించి?ప్రస్తుతం ఏ మనిషికైనా రెండే పద్ధతులు పని చేస్తాయి. నచ్చింది తీసుకోవడం.... నచ్చనిది పట్టించుకోకపోవడం.పాజిటివ్గా ఉండాలంటే నెగటివ్వైపు వెళ్లకుండా ఉండటమే. పోనీ వెళ్లడంలోనే ఆనందం ఉందీ అనుకుంటే... అది వారి ఆలోచనా విధానం. ఎక్కడైనా ఫలానాది జరిగింది అంటూ ఓ నెగటివ్ హెడ్లైన్ చదివితే... ఏం జరిగిందో తెలుసుకోవాలనే కుతూహలం. తీరా అసలు విషయంలో ఏమీ ఉండదు. సో... నెగటివిటీకి ఎట్రాక్ట్ అవుతున్నారు. అందుకే పెరిగిపోతోంది. ఈ పెరుగుదలకు కూడా కారణం మనమే. అందుకే పాజిటివిటీని పెంచడానికి ప్రయత్నించడం మంచిది.– డి.జి. భవానిఫొటోలు: ఎస్.ఎస్. ఠాకూర్ -
చందాలు వసూలు చేసి కూతురి పెళ్లి చేశా.. జబర్దస్త్ కమెడియన్ ఎమోషనల్
'ఇల్లు కట్టి చూడు- పెళ్లి చేసి చూడు' అన్న సామెత ఊరికే రాలేదు. ఈ రెండింటిలో ఏది చేయాలన్నా ఖర్చుతో కూడుకున్న పనే! ఎంత మామూలుగా పూర్తి చేయాలనుకున్నా జేబు ఖాళీ అవక తప్పదు. అయితే తను కమెడియన్గా ఇండస్ట్రీలో అడుగుపెట్టకముందే కూతురి పెళ్లి చేయాల్సి వచ్చిందని, అప్పుడు నానా కష్టాలు పడ్డానంటున్నాడు కమెడియన్ రైజింగ్ రాజు (Raising Raju).చందా వసూలు చేసి..తాజాగా ఓ షోలో రాజు మాట్లాడుతూ.. బుల్లితెర కామెడీ షోలో పాల్గొనడానికంటే ముందు నా కూతురు పెళ్లి చేశాను. చందాలు వసూలు చేసి ఆ పెళ్లి చేయాల్సి వచ్చింది. రాకెట్ రాఘవ, తాగుబోతు రమేశ్, ధనరాజ్ వంటివారు చెరో రూ.5 వేలు ఇచ్చారు. అలాంటి పరిస్థితిలో నా కూతురి పెళ్లి చేశాను అని ఎమోషనలయ్యాడు. రైజింగ్ రాజు అసలు పేరు రాజమహేంద్రవరపు రాజేశ్వరరావు. స్కూల్లో పేరు రాయడానికి ఇబ్బందవుతోని అతడి టీచర్ రాజమహేంద్రవరపు రాజు అని మార్చేసింది. కుటుంబ విషయాలు..తూర్పుగోదావరి జిల్లాలోని రామచంద్రాపురంలో జన్మించాడు. తండ్రి పేరయ్య రైతు. అయితే రాజుకు తోడుగా ఇద్దరన్నదమ్ములు, ఐదుగురు అక్కాచెల్లెళ్లు ఉన్నారు. ఏడో తరగతికే చదువు ఆపేశాడు. పెయింటింగ్ వంటి పనుల్లో చేరాడు. 1979లో చెన్నైకి వెళ్లి ఆఫీస్ బాయ్గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా పని చేశాడు. ప్రస్తుతం బుల్లితెర కామెడీ షోలో రాణిస్తున్నాడు.చదవండి: 25 ఏళ్లుగా ఇండస్ట్రీలో.. పేరు వచ్చినా అవకాశాలు రావడం లేదు: నటుడు -
దేవుడిపై ఒట్టేశా.. 23 ఏళ్లుగా దాని జోలికి వెళ్లలేదు: సప్తగిరి
సప్తగిరి (Sapthagiri) హీరోగా నటిస్తూ, నిర్మించిన చిత్రం పెళ్లి కాని ప్రసాద్ (Pelli Kani Prasad Movie). ఈ మూవీ మార్చి 21న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో సప్తగిరి మాట్లాడుతూ.. డైరెక్టర్ అవుదామని ఇండస్ట్రీకి వచ్చాను. అసిస్టెంట్ డైరెక్టర్గా, కమెడియన్గా, హీరోగా, నిర్మాతగా పని చేస్తున్నాను. అయితే ఇప్పటికీ నన్ను విమర్శిస్తూనే ఉంటారు. నువ్వు కమెడియన్గా పని చేసుకోక హీరోగా చేయడమేంటి? హీరోగా చేయడం వల్లే కామెడీ పాత్రలు తగ్గాయి అని కామెంట్లు చేస్తూనే ఉంటారు. నేనేంటో నాకు తెలుసు. అవతలివారిని తృప్తి పరిచేందుకు నేను బతకట్లేదు.నేను చేసినవాటిలో 'ప్రేమకథా చిత్రం' నాకెంతో ఇష్టం. హీరోగా 'సప్తగిరి ఎల్ఎల్బీ' ఇష్టం. పర్సనల్ విషయానికి వస్తే.. నాన్న అటవీశాఖ ఉద్యోగి.. ఇప్పుడు రిటైర్ అయిపోయాడు. అమ్మ గృహిణి. తిరుపతిలో సెటిలయ్యారు. హైదరాబాద్లో ఓ ఇల్లు కొనుక్కున్నాను. 23 ఏళ్ల క్రితం మాంసం తినడం ఆపేస్తానని వెంకటేశ్వరస్వామి మీద ఒట్టేశాను. అప్పటినుంచి ఇప్పటివరకు ఏనాడూ నాన్వెజ్ తినలేదు. లవ్ అంటేనే అసహ్యం. కానీ మంచి అమ్మాయి దొరికినప్పుడు పెళ్లి చేసుకుంటాను అని సప్తగిరి చెప్పుకొచ్చాడు.చదవండి: శోభిత మొదట ప్రేమించింది నాగచైతన్యను కాదు.. ఎవర్నో తెలుసా? -
'ఈ జన్మలో నీ రుణం తీర్చుకోలేను'.. టాలీవుడ్ కమెడియన్ ఎమోషనల్ పోస్ట్
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో రచ్చ రవి అందరికీ సుపరిచితమే. బుల్లితెర కామెడీ షో జబర్దస్త్ ద్వారా పరిశ్రమలోకి అడుగు పెట్టాడు. తనదైన కామెడీ, పంచ్ డైలాగ్స్తో కమెడియన్గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇటీవలే బాపు సినిమాలో రచ్చరవి నటించారు. ఈ చిత్రంలో కీలక పాత్రలో కనిపించారు. నటుడిగా తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. టాలీవుడ్లో దాదాపు అందరు స్టార్ హీరోల సినిమాల్లో నటించారు.తాజాగా రచ్చ రవి సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ వైరల్గా మారింది. ఇవాళ తన పెళ్లి రోజు కావడంతో భార్యకు ప్రత్యేకంగా విషెస్ తెలిపారు. తన పెళ్లి ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ తన ప్రేమను వ్యక్తం చేశారు. నా ప్రపంచానికి చిరుదివ్యల వెలుగును పంచుతూ నా జీవన ప్రయాణంలో తోడుగా నిలిచిన తన భార్య స్వాతిని ప్రశంసిస్తూ ఎమోషనల్ నోట్ రాసుకొచ్చారు. ఇది చూసిన రచ్చ రవి అభిమానులు తమ అభిమాన నటుడికి పెళ్లి రోజు శుభాకాంక్షలు చెబుతూ పోస్టులు పెడుతున్నారు.రచ్చ రవి తన ఇన్స్టాలో రాస్తూ..' నిన్ను పరిచయం చేసిన నీ... నా... తల్లిదండ్రుల రుణం తీరదు. నా జీవన ప్రయాణంలో నీ పూర్తి సహాయ సహకారం అందిస్తున్న నాకు తృప్తి ఉండదు. ఎన్ని ఆశలు.. కోరికలు.. ఇష్టాలు.. ఉన్నాయో నీకు వాటిని నేను తీర్చగలనో లేదో అని ఎన్నడు నేను అడగలేదు..నువ్వు చెప్పలేదు. నా ప్రపంచానికి చిరుదివ్యల వెలుగును పంచుతూ నా జీవన ప్రయాణానికి వసంతాలు పూయిస్తూ కష్టాలను భరిస్తూ దుఃఖాలను దిగమింగుకుంటూ... కాంప్రమైజ్ అవుతూ లైఫ్లో నన్ను సక్సెస్ చేయిస్తూ.... ఇదే జీవితంలో నీ ఇష్టాలు కోరికలు ఆశలను తీర్చాలని... అంత శక్తి నాకు భగవంతుడు ఇవ్వాలని.. నా నిస్వార్థ కోరిక అర్థం చేసుకొని ఇస్తాడని.... నీ రుణం కూడా తీరదని తెలిసి కూడా కనీసం వడ్డీగానైనా ప్రేమిస్తానని ప్రేమగా చూసుకుంటానని...నా సహచరికి పెళ్లిరోజు శుభాకాంక్షలు.. ఐ లవ్ యు స్వాతి..' అంటూ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. View this post on Instagram A post shared by Ravi Racha (@meracharavi) -
'మిస్ యూ మై సన్'.. ప్రముఖ టాలీవుడ్ కమెడియన్ తీవ్ర భావోద్వేగం!
ప్రముఖ తెలుగు లేడీ కమెడియన్, కితకితలు హీరోయిన్ గీతాసింగ్ కుమారుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ ఘటనతో గీతా సింగ్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. సరిగ్గా రెండేళ్ల క్రితం చేతికి అందివచ్చిన కుమారుడిని కోల్పోయిన గీతాసింగ్ తీవ్ర భావోద్వేగానికి గురైంది. ఫిబ్రవరి 18న తన కుమారుడి వర్ధంతి సందర్భంగా నివాళులర్పించింది. తన కొడుకు తనతో ఉన్న క్షణాలను గుర్తు చేసుకుంటూ.. మిస్ యూ రా అంటూ సోషల్ మీడియాలో ఓ వీడియోను పోస్ట్ చేసింది. (ఇది చదవండి: కమెడియన్ గీతాసింగ్ ఇంట విషాదం)అయితే.. గీతాసింగ్ ఇప్పటివరకు అసలు పెళ్లే చేసుకోలేదు. తన సోదరుడి కుమారులను దత్తత తీసుకుని పోషిస్తున్నారు. వారిలో పెద్దబ్బాయి ఈ రోడ్డు ప్రమాదంలో మరణించాడు. ఇకపోతే కితకితలు, ఎవడిగోల వాడిది సినిమాలో గీతా సింగ్ మంచి గుర్తింపు తెచ్చుకుంది. కమెడియన్గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా దాదాపు 50కి పైగా చిత్రాలు చేసింది. ప్రస్తుతం మాత్రం సినిమాలకు దూరంగా ఉంటోంది. View this post on Instagram A post shared by Geeta Singh (@kithakithalu_geetasingh) -
అంపశయ్యపై MS నారాయణ.. చివరి క్షణాల్లో ఏం జరిగిందంటే?: బ్రహ్మానందం
కమెడియన్స్ చేసే కామెడీకి కడుపుబ్బా నవ్వుకుంటాం. అయితే కొందరు హాస్యనటులు సినిమా తర్వాత కూడా మనల్ని వెంటాడుతూ ఉంటారు. వారి డైలాగులు, అవాక్కులు-చవాక్కులు, హావభావాలు గుర్తు చేసుకుని మనలో మనం కాసేపు నవ్వుకుంటూ ఉంటాం. అలా తెలుగువారి మనసులో చెరగని ముద్ర వేసుకున్న లెజెండరీ హాస్యనటుల్లో ఎమ్మెస్ నారాయణ (MS Narayana) ఒకరు. ఈయనకు హాస్య బ్రహ్మ, మీమ్ గాడ్ బ్రహ్మానందానికి మధ్య ఆత్మీయ అనుబంధం ఉంది.చివరి స్టేజీలో నాకోసం పరితపించాడుతాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న బ్రహ్మానందం (Brahmanandam).. ఎమ్మెస్ నారాయణతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. బ్రహ్మానందం మాట్లాడుతూ.. ఎమ్మెస్ నారాయణ మంచానపడి అంతిమ ఘడియలకు దగ్గరవుతున్నప్పుడు ఆయన మెదడులో ఎన్నో ఆలోచనలు తిరుగుతూ ఉంటాయి. తనకు ఎంతోమంది తెలుసు. రక్తసంబంధాలు, స్నేహసంబంధాలు ఎన్నో ఉన్నాయి. అయినా సరే చివరి స్టేజీలో ఉన్నప్పుడు నన్ను చూడాలనుకున్నాడు. నన్నెలాగైనా కలుసుకోవాలనుకున్నాడు.చెప్పాపెట్టకుండా వెళ్లిపోయా..మాట్లాడలేని స్థితిలో ఉన్న నారాయణ.. అతడి కూతుర్ని పిలిచి తెల్లకాగితం అడిగాడు. దానిపై బ్రహ్మానందం అన్నయ్యను చూడాలనుంది అని రాశాడు. అది చదివిన అమ్మాయి నాకు వెంటనే ఫోన్ చేసింది. అప్పుడు నేను గోపీచంద్ 'ఆరడుగుల బుల్లెట్' సినిమా షూటింగ్లో ఉన్నాను. శంషాబాద్లో షూటింగ్.. సడన్గా నేను వెళ్లాలి అని చెప్తే దర్శకుడు ఒప్పుకోకపోతే? ఎలా అన్న సంకోచం.. అందుకే ఎవరికి చెప్పకుండా నేరుగా కారెక్కి వెళ్లిపోయాను.అదే ఆఖరి రోజునన్ను చూడగానే అంపశయ్యపై పడుకున్న ఎమ్మెస్ నారాయణ కళ్ల వెంట నీళ్లు కారాయి. అది ఎన్నటికీ మర్చిపోలేను. నన్ను చూసి నా చేయి గట్టిగా పట్టుకుని వదిలేశాడు. అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. కాసేపటికి మళ్లీ కళ్లు తెరిచాడు. డబ్బు గురించి ఆలోచించొద్దని, ఎంతైనా పర్వాలేదు, నా మిత్రుడిని బతికించండని డాక్టర్స్ను కోరాను. ఇప్పటికీ మింగుడుపడదుషూటింగ్ మధ్యలో వచ్చేశానని, మళ్లీ వీలు చూసుకుని వస్తానని అక్కడి నుంచి సెలవు తీసుకున్నాను. తిరిగి షూటింగ్కు వెళ్తుండగా మార్గమధ్యలోనే ఆయన మరణించారన్న వార్త వచ్చింది. అంతటి మేధావి తక్కువ వయసులో మమ్మల్ని వదిలి వెళ్లిపోవడం నాకిప్పటికీ మింగుడుపడదు అని బ్రహ్మానందం చెప్పుకొచ్చారు. ఎమ్మెస్ నారాయణ (63).. 2015 జనవరి 23న అనారోగ్యంతో మరణించారు.చదవండి: 'ఛావా' ట్విటర్ రివ్యూ.. టాక్ ఎలా ఉందంటే? -
పెళ్లి సమయంలో భారీగా ట్రోల్స్.. ఇప్పుడు గుడ్న్యూస్తో సీరియల్ నటి
జైలర్ నటుడు, కమెడియన్ రెడిన్ కింగ్స్లీ లేటు వయసులో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. 46 ఏళ్ల వయసులో సీరియల్ నటి సంగీతను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. 2023 డిసెంబర్ 10న బెంగళూరులో ఇరు కుటుంబాలు, అత్యంత దగ్గరి బంధుమిత్రుల సమక్షంలో వీరి వివాహం జరిగింది. అయితే, ఈ జంట ఇప్పుడు గుడ్న్యూస్ చెప్పింది. తాము తల్లిదండ్రులు కాబోతున్నట్లు ప్రకటించింది. వారి వివాహం తర్వాత అంత పెద్ద వయసులో ఉన్నవాడిని సంగీత పెళ్లి చేసుకోవడానికి కారణం డబ్బేనని చాలామంది విమర్శించారు. కానీ, సంగీతకు కూడా ఇదేమీ ఫస్ట్ మ్యారేజ్ కాదంటూ మరికొందరు కామెంట్లు చేశారు.కొంతకాలంగా ప్రేమలో ఉన్న వారిద్దరూ.. ఒకరోజు సడన్గా పెళ్లి చేసుకుని అందరినీ సర్ప్రైజ్ చేశారు. అయితే, ఇప్పుడు కూడా అదేవిధంగా ఈ గుడ్న్యూస్ చెప్పారు. సంగీత సీమంతం వేడుక జరిగే వరకు ఎక్కడా కూడా ఈ విషయాన్ని వారు తెలుపలేదు. ఇలా సడెన్గా తాము తల్లిదండ్రులం కాబోతున్నామని చెప్పడంతో నెటిజన్లు శుభాకాంక్షలు చెబుతున్నారు. Toకాగా రెడిన్ కింగ్స్లీ.. కోలమావు కోకిల అనే తమిళ చిత్రంతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమాకు నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించాడు. నెల్సన్ డైరెక్ట్ చేసిన అన్ని సినిమాల్లోనూ రెడిన్ యాక్ట్ చేశాడు. డాక్టర్ మూవీలో ఈయన పోషించిన భగత్ పాత్ర అతడికి మంచి గుర్తింపు తీసుకొచ్చింది. బీస్ట్, మార్క్ ఆంటోని, మట్టి కుస్తీ, జైలర్ వంటి పలు సినిమాలు చేశాడు. సంగీత విషయానికి వస్తే అరన్మనైక్కిలి, తిరుమల్ వంటి సినిమాలు చేసింది. ఎక్కువగా సీరియల్స్లో నటించి గుర్తింపు పొందింది.సంగీతకు రెండో పెళ్లిగతంలో ఆమె క్రిష్ను పెళ్లాడగా వీరికి ఒక పాప కూడా ఉంది. వ్యక్తిగత కారణాల వల్ల వీరు విడాకులు తీసుకున్నారు. అనంతరం సంగీత రెడిన్తో ప్రేమలో పడగా ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. వారి పెళ్లిపై ఆ సమయంలో భారీగానే ట్రోల్స్ వచ్చాయి. ఈ వయసులో పెళ్లి అవసరమా..? అంటూ చాలామంది విమర్శించారు. వాటికి సమాధానంగా సంగీత ఇలా చెప్పింది. 'మానసికంగా నా వయసు 18, తన వయసు 22! మేము ఆ ఏజ్లోనే ఉన్నట్లు ఫీలవుతున్నాం. అది మీకు చెప్పినా అర్థం కాదు. ఇంకేమన్నారు.. డబ్బు కోసం పెళ్లి చేసుకున్నానా? అదెలాగో కాస్త వివరించి చెప్తారా? మీ వల్ల కాదు! అతడిలో నాకు నచ్చింది సింప్లిసిటీ! చాలా నిరాడంబరంగా ఉంటాడు. అది చూసే తనను పెళ్లి చేసుకున్నాను' అని పేర్కొంది. View this post on Instagram A post shared by Archana Saravanan (@archana_makeover_hair) -
టాలీవుడ్ కమెడియన్ అలీ పెళ్లి వేడుక.. సెలబ్రేషన్స్ చూశారా!
టాలీవుడ్ కమెడియన్ నటుడు అలీ గురించి పరిచయం అక్కర్లేదు. ఎంతోమంది స్టార్ హీరోల సినిమాల్లో తన కామెడీతో అభిమానులను ఎంటర్టైన్ చేశారు. తెలుగులో స్టార్ కమెడియన్గా ఎదిగారు. హీరోగా, హీరో స్నేహితుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, కమెడియన్గా విభిన్న పాత్రలతో టాలీవుడ్ ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారు. ఇప్పటికీ తెలుగు సినిమాలు చేస్తూ ఫ్యాన్స్ను ఎంటర్టైన్ చేస్తున్నారు. చైల్డ్ ఆర్టిస్ట్గా కెరీర్ ప్రారంభించిన ఆయన.. సీతాకోకచిలుక చిత్రం ద్వారా హీరోగా మారారు. ఇప్పటివరకు వెయ్యికి పైగానే చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు.జుబేదాను పెళ్లాడిన అలీ..అయితే జుబేదాను పెళ్లాడిన అలీకి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. 2022 డిసెంబర్లో పెద్దకూతురు ఫాతిమా పెళ్లిని గ్రాండ్గా చేశారు. ఈ పెళ్లికి టాలీవుడ్ స్టార్స్తో పాటు రాజకీయ ప్రముఖులు కూడా హాజరయ్యారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో అప్పట్లో తెగ వైరలయ్యాయి. అయితే తాజాగా అలీ సైతం మరోసారి పెళ్లి చేసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. ఇంతకీ అదేంటో మనం కూడా చూసేద్దాం.గ్రాండ్గా అలీ పెళ్లి వేడుక..ఇటీవల తన పెళ్లి రోజును ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు అలీ దంపతులు. కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో మరోసారి వివాహా వేడుక జరుపుకున్నారు. తమ ఇద్దరు కూతుర్ల సమక్షంలో ఈ పెళ్లి వేడుకను సంతోషంగా సెలబ్రేట్ చేసుకున్నారు. దీనికి సంబంధించిన పెళ్లి వీడియో జుబేదా అలీ యూట్యూబ్ ఛానెల్లో పోస్ట్ చేసింది. వారి సంప్రదాయం ప్రకారం నిఖా చేసుకోవడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. -
యుద్ధ గాయాలకు ఉపశమనం
2023 అక్టోబరు 14. ఉక్రెయిన్ రాజధాని కీవ్లోని అత్యంత ప్రతిష్టాత్మక రాజప్రాసాదం ఓ అసాధారణ షోకు వేదికైంది. అది స్టాండప్ కామెడీ. ప్రఖ్యాత కమేడియన్ ఆంటోన్ టైమోషేంకో సోలో ప్రదర్శన ఇచ్చారు. ఆ ఘనత సాధించిన తొలి ఉక్రేనియన్గా నిలిచారు. దాదాపు మూడేళ్లుగా యుద్ధ విషాదంలో మునిగి తేలుతున్న ఉక్రెయిన్కు స్టాండప్ కామెడీ ఇప్పుడు తాత్కాలిక ఉపశమనంగా మారింది. ఒకప్పుడు విలాసవంతమైనవిగా గుర్తింపు పొందిన షోలు ఇప్పుడు ఉక్రెయిన్ సంస్కృతిలో భాగమయ్యాయి. స్టాండప్ కామెడీని సైకోథెరపీ బడ్జెట్ వర్షన్గా అభివర్ణిస్తున్నారు టైమోషేంకో . యుద్ధ సమయంలో కామెడీ చేయడం నిజానికి అంత్యక్రియల్లో జోక్ వేయడం వంటిదే. అయినా దేశ ప్రజల ముఖాల్లో మాయమైన నవ్వును తిరిగి తెచ్చేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు స్టాండప్ కమెడియన్లు. షెల్టర్ హోమ్స్లో, సాయుధ దళాల కోసం, ఔట్డోర్ స్టేజీలపై... ఇలా వీలైన చోటల్లా ప్రదర్శనలు ఇస్తున్నారు. రష్యా క్షిపణులు ఉక్రెయిన్ నగరాల్లోకి దూసుకొస్తున్నా ప్రజలను నవ్వించడానికి ప్రయత్నిస్తున్న స్టాండప్ కామిక్స్లో 30 ఏళ్ల టైమోషెంకో ఒకరు. క్లిష్ట సమయాలను అధిగమించడానికి, సమాజ భావనను నిర్మించడానికి, మనోధైర్యాన్ని పెంచడానికి ఈ హాస్యం ఉత్తమమైన మార్గం అంటున్నారాయన. గాయాలను గుర్తు చేయకుండా భయంకర ఘర్షణ వాతావరణంలో హాస్యం నవ్వించగలుగుతుందా? అంటే అవునంటున్నారు కమెడియన్లు. ప్రమాదాన్ని ఎగతాళి చేయడం వల్ల దాన్ని ఎదుర్కోగల శక్తి వస్తుందంటారు కమెడియన్ హన్నా కొచెహురా. యుద్ధ సమయంలో వేసే జోక్స్ సహజంగానే యుద్ధానికి సంబంధించినవే ఉంటాయి. ఫ్రాంక్ జానర్లాగా ఉండే స్టాండప్ కామెడీలో కమెడియన్లు తమ సొంత అనుభవాలు, ఆలోచనల్లోంచే మాట్లాడతారు. యుద్ధ సమయంలో జోక్స్ ఐడియాలు ఎక్కడి నుంచి వస్తాయని అడిగితే, ఆకాశంలో రష్యా క్షిపణులను చూడగానే వాటంతటవే పుట్టకొస్తాయంటూ వ్యంగంగా బదులిస్తారు ఆంటోన్. పట్నంలో ఉన్న కొడుకుతో గ్రామంలో ఉంటున్న అమ్మ ఫోన్లో మాట్లాడుతూ, ‘బాబూ! ఈ రోజు మన ఇంటిపై నుంచి ఎన్ని రాకెట్లు వెళ్లాయో తెలుసా?’అంటూ బెదిరిపోతుంటుంది. ‘‘భయపడకులేమ్మా! అవన్నీ పట్నంలో ఉన్న నా వైపుకే వచ్చాయి’’అంటూ భయాన్ని పోగొడుతుంటాడు కొడుకు. ఇలా ఉంటుంది వారి కామెడీ. అయితే యుద్ధంపై జోక్ చేయడం కత్తిమీద సాము. ఆ క్రమంలో గాయాలను మళ్లీ రేపకుండా ఉండేందుకు అన్ని జాగ్రత్తలూ తీసుకుంటారు వీళ్లు. విచారంగా, విషాదంగా అనిపించే విషయాలను కామెడీ చేయరు. సైన్యానికి సాయంగా.. ఉక్రెయిన్లో స్టాండప్ కామెడీకి మరో కోణమూ ఉంది. అది సైన్యానికి సాయం. యూరప్, ఉత్తర అమెరికా, ఆ్రస్టేలియాల్లోనూ వీళ్లు ప్రదర్శనలిస్తున్నారు. వచ్చిన డబ్బును సాయుధ దళాలకు సాయంగా ఇస్తున్నారు. ‘‘యుద్ధ సమయంలో ప్రతిదీ సైన్యానికి ఆచరణాత్మకంగా ఉపయోగపడాలి. దూసుకొస్తున్న క్షిపణుల మధ్య కళ గురించి మాత్రమే మాట్లాడటం మతిలేనితనం. కానీ నాకు తెలిసిన ఏకైక మార్గం కామెడీ. ఆ షోల ద్వారా నిధులు సేకరిస్తున్నా. ఇప్పటిదాకా రకూ రూ.6 కోట్లకు పైగా విరాళాలిచ్చా’’అని టైమోషేంకో చెప్పారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
బాలీవుడ్ సెలబ్రిటీలకు వరుస బెదిరింపులు
బాలీవుడ్ సెలబ్రిటీలకు కంటి మీద కునుకు లేకుండా పోతోంది. సల్మాన్ ఖాన్ (Salman Khan)కు బెదిరింపులు, సైఫ్ అలీఖాన్పై దాడి ఘటనలతో చిత్రపరిశ్రమలో ఆందోళన వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో ప్రముఖ కమెడియన్ కపిల్ శర్మ (Kapil Sharma)కు చంపుతామని బెదిరింపులు వస్తున్నాయి. దీంతో ఆయన పోలీసులను ఆశ్రయించాడు. పాకిస్తాన్ నుంచి తనకు బెదిరింపులు వస్తున్నాయని ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు ముంబైలోని అంబోలి పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ మొదలుపెట్టారు.రిప్లై రాలేదంటే తీవ్ర పరిణామాలుఈమెయిల్లో ఏముందంటే..? నువ్వేం చేస్తున్నావో ప్రతీది గమనిస్తున్నాం. ఓ సున్నిత విషయాన్ని నీ దృష్టికి తీసుకురావడం అత్యంత ఆవశ్యకమని భావిస్తున్నాం. ఇదేం పబ్లిసిటీ స్టంట్ కాదు, అలా అని నిన్ను వేధించడమూ లేదు. ఈ మెసేజ్ను సీరియస్గా తీసుకోవాలని, అలాగే దీన్ని సీక్రెట్గా ఉంచాలని కోరుతున్నాం.. ఇట్లు బిష్ణు అని రాసుంది. అంతేకాకుండా ఎనిమిది గంటల్లో ఈ మెసేజ్కు రిప్లై ఇవ్వాలని లేదంటే వ్యక్తిగతంగా, వృత్తిపరంగా తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని బెదిరించారు.వరుసగా బెదిరింపులుకపిల్ కంటే ముందు సుగంధ మిశ్ర, రెమో డి సౌజ, రాజ్పాల్ యాదవ్కు సైతం ఇటువంటి మెయిల్సే వచ్చాయి. సల్మాన్ ఖాన్ స్పాన్సర్ చేస్తున్న షోలో భాగమైన కపిల్ శర్మను, అతడి టీమ్ మొత్తాన్ని చంపేస్తామని బెదిరించారు. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సెలబ్రిటీలను టార్గెట్ చేస్తున్నదెవరు? అందుకు గల కారణాలేంటన్నదానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇకపోతే గత వారం సైఫ్ అలీఖాన్ ఇంట్లో అతడిపై దాడి జరిగింది. ఓ దుండగుడు సైఫ్ను ఆరుసార్లు కత్తితో పొడిచి పారిపోయాడు. ఆటోలో ఆస్పత్రికి వెళ్లిన నటుడికి వైద్యులు సర్జరీ చేశారు. తన శరీరంలో నుంచి 2.5 అంగుళాల కత్తి మొననను తీసేశారు.చదవండి: నా పదేళ్ల కెరీర్లో సుబ్బు నా ఫేవరెట్ : అనుపమా పరమేశ్వరన్ -
అవకాశాలు లేక కాదు, రాక కాదు.. అందుకే సినిమాలు తగ్గించా!
తెలుగు దిగ్గజ కమెడియన్ బ్రహ్మానందం (Brahmanandam) కొన్నేళ్లుగా సినిమాలు తగ్గించేశాడు. ఒకప్పుడు జెట్ స్పీడ్లో చిత్రాలు చేసిన ఆయన ఈ మధ్య మాత్రం మూవీస్పై అంతగా ఆసక్తి చూపించడం లేదు. ఏదో అడపాదడపా చిత్రాలు చేస్తున్నాడు. ఈ క్రమంలోనే తన కుమారుడు గౌతమ్తో కలిసి బ్రహ్మ ఆనందం అనే సినిమా చేశాడు.సినిమాలు ఎందుకు తగ్గించేశానంటే?గురువారం జరిగిన బ్రహ్మ ఆనందం టీజర్ లాంచ్ ఈవెంట్ (Brahma Anandam Teaser Launch Event)లో సినిమాలు తగ్గించడానికి గల కారణాన్ని హాస్య బ్రహ్మ బయటపెట్టాడు. బ్రహ్మానందం మాట్లాడుతూ.. నాకు మంచి ఇమేజ్ ఉంది. దాన్ని నేను జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఈయన కామెడీ అప్పట్లో బాగుండేది.. ఈ మధ్య కామెడీ చేస్తున్నాడు కానీ నవ్వు రావట్లేదు అన్న మాట కొందరు కమెడియన్ల దగ్గర విన్నాను. అది నాకొద్దు. ఎంత చేసినా ఇంకా ఏదో వెతుకుతూ ఉంటారు.నాకు తెలుసుఅలాగే నా వయసేంటో నాకు తెలుసు. వయసు పెరుగుతోందని అర్థం చేసుకోకుండా నేనింకా యంగ్ అంటే కుదరదు. ఇంతకుముందు చేసినంత యాక్టివ్గా నేను చేయలేకపోతున్నాను. నేను చేసిన పాత్రలే మళ్లీ ఆఫర్ చేస్తున్నారు, చేసిన కామెడీనే మళ్లీ చేయించాలని ప్రయత్నిస్తున్నారు.. నన్ను ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాలంటే ఇలాంటివి రిపీట్ కాకుండా చూసుకోవాలి. అందుకే సినిమాలు తగ్గించేయాలని నాకు నేనుగా నిర్ణయం తీసుకున్నాను. సినిమాల్లో వేషాలు లేక కాదు, నాకు ఇవ్వక కాదు, నేను చేయలేకా కాదు! ఎంతజాగ్రత్తగా చేసినా దొరికిపోతాం. చేసిన కామెడీ చేస్తున్నాడన్న ఇమేజ్ వద్దనే సినిమాలు తగ్గించాను. ఇండస్ట్రీలో నా వారసత్వాన్ని వెన్నెల కిషోర్ కొనసాగిస్తాడు అని చెప్పాడు.ఆనందో బ్రహ్మ ఎలా ఒప్పుకున్నానంటే?డైరెక్టర్ నిఖిల్.. నా పేరుపైనే ఒక సినిమా రాసుకున్నానని, మీరు ఒప్పుకుంటే సినిమా చేస్తానన్నాడు. నాతో ఒక్క షాట్ అయినా డైరెక్ట్ చేయాలని తన కోరిక అని లేదంటే ఈ సినిమా పక్కనపెట్టేస్తానన్నాడు. అప్పటివరకు పోజు కొడదామనుకున్నాను కానీ నేను ఒప్పుకుంటేనే సినిమా అనేసరికి సరే అని అంగీకరించాను అని బ్రహ్మానందం చెప్పుకొచ్చాడు. హీరో ఎవరు? అని అడిగితే మా అబ్బాయి గౌతమ్ పేరు చెప్పారు. సినిమా కోసం వాడికి నేను తాతనయ్యాను అని చెప్పాడు. బ్రహ్మ ఆనందం సినిమా ఫిబ్రవరి 14న విడుదల కానుంది. చదవండి: సంక్రాంతి రభస: మోహన్బాబు, విష్ణుపై మంచు మనోజ్ ఫిర్యాదు -
ప్రముఖ కమెడియన్కు బ్రెయిన్ స్ట్రోక్
ప్రముఖ కమెడియన్ టీకు తల్సానియా (Tiku Talsania)కు బ్రెయిన్ స్ట్రోక్కు గురయ్యారు. దిల్ హై కీ మంతా నహీ (1991), కబీ హా కబీ నా (1993), ఇష్క్ (1997) చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న ఇతడు శుక్రవారం బ్రెయిన్ స్ట్రోక్కు గురయ్యారు. ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉంది.గుండెపోటు కాదు!మొదటగా టీకూకు గుండెపోటు వచ్చిందని రూమర్లు వచ్చాయి. అయితే అందులో నిజం లేదని, తనకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందని నటుడి భార్య దీప్తి తల్సానియా పేర్కొంది. ఈ మేరకు మీడియాతో మాట్లాడుతూ.. ఆయన ఓ సినిమా స్క్రీనింగ్కు వెళ్లాడు. రాత్రి ఎనిమిది గంటల సమయంలో అస్వస్థతకు లోనయ్యాడు. వెంటనే ఆయన్ను ఆస్పత్రిలో చేర్పించాం అని దీప్తి తెలిపింది.ఎవరీ టీకు?టీకు తల్సానియా.. ప్యార్ కె దో పాల్ (1986) సినిమాతో బాలీవుడ్లో నట ప్రస్థానం ప్రారంభించారు. కమెడియన్గా దిల్ హై కే మంతా నహీ, ఉమర్ 55కీ దిల్ బచ్పన్, బోల్ రాధా బోల్, అండాజ్ ఆప్న ఆప్న, మిస్టర్ బెహరా వంటి చిత్రాల్లో నటించాడు. తర్వాత కామెడీకి కాస్త బ్రేక్ ఇచ్చి వక్త్ హమారా హై మూవీలో సీరియస్ లుక్లో మెప్పించాడు. దేవదాస్ మూవీతో ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు.కూతురు కూడా నటిగా..వీర్, కూలీ నెం.1, రాజా హిందుస్తానీ, రాజు చాచా, హంగామా, బడే మియా చోటే మియా, జుడ్వా.. ఇలా ఎన్నో చిత్రాలు చేశారు. చివరగా విక్కీ విద్యాకా వో వాలా వీడియో సినిమాలో కనిపించారు. టీకు కూతురు శిఖ తల్సానియా కూడా నటిగా రాణిస్తోంది. సత్యప్రేమ్ కీ కథ, వీరే దీ వెడ్డింగ్ వంటి చిత్రాల్లో నటించింది.చదవండి: చికెన్గున్యాతో బాధపడుతున్న సమంత.. ఒళ్లునొప్పులున్నా..! -
భార్య కాళ్లు కడిగి నీళ్లు నెత్తిన చల్లుకున్న కమెడియన్
జబర్దస్త్ కమెడియన్ పంచ్ ప్రసాద్ (Punch Prasad) కొన్నేళ్లపాటు కిడ్నీ సమస్యతో బాధపడ్డాడు. డయాలసిస్ చేయించుకున్నప్పటికీ ఆరోగ్యం మెరుగవలేదు. రెండు మూత్రపిండాలు పాడవడంతో వీలైనంత త్వరగా ఆపరేషన్ చేయాలని, లేకపోతే కష్టమని వైద్యులు హెచ్చరించారు. అలాంటి సమయంలో ప్రసాద్ భార్య సునీత నేనున్నానంటూ ముందుకు వచ్చింది. తన కిడ్నీ దానం చేసేందుకు సిద్ధమైంది. అయితే డాక్టర్లు అందుకు ఒప్పుకోలేదు. వేరే కిడ్నీదాతను వెతుక్కోమన్నారు. కిడ్నీ మార్పిడి విజయవంతంఅవసరమైతే భవిష్యత్తులో మళ్లీ ఏదైనా సమస్య వచ్చినప్పుడు ప్రసాద్ భార్య కిడ్నీ ఉపయోగిద్దామన్నారు. ఎంతో ఎదురుచూపులు, వెతుకులాట తర్వాత అతడికి కిడ్నీ దాత దొరికారు. ఆపరేషన్కు లక్షల్లో ఖర్చవుతుందన్నారు. అతడి విషయాన్ని అప్పటి మంత్రి ఆర్కే రోజా ఆనాటి సీఎం వైస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ఆయన ఆదేశాలతో చికిత్సకు కావాల్సిన డబ్బు సీఎం సహాయకనిధి ద్వారా మంజూరు చేశారు. అలా 2023లో అతడికి విజయవంతంగా కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగింది.పంచ్ ప్రసాద్ ఎమోషనల్అప్పటి నుంచి ప్రసాద్ ఆరోగ్యంగా ఉంటున్నారు. తాజాగా అతడు తన భార్యతో కలిసి ఓ టీవీ షోకు హాజరయ్యాడు. ఈ సందర్భంగా ఏ భర్తా చేయని పని తాను చేశాడు. సునీత గురించి మాట్లాడుతూ భావోద్వేగానికి లోనయ్యాడు. ప్రసాద్ మాట్లాడుతూ.. ప్రేమించుకున్నవాళ్లు కలిసి బతకడానికి పెళ్లి చేసుకుంటారు. కానీ నన్ను బతికించడం కోసమే ఆమె నన్ను పెళ్లి చేసుకుంది. నువ్వు చేసిన పనికి ఎలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియడం లేదు. కాళ్లు కడిగి నెత్తిన చల్లుకున్న కమెడియన్మామూలుగా తల్లిదండ్రుల కాళ్లు కడిగి నెత్తిన చల్లుకుంటారు కదా.. నేనూ అదే చేయాలనుకుంటున్నా అన్నాడు. అనడమే ఆలస్యం.. భార్యను కూర్చోబెట్టి తాంబూలంలో ఆమె కాళ్లు కడిగి ఆ నీళ్లను తన నెత్తిన చల్లుకున్నాడు. అది చూసి సునీత సైతం కన్నీళ్లు పెట్టుకుంది. నా భార్య గర్భవతిగా ఉన్నప్పుడు ఆస్పత్రికి వెళ్లాలి. కానీ తన గురించి వదిలేసి నా చుట్టూ తిరిగింది అంటూ ప్రసాద్ భావోద్వేగానికి లోనయ్యాడు.చదవండి: ‘గేమ్ ఛేంజర్’ మూవీ ట్విటర్ రివ్యూ -
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న బ్రహ్మానందం (ఫొటోలు)
-
నా కాలేయం ఇచ్చి బతికించా.. చివరకు నా చేతుల్లోనే ప్రాణం..: ఏవీఎస్ కూతురు
కమెడియన్గా తెలుగు ఇండస్ట్రీలో ప్రత్యేక పేరు సంపాదించుకున్నాడు ఏవీఎస్. ఆయన పూర్తి పేరు ఆమంచి వెంకటసుబ్రహ్మణ్యం. రంగస్థల కళాకారుడిగా, మిమిక్రీ ఆర్టిస్టుగా, జర్నలిస్టుగా పేరు తెచ్చుకున్న ఆయన మిస్టర్ పెళ్లాం చిత్రంతో నటుడిగా వెండితెరకు పరిచయమయ్యాడు. తొలి సినిమాతోనే నంది అవార్డు అందుకున్నాడు. మాయలోడు, మా విడాకులు, శుభలగ్నం, ఘటోత్కచుడు, శుభలగ్నం, యమలీల, సమరసింహారెడ్డి, ఇంద్ర, యమగోల మల్లీ మొదలైంది.. ఇలా ఎన్నో చిత్రాలు చేశాడు. దాదాపు 500 చిత్రాల్లో నటించి ప్రేక్షక హృదయాల్లో స్థానం సంపాదించుకున్నాడు. 2013లో ఏవీఎస్ మరణించాడు.ఇటీవలే అమ్మ కూడా..తాజాగా ఏవీఎస్ (AVS) కూతురు శాంతి- అల్లుడు చింటూ ఓ ఇంటర్వ్యూకు హాజరయ్యారు. ఈ సందర్భంగా శాంతి (Comedian AVS Daughter Shanthi) మాట్లాడుతూ.. మా నాన్న 57 ఏళ్ల వయసులో మరణించాడు. అమ్మ 62 ఏళ్ల వయసులో (గతేడాది నవంబర్లోనే) కన్నుమూసింది. నిరంతరం షూటింగ్లోనే ఉంటూ నిద్రను పట్టించుకోకపోవడం వల్లే నాన్న ఆరోగ్యం దెబ్బతింది. కానీ బయటి వారు మాత్రం తాగడం వల్లే ప్రాణాలమీదకు తెచ్చుకున్నాడని అపోహపడుతుంటారు.మందు అలవాటే లేదుమాది బ్రాహ్మణ కుటుంబం. నాన్న ఎగ్ కూడా తినేవారు కాదు. ఎగ్ ఉంటుందని కేక్ కూడా ముట్టుకోరు. సోడా కూడా పెద్దగా తాగకపోయేవారు. మందు జోలికి వెళ్లిందే లేదు. కానీ 2008లో నాన్న కాలేయం పాడైపోయింది. రక్తపు వాంతులు చేసుకున్నాడు. డాక్టర్స్ ఆయన్ను పరీక్షించి కాలేయం మార్పిడి చేయాలన్నారు. నేను కాలేయం ఇవ్వడానికి రెడీ అయ్యా.. కానీ లావుగా ఉన్నానని నాది సెట్టవదన్నారు. (చదవండి: సౌత్ సినిమాతో హీరోయిన్గా పరిచయం.. ఇప్పుడు దేశంలోనే టాప్!)1% మాత్రమే బతికే ఛాన్స్దాత దొరకాలంటే ఏడాది పడుతుందన్నారు. నాకేం అర్థం కాలేదు. ఏం చేయాలో తోచలేదు. ఇంతలో సడన్గా ఆయన జ్ఞాపకశక్తి కోల్పోయారు. మా అమ్మను కూడా గుర్తు పట్టలేదు. కేవలం నా ఒక్క పేరు మాత్రమే గుర్తుంది. నాన్న బతకడానికి ఒక్క శాతమే ఛాన్స్ ఉందన్నారు. ఆయన్ను ఐసీయూలో ఉంచి మమ్మల్ని ఇంటికి వెళ్లిపోమన్నారు. రాత్రంతా నిద్రపోకుండా దేవుడికి దండం పెట్టుకుంటూనే ఉన్నాం. తర్వాతి రోజు ఉదయం 6.30 గంటలకు నాన్న స్వయంగా కాల్ చేశాడు. నా భర్తే ఒప్పించాడుఎవరూ రాలేదేంట్రా? ఇక్కడ నేను ఒక్కడినే ఉన్నాను అని మాట్లాడాడు. ఒక్క రాత్రిలో తనకు పోయిన జ్ఞాపకశక్తి ఎలా తిరిగొచ్చిందో అర్థం కాలేదు. అయితే 20 రోజుల్లో కాలేయం ఆపరేషన్ చేయాలన్నారు. దాతల కోసం వెతికేంత సమయం లేదని నేనే రెడీ అయ్యాను. నాకు ఆరోగ్య పరీక్షలు చేసి అంతా బాగుందన్నారు. కానీ, నాన్న ఒప్పుకోలేదు. భవిష్యత్తులో ప్రెగ్నెన్సీ ప్రాబ్లమ్స్ వస్తాయమోనని సందేహించాడు. అప్పుడు నా భర్తే దగ్గరుండి తనను ఒప్పించాడు. ఆయన సరే చెప్పేందుకు వారం రోజులు పట్టింది. (చదవండి: ఈ విషయం తెలిసుంటే 'బేబీ జాన్'లో నటించేదానినే కాదు: కీర్తి సురేష్)ఆరు నెలలు విశ్రాంతి తీసుకోమంటే..అలా నా కాలేయంలో 60 శాతం దానం చేశాను. ఆపరేషన్ తర్వాత నా శరీరంలో రక్తకణాల సంఖ్య పడిపోవడంతో ఒకరోజంతా అపస్మారక స్థితిలో ఉన్నాను. ప్లేట్లెట్స్ ఎక్కించడంతో కోలుకున్నాను. ఆపరేషన్ తర్వాత కనీసం ఆరు నెలలైనా విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు నాన్నకు సూచించారు. కానీ ఆయన వింటేగా! ఆపరేషన్ అయిన రెండో నెలకే మళ్లీ పనిలో పడిపోయాడు. సరిగా విశ్రాంతి తీసుకోలేదు.నా చేతిలో ప్రాణం పోయిందికాలేయం పెరగడం కోసం దాదాపు నాలుగేళ్లు గ్యాప్ ఇచ్చాక పిల్లల్ని ప్లాన్ చేసుకున్నాం. నాకు పిల్లలు పుడతారో, లేదోనని నాన్న భయపడిపోయాడు. అలాంటిది నాకు పాప పుట్టగానే నాన్న సంతోషంతో ఏడ్చేశాడు. ఆపరేషన్ అయిన ఆరేళ్లకు నాన్న పరిస్థితి విషమించి నా చేతిలోనే రక్తం కక్కుకుని చనిపోయాడు. ఆపరేషన్కు రూ.65 లక్షలదాకా ఖర్చయింది. అప్పుడు తెలుగు ఇండస్ట్రీ (Tollywood) చాలా సపోర్ట్ చేసింది అని శాంతి చెప్పుకొచ్చింది.చదవండి: క్లీంకారను అప్పుడే అందరికీ చూపిస్తా!: రామ్చరణ్ -
కడుపులో బిడ్డకు గ్యారెంటీ ఇవ్వమన్నారు: స్టెల్లా ఎమోషనల్
బుల్లితెర కమెడియన్ యాదమ్మరాజు తండ్రిగా ప్రమోషన్ పొందాడు. అతడి భార్య స్టెల్లా రాజ్ పండంటి బిడ్డకు జన్మనిచ్చిందని సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. దీంతో ఈ జంటకు అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అయితే ఈ ప్రసవం అంత ఈజీగా జరగలేదంటూ తమ అనుభవాలను యూట్యూబ్ వీడియోతో పంచుకున్నారు.బిడ్డకు గ్యారెంటీ ఇవ్వలేమన్న వైద్యులుస్టెల్లా మాట్లాడుతూ.. సాధారణ చెకప్ కోసం ఆస్పత్రికి వెళ్తే ఉమ్మునీరు తగ్గిందన్నారు. త్వరగా డెలివరీ చేయాలన్నారు. ఒక ఇంజక్షన్ తీసుకుని ఇంటికి వచ్చాను. తర్వాత ఇంకో డాక్టర్ను సంప్రదిస్తే ఇది చాలా ఎమర్జెన్సీ.. వెంటనే అడ్మిట్ అవాలన్నారు. కడుపులో ఉన్న బిడ్డకు కూడా గ్యారెంటీ ఇవ్వలేమన్నారు. అప్పుడు యాదమ్మరాజును పట్టుకుని చాలా ఏడ్చాను. ఏం చేయాలో అర్థం కాక ఇంటికి వచ్చాం.అందుకే శ్రీమంతం క్యాన్సిల్తెలిసినవాళ్ల ద్వారా తర్వాతి రోజు గాంధీ ఆస్పత్రికి వెళ్తే ఉమ్మునీరు ఎక్కించారు. కానీ అక్కడి పరిస్థితులు చూశాక భయమేసి మరో ఆస్పత్రికి వెళ్లాం. నా పరిస్థితి క్లిష్టంగా ఉందన్నారు. బిడ్డ గురించి ఎలాంటి ఆశ పెట్టుకోవద్దన్నారు. ఇందువల్లే శ్రీమంతం కూడా క్యాన్సిల్ చేసుకున్నాం. డాక్టర్స్ చెప్పిన డేట్ కంటే దాదాపు 15 రోజుల ముందే డెలివరీ చేశారు. శుక్రవారం ఉదయం 11 గంటలకు నా డెలివరీ జరిగింది. బేబీ ఆరోగ్యంగా ఉంది అని స్టెల్లా రాజ్ చెప్పుకొచ్చింది. ఇకపోతే వీరికి బాబు పుట్టినట్లు తెలుస్తోంది.చదవండి: పాక్లో ఇండియన్ సినిమాల కోసం ఆరాటం.. ఏకంగా! -
నా కుమారుడి కోసం సిగ్గు విడిచి డబ్బులడిగా..: కమెడియన్
సామాన్యులకైనా, సెలబ్రిటీలకైనా కష్టాలు తప్పవు. బిగ్బాస్ కంటెస్టెంట్, కమెడియన్ మునావర్ ఫరూఖి తన జీవితంలో ఎదుర్కొన్న ఓ పెద్ద సమస్యను తాజా ఇంటర్వ్యూలో షేర్ చేసుకున్నాడు. మునావర్ మాట్లాడుతూ.. నా కొడుడు మైఖేల్కు ఏడాదిన్నర వయసున్నప్పుడు కవసాకి అనే అరుదైన వ్యాధి సోకింది. దీనివల్ల రక్తనాళాల్లో వాపు ఏర్పడుతుంది. అరగంటపాటు షాక్లోఅలాగే గుండెకు సైతం హాని జరిగే ప్రమాదం ఉంది. వాడి పరిస్థితి గురించి చెప్పగానే అరగంటపాటు షాక్లో ఉండిపోయాను. ఒక్కో ఇంజక్షన్ ధర రూ.25,000 ఉంటుందన్నారు. నా దగ్గర చూస్తే రూ.700 మాత్రమే ఉన్నాయి. నా గర్వాన్ని పక్కనపెట్టి ముంబై వెళ్లా.. అందరి దగ్గరా చేతులు చాచి సాయమడిగాను. ట్రీట్మెంట్కు అవసరమైన డబ్బును మూడుగంటల్లో సమకూర్చి హాస్పిటల్లో కట్టేశాను. కానీ ఆ డబ్బు సేకరించడం కోసం పడ్డ కష్టం, వేదన మాత్రం ఎప్పటికీ మర్చిపోలేను.నా ముఖంలో సంతోషం లేదుఅలాగే హాస్పిటల్లో డబ్బు కట్టేశాక కూడా నా ముఖంలో సంతోషం లేదు. ఎందుకంటే అది నా డబ్బు కాదు కదా! ఆరోజే ఆర్థికంగా నిలదొక్కుకోవాలని ఆరోజే నిర్ణయించుకున్నాను అని చెప్పుకొచ్చాడు. కాగా మునావర్ గతంలో జాస్మిన్ను పెళ్లాడాడు. వీరికి పుట్టిన సంతానమే మైఖేల్. ఇటీవలే మునావర్.. మెజబీన్ కోట్వాలా అనే యువతిని రెండో పెళ్లి చేసుకున్నాడు.చదవండి: పెళ్లిలో డ్యాన్స్.. షారూఖ్ ఎంత తీసుకున్నాడేంటి? -
ప్రముఖ లేడీ కమెడియన్ బేబీ షవర్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
'కళ్లకు గంతలు కట్టి, కారులో తోసి.. రూ.20 లక్షలు డిమాండ్ చేశారు'
ప్రముఖ బాలీవుడ్ కమెడియన్ సునీల్ పాల్ కిడ్నాప్కు గురయ్యాడన్న వార్త సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అయితే కిడ్నాప్ అయిన కొద్ది గంటలకే అతడిని విడుదల చేయడంతో క్షేమంగా ఇంటికి చేరుకున్నాడని అతడి భార్య తెలిపింది. ఈ విషయంలో పోలీసులను కూడా సంప్రదించినట్లు పేర్కొంది.నిజంగానే కిడ్నాప్..అయితే ఇది పబ్లిసిటీ స్టంట్ అయి ఉండొచ్చని కొందరు అనుమానం వ్యక్తం చేశారు. దీనిపై కమెడియన్ సునీల్ పాల్ స్పందించాడు. ఇది ప్రాంకో, పబ్లిసిటీ స్టంటో కాదని, తనను నిజంగానే కిడ్నాప్ చేశారని స్పష్టం చేశాడు. తాజా ఇంటర్వ్యూలో సునీల్ పాల్ మాట్లాడుతూ.. అమిత్ అనే వ్యక్తి హరిద్వార్లో బర్త్డే పార్టీలో పాల్గొనాల్సిందిగా ఆహ్వానం పంపాడు. ఇందుకోసం కాస్త అడ్వాన్స్ కూడా పంపాడు. దీంతో డిసెంబర్ 2న ఢిల్లీకి వెళ్లాను. బర్త్డే పార్టీకి వెళ్తుండగా మార్గమధ్యలో స్నాక్స్ తిందామని ఆగారు. రూ.20 లక్షలు డిమాండ్సరిగ్గా అప్పుడే నా అభిమాని అంటూ ఓ వ్యక్తి వచ్చి మాట్లాడుతూ ఓ కారులోకి తోశాడు. బలవంతంగా నన్ను కారులో తీసుకెళ్లారు. కళ్లకు గంతలు కట్టి ఓ బంగ్లాకు తీసుకెళ్లారు. అక్కడ నన్ను చాలారకాలుగా భయపెట్టారు. రూ.20 లక్షలు కావాలని డబ్బు డిమాండ్ చేశారు, నా ఫోన్ కూడా లాక్కున్నారు. నా దగ్గర ఏటీఎమ్ కార్డు లేదని చెప్పడంతో వారు బేరాలు మొదలుపెట్టారు. నా ఫ్రెండ్స్కు ఫోన్ చేసుకోవచ్చని చెప్పారు.ఖర్చుల కోసం రూ.20 వేలిచ్చారుఅలా రూ.7.5 లక్షలు సమకూర్చాను. దీంతో వాళ్లు మరుసటి రోజు విమాన ప్రయాణ ఖర్చుల కోసం రూ.20 వేలు చేతిలో పెట్టి ఇంటికి పంపించారు. ఈ సంఘటన గురించి ఎవరితోనూ చెప్పకూడదనుకున్నాను. కానీ నా భార్య అప్పటికే పోలీసులను సంప్రదించడంతో నేనూ నోరు విప్పాను. కానీ ఆ కిడ్నాపర్లు నా వ్యక్తిగత విషయాలన్నీ తెలుసుకున్నారు. వణికిపోయా..నా పిల్లలు ఏ స్కూల్లో చదువుతారు? నా తల్లి ఎక్కడ నివసిస్తుంది? ఇలా ప్రతీది అడిగారు. నా కుటుంబాన్ని ఎలా కాపాడుకోవాలనేది భయంగా ఉంది. ఈ సంఘటనతో నేను వణికిపోయాను. పబ్లిసిటీ కోసం ఇదంతా చేశానంటున్నారు... అదే నిజమైతే మధ్యలో పోలీసులను ఎందుకు లాగుతాను. పైగా నా స్నేహితుల దగ్గర డబ్బు పంపినట్లు సాక్ష్యాలు కూడా ఉన్నాయి. ఏదేమైనా నేను ఇంకా బతికే ఉన్నందుకు సంతోషం అని సునీల్ చెప్పుకొచ్చాడు.చదవండి: కమెడియన్ ఆటో రామ్ప్రసాద్కు యాక్సిడెంట్ -
కమెడియన్ కిడ్నాప్?.. కొద్ది గంటల్లోనే!
నటుడు, కమెడియన్ సునీల్ పాల్ మంగళవారం కొన్ని గంటల పాటు అదృశ్యమయ్యాడు. ఈ విషయాన్ని సునీల్ భార్య సరిత ధృవీకరించింది. ఆమె మాట్లాడుతూ.. నా భర్త ఉన్నట్లుండి టచ్లో లేకపోయేసరికి కంగారుపడిపోయాను. అతడిని ఎవరో కిడ్నాప్ చేశారు. నేను పోలీసులను సంప్రదించగా వారు చాలా సహాయం చేశారు. ప్రస్తుతం ఆయన క్షేమంగా ఇంటికి చేరుకున్నారు. తనను కిడ్నాప్ చేసినవారి గురించి కూడా పోలీసులకు తెలియజేశాడు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తర్వాత వెల్లడిస్తాను అని పేర్కొన్నారు.మిస్సింగ్..ఏదో షోలో పొల్గొనేందుకు వేరే నగరానికి వెళ్లిన సునీల్ మంగళవారం తిరిగి ఇంటికొస్తానన్నాడు. అయితే ఆరోజు ఎంతసేపు ఎదురుచూసినా ఆయన ఇంటికి చేరుకోలేదు. పైగా ఫోన్కాల్స్ కూడా కనెక్ట్ కాకపోవడంతో కంగారుపడిపోయిన సరిత పోలీసులకు ఫిర్యాదు చేసింది. మిస్సింగ్ రిపోర్ట్ నమోదు చేసిన కొన్ని గంటల్లోనే సునీల్ తన కుటుంబంతో టచ్లోకి వచ్చాడు. మంగళవారం రాత్రికల్లా తిరిగి ఇంటికి చేరుకున్నాడు.కాగా సునీల్ పాల్ 2005లో ద గ్రేట్ ఇండియన్ లాఫ్టర్ ఛాలెంజ్ షో విజేతగా నిలిచాడు. హమ్ తుమ్, ఫిర్ హేరీ ఫెరి, ఆప్నా సప్నా మనీ మనీ, బాంబే టు గోవా వంటి చిత్రాల్లోనూ నటించాడు.చదవండి: హత్య కేసులో హీరోయిన్ సోదరి అరెస్ట్.. 20 ఏళ్లుగా మాటల్లేవ్! -
బండ్ల గణేశ్ సినిమాకు ఓకే చెప్పా.. కానీ మోసం చేశాడు: టాలీవుడ్ కమెడియన్
టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు తిరుపతి ప్రకాశ్. క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, కమెడియన్గా ఎన్నో చిత్రాల్లో అభిమానులను మెప్పించారు. టాలీవుడ్ స్టార్ హీరోలైనా నాగార్జున, చిరంజీవి, వెంకటేశ్, బాలయ్య, మోహన్ బాబు, కృష్ణంరాజు లాంటి స్టార్స్ అందరితో కలిసి పనిచేశారు. సీనియర్ ఎన్టీఆర్తో తప్ప దాదాపు అందరితో సినిమాలు చేశానని వెల్లడించారు. ప్రస్తుతం సీరియల్స్లో చేస్తున్న ఆయన తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరయ్యారు. ఈ సందర్భంగా సినీ కెరీర్లో తనకెదురైన అనుభవాలను పంచుకున్నారు.తాను సినిమాల్లో నటించే రోజుల్లో బండ్ల గణేశ్, తాను ప్రాణ స్నేహితులమని ప్రకాశ్ తెలిపారు. ఇద్దరం కలిసి చాలా సినిమాల్లో నటించామని పేర్కొన్నారు. అయితే బండ్ల గణేశ్ నిర్మాత అయ్యాక ఆయన సినిమాల్లో నాకు ఒక్క అవకాశం కూడా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఓ సినిమాకు డేట్స్ తీసుకుని నాకు అబద్ధం చెప్పారని ఆ రోజులను గుర్తు చేసుకున్నారు.తిరుపతి ప్రకాశ్ మాట్లాడుతూ..'బండ్లగణేశ్ చేసిన ఒక్క సినిమాలో కూడా నాకు అవకాశం ఇవ్వలేదు. అయితే ఒక సినిమాకు డేట్స్ తీసుకున్నాడు. దాదాపు 60 రోజులు షూట్ ఉంటుందని చెప్పాడు. రోజుకు 15 వేల పారితోషికం ఖరారు చేసుకున్నా. దీంతో వేరే సినిమాలకు నో చెప్పా. వినాయకచవితి పండగ మరుసటి రోజే కేరళలోని పొల్లాచ్చికి వెళ్లాలి. కానీ షూట్కు బయలుదేరాల్సిన ముందురోజే నాకు ఫోన్ కాల్ వచ్చింది. భారీ వర్షాలతో షూట్ క్యాన్సిల్ చేశామని ప్రొడక్షన్ మేనేజర్ చెప్పాడు. దీంతో షాక్ తిన్నా. మూడు సినిమాలు వదిలేశా. మూడు నెలలు ఖాళీగా ఎలా ఉండాలని ఆలోచించా. సరిగ్గా పది రోజుల తర్వాత శ్రీకాంత్ సినిమాలో ఛాన్స్ వచ్చింది. వెంటనే రాజమండ్రికి వెళ్లా. అక్కడ రోలర్ రవి నన్ను కలిశాడు. ఏం ప్రకాశ్ అన్న మంచి సినిమా వదిలేశావ్ అన్నాడు. ఏ సినిమా అని అడిగా. కల్యాణ్ బాబు మూవీ అన్నాడు. వర్షం వల్ల షూట్ క్యాన్సిల్ అయిందని చెప్పారని చెప్పా. కానీ నాకంటే తక్కువకే ఎవరో దొరికారని నన్ను తీసేసినట్లు తెలిసింది. అప్పుడు నాకు బండ్ల గణేశ్పై కోపం వచ్చింది. ఆ తర్వాత మా నాన్న చనిపోయారని ఫోన్ చేశాడు. అవును అని చెప్పి వెంటనే పెట్టేశా' అని అన్నారు. -
కర్నూలులో టీ షాప్ ప్రారంభించిన టాలీవుడ్ కమెడియన్ బ్రహ్మనందం (ఫొటోలు)
-
Hyderabad: భార్యతో గొడవపడి అర్ధరాత్రి పోర్షే కారులో చక్కర్లు..
బంజారాహిల్స్: భార్యతో గొడవపడి అర్ధరాత్రి ఖరీదైన పోర్షే కారులో చక్కర్లు కొడుతూ మితిమీరిన వేగంతో దూసుకెళ్ళి రోడ్డు ప్రమాదానికి కారకుడైన వ్యాపారి, స్టాండప్ కమేడీయన్ ఉత్సవ్ దీక్షిత్ను ఇప్పటికే బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేయగా ప్రమాదానికి కారణమైన పోర్షేకారు కండీషన్ తెలియజేయాల్సిందిగా జర్మనీ కంపెనీకి బంజారాహిల్స్ పోలీసులు లేఖ రాయనున్నారు. ఇప్పటికే లేఖను సిద్ధం చేసిన పోలీసులు నేడో, రేపో ఈ కారు కండీషన్ తెలియజేయాల్సిందిగా కోరనున్నారు. ఈ కారు మరమ్మతులకు వచ్చిందని మూడునెలల క్రితమే సర్వీస్ కు తేవాలని చెప్పామని రోడ్లపైకి తీసుకెళ్ళవద్దని హెచ్చరించడం కూడా జరిగిందని షోరూం ప్రతినిధులు స్పష్టం చేసినట్లు సమాచారం. ఇదేదీ పట్టని ఉత్సవ్ దీక్షిత్ మూడునెలల నుంచి కారును నడిపిస్తూనే ఉన్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.వేగంతో కారును నడపడంతో మూల మలుపు వద్ద కారు స్టీరింగ్కు లాక్ పడటంతో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు కూడా ప్రాథమిక దర్యాప్తులో తేలింది. అయితే ప్రమాదం జరిగిన సమయంలో కారు కండీషన్లో ఉందా లేదా తేల్చాల్సిందిగా పోర్షే కంపెనీకి లేఖ రాయాలని నిర్ణయించారు. సంబంధిత కంపెనీ నుంచి నిపుణులు వచ్చి కారు కండీషన్పై నివేదిక ఇచ్చిన తర్వాత తదుపరి చర్యలు తీసుకోవాలని కూడా నిర్ణయించారు. ఉత్సవ్ దీక్షిత్ అరెస్టు -
ఉత్సవ్ దీక్షిత్ అరెస్టు
బంజారాహిల్స్: రోడ్డు ప్రమాదానికి కారకుడైన స్టాండప్ కమెడియన్ ఉత్సవ్ దీక్షిత్ (33)ను ఆదివారం బంజారాహిల్స్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. బంజారాహిల్స్ రోడ్డునంబర్–6లో నివసించే ఉత్సవ్ దీక్షిత్ గత నెల 31వ తేదీ అర్ధరాత్రి తన భార్యతో గొడవపడి పోర్షే కారులో బయటకు వచ్చి రాత్రంతా నగరంలో చక్కర్లు కొట్టాడు. కారులో మితిమీరిన వేగంతో బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, గచ్చిబౌలి, మణికొండ ప్రాంతాల్లో తిరిగాడు. 1వ తేదీ తెల్లవారుజామున 5.45 గంటల ప్రాంతంలో తిరిగి ఇంటికి వెళ్లే క్రమంలో బంజారాహిల్స్ రోడ్డు నంబర్–12 నుంచి వెళ్తుండగా బసవతారకం కేన్సర్ ఆస్పత్రి సమీపంలో కారు అదుపుతప్పి స్టీరింగ్ లాక్ కావడంతో డివైడర్ను ఢీకొట్టి కేబీఆర్ పార్కు ఫెన్సింగ్ను దాటుకుని చెట్టు పైకి వెళ్లి కిందపడింది. స్వల్ప గాయాలతో ఉత్సవ్ బయటపడి పారిపోయాడు. కారు ముందు భాగం నుజ్జునుజ్జయ్యింది. నిందితుడిపై ఎంవీ యాక్ట్ కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు డ్రైవింగ్ లైసెన్స్ను సీజ్ చేసి రద్దు చేయాల్సిందిగా ఆర్డీఓకు లేఖ రాశారు. పోలీసుల విచారణలో నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడంతోనే కారు అదుపు తప్పినట్లు తేలింది. కాగా.. ఉత్సవ్ దీక్షిత్ స్టాండప్ కమెడియన్గా సుపరిచితుడు. పలు కార్యక్రమాల్లో కమెడియన్గా గుర్తింపు పొందాడు. ప్రేమ వివాహం చేసుకున్న ఉత్సవ్ దీక్షిత్ ఇంట్లో భార్యతో గొడవ పడి ఆ కోపాన్ని కారు మీద చూపించినట్లుగా నిర్ధారణ అయింది. బంజారాహిల్స్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
కోపంతో జర్నలిస్ట్ ఫోన్ లాక్కున్న కమెడియన్.. వీడియో వైరల్
ఈ దీపావళి సినిమా వాళ్లకు బాగానే కలిసొచ్చింది. సౌత్లో లక్కీ భాస్కర్, క, అమరన్ సినిమాలకు హిట్ టాక్ రాగా బాలీవుడ్ భూల్ భులయ్యా 3, సింగం అగైన్ చిత్రాలు ఏకంగా రూ.100 కోట్లు దాటేశాయి. ఇకపోతే భూల్ భులయ్యా 3 సినిమాలో నటించిన రాజ్పాల్ యాదవ్ తాజాగా వార్తల్లో నిలిచాడు.దీపావళి అలా జరుపుకోవద్దు!దీపావళికి పటాసులు కాల్చవద్దని సూచిస్తూ ఆ మధ్య ఓ వీడియో షేర్ చేశాడు. టపాకాయలు కాల్చడం వల్ల గాలి, శబ్ధ కాలుష్యం పెరుగుతుందని పేర్కొన్నాడు. అతడి కామెంట్లపై విమర్శలు వెల్లువెత్తడంతో సదరు వీడియోను డిలీట్ చేశాడు. తన మాటల వల్ల మనోభావాలు దెబ్బతిన్నవారికి క్షమాపణలు చెప్తూ మరో వీడియో ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశాడు. నటుడి క్షమాపణలుదీపావళి పండగ సంతోషాన్ని తగ్గించాలన్నది నా ఉద్దేశం కాదు. నన్ను క్షమించండి. మన జీవితాల్లో వెలుగును, ఆనందాన్ని నింపేదే దీపావళి. ఈ పండగను అందరం కలిసి సెలబ్రేట్ చేసుకుందాం అని చెప్పుకొచ్చాడు. తాజాగా ఈ నటుడిని ఓ జర్నలిస్టు కొన్ని ప్రశ్నలడిగాడు. నెలన్నరకోసారి నన్ను చూస్తారుఈ ఇంటర్వ్యూని అతడి ఫోన్లోనే రికార్డ్ చేశాడు. ప్రస్తుతం మీ చేతిలో ఎన్ని సినిమాలున్నాయని అడగ్గా రాజ్పాల్.. ప్రతి నెలన్నరకోసారి మీరు నన్ను చూస్తూనే ఉంటారని బదులిచ్చాడు. దీపావళి పండగపై చేసిన కామెంట్ల గురించి జర్నలిస్టు ఆరా తీయగా రాజ్పాల్ అసహనం వ్యక్తం చేశాడు.ఫోన్ లాక్కున్న నటుడువెంటనే జర్నలిస్టు చేతిలోని ఫోన్ను లాక్కున్నాడు. ఇదంతా ఫోన్లో రికార్డవగా ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. రాజ్పాల్ తన ఫోన్ను లాక్కోవడంతోపాటు విసిరేసేందుకు ప్రయత్నించాడని సదరు జర్నలిస్టు పేర్కొన్నాడు. लोगों को हंसाने वाले मशहूर फिल्म अभिनेता राजपाल यादव आखिर इतना क्यों भड़क गए?फिल्म अभिनेता राजपाल यादव आज यूपी के लखीमपुर खीरी जिले के पलिया कस्बे में पहुंचे थे, जहां एक पत्रकार के सवाल पर उनको इतना गुस्सा आ गया कि सवाल पूछ रहे पत्रकार के मोबाइल फोन पर झपट्टा मारकर मोबाइल फोन… pic.twitter.com/Gj7vCRTxEB— Zameer Ahmad (@zameerahmad_lmp) November 2, 2024 చదవండి: చిత్ర పరిశ్రమలో విషాదం.. దర్శకుడు అనుమానాస్పద మృతి -
US Elections 2024: చెత్త చుట్టూ అమెరికా ఎన్నికల సమరం
హోరాహోరీగా సాగుతున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల సమరం చివరి ఘట్టంలో ‘చెత్త’ చుట్టూ తిరుగుతోంది. గత ఆదివారం రిపబ్లికన్ల అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ భారీ బహిరంగ సభలో స్టాండప్ కమేడియన్ టోనీ హించ్క్లిఫ్ మాట్లాడుతూ ప్యూర్టోరీకోను నీటిపై తేలుతున్న చెత్తకుప్పగా అభివరి్ణంచడం తెలిసిందే. దానిపై అమెరికావ్యాప్తంగా ఇప్పటికీ నిరసనలు పెల్లుబుకుతున్నాయి. దేశవ్యాప్తంగా 50 లక్షలకు పైగా ఉన్న ప్యూర్టోరీకో ఓటర్లలో ఆ వ్యాఖ్యలు ఆగ్రహం రగిల్చాయి. వారంతా నవంబర్ 5 నాటి పోలింగ్లో ట్రంప్కు వ్యతిరేకంగా ఓటేయవచ్చని, ఫలితంగా డెమొక్రాట్ల అభ్యర్థి కమలా హారిస్ విజయాన్ని నల్లేరుపై నడకగా మారనుందని విశ్లేషణలు వెలువడ్డాయి. అయితే ట్రంప్ అభిమానులనే ‘అసలైన చెత్త’గా అభివరి్ణస్తూ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తాజాగా చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. దాంతో పరిస్థితి తారుమారైందన్న అభిప్రాయం వినిపిస్తోంది. తన ఉద్దేశం అది కాదంటూ సోషల్ మీడియా సాక్షిగా బైడెన్ వివరణ ఇచ్చినా అప్పటికే హారిస్కు భారీ నష్టం జరిగిందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ అనుకోని అవకాశాన్ని గట్టి ఆయుధంగా వాడుకునేందుకు ట్రంప్తో పాటు ఆయన ప్రచార శిబిరం కూడా శాయశక్తులా ప్రయతి్నస్తోంది. అమెరికన్లను అవమానించడం డెమొక్రాట్లకు కొత్తేమీ కాదంటూ ఊరూవాడా హోరెత్తిస్తోంది...! ఎన్నికల ఘట్టం చివరి అంకంలో సొంత పార్టీ అభ్యర్థి హారిస్ను అమెరికా అధ్యక్షుడు బైడెన్ గట్టి చిక్కుల్లోనే పడేశారు. ప్యూర్టోరీకోపై టోనీ వ్యాఖ్యలను తిప్పికొట్టే క్రమంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హిస్పానిక్ గ్రూప్ వోటో లాటినో మంగళవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బైడెన్ పాల్గొన్నారు. ప్యూర్టోరీకాపై ట్రంప్ సమక్షంలోనే టోనీ చేసిన దిగజారుడు వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ప్యూర్టోరీకన్ల పట్ల పూర్తి సంఘీభావం ప్రకటించారు. ‘‘వారు చాలా మంచివాళ్లు. ఆత్మగౌరవమున్న వ్యక్తులు. అమెరికా అభివృద్ధిలో వారికి కీలక పాత్ర’’ అంటూ కొనియాడారు. ‘‘లాటిన్ అమెరికన్లను రాక్షసులుగా చిత్రించేందుకు ట్రంప్, ఆయన శిబిరం చేస్తున్న ప్రయత్నాలు దారుణం. ఇతర దేశాలను కించపరచడం అమరికా విధానమే కాదు. అమెరికా పాటించే విలువలకు అవి పూర్తిగా విరుద్ధం’’ అంటూ విమర్శించారు. అక్కడిదాకా బాగానే ఉన్నా, ‘‘నాకు తెలిసిన అసలైన చెత్త ఆయన (ట్రంప్) మద్దతుదారులు మాత్రమే. వారి రూపంలోనే అసలైన చెత్తాచెదారం కనిపిస్తోంది’’ అంటూ నోరుజారారు. వాటిపై అమెరికా అంతటా విమర్శలు చెలరేగుతున్నాయి. బైడెన్ అంగీకారయోగ్యం కాని వ్యాఖ్యలు చేశారని విమర్శకులు కూడా భావిస్తున్నారు. ప్యూర్టోరీకాపై టోనీ తలతిక్క వ్యాఖ్యలతో తలపట్టుకున్న రిపబ్లికన్ పార్టీ నెత్తిన బైడెన్ పాలు పోశారంటున్నారు. ఆయన వ్యాఖ్యలను రిపబ్లికన్లు రెండు చేతులా అందిపుచ్చుకున్నారు. 2016 అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాట్ల అభ్యర్థి హిల్లరీ క్లింటన్ చేసిన వ్యాఖ్యలతో ముడిపెట్టి మరీ, ‘అమెరికన్లను దారుణంగా అవమానించడం డెమొక్రాట్లకు అలవాటే’నంటూ జోరుగా ప్రచారం చేస్తున్నారు. ట్రంప్ మద్దతుదారులైన కోట్లాది మంది అమెరికన్లను బైడెన్, హారిస్ దారుణంగా అవమానించారంటూ ట్రంప్ ప్రచార బృందం జాతీయ మీడియా కార్యదర్శి కరోలిన్ లీవిట్ దుయ్యబట్టారు. వివరణ ఇచి్చనా... వ్యవహారం చేయి దాటుతోందని గ్రహించిన బైడెన్ వెంటనే నష్ట నివారణ చర్యలకు దిగారు. తాను చెత్త అన్నది ప్యూర్టోరీకోపై అసహ్యకర వ్యాఖ్యలు చేసిన ట్రంప్ మద్దతుదారును ఉద్దేశించి మాత్రమేనంటూ వివరణ ఇచ్చుకున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. అలాంటి వారిని దిగజారుడుతనాన్ని వర్ణించేందుకు అదే సరైన పదమని చెప్పుకొచ్చారు. కానీ బైడెన్ వ్యాఖ్యలపై దుమారం చల్లారడం లేదు. వాటిపై డెమొక్రాట్ నేతలను అమెరికా అంతటా ప్రజలు నిలదీస్తున్నారు. హారిస మద్దతుదారైన పెన్సిల్వేనియా గవర్నర్ జోష్ షాపిరోకు కూడా మంగళవారం సాయంత్రం ఒక ఇంటర్వ్యూలో దీనిపై వరుసబెట్టి ప్రశ్నలు ఎదురయ్యాయి. దాంతో, ‘ప్రత్యర్థి నేతలకు మద్దతిచి్చనా నేనైతే అమెరికన్లెవరినీ ఎప్పటికీ అవమానించబోను’’ అంటూ ఆయన వివరణ ఇచ్చుకోవాల్సి వచి్చంది. నాడు హిల్లరీ ఏమన్నారంటే... 2016 అధ్యక్ష ఎన్నికల సందర్భంగా కూడా ట్రంప్ మద్దతుదారులపై ఆయన ప్రత్యర్థి హిల్లరీ క్లింటన్ ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. ‘‘ట్రంప్ మద్దతుదారుల్లో సగానికి సగం మంది ఎందుకూ పనికిమాలినవాళ్లే. వాళ్లంతా జాత్యహంకారులు. స్త్రీలు, ముస్లింలు, విదేశీయులతో పాటు స్వలింగ సంపర్కుల పట్ల విద్వేషం వెలిగక్కేవాళ్లు’’ అంటూ దుయ్యబట్టారు. ఆ వ్యాఖ్యల ద్వారా అమెరికన్లందరినీ హిల్లరీ తీవ్రంగా అవమానించారంటూ రిపబ్లికన్లు అప్పట్లో జోరుగా ప్రచారం చేశారు.డెమొక్రాట్లకు అలవాటేబైడెన్ తాజా వ్యాఖ్యలపై ట్రంప్ కూడా స్పందించారు. పెన్సిల్వేనియాలో ర్యాలీలో ఉండగా బైడెన్ వ్యాఖ్యలను ట్రంప్ ప్రచార బృందం ఆయన చెవిన వేసింది. దాంతో, ‘‘వావ్! ఇది దారుణం. కానీ వాళ్లకు (డెమొక్రాట్లకు) ఇది అలవాటే’’ అంటూ ట్రంప్ స్పందించారు. ‘‘2016లో నాతో తలపడ్డ హిల్లరీ కూడా నా మద్దతుదారులపై ఇలాంటి అవమానకర వ్యాఖ్యలే చేశారు. కానీ అవి ఫలించలేదు. ‘చెత్త’ వ్యాఖ్యలు వాటికంటే దారుణమైనవి. కాదంటారా?’’ అంటూ వివాదాన్ని మరింత పెద్దది చేసే ప్రయత్నం చేశారు. అమెరికన్లపై ఎవరూ క్రూర పరిహాసం చేయొద్దన్నదే తన అభిప్రాయమని చెప్పుకొచ్చారు. అమెరికన్లపై ప్రేమాభిమానాలు లేని డెమొక్రాట్లకు దేశానికి నాయకత్వం వహించే హక్కే లేదన్నారు. పనిలో పనిగా అంతేగాక టోనీ ‘ప్యూర్టోరీకో’ వ్యాఖ్యలకు దూరం జరిగేందుకు కూడా ట్రంప్ ప్రయతి్నంచారు. వాటితో తనకు ఏ సంబంధమూ లేదని చెప్పుకొచ్చారు. ‘‘ఎవరో కమేడియన్ ప్యూర్టోరీకోపై ఏదో అభ్యంతరకరమైన జోకు పేలి్చనట్టు నాకెవరో చెప్పారు. అతనెవరో నాకస్సలు తెలియదు. అతన్ని నేనెన్నడూ కనీసం చూడను కూడా లేదు’’ అని చెప్పుకొచ్చారు. అలాంటి వ్యక్తి ట్రంప్ ర్యాలీ వేదికపై ఎందుకున్నట్టన్న ప్రశ్నకు మాత్రం బదులివ్వలేదు!– సాక్షి, నేషనల్ డెస్క్ -
ప్రముఖ కమెడియన్ కన్నుమూత
ప్రముఖ కమెడియన్, మరాఠీ నటుడు ఇవాళ కన్నుమూశారు. ది కపిల్ శర్మ షో ఫేమ్ అతుల్ పర్చురే తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా క్యాన్సర్తో బాధపడుతున్న ఆయన చికిత్స పొందుతూ మరణించారు. బాలీవుడ్లో సినిమాలతో పాటు పలు మరాఠీ సీరియల్స్లో నటించారు. అంతేకాకుండా పలు టీవీ రియాలిటీ షోల్లో కనిపించారు. గతేడాది కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన రూల్స్ రంజన్ చిత్రంలో కనిపించారు.అతుల్ పర్చురే మరణం పట్ల బాలీవుడ్తో పాటు మరాఠీ చిత్రసీమను దిగ్భ్రాంతికి గురిచేసింది. తనదైన నటనతో పాటు మరాఠీ సినిమాల్లోనే కాకుండా హిందీ సినిమాలు, టెలివిజన్లో తనకంటూ ఒక పేరు తెచ్చుకున్నారు. అతని కెరీర్లో టీవీ సీరియల్స్లో ఎక్కువగా నటించారు. అతని మరణ వార్త విన్న అభిమానులు, సహచరులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. మరాఠీ, హిందీ సినిమా ఇండస్ట్రీలో ఆయన చెరగని ముద్ర వేశారని గుర్తు చేసుకుంటున్నారు. -
బిగ్బాస్ షోలో ప్రముఖ కమెడియన్?
తమిళ బిగ్బాస్ ఎనిమిదో సీజన్ లాంచ్కు రెడీ అవుతోంది. ఇప్పటికే పలువురు సెలబ్రిటీలతో బిగ్బాస్ టీమ్ సంప్రదింపులు జరుపుతోంది. కొందరిని ఆల్రెడీ ఫైనలైజ్ చేయగా మరికొందరికి ఇంకా ఏ కన్ఫర్మేషన్ ఇవ్వలేదు. మరోవైపు షోలోకి వచ్చే కంటెస్టెంట్లు వీళ్లేనంటూ పలువురి సెలబ్రిటీల పేర్లు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి..తాజాగా ఆ జాబితాలో సీనియర్ నటుడు, కమెడియన్ సెంథిల్ పేరు వినిపిస్తోంది. కేవలం తమిళంలోనే కాదు దక్షిణాది చిత్ర పరిశ్రమలోనూ ఈయనకు గుర్తింపు ఉంది. ఎక్కువగా పాపులర్ కమెడియన్ గౌండమణితో కలిసి వెండితెరపై నవ్వులు పూయించేవాడు.సెంథిల్ జర్నీ..సెంథిల్ 1970వ దశకంలో సినిమాల్లో ఎంట్రీ ఇచ్చాడు. మొదట్లో చిన్నాచితకా పాత్రలే చేసేవాడు. ఎప్పుడైతే కమెడియన్ గౌండమణితో కలిసి నటించడం మొదలుపెట్టాడో అప్పుడు తన దశ తిరిగిపోయింది. వీరి కాంబినేషన్లో వచ్చిన కరగట్టకరన్, మన్నన్, చిన్నతంబి, ఇండియన్.. వంటి ఎన్నో చిత్రాలు బ్లాక్బస్టర్లుగా నిలిచాయి. తెలుగులో తొలి ముద్దు, మనీ మనీ మోర్ మనీ వంటి పలు చిత్రాల్లో యాక్ట్ చేశాడు. దాదాపు 500 సినిమాల్లో యాక్ట్ చేసిన ఈయనను సినీప్రియులు ఎంతగానో ఇష్టపడతారు, గౌరవిస్తారు. అలాంటి ఈయన ఇప్పుడు బిగ్బాస్కు రాబోతున్నాడని వార్తలు వస్తుండటంతో అతడి అభిమానులు ఖుషీ అవుతున్నారు. మరి అతడి ఎంట్రీ నిజమేనా? కాదా? అనేది తెలియాలంటే అక్టోబర్లో తమిళ బిగ్బాస్ 8 ప్రారంభమయ్యేవరకు వేచి చూడాల్సిందే!మరిన్ని బిగ్బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
సత్య టాలెంట్ను మొదట గుర్తించిన హీరో ఎవరో తెలుసా?
ఈ మధ్య కాలంలో పర్ఫెక్ట్ కామెడీ టైమింగ్తో కడుపుబ్బా నవ్విస్తున్న కమెడియన్ ఎవరైనా ఉన్నారా? అంటే అందులో సత్య ముందు వరుసలో ఉంటాడు. 'మత్తు వదలరా' సీక్వెల్తో ప్రస్తుతం సోషల్ మీడియా సెన్సేషన్గా మారాడు. ఎక్కడ చూసినా సత్య కామెడీ క్లిప్పులే కనిపిస్తున్నాయి. ఇంత మంచి నటుడిని టాలీవుడ్కు పరిచయం చేసింది.. తనలో కమెడియన్ను గుర్తించి ఎవరో తెలుసా? హీరో నితిన్.తెలిసేది కాదుఈ విషయాన్ని సత్య ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టాడు. హీరో నితిన్, రచయిత హర్షవర్ధన్, నిర్మాత డీఎస్ రావు.. వీళ్లే నాలో నటుడున్నాడని గ్రహించారు. మొదట్లోనేను అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసేవాడిని. అప్పుడు నాకు ఎవరితో ఎలా మాట్లాడాలో తెలిసేది కాదు. అందరితోనూ ఒకేలా మాట్లాడేవాడిని. సర్, షార్ట్ రెడీ.. అని పిలిచేవాడిని కాదు.. ఇదిగో మిమ్మల్ని రమ్మంటున్నారు.. వెళ్లండి.. ఇలా అమలాపురం యాసలోనే చెప్పేవాడిని. ఆ హీరో సలహా ఇవ్వడమేగాకనా మాటలు విన్నాక నితిన్ గారు నువ్వు యాక్టర్ అవ్వు, బాగుంటుంది అని సలహా ఇచ్చారు. అక్కడితో ఆగకుండా బలవంతంగా నాతో యాక్టింగ్ చేయించారు. అలా నెమ్మదిగా నటుడిగా మారాను అని చెప్పుకొచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో క్లిప్ ఒకటి నెట్టింట వైరల్గా మారింది. ఇది చూసిన సత్య అభిమానులు.. ఇంత మంచి నటుడిని అందించిన నితిన్కు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నారు. కాగా నితిన్ ద్రోణ (2009) సినిమాకు సత్య అసిస్టెంట్ డైరెక్టర్గా పని చేశాడు.కమెడియన్గా, హీరోగాఇతడు జబర్దస్త్ షోలోనూ పాల్గొన్నాడు. పిల్ల జమీందార్ చిత్రంతో గుర్తింపు అందుకున్నాడు. స్వామిరారా మూవీతో కమెడియన్గా పాపులర్గా అయ్యాడు. చలో సినిమాకుగాను ఉత్తమ హాస్యనటుడిగా సైమా అవార్డు అందుకున్నాడు. గతంలో మత్తు వదలరా చిత్రంతో, ఇప్పుడు దాని సీక్వెల్తో ఆడియన్స్కు నవ్వుల విందు వడ్డించాడు. Thanks @actor_nithiin anna oka manchi actor ni maku ichav #MathuVadalara2 #Satya #Devara pic.twitter.com/hYPSWUG5kP— surya k (@naistam2k) September 15, 2024 చదవండి: జాన్వీ కపూర్ టాలెంట్ చూసి షాకయ్యా..: జూనియర్ ఎన్టీఆర్ -
కమెడియన్ సత్య మరో సునీల్ అవుతాడా..?
-
ఒక్క టికెట్ రూ.25 వేలా? డబ్బు వెనక పరిగెడతాడనుకోలేదు!
ప్రముఖ సింగర్, నటుడు దిల్జిత్ దోసాంజ్ త్వరలో ఇండియాలోని పలు మెట్రో నగరాల్లో సంగీత కచేరి నిర్వహించనున్నాడు. 'దిల్ లుమినటి టూర్' పేరిట నిర్వహించబోతున్న ఈ కన్సర్ట్కు సంబంధించి లక్ష టికెట్లను సెప్టెంబర్ 10న అమ్మకానికి పెట్టగా కొద్ది నిమిషాల్లోనే హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. అయితే ఆ టికెట్ రేట్లు మధ్య తరగతి జనాలకు అందుబాటులో లేవని కమెడియన్, ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లూయెన్సర్ సౌమ్య సాహ్ని ఫైర్ అయింది.అంత డబ్బు ఎక్కడిది?సంగీత కచేరిలో ఒక్క టికెట్ రూ.20-25 వేలా? ప్రేక్షకుల దగ్గర అంత డబ్బు ఎక్కడిది? పైగా ఎక్కువమంది నిరుద్యోగులే! మన భాషలో ఒకరు అద్భుతంగా పాడుతుంటే చూడాలని ఎవరికి ఉండదు.. కానీ టికెట్ రేట్లు ఆ రేంజ్లో ఉంటే దాన్ని కొనడం మధ్య తరగతి వాళ్లకు ఎలా సాధ్యమవుతుంది? పైగా పిల్లలతో కలిసే కుటుంబాలు కచేరీకి వెళ్తుంటాయి.బాగానే సంపాదిస్తున్నారు కదా!ఎలాగో విదేశాల్లో కచేరీలు పెట్టి బాగానే సంపాదిస్తున్నారు కదా! అలాంటప్పుడు కనీసం మనవాళ్ల దగ్గరైనా తక్కువ వసూలు చేయొచ్చుగా.. అంతర్జాతీయ సెలబ్రిటీలు కూడా ఒక్క టికెట్ దాదాపు రూ.10 వేలకే అమ్ముతారు. అలాంటిది నువ్వు రూ. 15 వేలు, రూ.20-25 వేలకు టికెట్స్ అమ్మడమేంటో నీకే తెలియాలి' అని వీడియోలో మండిపడింది.రూ.500 పెట్టడమే ఎక్కువఈ వీడియో చూసిన నెటిజన్లు సౌమ్య అభిప్రాయానికే మద్దతిస్తున్నారు. 'ఒక్క టికెట్కు రూ.500 పెట్టడమే ఎక్కువ. నేనైతే ఆ కచేరీని యూట్యూబ్లో చూస్తాను', 'మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి అయ్యుండి దిల్జిత్ ఇలా డబ్బు, పేరు వెనక పరిగెడతాడని అస్సలు ఊహించలేదు', 'అతడు కావాలనుకుంటే ఒక్క సిటీలోనే పలు షోలు చేయొచ్చు, కానీ అభిమానుల కంటే కూడా డబ్బుకే ప్రాధాన్యత ఇచ్చాడు' అని కామెంట్లు చేస్తున్నారు. ఆరోజే కచేరీ ప్రారంభంకాగా దిల్జిత్ కచేరీ అక్టోబర్ 26 ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ప్రారంభం కానుంది. ఆ తర్వాత హైదరాబాద్, అహ్మదాబాద్, లక్నో, పుణె, కోల్కతా, బెంగళూరు, ఇండోర్, చంఢీగర్ వంటి నగరాల మీదుగా ఈ కచేరీ టూర్ సాగనుంది. View this post on Instagram A post shared by Saumya Sahni (@mrsholmes221b) బిగ్బాస్ ప్రత్యేక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
కమెడియన్ అరుదైన ఘనత.. తొలి భారతీయ నటుడిగా రికార్డ్!
బాలీవుడ్ నటుడు వీర్ దాస్ అరుదైన ఘనత సాధించారు. ఇండస్ట్రీలో స్టాండ్-అప్ కమెడియన్గా గుర్తింపు తెచ్చుకున్న వీర్ దాస్ ప్రతిష్టాత్మక ఎమ్మీ అవార్డ్స్కు హోస్ట్గా ఎంపికయ్యారు. ఇంటర్నేషనల్ అకాడమీ ఆఫ్ టెలివిజన్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్- 2024 ఎమ్మీ అవార్డ్స్ హోస్ట్గా ఆయనను ప్రకటించింది.గతంలో 2021లో కామెడీ విభాగంలో ఎమ్మీ అవార్డ్స్కు నామినేట్ అయ్యారు. అయితే 2023లో నెట్ఫ్లిక్స్ కామెడీ వెబ్ సిరీస్ ల్యాండింగ్కు గానూ వీర్ దాస్ అవార్డ్ గెలుచుకున్నారు. అంతర్జాతీయ ఎమ్మీ అవార్డును అందుకున్న మొదటి భారతీయ కమెడియన్గా వీర్దాస్ రికార్డ్ సృష్టించారు. ఈసారి ఏకంగా అంతర్జాతీయ ఈవెంట్కు హోస్ట్గా ఛాన్స్ కొట్టేశారు. దీంతో ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్లో హోస్ట్గా వ్యవహరిస్తున్న తొలి భారతీయుడిగా నిలిచారు. కాగా..ఈ అవార్డుల ప్రదానోత్సవం నవంబర్ 25న న్యూయార్క్లో జరగనుంది.(ఇది చదవండి: నా సినిమాకు జాతీయ అవార్డ్స్ రాకుండా అడ్డుకున్నారు: పా.రంజిత్)కాగా.. ప్రముఖ స్టాండప్ కమెడియన్గా కెరీర్ ప్రారంభించిన వీర్దాస్కు ప్రపంచవ్యాప్తంగా ఫాలోయింగ్ ఉంది. అతను ఇటీవల ప్రైమ్ వీడియో సిరీస్ కాల్ మీ బేలో న్యూస్ యాంకర్గా కనిపించారు. అతను ప్రస్తుతం ఇంటర్నేషనల్ టూర్లో ఉన్న వీర్ దాస్ ఎమ్మీ అవార్డ్స్కు హోస్ట్గా ఎంపికకావడంపై సంతోషం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని ఇన్స్టాగ్రామ్ ద్వారా పంచుకున్నారు. -
నవ్వుతూ.. నవ్విస్తూ..
నలుగురితో నారాయణ అని కాకుండా నలుగురిలో నేను వేరయా అన్నట్లు ఆర్జేలలో ఆర్జే స్వాతి వేరయా అని నిరూపిస్తున్నారు. డిఫరెంట్ కంటెంట్తో అటు ఆర్జేగా ఇటు సోషల్మీడియా సెలబ్రిటీగా మరోవైపు ఇంట్లో ఇల్లాలిగా, పిల్లల ఆలనాపాలనతో పాటు పలు షోలను చేస్తూ తన సత్తాచాటుతోంది. ఆర్జేగా చేశామా అనేది కాకుండా కొంగొత్త థీమ్స్తో ఇంటర్వ్యూలు చేస్తూనే ఇన్స్టాగ్రామ్లో వైరల్ రీల్స్ చేస్తూ.. తన గెటప్స్తో అదరగొడుతున్నారు. నవ్వించడం చాలా కష్టం.. అందులో ఎదుటువారిమీద జోక్వేసి నవ్వించడం ఒకతీరైతే.. తనమీద తానే జోక్స్ వేసుకొని డిఫరెంట్ గెటప్స్తో నవ్వించడం మరోతీరు. ఈ కోవకే చెందుతారు ఆర్జే స్వాతి. పేరడీ, రీమిక్స్తో లక్షల్లో వ్యూస్ సంపాదిస్తూ.. సోషల్ మీడియాలో సంచలనాలను సృష్టిస్తున్న ఆర్జే స్వాతి తన అనుభవాలను ‘సాక్షి’తో పంచుకున్నారు. ఆ వివరాలు.. టిపికల్ మిడిల్క్లాస్ ప్యామిలీ.. టిపికల్ మిడిల్క్లాస్, స్ట్రిక్ట్ ప్యామిలీ.. మాది. పుట్టింది వరంగల్.. అక్కడే స్కూలింగ్ చేశాను. హైదరాబాద్ రామాంతపూర్లో డిగ్రీ చేసి బీపీఓలో ఉద్యోగం చేసేదానిని. మొదట్లో హైదరాబాద్ కల్చర్ను అలవాటు చేసుకోవడానికి చాలా టైం పట్టింది. కానీ త్వరగా మేలుకొని అలవాటయ్యాను. నాకు మాట్లాడటం అలవాటు.. ఎదుటివారితో కలిసిపోవడం, నవి్వంచడం చాలా ఇష్టం. బీపీఓలో గడగడా మాట్లాడుతూ కస్టమర్ కేర్లో గడసరిగా పేరుతెచ్చుకున్నాను. అలా 2013లో ఆర్జేగా మీరు కూడా అవ్వొచ్చు అనే అడ్వర్టైజ్మెంట్ రావడంతో ఇంట్లో చెప్పకుండా ఆర్జే ఆడిషన్స్కి వెళ్లి ఆడిషన్ ఇచ్చాను. నా ఆడిషన్ రేడియో మిర్చి వారికి నచ్చి నన్ను ఆర్జేగా తీసుకున్నారు.ఇమిటేషన్, కొత్త థీమ్స్ ఇంటర్వ్యూలు.. అందరిలా ఆర్జే చేయడం కన్నా కొద్దిగా సరికొత్తగా చేయడం ఇష్టం. అలా గురు సినిమా హీరో వెంకటేష్తో హీరోయిన్ మాదిరి ఇమిటేషన్ ఇంటర్యూ చేయడం ఆయనకు నచి్చంది. సందర్భానుసారం మట్లాడుతూ, మిమిక్రీ చేస్తూ, సినిమా ఇంటర్యూలలో ఆ సినిమా తాలూకూ థీంని తీసుకొని ఇంటర్యూ చేసేదానిని. అలా ఆర్జేగా నాకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు లభించింది.ఇన్స్టాగ్రామ్ వీడియోలకు స్పందన.. సోషల్ మీడియా వచ్చాక ఇన్స్టాగ్రామ్ వేదికగా నవ్వించే వీడియోలు చేశాను. కానీ సరికొత్తగా చేయాలనే తపనతో రీమిక్స్ గెటెప్ల వైపు మొగ్గాను. ట్రెండింగ్లోని వీడియోలకు అచ్చం అలాగే గెటప్స్ వేసి రీమిక్స్ వీడియోలు చేయడం ప్రారంభించాను. నెటిజన్ల నుండి అనూహ్య స్పందన లభించింది. ట్రెండింగ్ వీడియోస్లోని వారిని అనుకరించడానికి వారి గెటప్స్కి పేరడీగా ఇంట్లో వంట వస్తువులు, కూరగాయలు, నూడిల్స్, మా కుంటుబసభ్యుల దుస్తులు వాడతాను. అలా చేయడం నెటిజన్లను మరింత ఆకర్షించింది. దీంతో రీమిక్స్కి లక్షల్లో వ్యూస్ వచ్చాయి. ఇన్స్టాలో లక్షాపదివేల మంది ఫాలోవర్స్ వచ్చారు. కొంగొత్త కంటెంట్తో నవి్వంచడం నా కర్తవ్యం. ఓ రోజు మా స్టూడియోకి మాజీ మంత్రి కేటీఆర్ వచి్చనపుడు ర్యాప్ సాంగ్ పాడాను. ఆయనకు చాలా నచ్చి మీరు ర్యాపరా కూడానా అని మొచ్చుకున్నారు.లేడీ కమెడియన్ అవ్వాలి.. నేటితరంలో లేడీ కమెడియన్లు చాలా అరుదుగా ఉన్నారు. కోవై సరళలాగా తనమీద తనే జోకులు వేసుకుంటూ చేసే కామెడీని చేయాలన్నది నా కోరిక. లేడీ కమెడియన్గా అడుగులు వేస్తున్నాను. పలు టీవీ షోల వారితో సంప్రదింపులు జరుగుతున్నాయి. త్వరలో ఆర్జేగా, సోషల్ మీడియాతో పాటు బుల్లితెర, వెండితెరలలో నవ్వులు పూయించాలన్నదే నా ఆకాంక్ష.. నవ్వూతూ బ్రతకాలిరా.. నవ్వుతూ చావాలిరా.. నా చివరి శ్వాస వరకూ ప్రేక్షకులను నవి్వంచడానికి ప్రయతి్నస్తూనే ఉంటాను.. ఇట్లు.. మీ ఆర్జే స్వాతి. -
ప్రెగ్నెంట్ అని తెలీక పార్టీలకు వెళ్లి మందు తాగా: కమెడియన్
ప్రెగ్నెంట్ అన్న విషయం తెలియక కమెడియన్ భారతీ సింగ్ మందు తాగింది. నిజానికి ఏడు వారాల వరకు ఆమెకు తాను గర్భవతి అన్న విషయమే తెలియదు. ఈ విషయాన్ని భారతీ సింగ్ స్వయంగా వెల్లడించింది. ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. నా ప్రెగ్నెన్సీని నేను చాలా ఆలస్యంగా తెలుసుకున్నాను. ఎంజాయ్ చేశాఅప్పటిదాకా పార్టీలకు వెళ్తూ హాయిగా నచ్చింది తింటూ, తాగుతూ ఎంజాయ్ చేశాను. అనుకోకుండా ఓ రోజు ప్రెగ్నెన్సీ కిట్ కనిపించడంతో ట్రై చేద్దామనుకున్నాను. తీరా పరీక్షిస్తే పాజిటివ్ అని తేలింది. ఈ విషయాన్ని నా భర్త హార్ష్కు చెప్తే అతడు నమ్మలేదు. తర్వాత ఆస్పత్రికి వెళ్లి పరీక్ష చేస్తే గర్భవతినని నిర్ధారణ అయింది. ఆడవారిదే తప్పంటారు!గర్భంలో ఉన్న శిశువుకు ఏమాత్రం ఇబ్బంది వచ్చినా మహిళదే తప్పంటారు చాలామంది. అయితే భర్త మానసికంగా ధైర్యం చెప్తూ అండగా ఉంటే ప్రతి మహిళకు ప్రెగ్నెన్సీని హ్యాండిల్ చేయడం చాలా ఈజీ. నాకు అలా అర్థం చేసుకునే భర్త దొరికాడు అని చెప్తూ మురిసిపోయింది. ముచ్చటైన కుటుంబంకాగా భారతి సింగ్.. రచయిత, నిర్మాత, యాంకర్ హార్ష్ లింబాచియాను ప్రేమించింది. వీరిద్దరూ కొన్నేళ్లపాటు ప్రేమలో ఉన్నారు. 2017లో పెళ్లి చేసుకున్నారు. వీరికి 2022లో గోలా పుట్టాడు. తన కుమారుడితో కలిసి దిగిన ఫోటోలు, వీడియోలను భారతీ అప్పుడప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది.బిగ్బాస్ ప్రత్యేక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
త్వరలోనే పేరెంట్స్గా ప్రమోషన్.. జోర్దార్ సుజాత కంటతడి
జబర్దస్త్ కమెడియన్ రాకింగ్ రాకేశ్ - నటి, యాంకర్ జోర్దార్ సుజాత దంపతులు గుడ్న్యూస్ చెప్పారు. త్వరలోనే పేరెంట్స్గా ప్రమోషన్ పొందనున్నట్లు ప్రకటించారు. ఈమేరకు ఇన్స్టాగ్రామ్లో కొన్ని ఫోటోలు షేర్ చేశారు. ఇది చూసిన అభిమానులు దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇకపోతే ఏప్రిల్ నెలలో ఆమె సీమంతం కూడా జరిగింది. అయినా దాన్ని బయటకు చెప్పుకోలేదు. ఇన్నాళ్లకు తాను గర్భవతిని అని తెలియజేస్తూ ఓ వీడియోను యూట్యూబ్లో రిలీజ్ చేసింది. 'ఈ మధ్య సోషల్ మీడియాలో ఏ వీడియో షేర్ చేసినా మీరు ప్రెగ్నెంటా? అని కామెంట్లు చేస్తూనే ఉన్నారు.ప్రెగ్నెన్సీఒక మంచి సందర్భం చూసుకుని చెప్దామనే ఇన్నాళ్లు ఆగాం. మీరు ఆశీర్వదించినట్లే మా వివాహబంధం ఇంకో అడుగు ముందుకేసింది. ఈ విషయం చెప్తున్నందుకు సంతోషంగా ఉంది. అలాగే ఎమోషనల్గానూ ఉంది. మా ఇద్దరి ప్రేమకు ప్రతి రూపం ఈ ప్రపంచంలోకి రాబోతోంది. మీ అందరికీ ఈ విషయం చెప్పడానికి 9 నెలలు పట్టింది. ప్రెగ్నెన్సీ వచ్చినప్పటి నుంచి మా ఆయన నన్ను ఎంతో అపురూపంగా చూసుకున్నాడు. జన్మజన్మలకూ ఆయనకు నేనే భార్యను కావాలి.ఇంటికి పంపలేదుమా ఇంట్లోని వీణ(తోటి కోడలు).. నన్నెంత బాగా చూసుకుంటుందో! నేను ఏ ఫుడ్ తీసుకోవాలనే విషయంలో మా ఆయనతో పోటీపడేది. నాకు ప్రెగ్నెన్సీ వచ్చినప్పటినుంచి మా ఆయన నన్ను ఇంటికి పంపలేదు. అక్కడ రోడ్లు సరిగా లేవు, ఊరిలో ఆస్పత్రులు లేవని పంపలేదు. అలాంటి సమయంలో నన్ను చాలా బాగా చూసుకుంది. ఇల్లు గుర్తు రాకుండా ప్రేమను పంచింది. ఇలా ఎమోషనల్ అయితాననే ఇన్నిరోజులు వీడియో చేయలేదు' అంటూ సుజాత కంటతడి పెట్టుకుంది. View this post on Instagram A post shared by Rocking Rakesh (@jabardasthrakesh) View this post on Instagram A post shared by Sujatha P (@jordarsujatha) చదవండి: Mahima Makwana: పదేళ్ల వయసులోనే నటిగా మారింది! ఇప్పుడు -
విడాకుల రూమర్స్.. క్లారిటీ ఇచ్చిన కమెడియన్ హర్ష
కమెడియన్ హర్ష ఇటీవల సోషల్ మీడియాలో ఓ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశాడు. జీవితం అనేది రోలర్ కోస్టర్ రైడ్లాంటిది. ఎత్తుపల్లాలు ఉంటాయి. ఎగ్జయిట్మెంట్, చికాకు, భయం, థ్రిల్.. ఇలా అన్నీ ఉంటాయి. కానీ, ఏవీ మన చేతిలో ఉండవు. మనల్ని ఆపడానికి వస్తాయి. తర్వాత అవే వెళ్లిపోతాయి. అప్పటివరకు మనం బకెల్ పట్టుకుని కూర్చుని రైడ్ను ఎంజాయ్ చేయాల్సిందే!విడాకుల రూమర్స్పై క్లారిటీఅసలేదీ ఆశించకూడదు.. తర్వాత నిరాశ చెందకూడదు. జీవితం ఎటు వెళ్తే అటు పోవడమే అని ఇన్స్టాగ్రామ్లో ఓ పోస్ట్ పెట్టాడు. ఇది చూసిన జనాలు హర్షకు ఏమైందని కంగారుపడ్డారు. కొందరైతే అతడు విడాకులు తీసుకోబోతున్నాడంటూ పుకార్లు సృష్టించారు. దీంతో హర్ష తాజాగా ఈ రూమర్స్పై క్లారిటీ ఇచ్చాడు. తన వ్యక్తిగత జీవితం సాఫీగానే ఉందని, కెరీర్లోనే చిన్న ఆటంకాలని తెలిపాడు.హ్యాపీగా ఉన్నాఈ మేరకు మరో పోస్ట్ షేర్ చేశాడు. మనం కింద పడినప్పుడు లేచి నిలబడటం నేర్చుకుంటాం. ఇంకా స్ట్రాంగ్గా ముందుకు సాగుతాం.. నా గత పోస్టు గురించి ఆరా తీస్తున్న అందరికీ కృతజ్ఞతలు.. నా జీవితంలో యోగక్షేమాలను ఆరా తీసేవాళ్లు ఇంతమంది ఉన్నారా? అని సంతోషంగా అనిపించింది. విషయమేంటంటే.. వ్యక్తిగత జీవితంలో నేను హ్యాపీగా ఉన్నాను. పని దగ్గరే కాస్త చికాకుగా ఉన్నాను. అక్కడ పనికిమాలిన రాజకీయాలు చేస్తున్నారు. దానివల్లే ఇబ్బందులు పడుతున్నాను.చెత్త రాజకీయాలుఅయినా ఇవన్నీ ప్రతిచోటా ఉండేవే..! ఇది నీ వల్ల కాదు, నువ్వు చేయలేవు అని ఎవరితోనో అనిపించుకునే స్థాయికి రాకండి.. ఒంటరిగా ఒక్కరే పూర్తి చేయండి. చేయగలను అన్న విశ్వాసం ఉంచండి. ఏదేమైనా నేను బాగానే ఉన్నాను. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా మరింత స్ట్రాంగ్గా తిరిగొస్తాను. జీవితమంటే ఇంతే.. దానికి ఎవరూ ఎదురీదలేరు అని రాసుకొచ్చాడు. కాగా హర్ష తన ప్రియురాలు అక్షరను 2021లో పెళ్లాడాడు. View this post on Instagram A post shared by Harsha (@harshachemudu) View this post on Instagram A post shared by Harsha (@harshachemudu) చదవండి: 12th ఫెయిల్.. అలాంటి పాత్రలే చేయాలని లేదు: హీరోయిన్ -
చావే దిక్కనుకున్నా.. కూతురి కోసం ఆగిపోయా: లేడీ కమెడియన్
ఆర్య.. లేడీ కమెడియన్. బడాయి బంగ్లా అనే కామెడీ షోతో తన పేరు కాస్తా ఆర్య బడాయిగా మారిపోయింది. నటిగా, హాస్య నటిగా, యాంకర్గా, జడ్జిగా ఇలా వివిధ పాత్రలు పోషించే ఆమె సినిమాలు, రియాలిటీ షోలతో ఫుల్ బిజీగా ఉంది. అందరినీ కడుపుబ్బా నవ్వించే ఆర్య జీవితంలో మాత్రం ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొంది. 2008లో ఐటీ ఇంజనీర్ రోహిత్ సుశీలన్ (నటి అర్చన సుశీలన్ సోదరుడు)ను పెళ్లాడగా వీరికి రోయ అనే కూతురు పుట్టింది. కూతురి పేరు మీద ఓ బొటిక్ కూడా ఓపెన్ చేసింది. అయితే ఏమైందో ఏమో కానీ 2019లో భర్తతో విడిపోయి కూతురితో ఒంటరిగా నివసిస్తోంది.బిగ్బాస్ తర్వాత డిప్రెషన్తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన బాధను బయటపెట్టింది. బిగ్బాస్ నుంచి వచ్చాక డిప్రెషన్లోకి వెళ్లిపోయాను. ఆ మానసిక ఒత్తిడి నుంచి బయటపడలేకపోయాను. చనిపోయేందుకు ప్రయత్నించాను. నిద్రమాత్రలు తీసుకున్నాను. కానీ నా కూతురిని చూసి ఆగిపోయాను. తనే నన్ను ఆ బాధలో నుంచి బయటపడేసింది. ఎప్పుడైనా సరే మనకు తట్టుకోలేనంత బాధ అనిపిస్తే దాన్నుంచి ఎలా బయటపడాలా? అని ఆలోచిస్తాం. చావు ఒక్కటే మార్గం అనుకుంటాం. మరణమే మార్గమనుకున్నాలాక్డౌన్లో నాకూ అలాంటి పరిస్థితే ఎదురైంది. మాట్లాడేందుకు కూడా ఎవరూ లేరు. చావే సరైన నిర్ణయమనుకున్నాను. కానీ నా కూతురు.. తన పరిస్థితి ఏం కావాలి? తనను చూసుకోవడానికి మా నాన్న కూడా లేరు. ఆయన ఉండుంటే కూతుర్ని ఆయన చూసుకుంటాడన్న ధీమాతో ఎప్పుడో ప్రాణాలు వదిలేసేదాన్ని. నేను, అమ్మ, వదిన, పాప.. వాళ్లకంటూ ఉన్నది నేనేగా! అందరినీ వదిలేసిపోతే వాళ్లుం ఏం చేస్తారు? నా కూతురు జీవితం ఏమైపోతుంది? పాపను తన తండ్రి బాగానే చూసుకుంటాడు.కూతురి కోసం ఆలోచించి ఆగిపోయాకానీ చుట్టూ ఉన్న సమాజం ప్రేమలో ఓడిపోయి మీ అమ్మ బలవన్మరణానికి పాల్పడిందంటూ కాకుల్లా పొడిచి మరీ చెప్తారు. అవన్నీ ఆలోచించి ఆగిపోయాను. నా కుటుంబంతో, ఫ్రెండ్స్తో మాట్లాడాను. మళ్లీ సరైన దారిలోకి వచ్చాను. పెళ్లి విఫలమవడాన్ని భరించాను, తర్వాత బ్రేకప్ బాధనూ తట్టుకున్నాను, ఆఖరికి నాన్న మరణాన్ని సైతం తట్టుకుని నిలబడ్డాను. అందుకే అందరూ నన్ను బోల్డ్ అని పిలుస్తుంటారు. కానీ నేను చాలా ఎమోషనల్.. అని ఆర్య చెప్పుకొచ్చింది. View this post on Instagram A post shared by Arya Babu (@arya.badai) చదవండి: నటుడి ఇంట మొన్న విషాదం.. అంతలోనే సంతోషం.. -
కామెడీ పేరుతో అవమానించారు, ఇంత నిర్దయగా ప్రవర్తిస్తారా?: నటి
కామెడీ పండించడం అంత ఈజీ కాదు. కానీ ఇది తనకు కొట్టిన పిండి అన్నట్లుగా అవలీలగా నవ్వులు పూయించగలదు కుశా కపిల. సోషల్ మీడియాతో స్టార్డమ్ తెచ్చుకున్న ఈ బ్యూటీ ఘోస్ట్ స్టోరీస్ అనే వెబ్ సిరీస్లో, ‘ప్లాన్ ఏ ప్లాన్ బి’, ‘సెల్ఫీ’, ‘థాంక్యూ ఫర్ కమింగ్’ వంటి పలు చిత్రాల్లోనూ నటించింది. ఇటీవల ప్రెట్టీ గుడ్ రోస్ట్ షోలో పాల్గొంది.అది నా తప్పేఅక్కడ స్టాండప్ కమెడియన్లు తన మీద కుళ్లు జోకులు వేయడాన్ని సహించలేకపోయింది. తన వ్యక్తిగత విషయాలైన విడాకుల గురించి కూడా సెటైర్లు వేయడాన్ని తట్టుకోలేకపోయింది. తాజాగా ఆమె మాట్లాడుతూ.. నా ఫ్రెండ్ ఒకరు చెప్పారని ఆ షోకి వెళ్లాను. నన్ను ఈరేంజ్లో రోస్ట్ చేస్తారనుకోలేదు. వాళ్లు ఏం ప్లాన్ చేశారనేది ముందుగానే అడిగి తెలుసుకోవాల్సింది. నా ఫ్రెండ్ మీద నమ్మకంతో నేనా పని చేయలేదు. అది నా తప్పే!అందరి ముందు చులకనగాఅక్కడున్న ప్రేక్షకులు, సాంకేతిక నిపుణుల ముందు నన్ను చులకన చేసి మాట్లాడారు. నాపై వేసిన జోక్స్ కూడా నన్ను అవమానించేట్లుగా ఉన్నాయి. వీరికి మానవత్వమే లేదా అనిపించింది. కామెడీ పేరుతో ఒక మనిషిని ఇంత దారుణంగా హేళన చేయడం కరెక్ట్ కాదు. ఆ ఎపిసోడ్ ప్రసారం చేసేందుకు కూడా నా మనసు అంగీకరించలేదు. కానీ దాన్ని అడ్డుకుంటే నేను పిరికిదాన్నని ట్రోల్ చేసేవారు. అందుకే ఆ ఎపిసోడ్ ప్రసారం కానిచ్చాను.అదే గమనించాఅయితే నా తర్వాత షూట్ చేసిన ఎపిసోడ్లలో మాత్రం వారు హద్దులు దాటలేదు. ముఖ్యంగా మహిళల విషయంలో నోటికొచ్చిన జోక్స్ వేయలేదు. ఈ ఆరు నెలల్లో నేను గమనించిందేంటంటే విడాకులు తీసుకున్న మహిళలను ఏమైనా అంటారు. వారిని విలన్లలాగా చూస్తారు అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం కుష కపిల లైఫ్ హిల్ గయి అనే వెబ్ సిరీస్లో నటిస్తోంది.చదవండి: నేను చేసిన తప్పులకు కృతజ్ఞతలు: ధనుష్ -
ఉపాసనపై టాలీవుడ్ కమెడియన్ ప్రశంసలు.. ఎందుకంటే?
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సినిమాలతో సంబంధం లేకపోయినా చెర్రీ భార్యగా, వ్యాపారవేత్తగా ఎప్పుడు వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. ఈ నెల 20న తన పుట్టినరోజు కావడంతో రామ్ చరణ్ స్పెషల్గా విష్ చేశారు. 'క్లీంకార మమ్మీ' అంటూ కొత్త పేరుతో బర్త్ డే శుభాకాంక్షలు తెలిపారు.అయితే తాజాగా నటుడు, కమెడియన్ భద్రం.. ఉపాసనకు ప్రత్యేకంగా బర్త్ డే విషెస్ తెలిపారు. ఈ సందర్భంగా ఉపాసనపై ప్రశంసలు కురిపించారు. ఆమె మంచి మనసున్న వ్యక్తి అని కొనియాడారు. కుటుంబ సభ్యులు, సపోర్టింగ్ స్టాఫ్ కొరకు లాఫ్టెడ్ థెరపీ కోసం ప్రత్యేకంగా ఓ సెషన్ నిర్వహించమని అడిగినప్పుడు మీకు ఫ్యామిలీ పట్ల ఉన్న ప్రేమాభిమానాలు, కేరింగ్ అర్థమైందన్నారు. మీ ఫ్యామిలీతో పాటు మీ చుట్టూ ఉన్న వారి పట్ల అంతే కేరింగ్గా ఉంటూ.. వారు కూడా బాగుండాలని కోరుకున్నారని తెలిపారు. ఎల్లప్పుడు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నట్లు భద్రం తన ట్విటర్లో పోస్ట్ చేశారు. Happy Happy Birthday @upasanakonidela Ma'am pic.twitter.com/2jQksINIpx— భద్రం (@BhadramDr) July 20, 2024 -
యోగిబాబు హీరోగా.. 'కానిస్టేబుల్ నందన్'
తమిళసినిమా: చిన్న చిన్న పాత్రల నుంచి ప్రముఖ హాస్య నటుడిగా ఎదిగిన యోగిబాబు ఆ తరువాత కథానాయకుడి అవతారమెత్తి సక్సెస్పుల్గా రాణిస్తున్నారు. ప్రస్తుతం ఈయన లేని చిత్రం లేదంటే అతిశయోక్తి కాదు. అటు హాస్య పాత్రల్లోనూ, ఇటు హీరోగానూ రెండు పడవలపై విజయవంతంగా పయనిస్తున్న యోగిబాబు తాజాగా హీరోగా నటిస్తున్న చిత్రం కానిస్టేబుల్ నందన్. శంకర్ పిక్చర్స్ పతాకంపై డి.శంకర్ తిరువణ్ణామలై నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా భూపాల నటేశన్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.ఈయన దర్శకుడు సుందర్.సి, శశికుమార్, ఎం.కళైంజయం వద్ద సహాయ దర్శకుడిగా పని చేశారు. కాగా ఈయన దర్శకుడిగా పరి చయం అవుతున్న చిత్రం కానిస్టేబుల్ నందన్ ఆదివారం ఉదయం తిరువణ్ణామలైలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత డి.శంకర్ తిరువణ్ణామలై మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంటూ పలువురు నటులకు స్ఫూర్తిగా నిలిస్తున్న నటుడు యోగిబాబు వంటి ఉత్తమ నటుడితో కలిసి చిత్రం చేయడం ఘనతగా భావిస్తున్నానన్నారు.కథ చెబుతున్నప్పుడే ఆయన చూపించిన ఆసక్తి నిజంగానే అభినందనీయమన్నారు. పలు వురు ప్రముఖ దర్శకుల వద్ద పని చేసి చాలా విషయాలు నేర్చుకున్న భూపాల నటేశన్ వంటి ప్రతిభావంతుడైన దర్శకుడితో కానిస్టేబుల్ నందన్ చిత్రాన్ని చేయడం సంతోషంగా ఉందన్నారు. ఇలాంటి మంచి కథా చిత్రాలను మరిన్ని చేయాలని కోరుకుంటున్నానన్నారు.దర్శకుడు భూపాల నటే శన్ పేర్కొంటూ మంచి కథా చిత్రాలను నిర్మించాలన్న భావన కలిగిన నిర్మాతలను కనుగొనడం ఒక వరప్రసాదం అన్నారు. అలాంటి శంకర్ తన కథను చిత్రంగా నిర్మించడానికి ముందుకు రావడం సంతోషంగా ఉందన్నారు. ప్రేక్షకులు, బయ్యర్లకు నచ్చిన నటుడు యోగిబాబుతో కలిసి పని చేయడం చాలా ఆనందంగా ఉందన్నారు.ప్రముఖ హాస్యనటుడిగా కొనసాగుతూనే హీరోగా పలు విజయవంతమైన చిత్రాల్లో నటిస్తున్న ఆయన కేరీర్ కానిస్టేబుల్ నందన్ చిత్రం ఒక మైలు రాయిగా ఉంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కాగా ఇందులో యోగిబాబుకు విలన్గా ఓ బలమైన పాత్ర ఉంటుందన్నారు. ఆ పాత్ర కోసం ప్రతిభావంతుడైన నటుడిని ఎంపికచేసి త్వరలోనే వెల్లడించనున్నట్లు దర్శకుడు భూపాల నటేశన్ పేర్కొన్నారు.ఇవి చదవండి: 'మదర్ ఇండియా'కు సిద్ధం.. -
దీనస్థితిలో నటుడు.. ఆదుకున్న కమెడియన్..
ప్రముఖ కమెడియన్ వెంగళ్రావు దీన స్థితిలో ఉన్నాడు. తమిళంలో ఎన్నో హిట్ సినిమాల్లో నటించిన ఈయన కొన్నేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఇటీవల ఈయన ఆరోగ్య పరిస్థితి మరింత దిగజారింది. చికిత్సకు సైతం డబ్బుల్లేకపోవడంతో ఆదుకోవాలని కోరుతూ ఓ వీడియో రిలీజ్ చేశాడు. ఒక చేయి, కాలు పక్షవాతానికి గురైందని, పని చేసే స్థితిలో లేనని, చికిత్సకు డబ్బులిచ్చి సాయం చేయాలని సినిమా తారలకు విజ్ఞప్తి చేశాడు.కదిలిన సినీతారలుఇది చూసిన తమిళ హీరో శింబు రూ.2 లక్షలు, హీరోయిన్ ఐశ్వర్య రాజేశ్ రూ.25,000 ఆర్థిక సాయం చేసినట్లు తెలుస్తోంది. తాజాగా కమెడియన్ వడివేలు.. నటుడిని ఆదుకునేందుకు ముందుకు వచ్చాడు. లక్ష రూపాయలు ఇవ్వడంతో పాటు తనను నేరుగా కలిసి యోగక్షేమాలు తెలుసుకోనున్నాడు.వడివేలుతోనే ఎక్కువ సినిమాలుకాగా వెంగళ్రావు సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన కొత్తలో స్టంట్మెన్గా పని చేశాడు. తర్వాత నటుడిగా మారాడు. కాంతస్వామి, తలై నగరం, పగిరి.. ఇలా అనేక చిత్రాలు చేశాడు. ఎక్కువగా వడివేలుతో కలిసి పని చేశాడు. వీరిద్దరి కాంబినేషన్లోనే దాదాపు 30 సినిమాలున్నాయి. ప్రస్తుతం వెంగళ్రావు విజయవాడలో నివసిస్తున్నాడు. #வடிவேலு உடன் காமெடி வேடங்களில் நடித்த #வெங்கல்ராவ் ஒரு கை, ஒரு கால் செயல் இழந்து, சொந்த ஊரான விஜயவாடாவில் சிகிச்சை பெற்று வருகிறார்.மருத்துவச் செலவுக்கு நடிகர்கள் மற்றும் சினிமா தொழில்நுட்பக் கலைஞர்கள் தனக்கு உதவும்படி வீடியோ வெளியிட்டுள்ளார்.@GovindarajPro #VengalRao pic.twitter.com/6wkYJBVTqK— Actor Kayal Devaraj (@kayaldevaraj) June 24, 2024చదవండి: పెళ్లయిన ఐదురోజులకే ఆస్పత్రిలో హీరోయిన్.. ఏమైంది? -
Premgi Amaren: 45 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకున్న కమెడియన్ (ఫోటోలు)
-
పెళ్లి చేసుకున్న 45 ఏళ్ల కమెడియన్.. వీడియో వైరల్
ప్రముఖ కమెడియన్ కమ్ మ్యూజిక్ కంపోజర్ ప్రేమ్గీ పెళ్లి చేసుకున్నాడు. ఇందు అనే అమ్మాయితో ఏడడుగులు వేశాడు. జూన్ 9న తిరుత్తణి గుడిలో పెళ్లి చేసుకుంటాడని అన్నారు. కానీ శనివారం రాత్రి కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో వివాహం చేసుకున్నాడు. ఈ విషయాన్ని ప్రేమ్ గీ సోదరుడు, ప్రముఖ దర్శకుడు వెంకట్ ప్రభు బయటపెట్టాడు. తన ఇన్ స్టాలో కొత్త జంటకు శుభాకాంక్షలు చెబుతూ పోస్ట్ పెట్టాడు.(ఇదీ చదవండి: బాలీవుడ్లోకి శ్రీలీల ఎంట్రీ.. ఆ స్టార్ హీరో కొడుకుతో కలిసి!)తమిళ ప్రముఖ దర్శకుడు వెంకట్ ప్రభుకి సోదరుడే ప్రేమ్ గీ. ఇతడి ప్రస్తుత వయసు 45 ఏళ్లు. కానీ ఇన్నాళ్లు ఒంటరిగానే ఉన్నాడు. అలాంటిది కొన్నాళ్ల ముందు ప్రేమ్ గీ పెళ్లి చేసుకోబోతున్నాడని న్యూస్ వచ్చింది. చాలామంది దీన్ని రూమర్ ఏమో అనుకున్నారు. కానీ వెడ్డింగ్ కార్డ్ బయటకొచ్చేసరికి నిజమని తేలింది. అమ్మాయి పేరు ఇందు అని తప్పితే ఇంకే వివరాలు ప్రస్తుతానికైతే లేదు. తాజాగా జరిగిన పెళ్లి వేడుకకు యువ హీరోలు జై, వైభవ్ తదితరులు హాజరయ్యారు. ఆ వీడియోనే ఇప్పుడు వైరల్ అవుతోంది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన తమిళ హిట్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్) View this post on Instagram A post shared by Vaibhav Reddy (@vaibhav30) View this post on Instagram A post shared by Venkat Prabhu (@venkat_prabhu) -
'డబ్బు కోసమే 46 ఏళ్ల కమెడియన్తో పెళ్లి'.. నటి ఏమందంటే?
జైలర్ నటుడు, కమెడియన్ రెడిన్ కింగ్స్లీ గతేడాది పెళ్లి చేసుకున్నాడు. 46 ఏళ్ల వయసులో ప్రియురాలు, నటి సంగీత మెడలో మూడుముళ్లు వేశాడు. వివాహం తర్వాత తన ఫస్ట్ బర్త్డేను భార్యతో కలిసి సెలబ్రేట్ చేసుకున్నాడు. అంత పెద్ద వయసులో ఉన్నవాడిని సంగీత పెళ్లి చేసుకోవడానికి కారణం డబ్బేనని చాలామంది విమర్శించారు. ఇకపోతే సంగీతకు ఇదేమీ ఫస్ట్ మ్యారేజ్ కాదు. రెండో పెళ్లిగతంలో ఆమె క్రిష్ను పెళ్లాడగా వీరికి ఒక పాప కూడా ఉంది. వ్యక్తిగత కారణాల వల్ల వీరు విడాకులు తీసుకున్నారు. అనంతరం సంగీత రెడిన్తో ప్రేమలో పడగా ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. తన పెళ్లిపై వస్తున్న ట్రోల్స్పై తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె స్పందించింది. సంగీత మాట్లాడుతూ.. ఈ వయసులో పెళ్లి అవసరమా? అంటున్నారు. మా వయసు పెరగలేదుమానసికంగా నా వయసు 18, తన వయసు 22! మేము ఆ ఏజ్లోనే ఉన్నట్లు ఫీలవుతున్నాం. అది మీకు చెప్పినా అర్థం కాదు. ఇంకేమన్నారు.. డబ్బు కోసం పెళ్లి చేసుకున్నానా? అదెలాగో కాస్త వివరించి చెప్తారా? మీ వల్ల కాదు! అతడిలో నాకు నచ్చింది సింప్లిసిటీ! చాలా నిరాడంబరంగా ఉంటాడు. అది చూసే తనను పెళ్లి చేసుకున్నాను అని పేర్కొంది.కమెడియన్గా గుర్తింపుకాగా రెడిన్ కింగ్స్లీ.. కోలమావు కోకిల అనే తమిళ చిత్రంతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమాకు నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించాడు. నెల్సన్ డైరెక్ట్ చేసిన అన్ని సినిమాల్లోనూ రెడిన్ యాక్ట్ చేశాడు. డాక్టర్ మూవీలో ఈయన పోషించిన భగత్ పాత్ర అతడికి మంచి గుర్తింపు తీసుకొచ్చింది.సీరియల్స్- సినిమాలుఎల్కేజీ, అన్నాత్తె, బీస్ట్, కాతువాకుల రెండు కాదల్, మార్క్ ఆంటోని, మట్టి కుస్తీ, జైలర్ వంటి పలు సినిమాల్లో నవ్వులు పూయించాడు. సంగీత విషయానికి వస్తే అరన్మనైక్కిలి, తిరుమల్ వంటి సినిమాలు చేయగా సీరియల్స్లోనే ఎక్కువగా నటించింది. -
మోదీపై పోటీ.. కమెడియన్ నామినేషన్ తిరస్కరణ
లోక్సభ ఎన్నికల వేళ అందరి చూపు వారణాసి పార్లమెంట్ స్థానం వైపే ఆకర్షిస్తోంది. అక్కడ పోటీ చేస్తేది.. ప్రధాని మోదీ కాబట్టి. అయితే మోదీపై పోటీ చేయడానికి కమెడియన్ శ్యామ్ రంగీలా వేసిన నామినేషన్ తిరస్కరణకు గురైంది. ప్రధాని నరేంద్ర మోదీ వాయిస్ను అనుకరించటం వల్ల ఫేమస్ అయిన శ్యామ్ రంగీలా.. మే 14న వారణాసి స్థానానికి నామినేషన్ వేశారు. ఈ సెగ్మెంట్లో ప్రధాని మోదీకి వ్యతిరేకంగా స్వతంత్ర అభ్యర్థిగా శ్యామ్ రంగీలా నామినేషన్ వేశారు. ఒక రోజు తర్వాత ఆయన నామినేషన్ను తిర్కరించినట్లు ఎన్నికల సంఘం తన వెబ్సైట్లో పొందుపర్చింది. వారణాసిలో తనను నామినేషన్ వేయనీయకుండా ఇబ్బందులు కలిగిస్తున్నారని ఇటీవల ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.‘‘నన్ను ప్రతిపాదించేవారు ఉన్నారు. సంబందిత పత్రాలు కూడా నింపాం. ఆమోదించడానిక ఎవరు ముందుకు రావటం లేదు. రేపు మళ్లీ ప్రయత్నం చేస్తాం’’ అని మే 13న శ్యామ్ రంగీలా అన్నారు. మరుసటి రోజు కూడా అధికారులు సహరించలేదని తెలిపారు. అనంతరం ఎట్టకేలకు నిబంధంనల మేరకు నామినేషన్ దాఖలు చేసినట్లు వెల్లడించారు. ప్రస్తుతం శ్యామ్ రంగీలా నామినేష్ను తిరస్కరణకు గురైంది. దీనిపై బుధవారం శ్యామ్ రంగీలా స్పదించారు. ‘‘ప్రజాస్వామ్యం హత్యకు గురైంది. ఎన్నికల్లో పోటీ చేయటాన్ని ఎన్నికల సంఘం ఒక ఆటలా భావిస్తోంది. నా నామినేషన్ను తిరస్కరించారు. ప్రజల ముందు ఎన్నికల అధికారుల ఇలా ఎందుకు చేశారో? 24 గంటల్లోనే ప్రజలకు అర్థం అయింది. నేను సమర్పించిన పత్రాల్లో ఎటువంటి సమస్య లేదు. నాకు తెలుసు నేను అన్ని అవసరమైన పత్రాలు సమర్పించాను. నిన్నటి విజయం నేడు ఓడి పోయింది’’ అని శ్యామ్ రంగీలా అన్నారు.ఇక.. రాజస్థాన్లోని హనుమాన్గర్హ్ జిల్లాలోని మనక్తేరి బరనీ గ్రామంలో 1994లో పుట్టిన ఆయన అసలు పేరు శ్యామ్ సుందర్. యానిమేషన్ పట్టభద్రుడైన శ్యామ్ సరదాగా కామెడీ, మిమిక్రీ, స్టాండప్ కామెడీ చేస్తుండేవాడు. 2017లో ది గ్రేట్ ఇండియన్ లాఫ్టర్ ఛాలెంజ్ పోటీలో నరేంద్ర మోదీ వాయిస్ను శ్యామ్ మిమిక్రీ చేశాడు. అప్పటి నుంచే ఆయన విశేష గుర్తింపు వచ్చింది. ప్రధాని మోదీ గొంతును మిమిక్రీ చేసిన తర్వాత శ్యామ్కు వేధింపులు మొదలయ్యాయి. శ్యామ్ 2022లో ఆమ్ ఆద్మీ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా సామాజిక మాధ్యమాల ద్వారా మోదీని విమర్శలు చేస్తూ సంచలనం రేపారు. వారణాసి పార్లమెంట్ స్థానానికి ఏడో విడతలో జూన్ 1న పోలింగ్ జరగనుంది. జూన్ 4 ఫలితాలు విడుదల కానున్నాయి. -
డాక్టర్ కాళ్లు పట్టుకున్నా.. అర్ధరాత్రి రోడ్డుపై ఏడ్చుకుంటూ వెళ్లా..
జబర్దస్త్ కమెడియన్ ముక్కు అవినాష్ బుల్లితెరపై ప్రసారమయ్యే షోలతో పాటు సినిమాలు కూడా చేస్తున్నాడు. జగిత్యాల జిల్లాలోని రాఘవపట్నం గ్రామానికి చెందిన ఈ కమెడియన్ అంచెలంచెలుగా ఎదిగి తనకంటూ పేరుప్రఖ్యాతలు సంపాదించుకున్నాడు. 2021లో అనూజతో పెళ్లి జరగ్గా గతేడాది ఆమె ప్రెగ్నెన్సీ వార్తను వెల్లడించాడు. కానీ ఈ ఏడాది ప్రారంభంలో అబార్షన్ అయిందని బ్యాడ్ న్యూస్ చెప్పాడు.ఐదు నెలల క్రితమే..తాజాగా ఓ ఇంటర్వ్యూలో అవినాష్ మాట్లాడుతూ.. నాది పెద్దలు కుదిర్చిన సంబంధం. 2021లో అనూజతో నా పెళ్లి జరిగింది. గతేడాది తను గర్భవతి. ఐదు నెలల క్రితమే బిడ్డను కోల్పోయాం. తెల్లవారితే డెలివరీ అనగా సడన్గా అనూజ కడుపులో బేబీ కదలికలు ఆగిపోయాయి. ఆస్పత్రికి తీసుకెళ్తే బిడ్డ గుండె కొట్టుకోవడం ఆగిపోయిందన్నారు. ఉమ్మునీరు మింగడం వల్ల అలా జరిగి ఉండొచ్చన్నారు.అర్ధరాత్రి రోడ్డుపై..అప్పుడు నేను స్టేజీపై షూటింగ్లో ఉన్నాను. వెంటనే ఆస్పత్రికి వెళ్లి ఏదో ఒకటి చేయండని డాక్టర్ కాళ్ల మీద పడ్డాను. హార్ట్బీట్ ఆగిపోతే ఏం చేయలేమన్నారు. అర్ధరాత్రి ఒంటిగంటకు ఎటు వెళ్తున్నానో కూడా తెలీకుండా రోడ్డుపై ఏడ్చుకుంటూ ఒంటరిగా సాగిపోయాను. ఆ శిశువును బయటకు తీస్తే అచ్చం నాలాగే ఉన్నాడు. 2.75 కిలోల బరువుతో పుట్టాడు. కానీ వాడిలో ప్రాణం లేదు. ఇప్పటికీ నా భార్య అర్ధరాత్రిళ్లు కుమిలి కుమిలి ఏడుస్తోంది. తొమ్మిది నెలలు మోసింది కదా.. ఆ బాధ నుంచి బయటకు రాలేకపోతోంది' అని అవినాష్ ఎమోషనలయ్యాడు.చదవండి: Satish Joshi: స్టేజీపై కుప్పకూలి తుదిశ్వాస విడిచిన నటుడు -
ప్రముఖ కమెడియన్ మంచి మనసు.. ఏకంగా లక్షల సాయం
ప్రముఖ తమిళ హాస్య నటుడు అప్పుకుట్టి మంచి మనసు చాటుకున్నాడు. తాను చదివిన పాఠశాలకు రూ.11 లక్షలు విరాళం ఇచ్చి, తన ఔదార్యం చాటుకున్నాడు. అప్పుకుట్టి స్వస్థలం తమిళనాడులోని తూత్తుకుడి జిల్లా నాథన్ కినరు. ఆ ప్రాంతంలోని ముత్తారమ్మన్ ఆలయంలో జరుగుతున్న ఉత్సవాలకు అప్పుకుట్టి వెళ్లాడు. వేడుకల సందర్భంగా నాథన్ కినేరులోని తాను చదువుకున్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు వెళ్లాడు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్)గ్రామ ప్రజల కోరిక మేరకు అప్పుకుట్టి.. రూ.11 లక్షల ఖర్చుతో టేబుల్, కంప్యూటర్, టీవీ విద్యుత్ ఫ్యాన్లు, తదితర వస్తువులను కొని ఇచ్చాడు. దీని గురించి అప్పుకుట్టి మాట్లాడాడు. ఈ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో తాను ఒకటి, రెండు తరగతులు చదివానని, అయితే ఇక్కడ కనీస వసతులు లేకపోవడంతో చదివే విద్యార్థుల సంఖ్య కూడా తక్కువగానే ఉందన్నారు. ఈ క్రమంలోనే పాఠశాలకు అవసరమైన సామగ్రి అందించానని అన్నాడు.ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఉపాధి అవకాశాల్లో ప్రభుత్వం ప్రాధాన్యం ఇవ్వాలని అప్పుకుట్టి కోరాడు. అప్పుడే ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల సంఖ్య పెరుగుతుందని అభిప్రాయం వ్యక్తం చేశాడు. మనం ఊరి బయట ఉన్నా, ఏడాదికి కొన్ని రోజులు ఊరిలోనే నివాసం ఉండాలని అప్పుకుట్టి తన అభిప్రాయం వెలిబుచ్చారు.(ఇదీ చదవండి: AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!) -
నాకోసం ఆ స్టార్ హీరో నెలలతరబడి వెయిట్ చేశాడు: కమెడియన్
తెలుగు వెండితెరపై టాప్ లేడీ కమెడియన్ ఎవరయా? అంటే అందరూ ముక్తకంఠంతో కోవై సరళ అని టక్కున సమాధానమిస్తారు. ఈ మలయాళ నటి హీరోయిన్గా, సహాయ నటిగా, కమెడియన్గా అలరించింది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో యాక్ట్ చేస్తూ కామెడీ క్వీన్గా పేరు తెచ్చుకుంది. తాజాగా ఓ షోలో పాల్గొన్న ఆమె ఆసక్తికర విషయాలు పంచుకుంది.అలా మొదలైంది'మూడుముళ్లు సినిమాను తమిళంలో తెరకెక్కించిన దర్శకుడు మా ఇంటి పక్కన ఉండేవారు. ఒకరోజు ఇంటి దగ్గర షూటింగ్ జరగ్గా అందులో నాకు అవకాశమిచ్చారు. ఆ మూవీ సూపర్ హిట్టయింది. అలా నా జర్నీ మొదలైంది. దాదాపు 15 చిత్రాల్లో హీరోయిన్గా చేశాను. 900కు పైగా సినిమాల్లో నటించాను. కోలీవుడ్ నా పుట్టినిల్లయితే టాలీవుడ్ నా మెట్టినిల్లు.పెళ్లెందుకు చేసుకోలేదు?స్వేచ్చ కోసమే నేను పెళ్లి చేసుకోలేదు. కచ్చితంగా వివాహం చేసుకోవాలని రూలేమీ లేదు కదా.. మనం భూమి మీదకు ఒంటరిగా వచ్చాం. ఇక్కడికి వచ్చాకే అన్ని బంధాలు ఏర్పడుతాయి. ఎంతోమంది పిల్లలు ఉన్నప్పటికీ చివరి రోజుల్లో ఒంటరి జీవితాన్ని గడుపుతుంటారు. మనల్ని చూసేందుకు ఒకరుండాలని ఎదురుచూడకూడదు. ధైర్యంగా ముందుకు సాగిపోవాలంతే!తెలుగులో బిజీసతీ లీలావతి సినిమా కోసం కమల్ హాసన్ పక్కన హీరోయిన్గా అవకాశం వచ్చింది. అప్పుడు నేను నమ్మలేదు. తర్వాత కమల్ ఫోన్ చేసి నా డేట్స్ కోసం ఎదురుచూస్తున్నట్లు చెప్పారు. అయితే తెలుగులో బిజీగా ఉన్నానని చెప్తే నాకోసం ఐదు నెలలు వెయిట్ చేశారు. ఆ మూవీ చాలా బాగా వచ్చింది.ఆరోగ్యం బాగోలేదని రూమర్స్ఈ మధ్య నాకు ఆరోగ్యం బాగోలేదని, ఖర్చులకు డబ్బుల్లేక దీన స్థితిలో ఉన్నట్లు రూమర్స్ వచ్చాయి. మా అక్కవాళ్లందరూ నన్ను ఇంట్లో నుంచి గెంటేశారని కూడా రాసేశారు. కానీ అలాంటివేమీ జరగలేదు. నేను ఆరోగ్యంగా, ఆనందంగా ఉన్నాను. అలాగే నాకు రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన కూడా లేదు' అని కోవై సరళ చెప్పుకొచ్చింది.చదవండి: అక్కా నన్ను పెళ్లి చేసుకుంటావా?.. హీరోయిన్కు ఊహించని ప్రశ్న! -
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
కాలం వేగంగా పరిగెడుతోంది. ఒకప్పుడు వెండితెరపై వెలుగులు పంచిన ఎందరో తారలు తర్వాతి కాలంలో గుర్తుపట్టలేనంతగా మారిపోయారు. కమెడియన్ జనగరాజ్ కూడా ఇదే కోవలోకి వస్తాడు. అప్పట్లో తమిళ చిత్రపరిశ్రమలో సెంథిల్, గౌడమణి తర్వాత ఆ స్థాయిలో నవ్వులు పంచింది ఈయనే!కామెడీ రోల్స్తో..మొదట్లో దర్శకుడు భారతీరాజా వద్ద అసిస్టెంట్ డైరెక్టర్గా పని చేశాడు. అలా భారతీరాజా సినిమాలో చిన్న పాత్రలో నటించాడు. అందులో క్లిక్కవడంతో జనగరాజ్కు నటుడిగా అవకాశాలు వచ్చాయి. విలనిజం పండే పాత్రలు చేశాడు. కామెడీ రోల్స్తోనూ అదరగొట్టాడు. రజనీకాంత్, కమల్ హాసన్ వంటి స్టార్స్తో కామెడీ సీన్లలో పోటీపడి నటించేవాడు. అప్పట్లో ఏడాదికి 15-20 సినిమాలు చేశాడు. జెట్ స్పీడులో మూవీస్ చేసిన ఆయన 2000వ సంవత్సరంలో అడుగుపెట్టేసరికి కాస్త స్లో అయ్యాడు.ఇండస్ట్రీకి దూరంతెలుగులో జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాలో పోలీస్ ఇన్స్పెక్టర్గా నటించాడు. దాడి చిత్రంలోనూ యాక్ట్ చేశాడు. నెమ్మదిగా సినిమాలు తగ్గించుకుంటూ పోయి తర్వాత ఇండస్ట్రీలోనే కనిపించకుండా పోయాడు. దీంతో అతడు అమెరికా వెళ్లి సెటిలైపోయాడని వార్తలు వచ్చాయి. కానీ ఓ ఇంటర్వ్యూలో అవన్నీ ఉట్టి పుకార్లేనని కొట్టిపారేశాడు. దాదాపు పదేళ్ల తర్వాత విజయ్ సేతుపతి 96 మూవీతో రీఎంట్రీ ఇచ్చాడు. ఇటీవల తాత అనే షార్ట్ ఫిలింలో నటించాడు.గుర్తుపట్టలేనంతగా మారిపోయిన నటుడుఈ షార్ట్ ఫిలింలో అతడు గుర్తుపట్టలేనంతగా మారిపోయాడు. అలాగే అతడి లేటెస్ట్ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇందులో నటుడు బక్కచిక్కిపోయి ఉన్నాడు. వయసు 68 ఏళ్లు కావడంతో వృద్ధాప్య చాయలు ఆయన ముఖంలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. నటుడి ఫోటో చూసిన అభిమానులు ఒక్కసారిగా షాకవుతున్నారు. ఒకప్పుడు ఎలా ఉండేవాడు.. ఇప్పుడేంటి? ఇలా అయిపోయాడని విచారం వ్యక్తం చేస్తున్నారు.చదవండి: భర్తతో విడిపోయిన టాలీవుడ్ హీరోయిన్.. ఒంటరినే అంటూ పోస్ట్ -
ప్రవీణ్తో బ్రేకప్.. తొలిసారి స్పందించిన ఫైమా
తెలుగు బుల్లితెర షోలలో ఒకప్పుడు మేల్ కమెడియన్లదే ఆధిపత్యం ఉండేది. రానురానూ పరిస్థితిలో మార్పు వచ్చింది. లేడీస్ తాము కూడా కామెడీ పండించగలమని నిరూపించుకున్నారు. కామెడీ క్వీన్స్గా పేరు తెచ్చుకుంటున్నారు. అలా పటాస్, జబర్దస్త్ షోలలో ఫటాఫట్ పంచ్లు పేలుస్తూ అందరికీ దగ్గరైంది ఫైమా. ప్రవీణ్తో లవ్!అదే షోలోని మరో కమెడియన్ ప్రవీణ్తో ఫైమా ప్రేమాయణం నడుపుతుందని వార్తలు వచ్చాయి. వీరిద్దరూ కలిసి రీల్స్ చేయడం, గిఫ్టులు ఇచ్చిపుచ్చుకోవడం చూసి ఇదంతా నిజమే అని జనాలు ఫిక్సయిపోయారు. కానీ అంతలోనే బ్రేకప్ జరిగిందంటూ రూమర్స్ వచ్చాయి. ఆ మధ్య ప్రవీణ్ తన ప్రేమను ఫైమా రిజెక్ట్ చేసిందని వెల్లడించాడు. ఆ ఫేమ్ వాడుకున్నాంతాజా ఇంటర్వ్యూలో ఫైమా ఈ విషయం గురించి మాట్లాడింది. 'టీవీ షోలలో కనిపించే జోడీలేవీ నిజం కాదు. అవి నిజమని నమ్మొద్దు. ప్రవీణ్, నన్ను ఆన్స్క్రీన్లో జోడీగా చూపించారు. మా జంటను ఆదరించారు. దాన్ని వాడుకుంటూ యూట్యూబ్లో వీడియోలు చేశాం. ప్రవీణ్కు, నాకు మధ్య కొన్ని వ్యక్తిగత సమస్యలున్నాయి. అవి చెప్పుకోలేం.. అందుకే దూరం కావాల్సి వచ్చింది. మాట్లాడుకోవట్లేదు కూడా!వ్యక్తిగత విషయాల వల్లేమాకు గొడవ జరిగినప్పుడు దాన్ని పక్కనపెట్టేయాలే తప్ప దాన్ని అందరి ముందూ చెప్పుకుని గొడవను పెద్దది చెయ్యడం నాకిష్టం లేదు. అంతకుముందు మా రిలేషన్, అండర్స్టాండింగ్ అంతా బాగుండేది. వ్యక్తిగత విషయాల వల్ల మేము దూరమయ్యాం. అలాంటప్పుడు పర్సనల్గా నా దగ్గరకు వచ్చి మాట్లాడాలి. సింపథీకానీ తనకు పేరెంట్స్ లేకపోవడంతో అతడు మీడియా ముందు మాట్లాడే మాటలు సింపథీకి దారి తీస్తున్నాయి. తన మీద నేను నింద వేయడం లేదు. కానీ తన మీద సింపథీతో అతడు ఏం చెప్పినా జనాలు నన్ను నెగెటివ్ చేస్తున్నారు. దయచేసి మా రిలేషన్కు ఏ పేరూ పెట్టకండి' అని ఫైమా చెప్పుకొచ్చింది.చదవండి: ఒక్క పొరపాటుతో జాతకమే మారిపోయింది! అసలు పేరేంటంటే? -
నాన్న చనిపోయినా వేళ్లలేదు.. బంధువులంతా తిట్టారు: కోవై సరళ ఎమోషనల్
కోవై సరళ.. ఈ పేరు చెప్పగానే తెలుగు సినీ ప్రేక్షకుల పెదవులపై చిరునవ్వు వస్తుంది. ఈ మధ్యకాలంలో ఆమె తెలుగు సినిమాల్లో కనిపించడం లేదు కానీ.. ఒకప్పుడు ఏ సినిమా రిలీజైన అందులో కోవై సరళ ఉండాల్సిందే. బ్రహ్మానందం, కోవై సరళ కాంబినేషన్లో వచ్చే కామెడీని ఇష్టపడని తెలుగు ప్రేక్షకులు ఉండరు. అలాగే పలు సినిమాల్లో కమెడియన్ అలీకి జోడిగా నటించి నవ్వులు పూయించింది.చాలా కాలం తర్వాత ఈ సీనియర్ నటి బాక్ అనే సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తమన్నా, రాశిఖన్నా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం మే3న ప్రేక్షులకు ముందుకు వచ్చింది. ఇందులో హీరోకి మేనత్తగా నటించిన కోవై సరళ.. తనదైన కామెడీ టైమింగ్తో నవ్వులు పూయించింది.ఈ సినిమా ప్రమోషన్స్ కోసం హైదరాబాద్ వచ్చిన కోవై సరళ.. అలీ వ్యాఖ్యాతగా వ్యవహరించే ఓ షోలో పాల్గొని తన పర్సనల్ లైఫ్ గురించి ఆసక్తికర విషయాలను పంచుకుంది. ఒకప్పుడు కోయంబత్తూరుని షార్ట్కట్లో కోవై అని పిలిచేవారట. సరళ కోయంబత్తూరులోనే ఉండడంతో.. కోవై సరళ అని పిలవడం మొదలు పెట్టారట. అలా తనపేరు ఇండస్ట్రీలో కోవై సరళగా మారిందని ఈ స్టార్ కమెడిన్ చెప్పుకొచ్చింది. ఇక తన తండ్రి గురించి చెబుతూ ఎమోషనల్ అయింది. ‘నాకు నలుగురు సిస్టర్స్, ఒక బ్రదర్ ఉన్నాడు. అప్పట్లో నేను వరుస సినిమాలతో బిజీగా ఉండేదాన్ని. ఓ సినిమా షూటింగ్ కోసం ఊటీకి వెళ్లగా.. మా నాన్నగారు చనిపోయారనే విషయం తెలిసింది. అక్కడ ఓ పాట షూటింగ్ జరుగుతోంది. అందరూ వచ్చారు. ఆ పాటలో నేను బ్యాండ్ కొడుతూ సందడి చేయాలి. నాన్న మరణ వార్త తెలిసినా నేను ఆ పాటకు డ్యాన్స్ చేశా. ఎందుకంటే అది చిన్న ప్రొడక్షన్. ఆర్టిస్టులంతా వచ్చారు. నేను వెళ్లిపోతే షూటింగ్ క్యాన్సిల్ చేయాల్సివస్తుంది. దాని వల్ల నిర్మాతకు చాలా నష్టం వస్తుంది. అందుకే ఆ పాట షూటింగ్ కంప్లీట్ చేసి వెళ్లాను. మా నాన్నగారిని చివరి చూపు చూసుకోలేకపోయాను. బంధువులంతా నన్ను విమర్శించారు. నాన్న కంటే డబ్బులే ముఖ్యమని తిట్టుకున్నారు. అసలు విషయం వాళ్లకు తెలియదు’ అంటూ కోవై సరళ ఎమోషనల్ అయింది. -
ఒకప్పుడు మోదీ ఫాలోవర్.. ఇప్పుడు వారణాసిలో పోటీ
లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాన పార్టీలు దూసుకుపోతున్నాయి. తమ అభ్యర్థుల గెలుపు కోసం అగ్రనేతలు ర్యాలీలు, బహిరంగ సభల్లో పాల్గొంటూ ప్రచార స్పీడ్ పెంచుతున్నారు. స్వతంత్ర అభ్యర్థులు కూడా మేము సైతం అంటూ.. ప్రధాని పార్టీల అభ్యర్థులకు వ్యతిరేకంగా పోటీకి దిగుతున్నారు. తాజాగా మిమిక్రీ ఆర్టిస్ట్, కమెడియన్ శ్యామ్ రంగీలా (29) ప్రధానమంత్రి నరేంద్రమోదీ పోటీ చేసే వారణాసి స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని ప్రకటించారు. ‘‘ నేను వారణాసి లోక్సభ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తాను. ఈ రోజుల్లో ఎవరినీ నమ్మడానికి లేదు. ఎప్పుడైనా నామినేషన్ ఉపసంహరించుకుంటారు’’ అని శ్యామ్ రంగీలా అన్నారు. ప్రధాన మంత్రి నరేంద్రమోదీని అనుకరిస్తూ పాపులారిటీ సంపాధించిన శ్యామ్ రంగీలా తన మద్దతుదారుకు కృతజ్ఞతలు తెలిపారు. ‘‘నేను వారణాసిలో పోటీ చేస్తానని ప్రకటించటంతో వచ్చిన స్పందనకు చాలా సంతోషంగా ఉంది. నేను నా వీడియోల ద్వారా నామినేషన్కు సంబంధించిన విషయాలు పంచుకుంటా’’ అని అన్నారు.वाराणसी से चुनाव लड़ने के ऐलान के बाद आप सबसे मिल रहे प्रेम से मैं उत्साहित हूँ, वाराणसी पहुँचने और नामांकन और चुनाव लड़ने को लेकर जल्द ही वीडियो के माध्यम से अपने विचार आप सबके सामने रखूँगावन्दे मातरम् - जय हिन्द #ShyamRangeelaforVaranasi #election— Shyam Rangeela (@ShyamRangeela) May 1, 2024 ‘‘2014లో నేను ప్రధాని మోదీ ఫాలోవర్ను.నేను మోదీకి మద్దతుగా వీడియోలు చేశాను. అదేవిధంగా కాంగ్రెస్ నేత రాహుల్గాంధీ, సీఎం అరవింద్ కేజ్రీవాల్కు వ్యతిరేకంగా వీడియోలు షేర్ చేశాను. ఆ సమయంలోనే మరో 70 ఏళ్లు బీజేపీ ఓటు వేస్తాననుకున్నా. కానీ, గత పదేళ్లలో పరిస్థితులు మారిపోయాయి. నేను ఇప్పుడు మోదీకి వ్యతిరేకంగా వారణాసిలో ఎంపీగా పోటీ చేస్తున్నా. నేను వారం రోజుల్లో వారణాసికి వేళ్లి నామినేషన్ ఫైల్ చేస్తాను’’ అని కమెడియన్ శ్యామ్ రంగీలా తెలిపారు. మరోవైపు.. కాంగ్రెస్ పార్టీ పూర్వాంచల్లో బాహుబలి నేతగా పేరొందిన అజయ్రాయ్ను తమ అభ్యర్థిగా ప్రకటించింది. గత రెండు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఆయనే కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో దిగి మోదీ చేతిలో ఓడిపోయిన విషయం తెలిసిందే. -
గుర్తు పట్టలేనంతగా మారిపోయిన సీనియర్ నటి..!
సీనియర్ నటి కోవై సరళ మీకు గుర్తుందా? ఆమె పేరు వినగానే కామెడీ వెంటనే గుర్తుకొచ్చేస్తోందా? కోవై సరళ- బ్రహ్మానందం జోడీ చేసే కామెడీ ప్రేక్షకుల గుండెల్లో ఎప్పటికీ మెదలుతూనే ఉంటాయి. టాలీవుడ్లో ఎన్నో సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు. తమిళనాడుకి చెందిన కోవై సరళ తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం భాషల్లో నటించారు.ప్రస్తుతం చాలా తక్కువగా సినిమాల్లో కనిపిస్తున్నారు. చివరిసారిగా 2022లో వచ్చిన సెంబి చిత్రంలో కోవై సరళ నటించింది. తాజాగా మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. తమిళంలో సూపర్ హిట్ సిరీస్ అరణ్మనై పార్ట్-4 త్వరలోనే రిలీజ్ కానుంది. ఈ చిత్రంలో తమన్నా, రాశిఖన్నా ప్రధాన పాత్రలు పోషించారు. బాక్ పేరుతో తెలుగులోనూ ఈ మూవీని రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ హైదరాబాద్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈవెంట్కు కోవై సరళ కూజా హాజరయ్యారు. సరికొత్త లుక్లో కనిపించి సందడి చేశారు. సినీ ప్రియులు గుర్తు పట్టలేని విధంగా ఆమె మారిపోయారు. కాగా.. ఈ చిత్రం మే3న థియేటర్లలో సందడి చేయనుంది. -
టాలీవుడ్లో మరో విషాదం.. ప్రముఖ కమెడియన్ కన్నుమూత
టాలీవుడ్లో వరుస విషాదాలు నెలకొంటున్నాయి. రెండు రోజుల వ్యవధిలోనే చిత్రపరిశ్రమకు చెందిన గొప్ప వ్యక్తులు కన్నుమూయడం అందరినీ కలిచివేస్తోంది. ప్రముఖ రచయిత శ్రీ రామకృష్ణ, కాస్ట్యూమ్ డిజైనర్ దాసి సుదర్శన్ మరణ వార్త నుంచి కోలుకోకముందే తాజాగా మరో నటుడు, కమెడియన్ విశ్వేశ్వర రావు(62) తుదిశ్వాస విడిచారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మంగళవారం (ఏప్రిల్ 2న) కన్నుమూశారు. వందలాది సినిమాల్లో.. ఆయన భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్థం తమిళనాడు చెన్నైలోని సిరుశేరి గ్రామంలోని తన నివాసంలో ఉంచారు. బుధవారం అంత్యక్రియలు చేయనున్నట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. కాగా విశ్వేశ్వర రావు స్వస్థలం కాకినాడ. ఆరేళ్ల వయసులోనే చైల్డ్ ఆర్టిస్టుగా కెరీర్ ఆరంభించారు. తన తొలి సినిమా పొట్టి ప్లీడరు. భక్తి పోతన, బాలమిత్రుల కథ, ఓ సీత కథ, మా నాన్న నిర్దోషి, పట్టిందల్లా బంగారం, అందాల రాముడు, సిసింద్రీ చిట్టిబాబు, ఇంటి గౌరవం.. ఇలా బాలనటుడిగా 150కి పైగా సినిమాలు చేశారు. సొంతంగా యూట్యూబ్ ఛానల్ తర్వాతి కాలంలో కామెడీ, సహాయక పాత్రలతో పేరు గడించారు. ముఠా మేస్త్రీ, ప్రెసిడెంట్గారి పెళ్లాం, ఆమె కథ, ఆయనకు ఇద్దరు, అక్కడ అమ్మాయి- ఇక్కడ అబ్బాయి, మెకానిక్ అల్లుడు, శివాజీ, అవును.. వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు ఇలా దాదాపు రెండు వందల సినిమాల్లో తనదైన కామెడీ పండించారు. తెలుగుతో పాటు తమిళంలోనూ అనేక సినిమాలు చేసి హాస్య నటుడిగా గుర్తింపు పొందారు. 150కి పైగా సీరియల్స్లోనూ నటించారు. విస్సు టాకీస్ పేరుతో ఒక యూట్యూబ్ ఛానెల్ కూడా నడిపారు. అందులో సెలబ్రిటీలను ఇంటర్వ్యూ చేయడమే కాకుండా తన అనుభవాలను, జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ ఉండేవారు. చదవండి: నాలుగేళ్లుగా విడిగానే జీవిస్తున్నాం.. తను గొప్ప స్థాయిలో ఉంది: నటి మాజీ భర్త -
కమెడియన్ ఇంట వేడుకలు.. బెస్ట్ఫ్రెండ్ను పెళ్లాడిన నటి
కమెడియన్ రోబో శంకర్ ఇంట పెళ్లి వేడుకలు ఘనంగా జరిగాయి. అతడి కూతురు, నటి ఇంద్రజ పెళ్లిపీటలెక్కింది. 20 ఏళ్ల వయసులో తన క్లోజ్ఫ్రెండ్, డైరెక్టర్ కార్తీక్తో ఏడడుగులు వేసింది. ఫిబ్రవరి 2న ఎంగేజ్మెంట్ జరగ్గా ఆదివారం (మార్చి 24న) వీరి వివాహం కన్నులపండగ్గా జరిగింది. చెన్నైలో జరిగిన ఈ శుభకార్యానికి ఇరు కుటుంబసభ్యులతో పాటు బంధుమిత్రులు, సెలబ్రిటీలు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. గోరుముద్దలు.. 'దేవుడి ఆశీస్సులతో పెద్దల సమక్షంలో మనం ఒక్కటయ్యాం' అంటూ పెళ్లికి సంబంధించిన ఫోటోలను ఇంద్రజ శంకర్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. అలాగే పెళ్లి తర్వాత గోరుముద్దలు తినిపించుకున్న వీడియో సైతం పోస్ట్ చేసింది. ఈ ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారాయి. కాగా ఇంద్రజ.. తమిళ రియాలిటీ షో 'సర్వైవర్'తో గుర్తింపు పొందింది. తర్వాత బిగిల్(విజిల్) సినిమాలో నటించింది. తెలుగులో విశ్వక్ సేన్ 'పాగల్' మూవీలో 'ఈ సింగిల్ చిన్నోడే..' పాటలో కనిపించింది. కార్తీ 'విరుమాన్' చిత్రంలోనూ హీరోయిన్ అదితి శంకర్ స్నేహితురాలి పాత్రలో యాక్ట్ చేసింది. స్టార్ హీరోలతో నటించిన కమెడియన్ ఆమె తండ్రి విషయానికి వస్తే.. రోబో డ్యాన్స్తో ఫేమస్ అయినందున శంకర్ కాస్తా రోబో శంకర్ అయ్యాడు. మిమిక్రీతో కెరీర్ ఆరంభించిన అతడు ఎప్పుడోగానీ సినిమాల్లో కనిపించేవాడు కాదు. 'ఇదర్కుతనే ఆశైపట్టై బాలకుమార' సినిమాతో అందరి కంట్లో పడ్డాడు. ఈ మూవీ ద్వారా వచ్చిన క్రేజ్తో ఏడాదికి పది సినిమాలు చేసే స్థాయికి ఎదిగాడు. కోలీవుడ్లో దాదాపు అందరు హీరోలతోనూ నటించాడు. View this post on Instagram A post shared by sai sreedevi (@sai.sree.devi) View this post on Instagram A post shared by Behindwoods (@behindwoodsofficial) View this post on Instagram A post shared by Behindwoods (@behindwoodsofficial) చదవండి: బాలీవుడ్ స్టార్స్.. తెలుగు సినిమాలకు ఎంత తీసుకుంటున్నారో తెలుసా? -
Brahmanandam Latest Photos: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న హాస్యబ్రహ్మ (ఫోటోలు)
-
ఒక్క సీన్ కోసం 3 నెలలు వెయిట్ చేయించా.. చిరంజీవి కోపంతో!
టాలీవుడ్ టాప్ కమెడియన్లలో బాబూ మోహన్ ఒకరు. ఒకప్పుడు హీరోగా, విలన్గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా భిన్న రకాల పాత్రలతో ప్రేక్షకులను అలరించాడు. రాజకీయాల్లోకి అడుగుపెట్టాక సినిమాల సంఖ్య తగ్గించేశాడు. ఇటీవలే ఆర్గానిక్ మామ హైబ్రీడ్ అల్లుడు చిత్రంతో రీఎంట్రీ ఇచ్చాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించాడు. మూడు నెలలపాటు వెయిట్ చేయించా 'ముఠా మేస్త్రీ సినిమా సమయంలో జరిగిన సంఘటన ఇది. నా గురించి మూడు నెలలపాటు ఓ సీన్ షూటింగ్ ఆగిపోయింది. చిరంజీవికి విసుగెత్తిపోయి.. మీరేం చేస్తారో నాకనవసరం.. ఈరోజో, రేపో షూటింగ్ అయిపోవాలన్నాడు. రెండు గంటల సమయం ఎప్పుడిస్తారో చెప్పాలన్నాడు. ఓ టైం ఫిక్స్ చేసి రావాలని చెప్తే.. ప్రయత్నిస్తానన్నాను. ఇంకా ట్రై చేయడమేంటి? అని సీరియసయ్యాడు. నేను సారీ చెప్పాను. చిరంజీవి అంటే నాకు ప్రాణం. ఆయనతో షూటింగ్ అంటే మహా ఇష్టం. కానీ బిజీగా ఉండటం వల్ల డేట్లు అడ్జస్ట్ చేయలేకపోయాను. ఓపక్క సంతోషం.. మరోపక్క బాధ ఇక అదంతా జరిగాక ఓ రోజు ఎలాగోలా టైం అడ్జస్ట్ చేసుకుని సారథి స్టూడియోలో అడుగుపెట్టాను. చిరంజీవి వచ్చేదాకా చెట్టు కింద పడుకుందామనుకున్నాను. తీరా అప్పటికే మెగాస్టార్ అక్కడున్నారు. షూటింగ్ నుంచి వచ్చావా? నీ కళ్లే చెప్తున్నాయి.. సినిమా వాళ్ల జీవితం ఇంతే.. అని బాధపడ్డాడు. బ్రష్ చేసుకోమని చెప్పి ఇంటి దగ్గరి నుంచి దోసెలు తెప్పించాడు. నేను ఆవురావురుమని తింటుంటే చూసి సంతోషించాడు, బాధపడ్డాడు. నాకూ తినాలని ఉంటుంది కానీ హీరోను కాబట్టి తినలేను కదా అని ఫీలయ్యాడు' అని చెప్పుకొచ్చాడు. రూ. 1 కోటి దాకా ముంచాడు తన ఆస్తి గురించి మాట్లాడుతూ.. 'డబ్బులు మంచం కింద పెట్టి మర్చిపోయేవాడిని. ఒకసారి నా బెడ్షీట్ దులిపితే రూ.12 లక్షలు బయటపడ్డాయి. క్షణం తీరిక లేకుండా కష్టపడేవాడిని. చాలామంది డబ్బులు ఎగ్గొట్టేవాళ్లు. చెక్ బౌన్స్ అయ్యేవి. పోనీలే అని వదిలేసేవాళ్లం. ఒకసారి నేను మేనేజర్ను పెట్టుకున్నాను. కానీ అతడు కోటి రూపాయలు లెక్క చెప్పకుండా తినేశాడు. అప్పటినుంచి నేనే అన్నీ మెయింటైన్ చేసుకున్నాను' అని బాబూ మోహన్ తెలిపాడు. చదవండి: హృదయాలను మెలిపెట్టే సినిమా.. సడన్గా ఓటీటీలోకి.. స్ట్రీమింగ్ అక్కడే! -
'అమ్మ కోసం పడ్డ కష్టాలు అన్నీ ఇన్నీ కావు'.. జబర్దస్త్ శాంతి ఎమోషనల్!
జబర్దస్త్ శాంతి అలియాస్ శాంతిస్వరూప్ పరిచయం అక్కర్లేని పేరు. ప్రేక్షకులందరికీ జబర్దస్త్ శాంతిగానే పేరు ముద్రపడిపోయింది. కామెడీ షోతో గుర్తింపు తెచ్చుకున్న శాంతి బుల్లితెరపై తనకంటూ ప్రత్యేకతను చాటుకుంది. తన కామెడీతో అందరినీ నవ్వించిన జబర్దస్త్ శాంతి.. తన జీవితంలో చాలా కష్టాలు ఎదుర్కొన్నారు. గతంలో తన తల్లికి సర్జరీ కోసం ఇంటిని అమ్మేయాల్సి వచ్చిందని తెలిపారు. అమ్మ ఆస్పత్రి ఖర్చుల కోసం డబ్బులు లేకపోవడంతో తన ఇంటిని అమ్మకానికి పెట్టినట్లు వెల్లడించారు. తాజాగా శాంతి తన మదర్కు మోకాలి సర్జరీ చేయించినట్లు వెల్లడించారు. తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా ఈ విషయాన్ని పోస్ట్ చేశారు. నెల్లూరులోని అపోలో ఆస్పత్రిలో అమ్మకు మోకాలి సర్జరీ విజయవంతంగా పూర్తైనట్లు శాంతి తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా పంచుకున్నారు. డాక్టర్లు, ఆస్పత్రి సిబ్బంది తమను బాగా చూసుకున్నారని తెలిపారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ప్రస్తుతం మా అమ్మ ఆరోగ్యంతో ఉన్నారని శాంతి ఆనందం వ్యక్తం చేసింది. కాగా.. గతంలో అమ్మకు తెలియకుండానే సర్జరీ కోసం ఇంటిని అమ్మేస్తున్నట్లు చెబుతూ ఎమోషనలయ్యారు. అమ్మకు హెల్త్ బాగాలేకపోవడంతో నేను ఇంటిని అమ్మేయస్తున్నానంటూ కన్నీరు పెట్టుకున్నారు. ఈ ప్రకృతిలో అమ్మకు మించిన ఆస్తి, సంపద ఏది ఉండదని అన్నారు. నా ఇంట్లోకి ఎవరు వచ్చినా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నానని శాంతి తెలిపింది. -
అప్పులబాధతో ఇంటిసామాన్లు అమ్మిన కమెడియన్.. ఎడమచేత్తో!
ఎక్కువమందికి కుడిచేతి వాటం, చాలా తక్కువమందికి ఎడమచేతి వాటం ఉంటుంది. కమెడియన్ రాళ్లపల్లి వెంకట నరసింహారావుది కుడిచేతివాటం.. కానీ ఆయన ఎడమచేత్తో భోజనం చేసేవారట! అంతేకాదు, పొరపాటున ఆయన తినేటప్పుడు ఎవరైనా అదేంటి? ఎడమ చేతితో భోజనం చేస్తున్నారు? అని అడిగారంటే వెంటనే తింటున్న ప్లేటు పక్కన పడేసి చేతులు కడుక్కునేవారట! ఎందుకయా.. అంటే తాను భోజనం చేసేటప్పుడు ఎవరైనా ఎడమచేత్తో తింటున్నావేంటని ప్రశ్నిస్తే ఆ భోజనాన్ని వదిలేస్తాను, ఇది నియమంగా పెట్టుకున్నాను అని గతంలో చెప్పారు. ఎవరైనా అడిగితే.. ఇదేం నియమం? అన్న ప్రశ్నకు.. ప్రతిసారి లెఫ్ట్ హ్యాండ్తోనే తింటానని అయ్యప్ప దేవునికి మొక్కుకున్నాను. మధ్యలో ఎవరైనా దానిగురించి అడిగితే అన్నం తినకుండా లేచేస్తాను. నేను అనుకున్న లక్ష్యం నెరవేరేవరకు ఈ నియమాన్ని దీక్షగా కొనసాగిస్తాను అని తెలిపారు. కానీ ఆ లక్ష్యమేంటనేది చెప్పలేదు. ఒకవేళ లక్ష్యం నెరవేరకపోతే జీవితాంతం ఇదే పాటిస్తానని నిర్ణయించుకోవడం గమనార్హం. ప్రతి ఏడాది.. బీకామ్ చదివిన రాళ్లపల్లి రైల్వేలో కొంతకాలం ఉద్యోగం చేశారు. ఈయన అయ్యప్ప భక్తుడు. తన జీవితంలో దాదాపు 28 సార్లు శబరిమల వెళ్లారు. ఆగస్టు 15 ఆయన జన్మదినం. ప్రతి ఏడాది ఆరోజు ఓ పేదకళాకారుడికి సన్మానం చేసి 50 వేల రూపాయలు ఇచ్చేవారు. ఆర్థిక స్థితి అంతంతమాత్రంగా ఉన్న సమయంలోనూ ఈ నియమాన్ని తప్పలేదు. నాటకాలంటే ఆయనకు ప్రాణం.. ఒకానొక దశలో వాటికోసం అప్పులు కూడా చేశారు. ఏ స్థాయిలో అంటే ఓసారి ఇంట్లోని సోఫాను కూడా అమ్మేశారు. అప్పులవాళ్ల భయంతో ఇంటి వెనక నుంచి లోపలికి వెళ్లేవారు. ఇవన్నీ ఆయన శిష్యుడు తనికెళ్ల భరణి కళ్లారా చూశాడు. డబ్బు కోసం అంతలా ఇబ్బందిపడ్డారు. సినీ ఇండస్ట్రీకి వచ్చాకే ఆర్థిక పరిస్థితి మెరుగైంది. అదే బలహీనత ఆయనకున్న బలహీనత దానం చేయడం.. ఎంతోమందిని చదివించారు, పెళ్లిళ్లు చేశారు. ఆయన మంచితనాన్ని సొమ్ము చేసుకున్నవారూ ఉన్నారు. రాళ్లపల్లి జీవితంలో అత్యంత విషాదకర ఘటన.. పెద్ద కూతురు విజయమాధురి మరణం.. డాక్టర్ చదువు కోసం రష్యా వెళ్తూ చనిపోయింది. ఢిల్లీ వరకు ట్రైన్లో వెళ్తుండగా.. ఆ జర్నీలో తనకు బ్రెయిన్ ఫీవర్ వచ్చింది. ఆగ్రా రీచ్ అయ్యేలోపు చనిపోయింది. నీ పుట్టుకకు, నీ చావుకు కారణం నేనే అంటూ రాళ్లపల్లి గుండె పగిలేలా ఏడ్చారు. కూతుర్ని డాక్టర్ చేయాలన్నది ఆయన కల.. అందుకోసమే రష్యా పంపించాలనుకున్నారు. ఇంతలోనే కూతురు మరణించడంతో మానసికంగా కుంగిపోయారు. రాళ్లపల్లి సినిమాల సంగతి.. రాళ్లపల్లి స్త్రీ సినిమాతో కెరీర్ మొదలుపెట్టారు. శుభలేఖ, బడాయి బసవయ్య, జగన్నాథ రథచక్రాలు, అభిలాష, శ్రీవారికి ప్రేమలేఖ, అగ్నిపుత్రుడు, భలే మొగుడు, బామ్మ మాట బంగారు బాట, కూలీ నెం.1, చంద్రలేఖ, కలిసుందాం రా, నిన్ను చూడాలని, సింహాద్రి, నా అల్లుడు.. ఇలా అనేక సినిమాల్లో నటించారు. ప్రేక్షకులను నవ్వించడమే ధ్యేయంగా పెట్టుకుని అందుకోసం విశేషంగా కృషి చేశారు. రెండు నంది అవార్డులు అందుకున్న ఈ అనంతపురవాసి 2019 మేలో కన్నుమూశారు. చదవండి: పేద ప్రజల కోసం రజనీకాంత్ బిగ్ ప్లాన్..? -
కుమారుడిపెళ్లి.. మరింత బక్కచిక్కిపోయిన కమెడియన్ సుధాకర్
హీరోగా ఓ వెలుగు వెలిగాడు. తర్వాత కమెడియన్గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణించాడు. దాదాపు మూడు దశాబ్దాలపాటు ఇండస్ట్రీని ఏలాడు సుధాకర్. తర్వాత బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో సినిమాలకు దూరమయ్యాడు. ఆయన సినిమాలకు దూరమై సుమారు 17 ఏళ్లు అవుతోంది. తను నటనకు దూరమైనా తన ఒక్కగానొక్క కుమారుడు బెనిడిక్ మైఖేల్(బెన్నీ)ని టాలీవుడ్కు పరిచయం చేయాలనుకుంటున్నట్లు గతంలో వెల్లడించాడు. అది కూడా తన స్నేహితుడు చిరంజీవి చేతుల మీదుగానే బెన్నీ ఎంట్రీ ఉంటుందని హింటిచ్చాడు. సుధాకర్ తనయుడి పెళ్లి సినిమాల సంగతి పక్కనపెడితే ఇటీవల బెన్నీ పెళ్లి చేసుకున్నాడు. ఈ వివాహ వేడుకకు టాలీవుడ్ నుంచి జగపతి బాబు, బ్రహ్మానందం, చంద్రబోస్ దంపతులు, రోజా రమణి వంటి కొందరు సెలబ్రిటీలు మాత్రమే హాజరయ్యారు. బ్రహ్మానందం అయితే బెన్నీని పెళ్లికొడుకు చేసేటప్పుడు, వివాహ వేడుక, రిసెప్షన్లోనూ సందడి చేశాడు. కొత్త జంటపై కేసు పెడతా సరదా మాటలతో అక్కడున్న అందినీ నవ్వించాడు. ఈ హాస్యబ్రహ్మ సొంత ఇంటి మనిషిలా పెళ్లి పనులు మొదలైనప్పటి నుంచి అక్కడే ఉండటంతో సుధాకర్ ఇంటి సభ్యులు సంతోషంలో మునిగిపోయారు. రిసెప్షన్ స్టేజీపైకి ఎక్కి మైకు అందుకున్న బ్రహ్మానందం.. వీళ్లిద్దినీ చూస్తుంటే పోలీసు కేసు పెట్టాలనిపిస్తోంది. ఎందుకంటే ఇది బాల్యవివాహంలా అనిపిస్తోంది. ఈ రోజుల్లో ముదిరిపోయిన జంటల పెళ్లిళ్లు చూశాక వీళ్లను చూస్తుంటే చిన్నపిల్లల్లా, క్యూట్గా కనిపిస్తున్నారు అని మాట్లాడాడు. నడవలేని స్థితిలో.. కాగా బెన్నీ వివాహం క్రిస్టియన్ సాంప్రదాయం ప్రకారం జరిగింది. ఫిబ్రవరి రెండో వారంలో ఈ పెళ్లి జరిగినట్లు తెలుస్తోంది. పెళ్లి ఫోటోలు, వీడియోల్లో సుధాకర్ ఆరోగ్య పరిస్థితి మరింత అధ్వాన్నంగా మారినట్లు కనిపిస్తోంది. నడవలేని స్థితిలో ఉన్న ఆయనను ఇద్దరి సాయంతో స్టేజీపైకి తీసుకొచ్చారు. ఆయన మరింత బక్కచిక్కిపోయి గుర్తుపట్టలేని స్థితికి చేరుకున్నాడు. ఇది చూసిన అభిమానులు.. ఒకప్పుడు నవ్వులు పూయించిన సుధాకర్ ఇలా అయిపోయాడేంటి? అని విచారం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: సహజీవనం వేస్ట్.. ఇద్దరు తప్పు చేసినా ఒక్కరికే శిక్ష!: పక్కింటి కుర్రాడు -
కోట్లాది ఆస్తి.. చివరి రోజుల్లో చేయిచాచి అడుక్కునే స్థాయికి..
ఆమె అంబాసిడర్ కారులో తిరుగుతుంటే మహారాణిలా బతుకుతోందనుకున్నారు. పెద్ద పెద్ద సినిమాలు వరుసపెట్టి చేస్తుంటే లెక్కలేనన్ని కోట్లు పోగేసిందనుకున్నారు. బంగ్లాలు కొంటుంటే.. తరాలు తరబడి కూర్చుని తిన్నా తరగని ఆస్తి సంపాదించిందనుకున్నారు. వెండితెరపై నవ్వులు పూయిస్తుంటే తనకు ఏ కష్టాలూ లేకుండా హాయిగా బతుకుతోందనుకున్నారు. కానీ, కంటికి కనిపించేదంతా, చెవులకు వినిపించేదంతా నిజం కాదు! ఇంతకీ ఆ నటి ఎవరో కాదు గిరిజ.. తిరుగులేని హాస్య నటిగా.. బ్లాక్ అండ్ వైట్ జమానాలో స్టార్ కమెడియన్ గిరిజ. మొదట్లో సెకండ్ హీరోయిన్గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా తర్వాత కమెడియన్గా రాణించింది. కృష్ణా జిల్లాలోని కంకిపాడులో పుట్టిన ఈమెకు ఆమె తల్లి, నటి దాసరి రామతిలకం అన్ని వేళలా తోడుంది. తల్లి దగ్గరి నుంచి నటవారసత్వాన్ని పుణికిపుచ్చుకుంది గిరిజ. ఆమె ప్రోత్సాహంతో కమెడియన్ కస్తూరి శివరావు 'పరమానందయ్య శిష్యులు' సినిమాలో హీరోయిన్గా నటించింది. తర్వాత రేలంగికి జోడీగా నటించి తిరుగులేని హాస్యనటిగా కీర్తి పొందింది. పాతాళ భైవరిలో 'నరుడా ఏమి నీ కోరిక' అన్న ఒకే ఒక్క డైలాగుతో జనాలకు కనెక్ట్ అయిపోయింది. 'కాశీకి పోయాను రామాహరి.. గంగ తీర్థంబు తెచ్చాను రామాహరీ..' ఈ పాట విన్నా గిరిజే గుర్తొస్తుంది. గిరిజపై రేలంగి ప్రత్యేక శ్రద్ధ ఆఫ్స్క్రీన్లో కూడా రేలంగి-గిరిజ సన్నిహితంగా ఉండేవారని అప్పట్లో ప్రచారం నడిచింది. రేలంగి ఆమెకు సినిమా ఆఫర్లు ఇప్పించేవాడు. తనకోసం కోసం ఓ ఇల్లు కూడా కొనిచ్చాడని చెబుతారు. 60వ దశకంలో కొత్త తారల రాకతో గిరిజకు కాస్త అవకాశాలు తగ్గాయి. అయితే నాలుగైదు మేడలు సంపాదించి దర్జాగా కార్లలో తిరిగే గిరిజ జీవితం పెళ్లి తర్వాత అత్యంత దుర్భరంగా మారింది. సన్యాసిరావు అనే వ్యక్తిని ఆమె తిరుపతిలో పెళ్లి చేసుకుంది. భర్త ఖాళీగా ఉంటే బాగోదని అతడి కోసం నిర్మాణ సంస్థ ప్రారంభించింది. అదే గిరిజ చేసిన అతి పెద్ద తప్పు! భర్తతో కలిసి భలే మాస్టారు, పవిత్ర హృదయాలు తీసి తీవ్రంగా నష్టపోపోయింది. ఆర్థికంగా చితికిపోయింది. పెళ్లయినప్పటి నుంచి కష్టాలే! అటు భర్త మాత్రం తన దగ్గరున్న ఆస్తిని నీళ్లలా ఖర్చుచేసేవాడు. ఆమె కొనుక్కున్న లగ్జరీ కార్లలో తిరుగుతూ జల్సాలు చేసేవాడు. తాగిన మైకంలో గిరిజ మీద చేయి చేసుకునేవాడు కూడా! ఒకరోజు అతడు తన చేతికందిన వస్తువుతో కొట్టడంతో గిరిజ తలకు పద్నాలుగు కుట్లు పడ్డాయి. భార్యనే కాదు, కూతురిని కూడా దగ్గరకు చేరదీసిన పాపాన పోలేదు. నాన్న అంటూ దగ్గరకు వెళ్తే కాలితో తన్నేవాడు. భార్యాపిల్లల్ని ముప్పుతిప్పలు పెట్టిన అతడు ఉన్న డబ్బంతా ఖర్చు పెట్టాక ఒకరోజు ఉన్నట్లుండి చెప్పాపెట్టకుండా ఎక్కడికో వెళ్లిపోయాడు, మళ్లీ తిరిగి రాలేదు. లంకంత ఇంట్లో ఏసీ రూముల్లో దర్జాగా బతికిన ఆమె తర్వాతి రోజుల్లో అప్పులపాలై తల్లి, కూతురితో కలిసి చెన్నైలో చిన్న గదిలోకి మారాల్సి వచ్చింది. చివరి రోజుల్లో కనీస అవసరాలకు ఇబ్బంది పడాల్సి వచ్చింది. బస్టాప్లో విగతజీవిగా ఆమె చివరి రోజులను కళ్లారా చూశానంటాడు డ్యాన్స్ మాస్టర్ సురేశ్ దాస. 'ఓరోజు గిరిజ చేతిలో మూటతో దీనస్థితిలో మా పెద్దమ్మవాళ్లింటికి వచ్చి తలుపు తట్టింది. డోర్ తీసిన నేను ఆమెను గుర్తుపట్టలేదు. దీంతో ఆమె తన పేరు గిరిజ అని చెప్పడంతో ఒక్కసారిగా షాకై.. లోపలకి రమ్మని కూర్చోమన్నాను. ఎంతో వైభవంగా బతికిన ఆమెనేనా ఇలాంటి దీన అవతారంలో ఉందని బాధపడ్డాను. కష్టాల్లో ఉన్నానంటూ పెద్దమ్మను డబ్బులు అడిగి తీసుకుంది. రెండు నెలల తర్వాత ఇలాగే వచ్చి కొంత డబ్బు తీసుకుంది. ఇది జరిగిన వారం రోజులకే ఆమె ఇంటికి దగ్గర్లోని బస్టాప్లో చనిపోయి కనిపించింది. ఆమె కూతురు ఎవరినో ప్రేమించి దుబాయ్ వెళ్లిపోయింది. గిరిజ చివరి రోజుల్లో చాలా ఘోరమైన బతుకు బతికింది. తన పరిస్థితిని నేను కళ్లారా చూశాను' అంటూ ఓ ఇంటర్వ్యూలో ఎమోషనలయ్యాడు. ఇండస్ట్రీ నుంచి పరామర్శించిందెవరంటే? అయితే గిరిజ కూతురు శ్రీగంగ మాత్రం ఆమె ఇంట్లోనే మరణించిందని పేర్కొంది. దీంతో ఇప్పటికీ ఆమె మరణం మిస్టరీగానే మిగిలిపోయింది. గిరిజ చనిపోయిన రోజు తనను చూసేందుకు ఇండస్ట్రీ నుంచి ఎవరూ వెళ్లలేదు. కానీ ఆ రోజు రాత్రి శోభన్బాబు ఫోన్ చేసి శ్రీగంగతో మాట్లాడారు. ఏ అవసరమున్నా తానున్నానంటూ అభయహస్తమిచ్చారు. ఆ మరుసటి రోజు అల్లు రామలింగయ్య స్వయంగా వెళ్లి పరామర్శించారు. శ్రీగంగ తర్వాతి కాలంలో తన పేరును సలీమాగా మార్చుకుంది. ఆమె తెలుగులో మేఘ సందేశం అనే సినిమా చేసింది. మలయాళంలో కొన్ని సినిమాలు చేసి అనంతరం రియల్ ఎస్టేట్ వైపు వెళ్లిపోయింది. -
హీరోగా మారిన కమెడియన్, నిజమైన పులితో యాక్టింగ్
హాస్యనటులు కథానాయకులుగా మారడం సాధారణంగా జరుగుతూనే ఉంటుంది. కోలీవుడ్లో వడివేలు, సంతానం, సూరి.. హాస్యనటులు కథానాయకులుగా అవతారమెత్తి రాణిస్తున్న విషయం తెలిసిందే. ఈ వరుసలో ఇప్పుడు నటుడు పుగళ్ చేరారు. 4 జే స్టూడియోస్ పతాకంపై ఎస్.రాజతంత్రం, జబాజాన్ కలిసి నిర్మించిన చిత్రం మిస్టర్ జూ కీపర్. పుగళ్ హీరోగా నటించిన ఇందులో నటి షెర్లిన్ కాంచాలా హీరోయిన్గా నటించారు. జె.సురేష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందించారు. కథ చెప్పి మాయమయ్యాడు ఈ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా బుధవారం సాయంత్రం చైన్నెలోని ప్రసాద్ ల్యాబ్లో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నటుడు సూరి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పుగళ్ మాట్లాడుతూ.. ముందుగా దర్శకుడు తనను కలిసి కథ చెప్పి ఆ తరువాత కనిపించలేదన్నారు. కొంత కాలం తరువాత మళ్లీ కనిపించి వెంటనే షూటింగ్కు బయలుదేరండి అని చెప్పారన్నారు. అలా ఈ మూవీలో అవకాశం వరించిందన్నారు. పులిని మచ్చిక చేసుకోవడానికి ప్రయత్నించా ఈ మూవీలో నిజమైన పులితో నటించడం ముందు భయంగా అనిపించిందన్నారు. ఆ తరువాత దాన్ని మచ్చిక చేసుకోవడానికి ప్రయత్నించానన్నారు. అలా ఈ చిత్రంలో నటించడం మంచి అనుభవంగా పేర్కొన్నారు. సూరి మాట్లాడుతూ హీరోగా గెలవడం కంటే నిలబడడం కష్టమన్నారు. పుగళ్లో మంచి నటుడు ఉన్నాడని, హీరోగా వచ్చిన అవకాశాన్ని నిలబెట్టుకుంటారనే నమ్మకం ఉందని సూరి అన్నారు. చదవండి: 'వ్యూహం' విడుదల తేదీని ప్రకటించిన రామ్ గోపాల్ వర్మ -
కమెడియన్ కమ్ హీరో.. నిజ జీవితంలో రైతు!
సహజ నటనకు మారు పేరు నటుడు అప్పుకుట్టి. వెన్నెలా కబడీ కుళు చిత్రం ద్వారా నటుడిగా పరిచయమైన ఈయన పలు చిత్రాల్లో కామెడీ పాత్రల్లో నటించి సినిమాకు అందం, రంగు కంటే అభినయం ముఖ్యం అని నిరూపించారు. అలా అళగర్సామియిన్ కుదిరై చిత్రంతో కథానాయకుడిగా అవతారమెత్తారు. ఆ చిత్రంలో నటనకుగానూ జాతీయ ఉత్తమ నటుడు అవార్డు గెలుచుకున్నారు. ఇటీవల అవకాశాలు తగ్గినా.. శింబు హీరోగా నటించిన వెందు తనిందదుక్కాడు చిత్రంలో ముఖ్య భూమికను పోషించి లైమ్ టైమ్లోకి వచ్చారు. రెండు సినిమాలు ఇప్పుడు మళ్లీ కథానాయకుడిగా బిజీ అవుతున్నారు. ఈయన ప్రస్తుతం వాళ్గ వివసాయి, పిరందనాళ్ వాల్తుగళ్ చిత్రాల్లో హీరోగా నటిస్తున్నారు. వీటిలో పాల్డిపో కదిరేశన్ నిర్మిస్తున్న చిత్రం వాళ్గ వివసాయి. పొన్ని మోహన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో వసుంధర హీరోయిన్గా నటిస్తున్నారు. ఇందులో అప్పుకుట్టి రైతుగా నటిస్తున్నారని, ఈ చిత్రంలో ఆయన నటనకు మరోసారి జాతీయ అవార్డు అందుకుంటారనే నమ్మకాన్ని దర్శకుడు వ్యక్తం చేశారు. ఈ చిత్రం నిర్మాణ దశలో ఉంది. స్టార్ హీరోల సినిమాలో చేయాలనుంది అప్పుకుట్టి మాట్లాడుతూ.. ఇలాంటి సినిమాలు చేయడమంటే నాకు చాలా ఇష్టం. నేను రైతు కుటుంబానికి చెందినవాడిని. అంతేకాదు, నేను కూడా రైతునే! పొలం దున్నడం, విత్తడం, ఎరువులు వేయడం, నీళ్లు పెట్టడం.. అన్నీ తెలుసు. అవన్నీ చేసినవాడినే కాబట్టి ఈ పాత్ర పెద్ద కష్టంగా అనిపించలేదు. ఇలా హీరోగా నటించడం సంతోషంగా ఉంది. అయితే రజనీకాంత్ వంటి స్టార్ హీరోల చిత్రాల్లో నటించాలని కోరుకుంటున్నాను అని చెప్పుకొచ్చింది. చదవండి: గట్టిగానే కొట్టిన 'అంబాజీపేట మ్యారేజి బ్యాండు' కలెక్షన్స్.. నేడు ఈ థియేటర్స్లోకి హీరో,హీరోయిన్ -
కమెడియన్ కూతురి నిశ్చితార్థం.. నెల రోజుల్లో పెళ్లి!
తమిళ కమెడియన్ రోబో శంకర్ ఇంట త్వరలో పెళ్లి బాజాలు మోగనున్నాయి. అతడి కూతురు ఇంద్రజకు డైరెక్టర్ కార్తీక్తో నిశ్చితార్థం జరిగింది. ఫిబ్రవరి 2న చెన్నైలో వీరి ఎంగేజ్మెంట్ జరిగింది. ఈ శుభకార్యానికి ఇరు కుటుంబాలు సహా అతి దగ్గరి బంధుమిత్రులు హాజరయ్యారు. తన ఎంగేజ్మెంట్ ఫోటోలను ఇంద్రజ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అవి కాస్తా వైరల్గా మారాయి. పలువురు సెలబ్రిటీలు, నెటిజన్లు ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. నెల రోజుల్లోనే వీరి పెళ్లి జరగనున్నట్లు తెలుస్తోంది. విజిల్, పాగల్ సినిమాల్లో.. ఇందుకోసం రోబో శంకర్ భారీ ఎత్తున ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. చెన్నైలో జరగబోయే ఈ వేడుకకుగానూ సినీ ప్రముఖులకు ఆహ్వానాలు అందనున్నట్లు తెలుస్తోంది. కాగా ఇంద్రజ.. విజయ్ హీరోగా నటించిన బిగిల్(తెలుగులో విజిల్ పేరిట రిలీజైంది) మూవీలో ఓ ముఖ్య పాత్ర పోషించింది. తెలుగులో పాగల్ అనే సినిమా చేసింది. ఇందులో .ఈ సింగిల్ చిన్నోడే..' అనే పాటలో మాత్రమే కనిపిస్తుంది. కార్తీ 'విరుమాన్' మూవీలో హీరోయిన్ అదితి శంకర్ స్నేహితురాలిగా నటించింది. పెళ్లి తర్వాత కూడా సినిమాలు కంటిన్యూ చేసే ఆలోచనలో ఉంది ఇంద్రజ. ఎవరీ రోబో శంకర్.. ఆమె తండ్రి రోబో శంకర్ విషయానికి వస్తే.. ఇతడు రోబో డ్యాన్స్తో ఫేమస్ అయ్యాడు. అందుకే ఆయనకు ఆ పేరు వచ్చింది. తనకు వచ్చిన మిమిక్రీతో సినిమాల్లో అడుగుపెట్టాడు. నెమ్మదిగా ఒక్కో సినిమా చేసుకుంటూ పోయాడు. కెరీర్ ప్రారంభించిన పదేళ్ల తర్వాతే అతడికి మంచి బ్రేక్ వచ్చింది. 'ఇదర్కుతనే ఆశైపట్టై బాలకుమార' అనే చిత్రంతో అందరి కళ్లలో పడ్డాడు. అప్పటివరకు ఏడాదికి ఒకటీరెండు సినిమాలు చేసే ఇతడు ఈ చిత్రం సక్సెస్ తర్వాత ఏకంగా 10 సినిమాలు చేసే స్థాయికి ఎదిగిపోయాడు. దాదాపు తమిళ స్టార్ హీరోలందరితోనూ కలిసి పని చేశాడు. View this post on Instagram A post shared by SmartDecors (EVENT PLANNERS) (@smart_decors.in) View this post on Instagram A post shared by @clicks_by_vishnu_kumar_ చదవండి: భర్తతో కలిసి ఉదకశాంతి పూజ చేసిన గీతా మాధురి.. ఆమిర్తో, అతడి మాజీ భార్యతో.. నా రిలేషన్ ఎలా ఉందంటే? -
బ్రహ్మానందం తొలి సంపాదన ఎన్ని రూపాయలో తెలుసా?
ఎక్కడో మూరుమూల గ్రామంలో పుట్టి పెరిగిన కుర్రాడు, చెప్పులు కూడా కొనుకోలేని దుస్థితిలో ఉన్న పిల్లవాడు లెక్చరర్గా పాఠాలు చెప్పే స్థాయికి ఎదిగాడు. సైకిలే గొప్ప అనుకునే ఆయన కార్లలో తిరిగాడు. విద్యార్థులకు పాఠాలు బోధించే అతడు ప్రేక్షకులకు వినోదం పంచడం కోసం నటుడిగా ముఖానికి రంగు వేసుకున్నాడు. వెయ్యికి పైగా సినిమాల్లో నటించిన ఆయన రాష్ట్రపతి చేతులమీదుగా పద్మశ్రీ పురస్కారం అందుకున్నాడు. ఆయనే స్టార్ కమెడియన్ బ్రహ్మానందం. ఈ మధ్య సినిమాలు తగ్గించేసిన ఆయన నేను మీ బ్రహ్మానందం పేరిట తన ఆత్మకథ రాసుకున్నాడు. గత నెలాఖరున ఈ పుస్తకం విడుదలైంది. పెద్దగా వివాదాల జోలికి పోలేదని, కానీ తనలోని సంఘర్షణలకు పుస్తకరూపం ఇచ్చానన్నాడు బ్రహ్మానందం. దగ్గర డబ్బులు లేవు ఈ పుస్తకంలో తన గురించి ఎవరికీ తెలియని విషయాలను పొందుపరిచాడు. తన చదువంతా ఎవరో ఒకరి సాయంతోనే కొనసాగిందని తెలిపాడు. తనకు సాయం చేసినవాళ్ల ఇంట్లో చిన్నపాటి పనులు చేసిపెడుతూ ఇంటర్, డిగ్రీ పూర్తి చేసినట్లు తెలిపాడు. అయితే పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయడానికి తన దగ్గర డబ్బులు లేవు. సరిగ్గా అప్పుడే వైజాగ్ ఆంధ్ర యూనివర్సిటీ అధికారులు గుంటూరులో పీజీ సెంటర్ ఓపెన్ చేశారు. బ్రహ్మానందం కళను, కామెడీని చూసి MA తెలుగులో ఫ్రీ సీట్ ఇచ్చారు. గుంటూరు సమీపంలో నల్లపాడులో చిన్న అద్దెగదుల్లో చేరిన ఆయన అనసూయమ్మ చేసిన ఆర్థిక సాయంతో చదువుకున్నారు. పూర్తిగా ఆమె మీద ఆధారపడితే బాగోదని, కనీసం తినడానికి అయినా సంపాదించాలని ఏదో ఒక పని చేద్దామనుకున్నాడు. లారీలకు రంగు వేసే పనిలో.. నల్లపాడు రూమ్ నుంచి కాలేజీకి వెళ్లే దారిలో లారీలు రిపేర్లు చేస్తూ పెయింట్ వేసేవాళ్లు. సాయంత్రం కాలేజీ అయిపోగానే పాత బట్టలు వేసుకుని అక్కడికి వెళ్లి లారీలకు పెయింట్ వేశాడు. అప్పుడు నెల జీతంలా కాకుండా పనిని బట్టి నాలుగైదు రూపాయలు ఇచ్చేవారని పుస్తకంలో రాసుకొచ్చాడు బ్రహ్మానందం. అలా చిన్నపాటి పనులు చేసుకుంటూ, దాతల సాయంతో చదువుతూ తన చదువు పూర్తి చేసి లెక్చరర్గా మారాడు. మరోవైపు తనలోని కామెడీ యాంగిల్తో ప్రముఖ హాస్యనటుడిగా ఎదిగాడు. చదవండి: వర్మ ఆడిషన్కు వెళ్లా.. నన్ను వెళ్లిపోమని చెప్పాడు.. తర్వాత పిలవనేలేదు -
తెలుగులో తొలి స్టార్ కమెడియన్.. అనాథలా స్టేషన్లో శవం!
కమెడియన్ అనగానే బ్రహ్మానందం, సునీల్, వెన్నెల కిషోర్, అలీ.. ఇలా చాలామంది గుర్తొస్తారు.. అంతకు ముందు తరం అనగానే రేలంగి, రమణారెడ్డి, రాజబాబు గుర్తొస్తారు. కానీ వీళ్లందరి కన్నా ముందు వెండితెరపై నవ్వుల మాగాణిని పండించిన వ్యక్తి ఒకరున్నారు.. ఆయనే కస్తూరి శివరావు. తెలుగు సినీరంగంలో తొలి స్టార్ కమెడియన్గా కీర్తి గడించారు. నటుడిగా లెక్కపెట్టలేనంత డబ్బు సంపాదించారు. అదే రీతిలో దుబారా చేశారు. చివరకు కటిక పేదరికంలో ఒక అనామకుడిగా మరణించారు. ఆయన గురించి నేటి ప్రత్యేక కథనం.. స్టార్ కమెడియన్గా సాగిన ప్రస్థానం శివరావు 1913లో కాకినాడలో జన్మించారు. తండ్రి ఉపాధ్యాయుడు. తనయుడికేమో చదువు తప్ప అన్నింటా ఆసక్తే! శివరావు పద్యాలు, పాటలు పాడుతూ నాటక రంగంలో అడుగుపెట్టారు. అతడి కామెడీ మెచ్చి సినిమా ఛాన్సులు వచ్చాయి. 1939లో 'వరవిక్రయం'తో సినిమాలో ఎంట్రీ ఇచ్చారు. 'స్వర్గసీమ' మూవీతో జనాలకు దగ్గరయ్యారు. బాలరాజు, గుణసుందరి కథ, లైలా మజ్ను, శ్రీ లక్ష్మమ్మ కథ, స్వప్న సుందరి.. అన్నీ సూపర్ హిట్ చిత్రాలే! పేరుకు పేరు.. డబ్బుకు డబ్బు. కస్తూరి పన్నీటితో స్నానం చేసేవారు. అప్పట్లో ఖరీదైన బ్యూక్ కారు కొని అందులో దర్జాగా తిరిగేవారు. స్క్రీన్పై ఆయన కనిపిస్తే ప్రేక్షకుల ముఖాల్లో తమకు తెలియకుండానే చిరునవ్వు వచ్చేది. ఈ క్రేజ్ను క్యాష్ చేసుకోవాలనుకున్న హీరోలు, నిర్మాతలు.. శివరావు తమ సినిమాలో ఉండాల్సిందేనని మంకు పట్టు పట్టేవారు. తనకు లక్ష రూపాయల పారితోషికం ఇవ్వడానికి కూడా వెనుకాడేవారు కాదంటే ఆయనకు ఎంత డిమాండ్ ఉందో ఊహించుకోవచ్చు. కార్లలో తిరిగిన కమెడియన్ సైకిల్ తొక్కే స్థాయికి ఏ ఆర్టిస్టూ కంటతడి పెట్టకూడదని ఈయన బలంగా నమ్మేవారు. జేబులో నోట్ల కట్టలు పెట్టుకుని తిరుగుతూ అడిగినవారికల్లా సాయం చేసేవారు. భూ, ధన.. దాన దర్మాలు చేశారు. కానీ పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు కదా.. సినిమా నిర్మించాలన్న ఆలోచనే ఆయన పాలిట శాపంగా మారింది. పరమానందయ్య శిష్యులు మూవీతో భారీ స్థాయిలో నష్టాలు, కష్టాలు అన్నీ చూశాడు. సైకిల్ తొక్కేచోట బ్యూక్ కార్లలో తిరిగిన శివరావు తిరిగి అదే పాత సైకిల్ తొక్కుకునే స్థాయికి పడిపోయారు. ఇల్లు, కారు, ఆస్తులు అన్నీ పోయాయి. ఒకప్పుడు కోట్ల ఆస్తులు అనుభవించిన శివరావుకి ఎవరినైనా అవకాశాలు అడగాలంటే నామోషీ! దీనికి తోడు తాగుడు అలవాటు కాస్తా వ్యసనమైపోయింది. అవకాశాలు తగ్గిపోవడంతో మళ్లీ నాటకరంగాన్ని నమ్ముకున్నారు. అయితే ఆయన మీద అభిమానంతో ఎన్టీ రామారావు కొన్ని సినిమాల్లో అవకాశాలు కల్పించారు. పొట్టకూటి కోసం నాటకానికి.. అదే చివరిది! కానీ షూటింగ్స్కు సైతం తాగివస్తుండటంతో తర్వాత ఛాన్సులు రావడమే గగనమైపోయింది. రాజకీయ కుట్రలకు బలైపోయి మరింత వెనకబడిపోయారు. తర్వాత శివరావు ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింది. ఆకలితో చావడం ఇష్టం లేక ఒంట్లో శక్తి లేకపోయినా నాటకాలు వేసేందుకు వెళ్లేవారు. అసలే బక్కప్రాణి.. పోషకాహారం లేక మరింత చిక్కి శల్యమైపోయాడు. చివరిసారిగా 1966లో తెనాలిలో ఓ నాటకంలో వేషం వేయడానికి వెళ్లారు. నాటకం ముగిశాక స్టేషన్కు చేరుకుని ఓ బల్ల మీద పడుకున్నాడు, తెల్లవారినా చలనం లేదు. ఎవరిదో అనాథ శవం అనుకున్నారంతా! కానీ ఓ ప్రయాణికుడు.. ఆయనను క్షుణ్ణంగా చూసి శివరావు అని గుర్తుపట్టాడు. ఈ విషయం ఆనోటా ఈనోటా స్టేజీ కళాకారుడు వెంకట్రామయ్యకు తెలిసింది. శివరావు దుస్థితి చూసి కన్నీటిపర్యంతమయ్యాడు. మూడు రోజుల తర్వాత ఇంటికి చేరిన మృతదేహం ఆయన మృతదేహాన్ని స్వస్థలానికి పంపించేందుకు కారు మాట్లాడేందుకు ప్రయత్నించాడు. కానీ శవాన్ని తీసుకెళ్తే తన కారు మరెవరూ ఎక్కరని వాదించాడో కారు డ్రైవర్. దీంతో డిక్కీలో ఆయన మృతదేహాన్ని పెట్టారు. ఎన్నో అవాంతరాల మధ్య మూడు రోజుల తర్వాత కానీ ఆయన మృతదేహం ఇంటికి చేరకపోవడం విషాదం. స్టార్డమ్ లేదనో ఏమో కానీ చాలామంది తారలు ఆయన చివరి చూపుకు సైతం రాకపోవడం శోచనీయం. ఆఖరికి పాడె మోసేందుకు నలుగురు మనుషులకు డబ్బులిచ్చి పిలిపించడం అత్యంత దయనీయమైన విషయం! 'మొదటి రోజుల్లో మద్రాసులో సైకిలు తొక్కుతూ తిరిగేవాడిని. తర్వాత కార్లమీద తిరిగాను. ఇప్పుడు మళ్ళీ సైకిలు మీదనే తిరుగుతున్నాను. ఒకప్పుడు మా ఇంటి పేరైన కస్తూరి వాసనే నిత్యం గుప్పుమనేది. ఇప్పుడు ఇంటిపేరు కస్తూరి వారు - ఇంట్లో మాత్రం గబ్బిలాల కంపు' అని తన దుస్థితి మీద తానే జోకులు వేసుకునేవారు కస్తూరి శివరావు. చదవండి: యంగ్ హీరోకు బ్రేకప్ చెప్పేసిన సీనియర్ హీరోయిన్! -
ముచ్చటగా మూడో కారు కొన్న లేడీ కమెడియన్
సీరియల్ నటి, కమెడియన్ రోహిణి బుల్లితెర ప్రేక్షకులకు రౌడీ రోహిణిగానే బాగా సుపరిచితం. మొదట్లో సీరియల్స్లో కనిపించిన ఈమె ఆ తర్వాత జబర్దస్త్, అదిరింది వంటి కామెడీ షోలు సైతం చేసింది. 'మత్తు వదలరా', 'బలగం' వంటి సినిమాల్లో వినోదాన్ని పంచింది. 'సేవ్ ది టైగర్స్' వెబ్ సిరీస్లో ఆమె చేసే కామెడీకి పొట్ట చెక్కలయ్యేలా నవ్వాల్సిందే! ఆ టాలెంటెడ్ నటి తెలుగు బిగ్బాస్ మూడో సీజన్లోనూ పాల్గొంది. కొత్త కారు ధరెంతంటే? తాజాగా రోహిణి కొత్త కారు కొనుగోలు చేసింది. ఈ విషయాన్ని ఆమె యూట్యూబ్ ఛానల్ వేదికగా వెల్లడించింది. మొదటి కారు యాక్సిడెంట్లో దెబ్బతిందని, రెండో కారును ఈ మధ్యే అమ్మేయగా ఇప్పుడు ముచ్చటగా మూడో కారు కొన్నట్లు చెప్పింది. ఇది కియా సెల్టోస్ జీటీఎక్స్ ప్లస్ బ్రాండ్కు చెందినదంటూ తన కొత్త కారును చూపించింది. దానికి పూజ కూడా చేయించి. రోహిణి మాట్లాడుతూ.. 'మొదటి కారును రూ.9 లక్షలు పెట్టి తీసుకున్నాను. రెండో కారు కోసం రూ.14 లక్షలు పెట్టాను. ఇప్పుడీ కొత్త కారును రూ.25 లక్షలు పెట్టి తీసుకున్నాను. అదొక్కటే మిగిలుంది నిజానికి ఆడి కారు కొందామనుకున్నాను. కానీ దాని ప్రారంభ ధర రూ.57 లక్షల దాకా ఉంది. లోన్ పెట్టుకోవచ్చనుకున్నాను. కానీ ఎప్పుడెలా ఉంటుందోనని ఆ ఆలోచన విరమించుకున్నాను. చాలామంది నాకు మంచి సలహాలు, సూచనలు ఇచ్చారు. ఇండస్ట్రీలో పరిస్థితులు ఎప్పుడెలా ఉంటాయో తెలియవు కాబట్టి భూమి కొనుక్కోమని చెప్పారు. నిజమే కదా అనిపించింది. ఇప్పటికైతే ఇల్లు, కారు కొనేశాను.. ఎక్కడైనా ప్లాట్ తీసుకుని అది అమ్మానాన్న పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించి వారికి బహుమతిగా ఇవ్వాలి. అదొక్కటే మిగిలి ఉంది' అని చెప్పుకొచ్చింది రోహిణి. చదవండి: ఒక్క పూట భోజనం.. ఇంట్లో వాళ్ల కోసం ఆలోచించకుండా తినేవాడిని.. ప్రముఖ నటుడి కష్టాలు -
కమెడియన్ మృతి.. కుటుంబానికి సాయం చేసిన కెప్టెన్!
సీనియర్ సినీ హాస్యనటుడు బోండామణి (60) శనివారం రాత్రి చైన్నె సమీపంలోని ఆయన స్వగృహంలో కన్నుమూశారు. శ్రీలంకకు చెందిన ఈయన అక్కడ సైనికుల యుద్ధంలో కుటుంబ సభ్యులను కోల్పోగా తను మాత్రం తప్పించుకుని చైన్నెకి చేరుకున్నారు. చైన్నెలో సినీ ప్రయత్నాలు చేసి చివరకు 1981లో విడుదలైన పవును పవును దాన్ చిత్రం ద్వారా నటుడిగా రంగ ప్రవేశం చేశారు. ఆ చిత్రంలో చిన్న పాత్ర చేసి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ తరువాత మంచి హాస్యనటుడుగా గుర్తింపు పొందారు. వందల సినిమాల్లో నటించి.. అలా సుందర ట్రావెల్స్, మరుదమలై, విన్నర్, వేలాయుధం, జిల్లా.. తదతిర చిత్రాల్లో నటించారు. దాదాపు 250కి పైగా చిత్రాలలో నటించి ప్రేక్షకులకు దగ్గరయ్యారు. వడివేలు వంటి హాస్యనటులతో కలిసి పలు చిత్రాలు చేశారు. కొంతకాలంగా బోండామణి కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారు. తన రెండు కిడ్నీలు పాడవడంతో చైన్నె ప్రభుత్వ ఆసుపత్రిలో ఏడాదికి పైగా చికిత్స పొందుతూ వచ్చారు. తన ఆర్థిక పరిస్థితి బాగోలేకపోవడంతో బోండామణికి పలువురు సినీ ప్రముఖులు ఆర్థిక సాయం అందించారు. స్వగృహంలో కన్నుమూత రోజూ డయాలసిస్ చేసుకుంటూ వచ్చిన బోండామణి డిసెంబర్ 23న రాత్రి 11 గంటల ప్రాంతంలో రాత్రి ఉన్నట్లుండి కింద పడిపోయారు. దీంతో వెంటనే కుటుంబ సభ్యులు ఆయన్ని దగ్గరలోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా బోండామణి అప్పటికే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈయనకు భార్య మాధవి, కొడుకు సాయిరాం, కూతురు సాయికుమారి ఉన్నారు. బోండామణి మృతికి పలువురు సినీ ప్రముఖులు ప్రగాడ సంతాపాన్ని వ్యక్తం చేశారు. లక్ష సాయం కమెడియన్ మృతి పట్ల నటుడు, డీఎండీకే పార్టీ నేత విజయకాంత్ సంతాపాన్ని వ్యక్తం చేస్తూ లక్ష రూపాయలను నటుడు మీసై రాజేంద్రన్ ద్వారా ఆయన భార్యకు అందించారు. కాగా ఆదివారం క్రోంపేటలోని శ్మశాన వాటికలో బోండామణి అంత్యక్రియలు నిర్వహించారు. బోండామణి కొడుకు సాయిరాం మీడియాతో మాట్లాడుతూ తమకు ఎలాంటి జీవనాధారం లేదని, అద్దె ఇంటిలోనే ఉంటున్నామని నడిగర్ సంఘం, రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా ఆర్థిక సాయం అందించాలని విజ్ఞప్తి చేశాడు. చదవండి: రొమాన్స్ సీన్లో నేనేం సిగ్గుపడలేదు కానీ..: ఆండ్రియా -
నవ్వుల రాజా.. ఇలా షాక్ ఇచ్చాడేంటి?
సినీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. ప్రముఖ హాలీవుడ్ స్టాండ్అప్ కమెడియన్ నీల్ నందా(32) కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆయన సన్నిహితుల్లో ఒకరు ట్వీట్ చేశారు. చిన్న వయసులోనే కమెడియన్ కన్నుమూయడంతో అభిమానులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. 32 ఏళ్ల నీల్ నందా మృతి పట్ల హాలీవుడ్ ప్రముఖులు నివాళులర్పిస్తున్నారు. అయితే అతని మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. నీల్ నందా హాస్యనటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. అంతే కాకుండా రచయిత కూడా. నీల్ నందా ప్రధానంగా అట్లాంటాలో స్టాండప్ కామెడీ షోలను ప్రదర్శించారు. అతను కామెడీ సెంట్రల్, ఎంటీవీ, వైస్ల్యాండ్, హులు అనేక కామెడీ షోస్లో కూడా కనిపించాడు. అంతేకాకుండా వెస్ట్సైడ్ కామెడీ థియేటర్లో ప్రదర్శించిన అన్నెససరీ ఈవిల్ షో లాస్ఎంజిల్స్ వీక్లీ టాప్ -10లో చోటు దక్కించుకుంది. అయితే ప్రాథమిక సమాచారం ప్రకారం నీల్ నందా ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు ఇంకా ధృవీకరించలేదు. 2013లో తన ప్రయాణాన్ని ప్రారంభించిన నీల్ ప్రముఖ షో జిమ్మీ కిమ్మెల్ షో ద్వారా ఫేమ్ తెచ్చుకున్నారు. అంతేకాకుండా అమెజాన్ ప్రైమ్ షోలు ఇన్సైడ్ జోక్, హులు కమింగ్ టు ది స్టేజ్లో కూడా కనిపించాడు. నీల్ నందా మృతి చెందారనే వార్త సోషల్ మీడియాలో వ్యాపించడంతో నెటిజన్లు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. తమ అభిమాన హాస్యనటుడికి సోషల్ మీడియా వేదికగా నివాళులర్పించారు. RIP Neel Nanda. Just at a total loss for words here. One of the nice and hardest working ones we had 💔 pic.twitter.com/unFtmN2xoU — Eli Olsberg (@EliOlsberg) December 23, 2023 RIP Neel Nanda 😔 you were one of the nicest, hardest working comedians I’ve ever called a friend and i hope you can be at peace brother ❤️🩹 — Matt Rife (@mattrife) December 23, 2023 -
ప్రముఖ హాస్య నటుడు మృతి.. సడన్గా అలా జరగడంతోనే
ప్రముఖ హాస్య నటుడు బొండా మణి (60) అకస్మాత్తుగా మృతి చెందారు. కొన్నిరోజుల క్రితం పలు అనారోగ్య సమస్యలతో ఈయన ఇబ్బంది పడుతున్నట్లు వార్తలు వచ్చాయి. పలువురు సాయం చేయగా కోలుకున్నట్లు కనిపించారు. ఇప్పుడేమో సడన్గా శనివారం రాత్రి 11:30 గంటల టైంలో ఇంట్లోనే కుప్పకూలిపోయారు. కుటుంబసభ్యులు.. ఈయన్ని హుటాహుటిన ఆస్పత్రికి తీసుకెళ్లారు. కానీ అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. ఈ క్రమంలోనే పలువురు సెలబ్రిటీలు సంతాపం తెలియజేస్తున్నారు. (ఇదీ చదవండి: ఊరమాస్కి కేరాఫ్.. ఆ విషయంలో ఎక్స్పర్ట్.. ప్రశాంత్ నీల్ సక్సెస్ సీక్రెట్ ఇదే!) శ్రీలంకలో పుట్టిన బొండా మణి.. కెరీర్ ప్రారంభంలో చిన్న చిన్న పాత్రలు చేశారు. 1991లో తమిళ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. 175కి పైగా సినిమాల్లో హాస్య పాత్రలు చేశారు. సుందర్ ట్రావెల్స్, మరుదమలై, విన్నర్, వేలాయుతం, జిల్లా తదితర చిత్రాలు.. ఈయనకు బాగా పేరు తెచ్చిపెట్టాయి. ఇకపోతే స్టార్ కమెడియన్ వడివేలుతో ఈయన కాంబోకి చాలా క్రేజ్ ఉంది. చాలా సీన్స్ ఇప్పటికీ ప్రేక్షకుల్ని అలరిస్తుంటాయి. అయితే కొన్నాళ్ల ముందు మణి ఆరోగ్యం బాలేదని వార్తలొచ్చాయి. కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారని, డయాలసిస్ చేయించుకోవడానికి కూడా డబ్బుల్లేవని తెలియడంతో పలువురు తమిళ యాక్టర్స్.. ఆర్థిక సాయం చేశారు. దీంతో మణి కోలుకున్నారు. కానీ ఇప్పుడు ఇలా అనుకోని విధంగా కుప్పకూలిపోయి తుదిశ్వాస విడిచారు. (ఇదీ చదవండి: 'సలార్' కలెక్షన్స్ రచ్చ.. రెండు రోజుల్లో ఏకంగా అన్ని కోట్లు) -
విభిన్నమైన కథాంశంతో వస్తోన్న స్టార్ కమెడియన్..!
నటుడు యోగిబాబు కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం బోట్. నటి గౌరీ జీ.కిషన్ నాయకిగా నటిస్తున్న ఈ చిత్రానికి శింబు దేవన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈయన ఇంతకు ముందు వడివేలు హీరోగా హింసై అరసన్ 23 పులికేసి, విజయ్ హీరోగా పులి, ప్రకాష్ రాజ్, సంతానం, గంజా కరుప్పు ప్రధాన పాత్రలు పోషించిన అరై ఎన్ 305, రాఘవా లారెన్స్ హీరోగా నటించిన ఇరుంబు కోట్టై మురట్టు సింగం వంటి భారీ చిత్రాలను తెరకెక్కించారు. కాగా ఈ తాజా చిత్రాన్ని భారీ అండ్ మాన్వీ మూవీ మేకర్స్ పతాకంపై ప్రభా ప్రేమ్ కుమార్ నిర్మిస్తున్నారు. ఈ చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ బోట్ పూర్తిగా వైవిధ్య భరిత కథా చిత్రంగా ఉంటుందన్నారు. ఇది 1940 ప్రాంతంలో చైన్నెలో జపాన్ బాంబులతో దాడి చేసినప్పుడు పదిమంది తమ ప్రాణాలను రక్షించుకోవడానికి బోట్ ఎక్కి తప్పించుకునే ప్రయత్నం చేస్తారన్నారు. అందులో నటుడు యోగి బాబు ఒకరిని చెప్పారు. అయితే ఆ బోట్ సముద్ర మధ్యలో ఆగిపోవడం, రంధ్రం పడి నీరు బోట్లోకి రావడం వంటి పలు కష్టాలను ఎదుర్కొంటారన్నారు. అలాంటి పరిస్థితుల్లో వారు ఏం చేశారు ఎలా ప్రాణాలతో బయటపడ్డారు. వంటి పలు ఆసక్తికరమైన అంశాలతో రూపొందిస్తున్న చిత్రమని చెప్పారు. షూటింగ్ ఎక్కువ భాగం సముద్రంలో చిత్రీకరిస్తున్నట్లు చెప్పారు ఇది యాక్షన్, థ్రిల్లింగ్తో కూడిన పొలిటికల్ కామెడీ కథాచిత్రంగా ఉంటుందన్నారు. ఈ చిత్రాన్ని తమిళం, తెలుగు, మలయాళం , కన్నడం, హిందీ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో రూపొందిస్తున్నట్లు దర్శకుడు తెలిపారు. కాగా.. ఈ జిబ్రాన్ సంగీతాన్ని, మాధేష్ మాణిక్యం ఛాయాగ్రహణం అందిస్తున్నారు. A uniquely intriguing #BOATTeaser that sparks curiosity. It's my pleasure to share this and extend congratulations to the entire crew ! https://t.co/qhgIovhnpJ#ThroughoutInMidSea @chimbu_deven @iYogibabu @Gourayy @Madumkeshprem @GhibranVaibodha @maaliandmaanvi @cde_off pic.twitter.com/OVc9evIXtx — chaitanya akkineni (@chay_akkineni) December 16, 2023 -
Redin Kingsley- Sangeetha: జైలర్ నటుడితో ఏడడుగులు.. పెళ్లి ఫోటోలు షేర్ చేసిన బుల్లితెర నటి (ఫోటోలు)
-
హనీమూన్ చెక్కేసిన నవదంపతులు.. పెళ్లి వీడియో చూశారా?
జైలర్ నటుడు, కమెడియన్ రెడిన్ కింగ్స్లీ లేటు వయసులో పెళ్లి చేసుకున్నాడు. 46 ఏళ్ల వయసులో సీరియల్ నటి సంగీతను పెళ్లాడాడు. ఎటువంటి హడావుడి లేకుండా సైలెంట్గా వివాహ శుభాకార్యాన్ని సింపుల్గా ముగించేశాడు. ఆదివారం నాడు (డిసెంబర్ 10న) బెంగళూరులో ఇరు కుటుంబాలు, అత్యంత దగ్గరి బంధుమిత్రుల సమక్షంలో వీరి వివాహం జరిగింది. సడన్గా పెళ్లి చేసుకుని సర్ప్రైజ్ కొంతకాలంగా ప్రేమించుకుంటున్న వీరు సడన్గా పెళ్లి చేసుకుని అందరినీ సర్ప్రైజ్ చేశారు. దీంతో సెలబ్రిటీలు, అభిమానులు.. జీవితంలో నూతన అధ్యాయాన్ని ప్రారంభించిన రెడిన్ దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఈ కొత్త జంట హనీమూన్కు వెళ్లినట్లు తెలుస్తోంది. పెళ్లి తర్వాత తొలిసారి రెడిన్ కింగ్స్లీ తన భార్యతో కలిసి వెకేషన్కు వెళ్లిన ఫోటోలను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశాడు. మరోవైపు సంగీత తన పెళ్లి వీడియోను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. ఇద్దరి బ్యాగ్రౌండ్ ఇదే.. రెడిన్ కింగ్స్లీ.. కోలమావు కోకిల సినిమాతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చాడు. ఈ చిత్ర డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించిన అన్ని సినిమాల్లోనూ రెడిన్ యాక్ట్ చేశాడు. అలాగే ఎల్కేజీ, సంతనాతిన్ ఏ1, జాక్పాట్, నెట్టికన్ వంటి పలు చిత్రాల్లో యాక్ట్ చేశాడు. డాక్టర్, జైలర్ చిత్రాలతో మరింత గుర్తింపు సంపాదించుకున్నాడు. సంగీత విషయానికి వస్తే.. ఈ నటి అరన్మనైక్కిలి, తిరుమల్ వంటి సినిమాల్లో నటించింది. కానీ ఎక్కువగా బుల్లితెరపైనే సందడి చేసింది. పలు సీరియల్స్లో కీలక పాత్రలు పోషించింది. View this post on Instagram A post shared by Redin Kingsly (@redin_kingsley) View this post on Instagram A post shared by ©️ Silvan Photography (@silvan__photography) చదవండి: కీరవాణితో వియ్యం.. నిజమేనన్న మురళీ మోహన్.. అప్పుడే పెళ్లి! -
46 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకున్న కమెడియన్ (ఫొటోలు)
-
లేటు వయసులో పెళ్లి చేసుకున్న జైలర్ నటుడు, ఫోటోలు వైరల్
ప్రముఖ కమెడియన్ రెడిన్ కింగ్స్లీ లేటు వయసులో పెళ్లిపీటలెక్కాడు. 46 ఏళ్ల వయసున్న ఇతడు బుల్లితెర నటి సంగీత మెడలో మూడుముళ్లు వేశాడు. ఇరుకుటుంబ సభ్యులు, అతి దగ్గరి బంధుమిత్రుల సమక్షంలో ఈ వివాహ వేడుక జరిగింది. ఆదివారం జరిగిన ఈ శుభకార్యానికి పలువురు సెలబ్రిటీలు హాజరయ్యారు. నటుడు, డ్యాన్సర్ సతీష్ కృష్ణన్ నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలుపుతూ కొత్త జంట పెళ్లి ఫోటోలను షేర్ చేశాడు. అలాగే ఇదేమీ సినిమా షూటింగ్ కాదని, వీళ్లు నిజంగానే పెళ్లి చేసుకున్నారని క్లారిటీ ఇచ్చాడు. ప్రస్తుతం వీరి పెళ్లి ఫోటోలు నెట్టింట వైరల్గా మారాయి. కాగా రెడిన్ కింగ్స్లీ.. కోలమావు కోకిల అనే తమిళ సినిమాతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమాకు నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించాడు. ఈయన డైరెక్ట్ చేసిన దాదాపు అన్ని సినిమాల్లోనూ రెడిన్ యాక్ట్ చేశాడు. డాక్టర్ మూవీలో ఈయన పోషించిన భగత్ పాత్ర అతడికి మంచి గుర్తింపు తీసుకొచ్చింది. ఎల్కేజీ, అన్నాత్తె, బీస్ట్, కాతువాకుల రెండు కాదల్, మార్క్ ఆంటోని, మట్టి కుస్తీ, జైలర్ వంటి పలు సినిమాలు చేశాడు. సంగీత విషయానికి వస్తే అరన్మనైక్కిలి, తిరుమల్ వంటి సినిమాలు చేసింది. ఎక్కువగా సీరియల్స్లో నటించి గుర్తింపు పొందింది. #RedinKingsley and #Sangeetha were in a relationship for more than an year or so ❤ They got married at chamundeshwari temple at Mysore pic.twitter.com/iDEQ9wtqaZ — Kollywood Pictures (@KollywoodPics) December 10, 2023 Actor #RedinKingsley sir married to a Serial Actress #Sangeetha mam.Congrats & Happy Marriage Life 💐❤️💫pic.twitter.com/ppMjGy0zmH — 𝘚𝘸𝘦𝘵𝘩𝘢™ (@Swetha_little_) December 10, 2023 చదవండి: క్యాసినో వల్ల డబ్బులు పోగొట్టుకున్నాం.. ఆ రోజు పోలీసులు.. -
Kiraak RP Marriage: సీక్రెట్గా పెళ్లి చేసుకున్న కమెడియన్ కిర్రాక్ ఆర్పీ..
కమెడియన్ కిర్రాక్ ఆర్పీ పెళ్లిపీటలెక్కాడు. ప్రేయసి లక్ష్మీ ప్రసన్న మెడలో మూడు ముళ్లు వేశాడు. బుధవారం (నవంబర్ 29న) నాడు విశాఖపట్నంలో ఇరుకుటుంబాలు, బంధుమిత్రుల సమక్షంలో వీరి వివాహం ఘనంగా జరిగింది. ముందస్తు హడావుడి లేకుండా సీక్రెట్గా వివాహం చేసుకున్నాడు ఆర్పీ. రహస్యంగా పెళ్లి చేసుకోవడం గురించి ఆర్పీ మాట్లాడుతూ.. 'అమ్మాయిది వైజాగ్. గతేడాది మా నిశ్చితార్థం జరిగింది. మేము ప్రేమించుకుని, పెద్దలను ఒప్పించి మరీ పెళ్లి చేసుకుంటున్నాం. ఎంగేజ్మెంట్, తదితర కార్యక్రమాలకు సెలబ్రిటీలు, ఇతర వీఐపీలు వచ్చారు. ఈసారి కేవలం బంధుమిత్రుల సమక్షంలోనే పెళ్లి చేసుకోవాలని వైజాగ్ ఎంచుకున్నాం. అందుకే పెళ్లి విషయాన్ని గోప్యంగా ఉంచాం' అని చెప్పుకొచ్చాడు. కాగా కిర్రాక్ ఆర్పీ, లక్ష్మీ ప్రసన్న మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. గతేడాది మేలో ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నారు. ఈ నిశ్చితార్థ వేడుకకు ధనరాజ్ సహా తదితరులు హాజరయ్యారు. దాదాపు ఏడాదిన్నర తర్వాత పెళ్లి చేసుకున్నారు. జీవితంలో నూతన అధ్యాయాన్ని ప్రారంభించిన ఆర్పీ- లక్ష్మీ ప్రసన్నల జంటకు అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఆర్పీ ఏం చేస్తున్నాడు? జబర్దస్త్ కామెడీ షోలో వందల స్కిట్లు చేసి ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాడు ఆర్పీ. ఆ షో నుంచి తప్పుకున్న తర్వాత అతడు మరే ఇతర షోలలోనూ పెద్దగా కనిపించలేదు. చాలా కాలం తర్వాత హైదరాబాద్లో నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు పేరిట కర్రీ పాయింట్ బిజినెస్ ప్రారంభించాడు. దీనికి అనూహ్యమైన స్పందన లభించింది. ఈ వ్యాపారం విజయవంతం కావడంతో ఆర్పీ ముందడుగు వేసి నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు పేరిట పలు బ్రాంచ్లు ఓపెన్ చేశాడు. చదవండి: ఫినాలే అస్త్ర గెలుపుకు దగ్గర్లో ఉంది ఈ నలుగురే! -
అక్కడికెళ్లి కోహ్లీతో ఆడొచ్చు కదా?.. అదిరే అభి వీడియో వైరల్!
జబర్దస్త్ కామెడీతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నటుడు అభినయ కృష్ణ. అభిమానులను ఆయనను అదిరే అభి అని పిలుస్తుంటారు. తన కామెడీ పంచ్లతో కామెడీ షోతో ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకున్నారు. 2002లో వచ్చిన ప్రభాస్ మూవీ ఈశ్వర్లో హీరో ఫ్రెండ్గా తొలిసారిగా నటించారు. ఆ తరువాత విష్ణు, విద్యార్థి, గౌతమ్ ఎస్ఎస్సీ, ఈగ చిత్రాలలో నటించారు. అయితే తాజాగా అదిరే అభి ఓ వీడియోను తన ఇన్స్టాలో పంచుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. (ఇది చదవండి: చిన్నప్పుడే తండ్రి మరణం.. హోటల్లో వెయిటర్గా.. అత్తారింటికి దారేదీ నటుడి స్టోరీ!) అదిరే అభి వీడియోలో మాట్లాడుతూ..'మొన్ననే పక్కన టీ కొట్టుకు వెళ్లి టీ తాగుతున్నా. అప్పుడే టీ కొట్టు అతను మాట్లాడుతూ.. విరాట్ కోహ్లీ ఆ లాస్ట్ బాల్ను ఫ్రంట్ ఫుట్ వచ్చి ఆడుంటే సిక్స్ వెళ్లేది అన్నాడు. మిస్ చేశాడు కోహ్లీ అన్నాడు. నేను షాకయ్యా. విరాట్ కోహ్లీకి సిక్స్ ఎలా కొట్టాలో అతను చెబుతుంటే నాకు ఆశ్చర్యమనిపించింది. ఇంకో పక్కనున్న వ్యక్తి దేశంలో, రాష్ట్రంలో ఇలా చేసి ఉంటే వీళ్ల పార్టీ గెలిచేది అని అన్నాడు. అదోక షాక్. ఇంకొంతమంది సినిమాల గురించి చెప్పారు. ఈ సీన్ అలా కాకుండా ఇలా తీసి ఉంటే బాగుండేది అన్నారు.' అని అన్నారు. అనంతరం మాట్లాడుతూ..'నాకు అర్థం కానీ విషయం ఏంటంటే అంత నాలెడ్జ్ ఉన్నోడు ఇక్కడ టీ షాపు దగ్గర మాట్లాడాల్సిన అవసరమేంటి? అక్కడికెళ్లి కోహ్లీతో ఆడొచ్చు కదా? పాలిటిక్స్లో చేరి అధికారంలోకి రావొచ్చు కదా? సినిమాల్లో చేరి డైరెక్షన్ చేయొచ్చు కదా? బేసిక్గా ఏంటంటే మనం మనపని తప్పా అందరి పనులు చేసేస్తాం. అందరికంటే ఎక్కువ మనకే తెలుసనుకుంటాం. ఈరోజు కోహ్లీ ఎందుకు క్రికెట్ గ్రౌండ్లో ఉన్నాడు.. మనం టీ షాపు దగ్గర ఎందుకు ఉన్నామనేది రియలైజ్ చేసుకోవాలి. మనం మనపనిని ఫర్ఫెక్ట్గా చేసుకుంటే చాలు. ఎవరితో అవసరం లేదు. మన పని పక్కనపెట్టి.. అతను అలా ఆడితే బాగుండేది.. వాళ్లు ఇలా చేస్తే బాగుండేది.. అంటే మనల్ని నాశనం చేసుకున్నట్టే. అవతలి వాళ్లు అడిగితే చెప్పండి.. అంతేకానీ అడగకున్నా కూడా మనం మాట్లాడుతున్నామంటే టైం వేస్ట్ చేస్తున్నట్టు' అని అన్నారు. (ఇది చదవండి: బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోన్న విజయ్ ఆంటోనీ క్రైమ్ థ్రిల్లర్..!) అయితే ఈ వీడియో చూసిన నెటిజన్స్ సైతం క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. కొందరేమో అదిరే అభి మాటలకు మద్దతుగా కామెంట్స్ పెడుతున్నారు. మరికొందరేమో అలాంటి వాళ్లతో మీకెందుకు అన్నా అని పోస్ట్ చేస్తున్నారు. కొంతమంది మేధావులకు టైం కలిసిరాక అలా రోడ్లమీద తిరుగుతూ ఉంటారు అన్నా అంటూ నెటిజన్స్ రిప్లై ఇస్తున్నారు. ఏది ఏమైనా అదిరే అభి చెప్పిన మాటలు మనం కూడా ఎక్కడో ఒకచోట అలా మాట్లాడి ఉంటాం అని అనిపిస్తోంది. View this post on Instagram A post shared by Adhire Abhi (@abbhinav_actor) -
పెళ్లైన 13 రోజులకే కొట్టాడు, మరో అమ్మాయితో ఎఫైర్.. ఆత్మహత్య: నటి
విజయ్సాయి.. అమాయకపు చూపులతో అందరినీ నవ్వించాడు. హీరోగా, హీరో ఫ్రెండుగా, కమెడియన్గా.. భిన్న రకాల పాత్రలు పోషించి సినీ ఇండస్ట్రీలో సక్సెస్ అయ్యాడు. కానీ వ్యక్తిగత జీవితంలో మాత్రం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. 2006లో నటి వనితా రెడ్డిని పెళ్లి చేసుకోగా ఓ పాప కూడా పుట్టింది. కానీ, కొంతకాలానికే విభేదాలు రావడంతో ఇద్దరూ విడిపోయారు. 2015లో ఇద్దరూ విడివిడిగా జీవించడం మొదలుపెట్టారు. 2017లో తన గదిలో ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు విడిచాడు. తన చావుకు వనితాయే కారణమంటూ సూసైడ్కు ముందు సెల్ఫీ వీడియోలో పేర్కొన్నాడంటూ అప్పట్లో ప్రచారం జరిగింది. పారిపోయి పెళ్లి చేసుకున్నాం.. ఇకపోతే ఇటీవల వనితా రెడ్డి ఓ ఇంటర్వ్యూలో తన ప్రేమవివాహం- విడాకుల గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది. 'వాల్పోస్టర్ మూవీ షూటింగ్లో విజయ్కు జంటగా నటించాను. ఆ సినిమా షూటింగ్లోనే క్లోజయ్యాం. ఇద్దరం ప్రేమించుకున్నాం. రైల్లో ఉన్నప్పుడే నాకు రింగు తొడిగాడు. ఇంట్లో మా ప్రేమను ఒప్పుకోలేదు. అప్పుడు శ్రీశైలం వెళ్లగా అక్కడ కారులోనే నాకు పసుపుతాడు కట్టేశాడు. నేను ఆ పసుపుతాడు ఎవరికీ కనబడకుండా జాగ్రత్తపడేదాన్ని. ఒకానొక సమయంలో మా అమ్మకు దొరికిపోయాను. దీంతో తను రోడ్డుపైనే నా తాళి తెంపేసి రచ్చ చేసింది. పెళ్లైన 13 రోజులకే కొట్టడం మొదలుపెట్టాడు ఇంతదాకా వచ్చాక చేసేదేముందని ఇంట్లో నుంచి డబ్బు, బంగారం తీసుకుని పారిపోయి విజయ్ దగ్గరకు వచ్చేశాను. అప్పుడు యాదగిరిగుట్టలో పెళ్లి చేసుకున్నాం. కానీ తన నిజ స్వరూపం నెమ్మదిగా తెలిసి వచ్చింది. పెళ్లైన 13 రోజులకే నన్ను కొట్టడం మొదలుపెట్టాడు. నాకు సినిమా ఛాన్సులు వస్తే చేయకూడదని కండీషన్ పెట్టాడు. మా ఇంటి నుంచి డబ్బు తీసుకురమ్మని హింసించేవాడు. అలా చాలా ఆస్తి తనకు ఇచ్చేశాను. అతడి వేధింపులు భరించలేక 2013లోనే విడాకులకు దరఖాస్తు చేశాను. మాకు ఓ పాప ఉంది. కోర్టు నిర్ణయం ప్రకారం ప్రతివారం పాపను చూపించాలన్నారు. అలా నా కూతురు వారంలో ఒకరోజు తనతో ఉండేది. చనిపోయినప్పుడు తనను పట్టుకుని ఏడ్చా నా మనసు ఎప్పుడు విరిగిపోయిందంటే.. నా స్థానంలో ఇంకొకరిని తీసుకు వచ్చినప్పుడు! పెళ్లి కాకముందే తనకు మరో అమ్మాయితో ఎఫైర్ ఉంది. ఈ విషయం తెలిశాక తన ముఖం కూడా చూడాలనుకోలేదు. కానీ చనిపోయినప్పుడు తనను పట్టుకుని ఏడ్చాను. ఎందుకు తప్పుడు నిర్ణయాలు తీసుకున్నావని గుండెలవిసేలా ఏడ్చాను. ఇప్పటికీ కొన్ని కేసులు కోర్టులోనే ఉన్నాయి. నా కూతురి కోసం ఇప్పుడిప్పుడే నా కెరీర్ను తిరిగి ప్రారంభిస్తున్నాను' అని చెప్పుకొచ్చింది వనితా రెడ్డి. చదవండి: అమర్ చాలా మంచివాడు.. దయచేసి అలా మాట్లాడొద్దంటూ నటుడి తల్లి భావోద్వేగం -
హోటల్ బయట ఏడ్చిన కోవై సరళ.. పెళ్లి చేసుకోకపోవడానికి కారణమిదే!
కోవై సరళ.. చాలామందికి ఈ పేరు వినగానే పెదాలపై చిన్నటి చిరునవ్వు వస్తుంది. బ్రహ్మానందంతో జత కట్టి ఈమె పండించిన కామెడీకైతే పొట్టచెక్కలయ్యేలా నవ్వాల్సిందే! తమిళంలో వడివేలుకు జంటగా నటించి అక్కడా నవ్వుల రసాన్ని పంచింది. ఉత్తమ హాస్యనటిగా రెండు నందులు సహా అనేక అవార్డులు అందుకుంది. రాష్ట్రస్థాయిలోనూ బోలెడన్ని పురస్కారాలు అందుకున్న ఈ నటి తన జీవితంలో మాత్రం తోడు కావాలనుకోలేదు. అసలు తన సినీప్రస్థానం ఎలా మొదలైంది? ఎందుకు పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా మిగిలిపోయిందో చూద్దాం.. ఆయన ప్రశ్నలకు వణికిపోయిన కోవై సరళ ఆరో తరగతి చదువుతున్నప్పుడు కోవై సరళ తన అభిమాన నటుడు ఎమ్జీఆర్ను చూసేందుకు కోయంబత్తూరులోని హోటల్ బయట నిలుచుంది. స్కూల్ డ్రెస్లో రెండు జళ్లు వేసుకుని ఉన్న ఆమె ఎమ్జీఆర్ను చూడలేకపోవడంతో ఏడుస్తూ ఉండిపోయింది. ఈ విషయం తెలుసుకున్న ఎమ్జీఆర్ ఆమెను ఇంటికి పిలిచి మరీ తన గురించి ఆరా తీశాడు. ఏ స్కూలులో చదువుతున్నావని అడిగాడు. కొంత సంతోషం, మరికొంత భయంతోనే అన్నింటికీ సమాధానాలు ఇచ్చుకుంటూ పోయింది. తన మీద పాఠశాలలో ఫిర్యాదు చేస్తాడేమోనని వణికిపోయింది సరళ. కానీ సరిగ్గా నెల రోజులకు సరళ చదువుతున్న పాఠశాలకు ఆమె స్కూల్ ఫీజు పంపించాడు ఎమ్జీఆర్. పదో తరగతికే గర్భిణీగా అప్పటినుంచి అతడిని మరింత ఆరాధించింది. తనలాగే వెండితెరపైనా కనిపించాలనుకుంది. అనుకున్నది సాధించింది. పాఠశాలలో చదువుకునే రోజుల్లోనే వెళ్లి రత్తం(1979) చిత్రంతో వెండితెరపై అడుగుపెట్టింది. పదో తరగతికే గర్భిణీగా నటించింది. రెండో సినిమా ముందనై ముడిచ్చులో గర్భిణీ స్త్రీగా యాక్ట్ చేసింది. అంత చిన్న వయసులో గర్భిణీగా నటించే సాహసం చేసిందంటే తన అంకితభావం ఎటువంటిదో అర్థమవుతోంది. తనకు వచ్చిన అవకాశాలనల్లా కాదనకుండా చేసుకుంటూ పోయింది. పాత్రలకు ప్రాణం పోసింది.. తన కామెడీతో సినిమాలను విజయపథం వైపు నడిపించింది. ఎన్నో వందల సినిమాలు చేసిన ఆమె ప్రస్తుతం ఓపక్క సినిమాలు చేస్తూనే మరోపక్క తమిళ బుల్లితెరపై టీవీ యాంకర్గా, జడ్జిగానూ వ్యవహరిస్తోంది. 61 ఏళ్లొచ్చినా ఒంటరిగానే.. పేరు ప్రఖ్యాతలు, కీర్తి ప్రతిష్టలు, అఖండ విజయాలు కైవసం చేసుకున్న కోవై సరళ ఇంతవరకు పెళ్లి చేసుకోలేదు. ప్రస్తుతం ఆమె వయసు 61 సంవత్సరాలు. తన కుటుంబంలో కోవై సరళనే పెద్ద.. తన తర్వాత నలుగురు చెల్లెళ్లు ఉన్నారు. తను సంపాదించిందంతా కుటుంబానికే ఖర్చుపెట్టేది. ఏనాడూ స్వార్థంగా ఆలోచించేది కాదు. చెల్లెళ్లకు దగ్గరుండి పెళ్లి చేసిన ఈ హాస్యనటి వారికి పుట్టిన పిల్లల బాధ్యతను సైతం తన భుజాన వేసుకుంది. తన సొంత ఖర్చులతో వారిని చదివించింది. మనవరాళ్లను కూడా చూసుకుంటోంది. వారి కోసం జీవితాన్నే త్యాగం మరోవైపు నిరుపేదలకు, ఆపదలో ఉన్నవారికి సాయం చేస్తుంది. తన చెల్లెళ్ల కోసం అనునిత్యం ఆలోచింది తన జీవితాన్నే త్యాగం చేసింది. తను కూడా ఇల్లాలిగా మారాలని ఏనాడూ ఆలోచించలేదు. ప్రస్తుతం కోవై సరళ వారి పిల్లలకు, మనవరాళ్లకు తన ప్రేమను పంచుతోంది. ఒంటరిగా ఉండటం కూడా ఈ హాస్యనటికి ఇష్టం. అందుకే ఆమె పెళ్లి చేసుకోకుండా సింగిల్గా మిగిలిపోయిందనీ అంటుంటారు! చదవండి: డబుల్ మీనింగ్ డైలాగ్స్.. కోరుకునేది ఒక్కటేనంటున్న గురు హీరోయిన్ -
ఆ కారణం వల్లే సినిమాలకు దూరమైన ఆర్య కమెడియన్, త్వరలో పెళ్లి!
చిత్రం సినిమాతో పేరు తెచ్చుకున్న కమెడియన్ బబ్లూ ఆర్య సినిమాతో అందరికీ దగ్గరయ్యాడు. తెలుగులో స్టార్ హీరోలందరి సినిమాల్లో నటించిన అతడు తన కామెడీ టైమింగ్తో ఎందరినో నవ్వించాడు. చాలాకాలంగా సినిమాలకు దూరంగా ఉన్న అతడు రీఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయ్యాడు. ఈక్రమంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చాడు. 5 ఏళ్లకే సినిమాల్లోకి.. 'నా మొదటి చిత్రం ముద్దుల మేనల్లుడు. అప్పుడు నా వయసు 5 ఏళ్లు. అందులో నాజర్ కొడుకిగా నటించాను. చైల్డ్ ఆర్టిస్ట్గా చాలా సినిమాలు చేశాను. 11 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు సీరియల్ చేశాను. నా అసలు పేరు సదా ఆనంద్. ఈ సీరియల్ చేసేటప్పుడు జంధ్యాలగారు బబ్లూ అన్న పేరు పెట్టారు. అప్పటినుంచి అదే పేరు స్థిరపడిపోయింది. నేను 10వ తరగతి చదివేటప్పుడు చిత్రం మూవీ చేశాను. ఆ సినిమాతో బోలెడన్ని అవకాశాలు వచ్చాయి. మా నాన్న బాడీ బిల్డర్. ఆయన సినిమాలు చేయాలని ఎంతో ప్రయత్నించాడు, కానీ కుదర్లేదు. అయితే 'చిత్రం'లో నాతోపాటు ఓ సాంగ్లో నటించాడు. నాకిష్టమైన ముగ్గురూ చనిపోయారు 2012లో నాన్న చనిపోయాడు. గతేడాది చెల్లి మరణించింది. ఈ ఏడాది జనవరిలో నాన్న సోదరి కొడుకు చనిపోయాడు. అలా నాకు ఇష్టమైన ముగ్గురు చనిపోయారు. మా నాన్న మరణంతో డిప్రెషన్లోకి వెళ్లిపోయాను. అప్పుడు ఆఫర్స్ వదిలేసుకున్నాను. బ్యాంకాక్ వెళ్లిపోయి రెండేళ్లకుపైగా అక్కడే ఉన్నాను. అలా సినిమాలకు దూరమయ్యాను. ఇప్పుడిప్పుడే మళ్లీ సినిమాల మీద దృష్టి పెట్టాను. ప్రస్తుతం సొంతంగా ఓ ప్రాజెక్ట్ కూడా చేస్తున్నాను. అలాగే యాక్టింగ్ అకాడమీలోనూ పని చేస్తున్నాను. పెళ్లి వాయిదా పెళ్లి విషయానికి వస్తే.. లాక్డౌన్లో ఆ అమ్మాయిని ప్రేమించాను. మూడేళ్లుగా లవ్ చేసుకున్నాం. త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాను. నిజానికి ఈ ఏడాదే పెళ్లి చేసుకోవాల్సింది. కానీ చెల్లి మరణంతో అది వాయిదా పడింది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో నా పెళ్లి జరుగుతుంది' అని చెప్పుకొచ్చాడు బబ్లూ. చదవండి: కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న ఆనంద్ హీరో -
చనిపోయేవరకు నన్ను వదలవేమో.. ఏడ్చేసిన జబర్దస్త్ కమెడియన్
జీవితంలో కష్టసుఖాలు సర్వసాధారణం. అయితే తన లైఫ్లో మాత్రం చిన్నప్పటి నుంచి ఇప్పటివరకు కష్టాలే తిష్ట వేసుకుని కూర్చున్నాయంటున్నాడు జబర్దస్త్ కమెడియన్ జీవన్. బుల్లితెరపై కమెడియన్గా క్లిక్ అయిన సమయంలో అనారోగ్యానికి గురై షో నుంచి తప్పుకున్నాడు. అనారోగ్య సమస్యలతో చావు అంచుల వరకు వెళ్లి వచ్చాడు. చాలాకాలం తర్వాత తాజాగా ఓ షోలో హాజరై తన కన్నీటి కష్టాలను వివరించాడు. ఆటోకు డబ్బుల్లేక నడుచుకుంటూ వెళ్లేవాళ్లం 'ఒక పేరు వచ్చాక కష్టాలకు చెక్ పడుతుందనుకున్నాను. కానీ పేరు వచ్చిన తర్వాత కూడా ఇంకా కష్టాలు పడుతూనే ఉన్నాను. మ్యూజిక్ డైరెక్టర్ అవుదామని ఇండస్ట్రీలోకి వచ్చాను. కృష్ణవంశీ 'మహాత్మ' సినిమాలో నీలపురి గాజుల ఓ నీలవేణి పాట పాడింది మేమే.. కానీ పాడింది మేమేనని ఎక్కడా పేరు వేయలేదు. అలా అక్కడ స్ట్రక్ అయిపోయాను. తర్వాత ఫణి అన్న అభి అన్నకు పరిచయం చేశాడు. అభి అన్న ఇంటికి వెళ్లడానికి డబ్బుల్లేక.. హైపర్ ఆది అన్న, నేను కృష్ణా నగర్ నుంచి బోయిన్పల్లి చౌరస్తా వరకు నడుచుకుంటూ వెళ్లి అక్కడ షేర్ ఆటోలో వెళ్లేవాళ్లం. ఆ దేవుడు నాపై కరుణ చూపలేదు జబర్దస్త్ షోలో మంచి పేరొచ్చింది. టీం లీడర్ స్థాయికి వెళ్లాను. కానీ ఎందుకో నామీద దేవుడు కరుణ చూపలేదు. నన్ను చావు అంచుల వరకు తీసుకెళ్లాడు. చిన్నప్పటి నుంచి కష్టాలే.. నేను చనిపోయేవరకు ఈ కష్టాలు నన్ను వదిలిపోవేమో అనిపిస్తోంది' అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు జీవన్. అక్కడే ఉన్న ఫణి సైతం తాను పడ్డ బాధలను చెప్పుకొచ్చాడు. సినిమాలు చేద్దామని జబర్దస్త్ నుంచి బయటకు వచ్చాను. కానీ అక్కడ సినిమాల్లేవు. షోలు చేద్దామంటే అవి కూడా లేవు. ఆ సమయంలోనే నాన్నకు క్యాన్సర్ వచ్చింది అని చెప్తూ భావోద్వేగానికి లోనయ్యాడు. చదవండి: స్టేజీపై యాంకర్తో నటుడి అనుచిత ప్రవర్తన.. అమ్మాయి నోరు నొక్కేస్తారంటూ మండిపడ్డ చిన్మయి -
హీరో అవ్వాలనుకున్నా, సీక్రెట్గా పెళ్లి.. ఇండస్ట్రీలో కష్టాలు..: గడ్డం నవీన్
జబర్దస్త్ నవీన్.. బుల్లితెరపై, వెండితెరపై నవ్వుల జల్లు కురిపిస్తూనే ఉన్నాడు. జబర్దస్త్ నవీన్, గడ్డం నవీన్, నవీన్ ఇటిక, జూనియర్ రాఘవేంద్రరావు.. ఇలా ఎన్నో పేర్లతో పాపులర్ అయ్యాడు. వరుస సినిమాలతో, విభిన్న పాత్రలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. 25 ఏళ్లుగా ఇండస్ట్రీలో నటుడిగా వెలుగొందుతున్న జబర్దస్త్ గడ్డం నవీన్ బర్త్డే నేడు (సెప్టెంబర్ 1). ఈ సందర్భంగా తన గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. ► ఇది 47వ పుట్టిన రోజు.. 1995లో సినీ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చాను. అప్పటి నుంచి ఎన్నో ఒడిదుడుకులు చూశాను. ఈ సంవత్సరం చాలా సంతృప్తికరమైన జర్నీ సాగుతోంది. గేమ్ చేంజర్, సైంధవ్ సహా 10 సినిమాలు చేస్తున్నాను. మా పెద్దబాబు డిగ్రీలో గోల్డ్ మెడల్ సాధించినందుకు చాలా సంతోషంగా ఉంది. ► పుట్టిపెరిగింది సికింద్రాబాద్. మా తల్లిదండ్రులు కృష్ణ, సక్కుబాయి. మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. మా నాన్న ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేశారు. అయినా ఆర్థిక కష్టాలు మా కుటుంబాన్ని వెంటాడేవి. చదువుకుంటూనే మెకానిక్ షాపు, బట్టల షాపు, చిరు వ్యాపారాలు చేశాను. ఒకానొక సమయంలో ఆఫీస్ బాయ్గా కూడా పని చేశాను. ఆ క్రమంలోనే 1995 నుంచి సినీ అవకాశాల కోసం ప్రయత్నించాను. అప్పుడే పెళ్లిచేసుకున్నాను. నా భార్య పేరు బబితా. ఇద్దరు కొడుకులు పవన్ దినేష్, అక్షయ్ కుమార్. లోకల్ కాబట్టి సినీఇండస్ట్రీలో ఆకలి బాధలు పడలేదు కానీ.. మిగతా ఇబ్బందులు ఫేస్ చేశాను. ► సినిమాలకు వెళ్ళానుకున్నప్పుడు మా బాబాయ్ శ్రీను ప్రోత్సాహంతో ఓ చిన్న ఎంట్రీ దొరికింది. 'ప్రేమించేది ఎందుకమ్మా' సినిమాకి దర్శకులు సురేందర్ రెడ్డి ఆసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్నారు. ఆ సమయంలో నా హెయిర్ స్టైల్ బాగుండేది. సురేందర్ రెడ్డి గారు నన్ను సెలెక్ట్ చేసి అవకాశం ఇచ్చారు. మా వైఫ్ కూడా ఆర్టిస్ట్. అమెను కూడా ఫస్ట్ టైమ్ అక్కడే చూశాను.. సినిమా పూర్తియ్యేసరికి పేరేంట్స్కి తెలియకుండా పెళ్లి చేసుకున్నాం. ఈ విషయం తెలిసి సీరియస్ అయ్యారు.. కానీ తర్వాత అంతా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ► హీరో అవుదామనే ఇండస్ట్రీకి వచ్చాను. ఫస్ట్ టైమ్ సిల్వర్ స్క్రీన్ పై కృష్ణ యాక్షన్ సీన్స్ చూసి బాగా ఫిదా అయ్యాను. ఆ తర్వాత చిరంజీవి సినిమాలు చూశాక మెంటల్ ఎక్కిపోయింది. ప్రతి ఆదివారం సినిమాలు చూడటం అలవాటై సినిమాలపై మక్కువ పెరిగింది. కమెడియన్గా కొంత గుర్తింపు తెచ్చుకున్నందుకు సంతోషంగా ఉంది. ఇప్పటివరకు 150 సినిమాలు చేశాను. నిర్మాత కావాలనేదే నా లక్ష్యం. అంతేకాకుండా ఓ సింగిల్ థియేటర్ నిర్మించాలన్న కల కూడా ఉంది. ► జబర్దస్త్, సినిమాలు, ఈవెంట్స్ చేస్తున్నాను కానీ.. ఆ పేమెంట్ నా కుటుంబ పోషణకు ఉపయోగపడుతుంది. అయితే ఉద్యోగం చేసేవాడిని, కానీ ఇప్పుడు వెళ్లడం లేదు. మా కంపెనీ యాజమానీ దినేష్ గారు.. ఎప్పుడు వెళ్లినా నాకు ఉద్యోగం ఇస్తారు. అందుకే ఆ కంపెనీకి ఇంకా రాజీనామా చేయలేదు. సొంత ఇల్లు కట్టుకోవాలనే డ్రీమ్ ఉంది. అప్పటి వరకు మీ సహకారంతో కష్టపడుతూనే ఉంటాను. చదవండి: ఫోటో షేర్ చేసిన మంచు లక్ష్మి.. విష్ణుకు ఎందుకు రాఖీ కట్టలేదంటూ..? -
నటుడు వడివేలు ఇంట విషాదం..
తమిళనాడు: ప్రముఖ నటుడు వడివేలు ఇంట విషాదం నెలకొంది. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తమ్ముడు జగదీశ్వరన్(55) ఆదివారం(ఆగస్టు 27) కన్నుమూశారు. కాలేయ సంబంధిత సమస్యతో సతమతమవుతున్న ఆయన కొద్ది రోజులుగా తమిళనాడు మధురైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కాలేయ పనితీరు పూర్తిగా దెబ్బతినడంతోనే ఆయన ఆరోగ్యం విషమించి చనిపోయారు. కాగా జగదీశ్వరీన్.. శింబు 'కాదల్ అలైవిట్టలై' సినిమాతో సహా పలు చిత్రాల్లో నటుడిగా తళుక్కుమని మెరిశారు. కానీ ఇండస్ట్రీలో అంతగా అవకాశాలు రాకపోవడంతో చెన్నై నుంచి మధురై వెళ్లిపోయాడు. అక్కడ ఒక వస్త్రాల షాపు పెట్టుకుని జీవనం కొనసాగించాడు. ఇదిలా ఉంటే కొద్ది నెలల క్రితమే వడివేలు తల్లి మరణించింది. ఈ విషాదం నుంచి తేరుకోమందే తమ్ముడు కూడా చనిపోవడంతో ఆయన ఇంట రోదనలు మిన్నంటాయి. చదవండి: తాగమని బలవంతం, మందుకు బానిసయ్యా.. తాగుబోతునని నా కూతుర్ని కూడా.. -
ఇల్లు అమ్మేస్తోన్న జబర్దస్త్ కమెడియన్.. కన్నీటిని ఆపుకుంటూ!
జబర్దస్త్ శాంతి అలియాస్ శాంతిస్వరూప్ పరిచయం అక్కర్లేని పేరు. ప్రేక్షకులందరికీ జబర్దస్త్ శాంతిగానే పేరు ముద్రపడిపోయింది. కామెడీ షోతో గుర్తింపు తెచ్చుకున్న శాంతి బుల్లితెరపై తనకంటూ ప్రత్యేకతను చాటుకుంది. తన కామెడీతో అందరినీ నవ్వించిన జబర్దస్త్ శాంతి.. అయితే ప్రస్తుతం కష్టాల్లో ఉన్నారు. అతని తల్లికి ప్రస్తుతం సర్జరీ చేయాల్సి వచ్చిందని తెలిపారు. అమ్మ ఆస్పత్రి ఖర్చుల కోసం డబ్బులు లేకపోవడంతో ఏకంగా తన ఇంటిని అమ్మకానికి పెట్టినట్లు వెల్లడించారు. (ఇది చదవండి: ప్రేమ పేరుతో మోసం.. జబర్దస్త్ కమెడియన్ అరెస్ట్ ) ఈ విషయాన్ని తన ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు. అమ్మకు తెలియకుండానే ఇంటిని అమ్మేస్తున్నట్లు ఎమోషనలయ్యారు. అమ్మకు హెల్త్ బాగాలేకపోవడంతో నేను ఇంటిని అమ్మేయస్తున్నానంటూ కన్నీరు పెట్టుకున్నారు. ఇది చూసిన నెటిజన్స్ శాంతికి మద్దతు ప్రకటిస్తున్నారు. అమ్మ కోసం మీరు చేస్తున్న పని చూస్తుంటే గర్వంగా ఉందని పోస్టులు పెడుతున్నారు. అమ్మ కోసం మీరు చేస్తున్న త్యాగం చాలా గొప్పది.. ఈ ప్రకృతిలో అమ్మకు మించిన ఆస్తి, సంపద, స్టేటస్ ఏది ఉండదని ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇన్ని రోజులు నాకోసం ఉన్న ఇల్లు ఇప్పుడు నాకు లేకుండా పోతోంది.. కానీ ఈ ఇంట్లోకి ఎవరు వచ్చినా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నానని తెలిపింది. (ఇది చదవండి: ఇద్దరు పిల్లల తండ్రిని కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకున్న నటి?!) View this post on Instagram A post shared by Jabardasth Shanthi Swaroop (@jabardasthshanti) -
ఉన్నదంతా దానం చేసిన కమెడియన్.. చివరిరోజుల్లో తిండి లేక చనిపోయింది!
కల్పనా రాయ్.. ఈ పేరు చెప్తే చాలు చాలామంది పెదాలపై వారికి తెలియకుండానే చిరునవ్వు వస్తుంది. తరతరాలకు సరిపడేంత నవ్వులు పంచి వెళ్లిపోయింది ఈ మహానటి. తన యాసతో డైలాగ్కే వన్నె తెచ్చిన ఈమె 430కు పైగా చిత్రాల్లో నటించింది. జంబలకిడి పంబ, ప్రేమించుకుందాం రా, కలిసుందాం రా.. ఇలా చెప్పుకుంటూ పోతే బోలెడన్ని గుర్తుండిపోయే సినిమాలు చేసింది. వందల సినిమాలు చేసిన ఈ నటి చివరి రోజుల్లో మాత్రం ఆర్థిక కష్టాలతో కొట్టుమిట్టాడింది. అంత పెద్ద నటికి అటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? తన చివరి రోజుల్లో ఏం జరిగింది? అనేది ఈ కథనంలో చదివేద్దాం.. తెలుగింటి ఆడపడుచు కల్పనా రాయ్ తెలుగింటి ఆడపడుచు. 1950లో కాకినాడలో జన్మించింది. ఆమె అసలు పేరు సత్యవతి. యుక్తవయసులో ఆమె ఎంతో అందంగా ఉండేది. ఒంటినిండా బంగారు నగలు వేసుకుని ఆమె నడిచి వస్తుంటే చూడటానికి రెండు కళ్లు చాలేవి కాదట! 'నీడలేని ఆడది' సినిమాతో వెండితెరపై రంగప్రవేశం చేసింది కల్పన. కమెడియన్గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా వందల కొద్దీ సినిమాలు చేసింది. అందరికీ తనే స్వయంగా అన్నం వండి వడ్డించేది. కో డైరెక్టర్లు సహా ఎంతోమంది ఆమె చేతివంట తిని కడుపు నింపుకునేవాళ్లు. వెన్నలాంటి మనసు ఎవరైనా బాధలో ఉన్నామని కన్నీళ్లు పెట్టుకుంటే చాలు క్షణం ఆలోచించకుండా తన చేతికి ఉన్న బంగారు గాజులను తీసి ఇచ్చేది. అంతటి దయామయురాలు కల్పనా రాయ్. తన దానధర్మాల వల్ల ఉన్న బంగారం, ఆస్తి అంతా కరిగిపోయినా ఆమె మాత్రం తీరు మార్చుకోలేదు. అప్పు చేసైనా సరే అందరికీ భోజనం పెట్టేది. ఆ మంచితనమే ఆమెకు శాపంగా మారింది. డబ్బు పోగానే అందరూ దూరమయ్యారు. దిగులు వల్లో మరింకేదో కానీ కల్పన లావెక్కింది. కూతురు పారిపోవడంతో ఒంటరి ఈ నటి ఎవరినీ పెళ్లి చేసుకోలేదు. ఒకమ్మాయిని దత్తత తీసుకుని పెంచుకుంది. కానీ ఆమె యుక్తవయసుకురాగానే ఒకరిని ప్రేమించి అతడితో పారిపోయింది. అప్పుడు కల్పన పడ్డ బాధ వర్ణణాతీతం. ప్రాణంగా ప్రేమించుకున్న కూతురు తనను మోసం చేసి వెళ్లిపోవడాన్ని తట్టుకోలేక తల్లడిల్లిపోయింది. అప్పుడే ఆమె మనిషిగా సగం చనిపోయింది. ఉన్న డబ్బు కూడా ఆవిరవడంతో పలకరించే నాధుడే కరువయ్యాడు. ఒంటరిగా మిగిలిపోయింది. చనిపోయేముందు దాదాపు పది రోజులపాటు తిండి లేక ఆకలికి అలమటించింది. తన శరీరం ఆకలికి తట్టుకోలేక హృదయ విదారక స్థితిలో ఆమె కన్నుమూసింది. ఈ పరిస్థితి ఎవరికీ రాకూడదు 'కల్పనా రాయ్ చనిపోయినప్పుడు ఆమె చితికి నిప్పు పెట్టడానికి కూడా డబ్బుల్లేని దుస్థితికి చేరుకుంది. ఆమె అతి మంచితనం వల్ల చేతిలో చిల్లిగవ్వ కూడా లేకపోయింది. ఇంతటి దుస్థితి ఏ ఆర్టిస్టుకూ రాకూడదు. కళామతల్లిని నమ్ముకున్న ఆమె చితి పేర్చేందుకు వేరేవాళ్లు డబ్బు సాయం చేస్తే కానీ ఆమె అంత్యక్రియలు జరగలేదు' అంటూ గతంలో ఓ ఇంటర్వ్యూలో కంటతడి పెట్టుకుంది నటి జయశ్రీ. చదవండి: Sushmita Sen: పెళ్లి చేసుకుంటానంటే.. దేనికి? మాకైతే తండ్రి అక్కర్లేదంటున్నారు పిల్లలు.. -
కమెడియన్ రఘు కూతుళ్లను చూశారా?
టాలీవుడ్లో చాలా మంది కమెడియన్లు ఉన్నారు. వారిలో కొద్ది మంది మాత్రమే తమదైన కామెడీ టైమింగ్తో జనాల్లో క్రేజీ సంపాదించుకున్నారు. అలాంటి వారిలో రఘు కారుమంచి ఒకరు. తెలంగాణ యాసలో మాట్లాడుతూ.. డిఫరెంట్ మేనరిజంతో అందరికి దగ్గరయ్యాడు. ఆది సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన రఘు.. అదుర్స్ చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. (చదవండి: విజయ్ దేవరకొండ డ్రస్.. అంత కాస్ట్ లీ!?) అయితే రఘు సినీ ఎంట్రీ అంత ఈజీగా జరగలేదు. సాఫ్ట్వేర్ ఉద్యోగం వదిలేసి సినిమాల కోసం చాలా ప్రయత్నాలు చేశాడు. డైరెక్టర్ వి.వి వినాయక్తో ఉన్న స్నేహబంధం కారణంగా ఎన్టీఆర్ చిత్రాల్లో అవకాశం లభించింది. అదుర్స్లో మంచి పాత్ర లభించడంతో రఘు పేరు అందరికి రిజిస్ట్రర్ అయింది. అలాగే జబర్దస్త్ కామెడీ షో కూడా రఘుకి మంచి గుర్తింపు తెచ్చ పెట్టింది. ఇప్పటివరకు దాదాపు 200పైగా చిత్రాల్లో నటించాడు. లిక్కర్ దందా వరుస సినిమాలు చేసినప్పటికే రఘుకి సరైన గుర్తింపు రాలేదు. ఒకనొక దశలో సినిమా అవకాశాలు కూడా తగ్గాయి. దీంతో రఘు లిక్కర్ దందాలోకి దిగాడు. రెండేళ్ల కింద తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన వైన్ షాపుల వేలంలో నల్లగొండ జిల్లాలోని మర్రిగూడ బైపాస్ సమీపంలో ఎండు దుకాణాలు చేజిక్కించుకున్నారు. రఘునే స్వయంగా పూజలు నిర్వహించి, మద్యం అమ్మకాన్ని ప్రారంభించారు. బిజినెస్లో భారీ నష్టం ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే రఘు పలు రకాల వ్యాపారాలు చేశాడు. అతనికి స్టాక్ మార్కెట్పై మంచి పట్టు ఉంది. ఒక సమయంలో షేర్ మార్కెట్లో భారీగా పెట్టుబడులు పెట్టి పెద్ద ఎత్తున నష్టపోయారు.‘షేర్ మార్కెట్లో భారీ నష్టం రావడంతో మూడు నెలల పాటు ఇంట్లో నుంచి బయటకు రాలేదు. టెన్షన్తో ఇంట్లో ఉన్నకంప్యూటర్, ల్యాప్టాప్ని పగులగొట్టాను’అని ఓ ఇంటర్వ్యూలో రఘు చెప్పుకొచ్చాడు. కూతుళ్ల ఫోటోలు వైరల్ రఘు స్వస్థలం తెనాలి. అతను హైదరాబాదులో పుట్టి పెరిగాడు. ఇక్కడే ఎంబీఏ పూర్తి చేసి సాఫ్ట్వేర్ ఉద్యోగం చేరాడు. ఆ సమయంలోనే అతని పెళ్లి జరిగింది. రఘుకు ఇద్దరు ఆడ పిల్లలున్నారు. పెద్ద కూతురు పేరు స్వప్నిక, చిన్న కూతురు పేరు తేజస్వీ. సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్గా ఉండే రఘు తాజాగా తన చిన్న కూతురు ఫోటోలను షేర్ చేస్తూ బర్త్డే విషెస్ తెలియజేశాడు. దీంతో రఘు కూతుర్ల ఫోటోలు నెట్టంట వైరల్గా మారాయి. రఘు ఇద్దరు కూతుళ్లు ఇంజనీరింగ్ చదువుతున్నారు. View this post on Instagram A post shared by Raghu Karumanchi (@raghukarumanchi) -
మూడో తరగతిలోనే అమ్మ చనిపోయింది, నాన్న వదిలేసి పోయారు
కమెడియన్, హీరోగా, విలన్గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా భిన్న రకాల పాత్రలు పోషించి ప్రేక్షకులకు దగ్గరయ్యాడు బాబూ మోహన్. ఆహుతి సినిమాతో ఆయన సినీప్రస్థానం మొదలైంది. తొలి సినిమాలోనే మంచి మార్కులు కొట్టేసిన బాబూ మోహన్ తక్కువ కాలంలో కమెడియన్గా టాప్ పొజిషన్కు వెళ్లాడు. రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చాక సినిమాలు తగ్గించేసిన ఈయన దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత ఆర్గానిక మామ హైబ్రీడ్ అల్లుడు సినిమాతో రీఎంట్రీ ఇస్తున్నాడు. ప్రస్తుతం ఓ బుల్లితెర షోలో జడ్జిగా వ్యవహరిస్తున్న ఆయన పిల్లలు వేసిన ఎమోషనల్ స్కిట్ చూసి ఏడ్చేశాడు. తన చిన్ననాటి సంగతులు గుర్తుకు వచ్చాయంటూ భావోద్వేగానికి లోనయ్యారు. 'ఒక్కసారిగా నన్ను గతంలోకి తీసుకెళ్లారు. నాకు మా అమ్మ గుర్తొచ్చింది. నేను మూడో తరగతి చదువుతుండగా అమ్మ చనిపోయింది. నాకో చిన్న చెల్లెలు. చిన్నప్పటి నుంచి తల దువ్వి జడ వేసి దగ్గరుండి చూసుకున్నాను. మా నాన్న ఎక్కడికో వెళ్లిపోయారు. మా బాధ ఎవరికి చెప్పుకోవాలో తెలియదు' అంటూ కంటతడి పెట్టుకున్నాడు. బాబూ మోహన్ ఎక్కువగా కోట శ్రీనివాస్ రావుతో కలిసి కామెడీ పండించేవారు. ఆ తర్వాత బ్రహ్మానందంతో ఎక్కుగా కాంబినేషన్ కామెడీ సీన్లు ఉండేవి. మామగారు సినిమాకుగానూ బాబూ మోహన్ నంది అవార్డు అందుకున్నాడు. తెలుగు వెండితెరపై టాప్ కమెడియన్గా రాణించిన ఆయన ప్రస్తుతం భారతీయ జనతా పార్టీలో కొనసాగుతున్నాడు. చదవండి: వీడియో షేర్ చేసిన స్నేహ.. అలా చేస్తే గుండెపోటు వచ్చే ప్రమాదం ఉందంటూ అభిమానుల హెచ్చరిక -
హీరోగా మారిన మరో కమెడియన్
కథానాయకులుగా అవతారమెత్తిన హాస్యనటుల సరసన ఇప్పుడు నటుడు పుగళ్ చేరారు. కుక్ విత్ కోమాలి బుల్లితెర కార్యక్రమంతో పాపులర్ అయిన ఈయన ఆ తరువాత సినీ రంగప్రవేశం చేసి హాస్యనటుడిగా అనతి కాలంలోనే పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు తుడిక్కరదు మీసై చిత్రం ద్వారా హీరోగా పరిచయం అవుతున్నారు. యోగి వీరన్ పిక్చర్ పతాకంపై రాము నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా ఎంజే ఇళన్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈయన ఎస్డీ సభ వద్ద పలు చిత్రాలకు సహాయదర్శకుడిగా పనిచేశారు. తుడిక్కరదు మీసై చిత్ర యూనిట్ అదేవిధంగా నిర్మాత కలైపులి.ఎస్.థాను వద్ద పనిచేసి అనుభవం గడించారు. తుడిక్కరదు మీసై చిత్రం గురువారం చైన్నెలో పూజాకార్యక్రమాలతో ప్రారంభమైంది. పలువురు సినీ ప్రముఖులు హాజరై చిత్ర యూనిట్కు శుభాకాంక్షలు అందించారు. చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ ప్రేమించడం తప్పు కాదు, ప్రేమ కోసం జీవితాన్ని నాశనం చేసుకునే ఈతరం యువత గురించి చెప్పే కథా చిత్రంగా ఉంటుందన్నారు. చిత్రాన్ని వినోదాన్ని జోడించి జనరంజకంగా రూపొందిస్తున్నట్లు చెప్పారు. చిత్ర కథ మదురై నుంచి చైన్నె వరకూ సాగుతుందని చెప్పారు. సినిమాపై ఆసక్తి, ప్రతిభ కలిగిన యూనిట్తో షూటింగ్కు సిద్ధమైనట్లు చెప్పారు. కాగా దీనికి అశోక్కుమార్ ఛాయాగ్రహణం, శ్రీకాంత్ దేవా సంగీతాన్ని అందిస్తున్నారు. -
మా నాన్న ఎలా ఉంటాడో తెలియదు.. ఏడ్చేసిన ధనరాజ్
జబర్దస్త్ షోలో నవ్వులు పూయించిన కమెడియన్లలో ధనరాజ్ ఒకరు. ఇతడి పంచులు, డైలాగ్ డెలివరీ విధానానికి జనాలు పొట్టచెక్కలయ్యేలా నవ్వుకునేవాళ్లు. ఈ షోతో కమెడియన్గా తనను తాను నిరూపించుకున్న ఇతడు అప్పటికే వెండితెరపైనా తళుక్కుమని మెరిశాడు. జై సినిమాతో సినీప్రపంచంలో అడుగుపెట్టిన అతడు పరుగు, గోపి గోపిక గోదావరి, పిల్ల జమీందార్ వంటి సినిమాలతో ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. అతడి యాక్టింగ్ ఎంతో సహజంగా ఉండటంతో బోలెడన్ని సినిమా అవకాశాలు ఆయన ఇంటి తలుపు తట్టాయి. దీంతో వచ్చినవాటినల్లా చేసుకుంటూ పోయాడు. మధ్యలో జబర్దస్త్లో టీమ్ లీడర్గానూ చేశాడు. ఈ మధ్య ఎక్కువగా చిన్న చిత్రాల్లోనే కనిపిస్తున్నాడు ధనరాజ్. తాజాగా అతడు ఓ షోలో కంటతడి పెట్టుకున్నాడు. 'మా నాన్న ఎలా ఉంటాడో నాకు తెలీదు. ప్రపంచంలో నాకు రక్తసంబంధం అనేదే లేదు. ఏదైనా రక్తసంబంధం ఉందీ ఉంటే అది వీళ్లిద్దరితోనే స్టార్ట్ అయింది' అంటూ పిల్లలను చూపిస్తూ ఏడ్చేశాడు. దీంతో ధనరాజ్ భార్య సైతం కంటతడి పెట్టుకుంది. ధనరాజ్ తనయుడు సైతం.. 'డాడీ, తమ్ముడు, మమ్మీ.. వీళ్లే నా ప్రపంచం' అంటూ భావోద్వేగానికి లోనయ్యాడు. వీరంతా ఓ ఫ్యామిలీ షోలో పాల్గొంటున్నారు. ఇకపోతే ధనరాజ్ ఆమధ్య బిగ్బాస్ షోలోనూ కనిపించాడు. బిగ్బాస్ తెలుగు మొదటి సీజన్లో పాల్గొన్న అతడు టాప్ 10 కంటెస్టెంట్లలో ఒకరిగా చోటు దక్కించుకున్నాడు. దాదాపు నెలన్నర రోజులపాటు హౌస్లో కొనసాగాడు. ప్రస్తుతం సినిమాలతో పాటు కామెడీ షోలు కూడా చేస్తున్నాడు. చదవండి: తెలుగింటి హీరోయిన్..సీక్రెట్గా పెళ్లి.. మోసం చేసిన భర్త.. ఆర్థిక కష్టాలతో ఇల్లమ్మేసి.. పుట్టెడు శోకంలో ఉన్నాం.. మాపై మీరు చేస్తుంది అన్యాయం -
బ్రహ్మానందం ఇంట పెళ్లి బాజాలు.. సీఎం కేసీఆర్ను కలిసిన హాస్యబ్రహ్మ
హాస్యబ్రహ్మ బ్రహ్మానందం ఇంట పెళ్లి సందడి షురూ అయింది. ఆయన రెండో తనయుడు సిద్దార్థ్.. డాక్టర్ ఐశ్వర్యతో ఆయన ఏడడుగులు వేయనున్నారు. ఇటీవలే వీరి నిశ్చితార్థ వేడుక అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే! తాజాగా వీరి పెళ్లికి ముహూర్తం ఫిక్స్ చేశారు. త్వరలో హైదరాబాద్లో జరగనున్న పెళ్లి కోసం అతిథులకు ఆహ్వానాలు పంపుతున్నారు. ఈ క్రమంలో శనివారం నాడు ప్రగతిభవన్లో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు గారిని బ్రహ్మానందం కుటుంబ సమేతంగా కలిసి పెళ్లి పత్రిక అందజేశారు. తన కుమారుడి పెళ్లికి తప్పకుండా రావాల్సిందిగా కేసీఆర్ను ఆహ్వానించారు. ఈ సందర్భంగా బ్రహ్మానందం దంపతులకు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. ఇకపోతే బ్రహ్మానందానికి ఇద్దరు కుమారులు. పెద్ద కొడుకు రాజా గౌతమ్ 'పల్లకిలో పెళ్లికూతురు' సినిమాతో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చారు. తర్వాత పలు చిత్రాల్లో నటించారు. గౌతమ్కు ఇదివరకే పెళ్లై పిల్లలు కూడా ఉన్నారు. బ్రహ్మానందం తన మనవళ్లతో కలిసి ఆడుకున్న ఫోటోలను అప్పుడప్పుడూ షేర్ చేస్తుంటారు గౌతమ్. బ్రహ్మానందం చిన్న కొడుకు సిద్దార్థ్ విదేశాల్లో చదువుకుని అక్కడే ఉద్యోగం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇతడికి సినిమాల మీద ఆసక్తి లేకపోవడంతోనే ఇండస్ట్రీకి దూరంగా ఉంచినట్లు సమాచారం. చదవండి: ఆ సినిమాకు రూ.250 కోట్లా?: కంగనా ఫైర్ -
కమెడియన్తో హీరోయిన్ డేటింగ్.. సోషల్ మీడియాలో వైరల్!
కోలీవుడ్ నటి గాయత్రీ శంకర్ సౌత్ సినిమాల్లో హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. గతేడాది మామనితమ్, విక్రమ్ సినిమాల్లో తనదైన నటనతో మెప్పించింది. గాయత్రీ 2012లో '18 వయసు' సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టి.. 'నడువుల కొంజం పక్కత కానోమ్' అనే చిత్రంతో గుర్తింపు దక్కించుకుంది. అయితే ఇటీవల ఈ హీరోయిన్పై నెట్టింట తెగ చర్చ నడుస్తోంది. ప్రముఖ స్టాండప్ కమెడియన్ అర్వింద్తో డేటింగ్లో కోలీవుడ్లో రూమర్స్ వినిపిస్తున్నాయి. (ఇది చదవండి: కవలలకు జన్మనిచ్చిన బుల్లితెర నటి.. సోషల్ మీడియాలో వైరల్!) ఆమె ఇటీవల తన ఇన్స్టా స్టోరీస్లో షేర్ చేసిన ఫోటోను చూస్తే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఆ ఫోటోలో గాయత్రి, అరవింద్ ఎస్ఏను కౌగిలించుకుంటూ కనిపించింది. అంతే కాకుండా ఆ ఫోటోతో పాటు క్యాప్షన్ కూడా ఇచ్చింది ముద్దుగుమ్మ. ఇది చూసిన అభిమానులు ఈ జంట డేటింగ్లో ఉందంటూ తెగ కామెంట్స్ చేస్తున్నారు. అయితే దీనిపై వీరిద్దరూ ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇన్స్టాలో గాయత్రి రాస్తూ.. 'కమెడియన్గా అతని ఎదుగుదలను ప్రశంసించింది. అతని పట్ల తన గర్వాన్ని వ్యక్తం చేసింది. రైల్వే రిజర్వేషన్ సిస్టమ్లో అవకతవకలు జరుగుతున్నాయని మీరు మాట్లాడటం నుంచి ఇంత దూరం ప్రయాణించారు. మీతో మాట్లాడుతున్నందుకు నేను చాలా గర్వపడుతున్నా.' అంటూ పోస్ట్ చేసింది. అసలు అరవింద్ ఎవరు? తన కామెడీతో అందరినీ నవ్వించే అరవింద్ ఎవరో తెలుసుకుందాం. అతని అసలు పేరు అరవింద్ సుబ్రమణ్యం. అందరూ అతన్ని అరవింద్ ఎస్ఏ అని పిలుస్తారు. ఈ స్టాండప్ కమెడియన్ మొదట 2013లో తమిళ చిత్రం ఆరంభం మూవీకి అసిస్టెంట్ డైరెక్టర్గా కెరీర్ ప్రారంభించాడు. ఆ తర్వాత 2017లో టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రకటించిన అత్యంత ఇష్టపడే వ్యక్తులలో ఒకరిగా నిలిచాడు. యూట్యూబ్లో కామెడీ వీడియోలు, హిందీ పాటలతో ప్రేక్షకాదరణ పొందాడు. అరవింద్ మద్రాసీ డా లాంటి షోలో కూడా కనిపించాడు. ఆ తర్వాత 2020లో అమెజాన్ ప్రైమ్లో "ఐ వాజ్ నాట్ రెడీ డా" షోను విడుదల రిలీజ్ చేశారు. ప్రస్తుతం భారతదేశంతో పాటు కెనడా, అమెరికా, యూరప్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా దేశాల్లో 'వీ నీడ్ టూ టాక్' అనే కామెడీ షోను ప్రదర్శిస్తున్నాడు. (ఇది చదవండి: ఆ సీక్రెట్ చెప్పేస్తానంటోన్న ఆదిపురుష్ భామ.. ప్రభాస్ కోసమేనా అంటున్న ఫ్యాన్స్! ) -
రోడ్డు పక్కన గొడుగులు అమ్ముతున్న స్టార్ కమెడియన్
ఏ సినీ ఇండస్ట్రీలో అయినా కమెడియన్స్కి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. స్టార్ హీరోలకు మించిన ఫాలోయింగ్ సంపాదిస్తుంటారు. తెలుగులో బ్రహ్మానందం, అలీ తదితరులు ఇలా చాలా క్రేజ్ సొంతం చేసుకున్న వాళ్ల జాబితాలో ఉంటారు. హిందీలో సునీల్ గ్రోవర్ అలాంటి వాడని చెప్పొచ్చు. ఇప్పుడు అలాంటిది రోడ్డు పక్కన గొడుగులు, మొక్కజొన్న పొత్తులు అమ్ముతూ కనిపించాడు. పలు సినిమాల్లో నటించిన సునీల్ గ్రోవర్.. 'కపిల్ శర్మ' షోతో బోలెడంత పాపులారిటీ దక్కించుకున్నాడు. డిఫరెంట్ గెటప్స్తో ఎంటర్టైన్ చేసేవాడు. కానీ కారణాలేంటో తెలియదు గానీ ఆ షో నుంచి తప్పుకొన్నాడు. ఇది జరిగిన చాన్నాళ్లు అయిపోయింది. అయితే కపిల్ శర్మ షోకి తిరిగి రావాలని అనుకుంటున్నట్లు ఈ హాస్య నటుడు పలు ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చాడు. (ఇదీ చదవండి: కమెడియన్ యాదమ్మ రాజుకి యాక్సిడెంట్!) ఈ మధ్యే 'యునైటెడ్ కచ్చే' వెబ్ సిరీస్తో అలరించిన సునీల్ గ్రోవర్.. షారుక్ ఖాన్ 'జవాన్' సినిమాలోనూ నటించాడు. ఇది సెప్టెంబరు 7న థియేటర్లలో రిలీజ్ కానుంది. దాని గురించి పక్కనబెడితే తాజాగా రోడ్ పక్కన తోపుడు బండిపై మొక్కజొన్న పొత్తులు, గొడుగులు అమ్ముతూ ఈ హాస్య నటుడు కనిపించాడు. అలానే రోడ్ పక్కన ఓ స్టాల్లో చపాతీలు చేస్తూ కమెడియన్ సునీల్ గ్రోవర్ దర్శనమిచ్చారు. ఆ ఫొటోలు, వీడియోలని సదరు కమెడియన్ స్వయంగా తన ఇన్ స్టాలో పోస్ట్ చేయడం విశేషం. అయితే ఇది కేవలం ఫన్ కోసమా చేశాడా మరేదైనా కారణం ఉందా తెలియాల్సి ఉంది. ఏదైతేనేం ఇది చూసిన చాలామంది నెటిజన్స్ ఫస్ట్ అవాక్కయ్యారు. ఆ తర్వాత నవ్వుకున్నారు. View this post on Instagram A post shared by Sunil Grover (@whosunilgrover) View this post on Instagram A post shared by Sunil Grover (@whosunilgrover) View this post on Instagram A post shared by Sunil Grover (@whosunilgrover) (ఇదీ చదవండి: విడాకుల రూమర్స్.. బుర్ఖాలో కనిపించిన కలర్స్ స్వాతి!) -
కమెడియన్ యాదమ్మ రాజుకి యాక్సిడెంట్!
ప్రముఖ కమెడియన్ యాదమ్మ రాజు హాస్పిటల్లో కనిపించాడు. కాలికి సర్జరీ జరగ్గా, పెద్ద కట్టుతో కనిపించాడు. భార్య స్టెల్లా అతడికి తోడుగా ఉంది. ఇందుకు సంబంధించిన వీడియోని స్వయంగా యాదమ్మ రాజు తన ఇన్ స్టాలో పోస్ట్ చేయడంతో ఈ విషయం బయటపడింది. ఇంతకీ ఏం జరిగింది? (ఇదీ చదవండి: 'బేబీ' నటికి బెదిరింపులు.. చంపేస్తామంటూ!) ప్రముఖ ఛానెల్లో ప్రసారమైన 'పటాస్' కామెడీ షోతో యాదమ్మ రాజు వెలుగులోకి వచ్చాడు. తనదైన పంచులు, టైమింగ్తో గుర్తింపు తెచ్చుకున్నాడు. అలా ప్రస్తుతం 'జబర్దస్త్'లో సద్దాంతో కలిసి టీమ్ లీడర్గా చేస్తున్నాడు. ప్రతివారం స్కిట్స్తో నవ్వించే ఇతడు ఇప్పుడు సడన్గా కాలికి కట్టుతో కనిపించాడు. అయితే ఈ మధ్య ఏమైనా మెట్లపై నుంచి కాలు జారాడా? లేదా ఏమైనా యాక్సిడెంట్ జరిగిందా? అనేది తెలియాల్సి ఉంది. వీడియో మాత్రమే పోస్ట్ చేసిన యాదమ్మ రాజు.. ఏం జరిగింది? ఏంటనేది బయటపెట్టలేదు. బహుశా ఏం జరిగిందనేది యూట్యూబ్లో వీడియోగా పెడతాడేమో చూడాల్సి ఉంది. ఇదిలా ఉండగా యూట్యూబర్ స్టెల్లా రాజ్ని యాదమ్మ రాజు గతేడాది డిసెంబరులో పెళ్లి చేసుకున్నాడు. (ఇదీ చదవండి: విడాకుల రూమర్స్.. బుర్ఖాలో కనిపించిన కలర్స్ స్వాతి!) -
ఐఐటీ వదిలి కమెడియన్గా.. సంపాదన తెలిస్తే అవాక్కవాల్సిందే!
Biswa Kalyan Rath Success Story: ఒక ఐఐటీ గ్రాడ్యుయేట్ చదువు పూర్తి చేసిన తరువాత ఏదైనా మంచి ఉద్యోగంలో చేరి సంపాదించడం ఆనవాయితీ. అలా కాకుండా ఆధునిక కాలంలో కొంతమంది ఐఐటీయన్లు తమకు నచ్చిన ప్రపంచంలో ముందుకు సాగుతున్నారు. ఇలాంటి కోవకు చెందిన వారిలో ఒకరు 'బిశ్వ కళ్యాణ్ రాత్' (Biswa Kalyan Rath). ఇంతకీ ఈయనెవరు? ఈయన సంపాదన ఏంటనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం, బిశ్వ కళ్యాణ్ రాత్ ఇండియన్ స్టాండ్-అప్ కమెడియన్, రచయిత అండ్ యూట్యూబర్. ఈయన తన తోటి హాస్యనటుడు కనన్ గిల్తో కలిసి యూట్యూబ్ కామెడీ సిరీస్, ప్రిటెన్షియస్ మూవీ రివ్యూస్ ద్వారా ప్రజాదరణ పొందాడు. అంతే కాకుండా 2016 బ్రహ్మన్ నమన్ అనే నెట్ఫ్లిక్స్ కామెడీ చిత్రంలో ఒక పాత్ర కూడా పోషించాడు. ఆ తరువాత 2017లో అమెజాన్ ప్రైమ్ వీడియో సిరీస్ లాఖోన్ మే ఏక్ని సృష్టించాడు. (ఇదీ చదవండి: సుధామూర్తిని ఏడిపించిన అలియా భట్.. కారణం ఇదే!) నిజానికి బిశ్వ కళ్యాణ్ రాత్ 2012లో ఐఐటీ ఖరగ్పూర్ నుంచి గ్రాడ్యుయేట్, ఆ తరువాత బయోటెక్నాలజీ పూర్తి చేసాడు. చదువు పూర్తయిన తరువాత గ్రాఫిక్ డిజైన్, అడ్వర్టైజింగ్, సాఫ్ట్వేర్ వంటి వాటిలో పనిచేసాడు. ఈ సమయంలోనే అతను 2013లో బెంగుళూరులో ఒక ఓపెన్ మైక్ ఈవెంట్లో కనన్ గిల్ను కలిసి 2014లో తన ఉద్యోగాన్ని వదిలి కమెడియన్గా మారాడు. (ఇదీ చదవండి: ఎలాన్ మస్క్, అంబానీ.. వీళ్లకంటే ముందు ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడు ఈయనే!) బిశ్వ కళ్యాణ్ రాత్ కమెడియన్గా మారిన తరువాత బెంగళూరు, పూణే, ముంబై, హైదరాబాద్ అండ్ కోల్కతాలలో ఎన్నో ప్రదర్శనలు ఇచ్చారు. బిస్వా మస్త్ ఆద్మీ అనే పేరుతో కామెడీ షో కూడా ప్రారంభించాడు. మొత్తానికి ఐఐటీ వదిలి కమెడియన్గా స్థిరపడిన బిశ్వ నికర ఆస్తి విలువ రూ. 11 లక్షల నుంచి రూ. 67 లక్షల వరకు అని సమాచారం. కాగా పాణిగ్రాహి అంబర్ ధార, దో సహేలియాన్ వంటి షోలలో పాపులర్ అయిన 'సులంగ్నా'ను 2020లో వివాహం చేసుకున్నాడు. -
అమెరికాలో అలీ ఫ్యామిలీ సందడి (ఫొటోలు)
-
స్టార్ కమెడియన్కు చేదు అనుభవం.. ఏకంగా నాలుగుసార్లు!
అతడో కమెడియన్. జనాల్ని నవ్విస్తుంటాడు. స్టాండప్ షోలతో కితకితలు పెట్టిస్తుంటాడు. నెట్ఫ్లిక్స్లోనూ 'వేక్ న్ బేక్ బై రోహన్' అనే ప్రోగ్రాంతో క్రేజ్ తెచ్చుకున్నాడు. అలాంటి ఇతడిని ఏడిపించారు. సరదాగా సినిమా చూద్దామని థియేటర్కి వెళ్తే చేదు అనుభవాలు మిగిల్చారు. ఆ విషయాల్ని స్వయంగా ఇతడే బయటపెట్టాడు. ఏం జరిగిందో పూసగుచ్చినట్లు చెప్పుకొచ్చాడు. మల్టీప్లెక్స్ల్లో దోపిడి గురించి ప్రేక్షకులకు కొత్తగా చెప్పనక్కర్లేదు. సినిమా టికెట్ రేట్ కంటే స్నాక్స్, డ్రింక్స్ ధరలు చాలా ఎక్కువగా ఉంటాయి. కమెడియన్ రోహన్ జోషి కూడా అలాంటి అనుభవమే ఎదుర్కొన్నాడు. ముంబయిలోని ఓ మల్టీప్లెక్స్కి రీసెంట్గా వెళ్లాడు. చిన్న పెప్సీకి రూ.400 ఛార్జ్ చేశారని, టేస్ట్ కూడా ఏం బాగోలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. (ఇదీ చదవండి: ప్రభాస్ 'కల్కి' గ్లింప్స్లో కమల్హాసన్.. ఎక్కడో గుర్తుపట్టారా?) రోహన్ జోషి ఇన్ స్టా పోస్ట్ ప్రకారం.. ఇతడు గతంలో ఓసారి 'షాంగ్ చీ' సినిమా త్రీడీలో చూద్దామని ఓ మల్టీప్లెక్స్కి వెళ్లాడు. అయితే మూవీని 2Dలో ప్లే చేశారు. ఇదేంటని స్టాఫ్ని అడిగితే ఇంటర్వెల్ తర్వాత పక్కా త్రీడీలో ప్లే చేస్తామని అన్నారట. మరోసారి 'టాప్గన్ మేవరిక్' చూద్దామని ఫ్రెండ్స్తో వెళ్తే సరిగా డైలాగ్స్ వినిపించలేదని, అడిగితే ముందు నుంచి ప్లే చేశారని చెప్పాడు. అయినా పెద్దగా మార్పులేం జరగలేదని అన్నాడు. 'గార్డియన్ ఆఫ్ ది గ్యాలక్సీ 3' చూడటం కోసం రోహన్, కొన్నిరోజుల ముందు ఓ మల్టీప్లెక్స్కి వెళ్లాడు. ఇంటర్వెల్ బ్రేక్ 15 నిమిషాల తర్వాత థియేటర్లోకి వెళ్లాడు. సినిమా చూసి వచ్చేశాడు. మరోసారి అదే మూవీ చూసిన తర్వాత ఈ కమెడియన్కి అర్థమైన విషయం ఏంటంటే.. గతసారి ఇంటర్వెల్ బ్రేక్లోనూ మూవీ రన్ చేశారు. దీంతో పావు గంట పార్ట్ని అందరూ మిస్ అయిపోయారట. ఇవన్నీ బయటపెట్టిన ఇతడు.. మల్టీప్లెక్స్ల తీరుపై అసహనం వ్యక్తం చేశాడు. View this post on Instagram A post shared by Rohan Joshi (@mojorojo) (ఇదీ చదవండి: Hatya Review: ‘హత్య’ మూవీ రివ్యూ) -
క్యాన్సర్.. ట్రీట్మెంట్ వికటించడంతో నడవలేని స్థితి!: కమెడియన్
ఇటు బుల్లితెర, అటు వెండితెరపై నవ్వులు పూయించిన నటుడు అతుల్ పరుచూరి. 56 ఏళ్ల వయసున్న ఇతడు 'ద కపిల్ శర్మ షో'తో బాగా పాపులర్ అయ్యాడు. ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో తాను క్యాన్సర్తో పోరాడుతున్న విషయాన్ని బయటపెట్టాడు. అసలు క్యాన్సర్ ఎప్పుడు వచ్చింది? ప్రస్తుతం తన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? అన్న విషయాలను తాజాగా ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నాడు. డాక్టర్ కళ్లలో భయం.. అతుల్ మాట్లాడుతూ.. 'నాకు పెళ్లై 25 ఏళ్లవుతోంది. ఈ మధ్యే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వెళ్లి వచ్చాను. తర్వాత ఉన్నట్లుండి ఆరోగ్యం దెబ్బతింది. సరిగ్గా తినలేకపోయాను. కడుపులో ఏదో వికారంగా అనిపించేది. నాకేదో అవుతోందనిపించింది. నా సోదరుడు కొన్ని మందులిచ్చాడు, కానీ తగ్గలేదు. చాలామంది డాక్టర్లను కలిశాను.. వారు అల్ట్రాసోనోగ్రఫీ చేయించుకోమన్నారు. తీరా ఈ పరీక్ష చేశాక నా ఎదుట నిలబడ్డ డాక్టర్ కళ్లలో భయం కనిపించింది. అప్పుడే నాకేదో సమస్య ఉందని అర్థమైంది. నా కాలేయంలో 5 సెం.మీ. కణతి ఉందని చెప్పారు. అది క్యాన్సర్ గడ్డ అని చెప్పారు. నేను కోలుకుంటానా? లేదా? అని అడిగితే తప్పకుండా నయమవుందని బదులిచ్చారు. చికిత్స వికటించడంతో నడవలేని దుస్థితి కానీ క్యాన్సర్ ఉందని తేలాక నేను తీసుకున్న చికిత్స నాకు తిరగబడింది. వైద్యులు ఇచ్చిన చికిత్స వల్ల నా పరిస్థితి మరింత అధ్వాన్నంగా తయారైంది. నడవడానికి కూడా వీల్లేని దుస్థితికి చేరుకున్నాను. మాట్లాడటానికి కూడా తడబడ్డాను. ఆ పరిస్థితిలో సర్జరీ మంచిది కాదని, నెలన్నర రోజులు ఆగుదామని వైద్యులు సూచించారు. కాదని సర్జరీ చేస్తే పచ్చకామెర్ల వ్యాధి వస్తుందని, కాలేయం మొత్తం నీళ్లతో నిండిపోతుందని.. ప్రాణాలకు కూడా గ్యారెంటీ ఇవ్వలేమని చెప్పారు. తర్వాత కీమోథెరపీ సహా మంచి మందులు వాడటంతో నా పరిస్థితిలో కొంత మెరుగుదల కనిపించింది' అని చెప్పుకొచ్చాడు అతుల్. చదవండి: తొలి సినిమాకే స్టార్డమ్.. కానీ బ్రెయిన్ స్ట్రోక్తో మంచానపడి.. నోట మాటరాక బేబీ హీరోయిన్ తొలి పారితోషికం ఎంతంటే? -
మూవీ టైటిల్ 'చట్నీ- సాంబార్'.. హీరోగా ప్రముఖ కమెడియన్!
కోలీవుడ్లో ఫేమస్ కమెడియన్ యోగిబాబు ఓ వైపు హాస్య పాత్రలో నటిస్తూనే మరోవైపు కథానాయకుడిగా ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఈ శుక్రవారం విడుదలైన మావీరన్ చిత్రంలో కమెడియన్ పాత్రలో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. తాజాగా ఈయన కథానాయకుడిగా నటిస్తున్న చిత్రానికి చట్నీ సాంబార్ అనే పేరును నిర్ణయించారు. ఈ చిత్రంలో నటి వాణి భోజన్ హీరోయిన్గా నటిస్తుండగా.. నితిన్, సత్య తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి రాధా మోహన్ దర్శకత్వం వహిస్తున్నారు. యోగి బాబు ఇప్పటికే ఎస్జే సూర్య, ప్రియా భవానీ శంకర్ జంటగా నటించిన బొమ్మై చిత్రం గత నెల 16వ తేదీన విడుదల కాగా.. మిశ్రమ స్పందనను తెచ్చుకుంది. ప్రస్తుతం ఈ చిత్రాన్ని డిస్నీ హాట్ స్టార్ సంస్థతో కలిసి వేల్స్ ఫిలిం ఇంటర్నేషనల్ పతాకంపై ఐసరి గణేష్ నిర్మిస్తున్నారు. దీనికి అజేష్ సంగీతాన్ని.. ప్రసన్నకుమార్ చాయాగ్రహణం అందిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ను శనివారం పూజ కార్యక్రమాలతో ప్రారంభించారు. దర్శకుడు రాధా మోహన్ చిత్రాలు అంటేనే కథ, కథనాలు వైవిధ్యంగా ఉంటాయి. కాగా ఈ చిత్రం టైటిల్ కూడా చాలా కొత్తగా ఉంది. అదే సమయంలో ఇందులో వినోదానికి కొదవ ఉండదు అనిపిస్తుంది. దీంతో ఈ చట్నీ సాంబార్ చిత్రంపై ఆసక్తి నెలకొంది. -
జబర్దస్త్ అవినాష్ తల్లికి గుండెపోటు! స్టంట్స్ వేసిన వైద్యులు
జబర్దస్త్ కమెడియన్ ముక్కు అవినాశ్ తల్లి మల్లమ్మ అస్వస్థతకు లోనైంది. అనారోగ్యంతో బాధపడుతున్న ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లగా గుండెపోటు వచ్చినట్లు వైద్యులు వెల్లడించారు. గుండెలో బ్లాక్స్ ఉండటంతో వైద్యులు స్టంట్స్ వేశారు. ఈమేరకు ఓ వీడియోను ముక్కు అవినాశ్ తన యూట్యూబ్ ఛానల్లో రిలీజ్ చేశాడు. 'ఎప్పుడూ నవ్వుతూ ఉండే అమ్మ ఇలా ఇబ్బందిపడటం చూడలేకపోతున్నా. తను ముందు నుంచే షుగర్ వ్యాధితో బాదపడుతోంది. ఈ షుగర్ వల్ల నచ్చిన ఫుడ్ కూడా తినలేకపోతోంది. ఈ మధ్యే అమ్మకు గుండెపోటు(హార్ట్ స్ట్రోక్) వచ్చింది. తనను ఊరిలో ఆస్పత్రికి తీసుకెళ్తే అమ్మ గుండె వీక్ ఉందన్నారు. అందుకే ఏమాత్రం ఆలస్యం చేయకుండా హైదరాబాద్ తీసుకొచ్చి ఇక్కడే ఒక ఆస్పత్రిలో చూపించాను. గుండెలో రెండు పెద్ద బ్లాక్స్ ఏర్పడ్డాయి. ఆంజియోగ్రామ్ చేయించాం, రెండు స్టంట్స్ వేయించాం. తననిప్పుడు ఇంకా జాగ్రత్తగా చూసుకోవాలి' అని చెప్పుకొచ్చాడు. తనకు వచ్చిన పరిస్థితిని తలుచుకుని అవినాశ్ తల్లి కన్నీటిపర్యంతమైంది. 'నా కొడుకులు బతికించారు, అందుకే బతికినా. జరగబోయేది నాకు తెల్వదు. మీ దయ వల్ల మంచిగుండి డ్యాన్స్ చేశిన, అన్నీ చేశిన. నాకిప్పుడు ఈ కష్టం వచ్చింది. మీరు లేకుంటే బతకలేను, నా పెద్ద కొడుకు లేకపోయుంటే ఊరిలోనే నా ప్రాణం పోయేది. వాడు తొందరగా నన్ను ఆస్పత్రికి తీసుకెళ్లి చూపించడం వల్లే బతికి ఉన్నాను' అంటూ ఏడ్చేసింది. కొద్దిరోజులపాటు ఆస్పత్రిలో చికిత్స తీసుకున్న అనంతరం ముక్కు అవినాశ్ తల్లిని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకెళ్లాడు. చదవండి: శామీర్పేట్ ఘటన.. నాకు సంబంధమే లేదంటున్న నటుడు మనోజ్ -
నేనంటే ఆయనకు చాలా ఇష్టం..
-
అమెరికా వెళ్తున్న అలీ ఫ్యామిలీ (ఫొటోలు)
-
టాప్ రేంజ్ లో ఉన్న కమెడియన్ సత్య
-
బ్రహ్మానందం గాడి పని అయిపోయింది అనుకున్నారు..
-
బ్రహ్మానందం చేతి నుంచి జాలువారిన కళాఖండాలు (ఫోటోలు)
-
పెళ్లై కొన్ని నెలలైనా కాలేదు.. అప్పుడే విడాకులా..!
కమెడియన్ యాదమ్మ రాజు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పటాస్ కామెడీ షో ద్వారా ఫేమ్ తెచ్చుకున్నారు. ఆ తర్వాత పలు కామెడీ షోల్లో మెప్పించారు. గతేడాది తన ప్రియురాలు షార్లీ స్టెల్లాను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో అభిమానులతో టచ్లో ఉంటున్నారు. తమ యూట్యూబ్ ఛానెల్లో పలు వీడియోలు చేస్తూ సందడి చేస్తున్నారు.(ఇది చదవండి: ప్రేయసిని పెళ్లాడిన కమెడియన్ యాదమ్మరాజు.. ఫొటోలు వైరల్)అయిచే వీరి పెళ్లి జరిగి కొద్ది నెలలకే ఓ షాకింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఈ జంట త్వరలోనే విడాకులు తీసుకోబోతున్నారంటూ ప్రచారం జరుగుతోంది. అయితే ఇటీవలే ఓ టీవీ షో పాల్గొన్న ఈ జంట విడాకులు తీసుకుంటున్నట్లు చెప్పడంతో అందరూ షాక్ అయ్యారు. దీంతో ఇది చూసిన అభిమానులు నిజంగానే విడాకులు తీసుకుంటున్నారా? అనే చర్చ మొదలెట్టారు. అయితే ఇదంతా టీవీ షో ప్రోమో కోసమే ఇలా చేసినట్లు తెలుస్తోంది. అయితే సోషల్ మీడియాలో వైరలవుతున్న ఈ వార్తలపై యాదమ్మ రాజు, స్టెల్లా ఇన్స్టా వేదికగా స్పందించారు. తాము విడాకులు తీసుకుంటున్నట్లు వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదన్నారు. కేవలం తాము పాల్గొంటున్న షోలో థీమ్ కోసం డైవర్స్ అనే కాన్సెప్ట్లో భాగంగా అలా చేసినట్లు తెలిపారు. దయచేసి ఈ వార్తలను ఎవరూ నమ్మొద్దు. ఉదయం నుంచి చాలమంది నుంచి కాల్స్ కూడా చేశారు. అందుకే క్లారిటీ కోసమే ఈ వీడియో చేస్తున్నాం. అంటూ ఇన్స్టాలో పోస్ట్ చేశారు. దీంతో ఈ జంట విడాకులు తీసుకుంటోందన్న వార్తలకు వీడియోతో చెక్ పెట్టారు. (ఇది చదవండి: విడిపోయి రెండు రోజులు.. నటిపై ట్రోలింగ్.. మాజీ భర్త ఏమన్నాడంటే?) View this post on Instagram A post shared by sharon stella pastham (@stellaraj_777) -
ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ కమెడియన్ దుర్మరణం!
సినీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. ప్రముఖ హాస్యనటుడు, యూట్యూబర్ దేవ్రాజ్ పటేల్ మృతి చెందారు. ఛత్తీస్గఢ్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన మరణించారు. రాయ్పూర్లో షూటింగ్లో పాల్గొనేందుకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అతని మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. (ఇది చదవండి: 'ఆదిపురుష్ 2' ప్లాన్.. ఆ క్లారిటీ ఇచ్చేసిన ప్రభాస్!) యూట్యూబ్లో వైరల్ రీల్స్ చేస్తూ ఫేమ్ తెచ్చుకున్నారు. దేవరాజ్ తన 'దిల్ సే బురా లగ్తా హై' అనే డైలాగ్తో మరింత పేరు సంపాదించుకున్నారు. ఆయనకు యూట్యూబ్లో అతనికి 4 లక్షల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. కమెడియన్ దేవ్రాజ్ పటేల్ పట్ల ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ సంతాపం ప్రకటించారు. కాగా.. 2021లో భువన్ బామ్ తెరకెక్కించిన వెబ్ సిరీస్ ధిండోరాలో దేవరాజ్ విద్యార్థి పాత్రలో కనిపించాడు. దేవ్రాజ్ తన మరణానికి కొన్ని గంటల ముందే ఇన్స్టాగ్రామ్లో రీల్ షేర్ చేశాడు. సీఎం ట్విటర్లో రాస్తూ.. ''దిల్ సే బురా లగ్తా హై'తో మనందరినీ నవ్వించిన దేవరాజ్ పటేల్ ఈరోజు మనల్ని విడిచిపెట్టి వెళ్లిపోయాడు. చిన్న వయసులో తన అద్భుతమైన ప్రతిభను కోల్పోవడం చాలా బాధాకరం. అతని ఆత్మకు భగవంతుడు శాంతిని ప్రసాదించుగాక. కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి.' అని ట్వీట్ చేశారు. (ఇది చదవండి: 'కాంతార' హీరో రిషబ్ శెట్టి ఎమోషనల్.. ఎందుకో తెలుసా?) “दिल से बुरा लगता है” से करोड़ों लोगों के बीच अपनी जगह बनाने वाले, हम सबको हंसाने वाले देवराज पटेल आज हमारे बीच से चले गए. इस बाल उम्र में अद्भुत प्रतिभा की क्षति बहुत दुखदायी है. ईश्वर उनके परिवार और चाहने वालों को यह दुःख सहने की शक्ति दे. ओम् शांति: pic.twitter.com/6kRMQ94o4v — Bhupesh Baghel (@bhupeshbaghel) June 26, 2023 View this post on Instagram A post shared by Devraj Patel (@imdevrajpatel) -
నా చేతులతో మొదటి భార్య శవాన్ని మోశా.. బిడ్డను కనగానే..: కమెడియన్
తెలుగు సినిమాలో టాప్ కమెడియన్ ఎవరంటే బ్రహ్మానందం అని టక్కున చెప్పేస్తారు. అలాగే బాలీవుడ్లో బడా కమెడియన్ అనగానే చాలామందికి రాజ్పాల్ యాదవ్ గుర్తొస్తారు. 25 ఏళ్లుగా హిందీ ప్రేక్షకులకు నవ్వులు పంచుతున్న అతడు తాజాగా తన జీవితంలో జరిగిన ఓ విషాదకర సంఘటనను వెల్లడించాడు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. 'అప్పుడు రోజులు ఎలా ఉండేవంటే.. 20 ఏళ్లకే మన చేతిలో ఉద్యోగం ఉందంటే చాలు.. జనాలు పెళ్లి చేసుకోమని సలహా ఇస్తూ ఉండేవారు. మా నాన్న వారి మాటలు విని నాకు 20 ఏళ్ల వయసులోనే పెళ్లి చేశాడు. నా మొదటి భార్య నాకు ఓ బిడ్డను ప్రసాదించి చనిపోయింది. నా చేతులతో ఆమె శవాన్ని.. నేను ఇతర పనులతో బిజీగా ఉండటంతో ప్రసవమైన మరునాడు ఆమెను వెళ్లి చూద్దామనుకున్నాను. ఇంతలోనే ఆమె మరణించిందన్న కబురు అందింది. ఈ చేతులో ఆమె శవాన్ని మోశాను. తనను హత్తుకుని ఏడ్చాను. అయితే నా కుటుంబం నా కూతురికి తల్లి లేని లోటు తెలియనివ్వకుండా పెంచింది. 2003లో నేను రెండో పెళ్లి చేసుకున్నాను. తన ఊరికి వెళ్లినప్పుడు ఆమె వారి సాంప్రదాయం ప్రకారం తన ముఖం కనిపించకుండా ఓ వస్త్రాన్ని కప్పుకుని ఉంది. ఆమె చాలా తొందరగా మా యాసభాషను నేర్చుకుంది. నేను మా అమ్మతో ఎలా మాట్లాడతానో తను కూడా తనతో అలాగే మాట్లాడేది. నా రెండో భార్యకు 5 భాషలు వచ్చు నువ్వు చీర కట్టుకోవాలి లేదంటే ఇలాంటి డ్రెస్లే వేసుకోవాలని నా భార్యకు నేనెప్పుడూ ఆంక్షలు పెట్టేవాడిని కాదు. తనకు ఐదు భాషలు వచ్చు. నా తల్లిదండ్రులు, గురువు తర్వాత నన్ను ఎంతగానో సపోర్ట్ చేసిన వ్యక్తి నా భార్యే! నా కూతుర్ని కూడా తన కూతురిలా కంటికి రెప్పలా చూసుకుంది. నా కూతురిప్పుడు పెళ్లి చేసుకుని లక్నోలో సెటిలైంది. తను సంతోషంగా ఉంటోందంటే అందుకు కారణం నా కుటుంబం, నా భార్యే! నేను చేసిందేమీ లేదు, వాళ్లవల్లే ఇదంతా సాధ్యమైంది' అని చెప్పుకొచ్చాడు రాజ్పాల్ యాదవ్. కాగా ఇతడు ప్రస్తుతం కార్తీక్ ఆర్యన్ హీరోగా నటిస్తున్న 'సత్యప్రేమ్ కీ కథ', ఆయుష్మాన్ ఖురానా 'డ్రీమ్ గర్ల్ 2' చిత్రాల్లో నటిస్తున్నాడు. చదవండి: రాజకీయాల్లోకి కీర్తి సురేశ్? -
48 ఏళ్ల వయసులో తల్లి కాబోతున్న కమెడియన్
తమిళ హాస్యనటి శర్మిలి 48 ఏళ్ల వయసులో గర్భం దాల్చింది. 40 ఏళ్ల వయసులో ఐటీ ప్రొఫెషనల్ను పెళ్లి చేసుకున్న ఆమె తల్లిగా ప్రమోషన్ పొందే రోజు కోసం ఎదురు చూస్తోంది. నటి వనితా విజయ్ కుమార్.. శర్మిలిని ఇంటర్వ్యూ చేయగా ఆమె ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చింది. తన భర్త ఓపక్క ఐటీరంగంలో పనిచేస్తూనే మరో పక్క లాయర్గానూ విధులు నిర్వహిస్తున్నాడంది. అలాగే లాయర్ నుంచి జడ్జిగా మారేందుకు ఎంతగానో కృషి చేస్తున్నాడని చెప్పుకొచ్చింది. ఏ విషయంలోనైనా భర్త అండగా ఉంటాడని చెప్తున్న కమెడియన్.. తనకు డెలివరీ అయిన తర్వాత తిరిగి సినిమాలు, సీరియల్స్లోకి రీ ఎంట్రీ ఇస్తానని చెప్తోంది. ఈ నిర్ణయంపై వనితా విజయ్ కుమార్ హర్షం వ్యక్తం చేసింది. అలాగే 48 ఏళ్ల వయసులో తనకంటూ ఓ కుటుంబాన్ని ఏర్పరుచుకుంటున్న శర్మిలిని అభినందించింది వనిత. చదవండి: యాసలందు అన్ని యాసలు లెస్స -
వేరొక మహిళతో ఎఫైర్! కమెడియన్ కాళ్లు విరగ్గొట్టించిన భార్య?
'అసత పోవతు యారు', 'కలకప్పోవత్తు యారు' వంటి కామెడీ షోలతో తళుక్కుమని మెరిశాడు తమిళ కమెడియన్ వెంకటేశ్. బుల్లితెరపై ప్రసారమయ్యే కామెడీ షోల ద్వారా ఎంతోమంది ప్రేక్షకులను సంపాదించుకున్న ఆయన గురించి ఓ వార్త అటు కోలీవుడ్లో ఇటు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీని ప్రకారం.. కమెడియన్ వెంకటేశ్ కొన్ని రోజుల కిందట తన కారులో ప్రయాణిస్తున్న సమయంలో అతడిపై దాడి జరిగింది. ముగ్గురు వ్యక్తులు కారును ఆపి అందులో ఉన్న డ్రైవర్ను వెళ్లిపోమని బెదిరించారు. పొదల్లోకి తీసుకెళ్లి చితక్కొట్టారు దీంతో కారు డ్రైవర్ మోహన్ భయంతో అక్కడి నుంచి పారిపోగా సదరు దుండగులు వెంకటేశ్ను పక్కనే ఉన్న చెట్లపొదల్లోకి తీసుకెళ్లి చితకబాదారు. అతడి ఆర్తనాదాలు విన్న స్థానికులు అక్కడికి పరిగెత్తుకుంటూ రావడంతో దుండగులు అక్కడి నుంచి పారిపోయారు. గాయాలపాలైన కమెడియన్ను ఆస్పత్రిలో చేర్పించగా అతడి కాళ్లు ఫ్రాక్చర్ అయినట్లు తెలిసింది. కమెడియన్ భార్యకు డ్రైవర్తో ఎఫైర్? అయితే ఘటనా స్థలంలో బీజేపీ జెండాలు కనిపించడంతో ఇది ఆ పార్టీ కార్యకర్తల పనే అయ్యుంటుందని పోలీసులు భావించారు. వెంకటేశ్ సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులను వ్యతిరేకించినవారే ఈ దాడి చేయించి ఉండవచ్చని అభిప్రాయపడ్డారు. కానీ వెంకటేశ్ వాదన మరోలా ఉంది. తన భార్య భానుమతికి, డ్రైవర్ మోహన్కు వివాహేతర సంబంధం ఉందని, తన అడ్డు తొలగించుకోవాలనే ఈ పని చేసి దాన్ని వేరే పార్టీ మీదకు తోసేస్తోందని ఆరోపిస్తున్నాడు. డబ్బులిచ్చి మరీ గూండాలతో తనపై దాడి చేయించిందని పేర్కొంటున్నాడు. కమెడియన్ ఎఫైర్, కాళ్లు విరగ్గొట్టిన భార్య అయితే వెంకటేశ్కు కోయంబత్తూరుకు చెందిన మహిళతో ఎఫైర్ ఉందని, ఆమె కోసం భార్య భానుమతికి విడాకుల నోటీసులు కూడా పంపించినట్లు తెలుస్తోంది. భర్తను దూరం చేసుకోవడం ఇష్టం లేక అతడి కాళ్లు విరగ్గొట్టి తనతో పాటు ఇంట్లో ఉండిపోయేందుకు ఆమె స్కెచ్ వేసి ఉండవచ్చని పలువురు భావిస్తున్నారు. మరి పోలీసుల విచారణలో ఏం తేలనుందో చూడాలి! చదవండి: అసభ్య సందేశాలు.. భర్తపై నటి ఫిర్యాదు బిడ్డకు జన్మనిచ్చిన బుల్లితెర నటి -
తమిళనాడులో ఆస్తులు ఉండేవి.. అన్నీ అమ్మేశా: సుధాకర్
ఇప్పుడు కామెడీ అంటే అన్నీ డబుల్ మీనింగ్ డైలాగులు, అవతలివారిని చులకన చేసే జోక్సే కనిపిస్తున్నాయి. కానీ ఒకప్పుడు స్వచ్ఛమైన కామెడీ కనిపించేది. మాటలతోనే కాదు, హావభావాలతో కూడా కామెడీ పండించేవాళ్లు. అలాంటి దిగ్గజ హాస్యనటులలో బేత సుధాకర్ ఒకరు. ఈ మధ్య ఆయన చనిపోయాడంటూ ఓ పుకారు గుప్పుమనగా తాను బతికే ఉన్నానంటూ వీడియో రిలీజ్ చేశాడు సుధాకర్. అయితే చాలాకాలం తర్వాత బుల్లితెరపై ఓ షోలో సందడి చేశాడు. ఇందులో కమెడియన్ గుర్తుపట్టలేనంతగా మారిపోయాడు. పుకార్లు పుట్టించొద్దు తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆయన కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. ముందుగా తనపై వచ్చే రూమర్లపై స్పందిస్తూ.. 'నేను చనిపోయానంటూ రూమర్స్ పుట్టించారు. నా ఆరోగ్యం బాగుంది. దయచేసి అలాంటి పుకార్లు సృష్టించవద్దు' అని కోరారు. తన కెరీర్ గురించి మాట్లాడుతూ.. 'నేను వెనక్కు తిరిగి చూసుకుంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఎన్నో మంచి పాత్రలు చేశాను. హీరో నుంచి కమెడియన్గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా పని చేశాను. ఏ క్యారెక్టర్ ఇచ్చినా సంతోషంగా చేసేవాడిని. నాకు ఇష్టమైన కమెడియన్ ఎమ్మెస్ నారాయణ. నాకు ఇష్టమైన ప్రదేశం ఊటీ. అప్పట్లో బ్రహ్మానందం మా ఇంటికి దగ్గర్లో ఉండేవారు. అప్పుడప్పుడు మా ఇంటికి కూడా వచ్చేవారు. చిరంజీవి పట్టు పట్టడంతోనే.. చిరంజీవి, నేను ఇద్దరం ఒకే రూమ్లో ఉండేవాళ్లం. అలా మొదలైన మా స్నేహం ఇప్పటికీ కొనసాగుతోంది. గతంలో యముడికి మొగుడు సినిమాలో నేను నటించాల్సిందేనని చిరంజీవి పట్టు పట్టాడు. అలా నేను ఆ సినిమా చేయాల్సి వచ్చింది. ఈ చిత్రంతో మంచి పేరు వచ్చింది. తమిళనాడులో నాకు ఆస్తులు ఉండేవి, కానీ అమ్మేశాను. తమిళం తర్వాత తెలుగులో ఎక్కువ అవకాశాలు వచ్చాయి. అలా ఇక్కడ సెటిలయ్యాను. నా కొడుకు కూడా త్వరలోనే ఇండస్ట్రీలో ఎంట్రీ ఇస్తాడు' అని చెప్పుకొచ్చాడు. సుధాకర్ ప్రస్థానం సాగిందిలా.. కాగా 1959 మే 18న జన్మించిన సుధాకర్ సినిమాలపై ఆసక్తితో మద్రాస్ వెళ్లాడు. అక్కడ చిరంజీవి, నారాయణరావు, హరిప్రసాద్లతో కలిసి ఒకే గదిలో ఉండేవాడు. దర్శకుడు భారతీరాజాతో పరిచయం ఏర్పడగా ఆయన సుధాకర్ను హీరోగా పెట్టి కిళుక్కెమ్ పొగుమ్ రెయిల్ సినిమా తీశాడు. ఇందులో రాధిక హీరోయిన్. ఈ సినిమా హిట్ కావడంతో వీరి కాంబినేషన్ కూడా రిపీటైంది. తమిళంలో వరుస సినిమాలు చేసిన ఆయన తర్వాత సడన్గా రూటు మార్చి తెలుగుపైనే పూర్తిగా దృష్టి సారించాడు. కమెడియన్గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఇక్కడే స్థిరపడిపోయాడు. చదవండి: స్టార్ కమెడియన్ సుధాకర్ ఇలా అయిపోయాడేంటి? -
స్టార్ కమెడియన్ సుధాకర్ ఇలా అయిపోయారేంటి?
వేరే ఏ ఇండస్ట్రీకి లేని చాలా ప్లస్ పాయింట్స్ లో టాలీవుడ్ లో ఉన్నాయి. ప్రస్తుతానికి లెక్కకి మించిన పాన్ ఇండియా మూవీస్.. మన దర్శకులే తీస్తున్నారు. ఇప్పుడంటే తగ్గిపోయారు గానీ వేరే ఏ ఇండస్ట్రీలోనూ లేనంత మంది కమెడియన్స్ తెలుగులోనే ఉన్నారు. అలా ఓ ఫేడౌట్ అయిన హాస్యనటుడు చాలారోజుల తర్వాత ఓ రియాలిటీ షోలు సందడి చేశారు. ఫ్యాన్స్ ఆయన్ని చూసి హ్యాపీగా ఫీలవుతున్నారు. ఇప్పటి జనరేషన్ కు సుధాకర్ అంటే పెద్దగా తెలియకపోవచ్చు. కానీ ఓ 15-20 ఏళ్ల ముందు మూవీస్ చూసిన వాళ్లని అడిగితే మాత్రం టక్కున గుర్తుపట్టేస్తారు. కమెడియన్ గా మనల్ని తెగ నవ్వించిన ఆయన గత కొన్నేళ్లలో బయట ఎక్కడా కనిపించలేదు. ఈ మధ్య కొన్నిరోజుల ముందు సుధాకర్ చనిపోయారనే న్యూస్ ఒకటి బయటకొచ్చింది. వాటిని కొట్టిపారేస్తూ ఆయన ఓ వీడియో రిలీజ్ చేశారు. (ఇదీ చదవండి: హీరోయిన్ హనీరోజ్ సాహసం.. అలాంటి ప్లేసులో ముద్దు!) తాను ఆరోగ్యంగానే ఉన్నట్లు ఆయన చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఓ ప్రముఖ ఛానెల్ లో ఫాదర్స్ డే సందర్భంగా 'నేను నాన్న' పేరుతో ఓ ప్రోగ్రామ్ ఏర్పాటు చేశారు. సుధాకర్ ని ఈషోకి తీసుకొచ్చిన ఆర్గనైజర్స్.. నటుడిగా 45 ఏళ్ల జర్నీ పూర్తి చేసుకున్నందుకు గానూ సన్మానించారు. ఆయనతో కేక్ కూడా కట్ చేయించారు. ప్రస్తుతం ఈ ప్రోమో వైరల్ అయింది. ఈ ప్రోమోలో కమెడియన్ సుధాకర్ ని చూసి చాలామంది ఫస్ట్ గుర్తుపట్టలేకపోయారు. ఆ తర్వాత ఆయన చేసిన మూవీస్, నవ్వించిన సీన్స్ ని గుర్తుచేసుకుని మరీ సంతోషంగా ఫీలయ్యారు. ప్రస్తుతం ఈయన ఆరోగ్యం సరిగా లేదు. దీంతో సన్నగా మారిపోయి, మరీ గుర్తుపట్టలేనంతగా ఉన్నారు. ఏదైతేనేం ఆయన ఇలా షోకి రావడం, అందరితో కలిసి ఎంజాయ్ చేయడం మాత్రం కనువిందుగా అనిపించింది. (ఇదీ చదవండి: 'ఆదిపురుష్' రిజల్ట్.. ఇలా జరగడానికి కారణాలేంటి?) -
మహిళతో సహజీవనం.. లైవ్లో కమెడియన్ ఆత్మహత్యాయత్నం!
బాలీవుడ్లో ప్రముఖ కామెడీ షో 'ది కపిల్ శర్మ షో' గురించి తెలియని వారు ఉండరు. టాలీవుడ్లోనూ ఈ షో గురించి చాలామందికి తెలుసు. ప్రముఖులతో సైతం నవ్వులు తెప్పించే ఈ షో ద్వారా కపిల్ శర్మ ఫేమస్ అయ్యారు. మరో హాస్యనటుడు తీర్థానంద రావు కూడా ఈ షోతోనే గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే తాజాగా కపిల్ శర్మ కో స్టార్ తీర్థానంద రావు ఆత్మహత్యాయత్నం చేశాడు. ఫేస్బుక్ లైవ్లో పాయిజన్ తాగి బలవన్మరణానికి యత్నించాడు. వెంటనే విషయం తెలుసుకున్న స్నేహితులు అతని ఇంటికి చేరుకున్నారు. అపస్మారక స్థితిలో ఉన్న తీర్థానందరావును ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతను చికిత్స పొందుతున్నారు. (ఇది చదవండి :వరుణ్ లావణ్య ఎంగేజ్మెంట్: బేబీ బంప్తో ఉపాసన, డ్రెస్ ఖరీదెంతో తెలుసా? ) మహిళతో సహజీవనం.. వేధింపులు అయితే తనతో సహజీవనం చేస్తున్న మహిళ డబ్బుల కోసం బ్లాక్ మెయిల్ చేస్తోందని తీర్థానంద రావు ఆరోపిస్తున్నారు. తన డబ్బులు లాక్కోవడానికి ప్రయత్నిస్తోందని.. ఆమె వల్ల రూ.4 లక్షల అప్పులు చేశానని చెప్పుకొచ్చారు. తనకు ఏదైనా జరిగితే ఆమెనే బాధ్యత వహించాలన్నారు. ఆమె వల్లే అప్పులు చేశా ఫేస్బుక్ లైవ్లో మాట్లాడుతూ.. 'తేడాది అక్టోబర్ నుంచి తాను ఓ మహిళతో తాను లైవ్-ఇన్ రిలేషన్షిప్లో ఉన్నా. ఇప్పటికే నాపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాని వెనుక ఉన్న కారణమేంటో తెలియదు. ఆమె తనను ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేస్తోంది. తన నుంచి డబ్బులు లాక్కోవడానికి ప్రయత్నిస్తోంది. ఆమె నాకు ఫోన్ చేసి కలవాలనుకుంటున్నట్లు చెబుతోంది. ఆమె వల్ల లక్షల రూపాయలు అప్పు చేశా.' అని అన్నారు. అయితే ఆ తర్వాత లైవ్ వీడియోను డిలీట్ చేసినట్లు సమాచారం. - కె.తారకరామ కుమార్ (ఇది చదవండి : పుట్టబోయే బిడ్డ కోసం ఉపాసన కీలక నిర్ణయం!) -
కమెడియన్ మృతి.. అతనికి గుండెపోటు కాదు!
'బ్రేకింగ్ బ్యాడ్' సిరీస్లో కీలక పాత్రలో నటించిన హాస్యనటుడు మైక్ బటాయే జూన్ 1న మరణించిన సంగతి తెలిసిందే. అతను మొదట గుండెపోటుతో చనిపోయాడని కుటుంబసభ్యులు వెల్లడించారు. కానీ తాజాగా వైద్యాధికారులు ఇచ్చిన నివేదికలో అతను ఉరి వేసుకోవడం వల్ల మరణించాడని వెల్లడైంది. గతంలో కూడా ఆయన కుటుంబంలో ఎవరికీ కూడా గుండె జబ్బులు ఉన్నట్లు ఎలాంటి చరిత్ర లేదని తెలిసింది. కాగా.. జూన్ 1న మిచిగాన్లోని ఆయన ఇంట్లో విగతజీవిగా కనిపించారు. నటుడు ఆత్మహత్య చేసుకున్నాడని తెలుసుకున్న హాలీవుడ్ ప్రముఖులు షాక్కు గురవుతున్నారు. (ఇది చదవండి: స్మగ్లింగ్ వివాదంపై స్పందించిన 'జబర్దస్త్' హరి) మైక్ బటాయే కెరీర్ మైక్ బటాయే సూపర్హిట్ సిరీస్ బ్రేకింగ్ బ్యాడ్లో మూడు ఎపిసోడ్లలో డెన్నిస్ మార్కోవ్స్కీగా కనిపించాడు. అంతేకాకుండా 'ఇట్స్ ఆల్వేస్ సన్నీ ఇన్ ఫిలడెల్ఫియా,' 'స్లీపర్ సెల్,' 'ది బెర్నీ మాక్ షో,' 'బాయ్ మీట్స్ వరల్డ్,' 'ఎవ్రీబడీ లవ్స్ రేమండ్' వంటి షోలలో కూడా నటించాడు. వీటితో మైక్ బటాయే న్యూయార్క్ గోతం, లాస్ ఏంజిల్స్ లాఫ్ ఫ్యాక్టరీ, కామెడీ స్టోర్, ది ఇంప్రూవ్, ఐస్హౌస్ వంటి ప్రముఖ కామెడీ క్లబ్లలో కూడా ప్రదర్శన ఇచ్చాడు. (ఇది చదవండి: 'సీతారామం' బ్యూటీకి బంపరాఫర్.. ఈసారి ఏకంగా!) -
స్మగ్లింగ్ వివాదంపై స్పందించిన 'జబర్దస్త్' హరి
'జబర్దస్త్' ప్రముఖ కమెడియన్.. ఎర్రచందనాన్ని స్మగ్లింగ్ చేస్తూ పోలీసులకు దొరికిపోయాడని తాజాగా న్యూస్ బయటకొచ్చింది. దీంతో అందరూ అవాక్కయ్యారు. ప్రేక్షకుల్ని ఎంటర్ టైన్ చేస్తున్న ఓ హస్యనటుడు ఇలాంటి పనులు చేస్తున్నాడా అని మాట్లాడుకున్నారు. ఇంకొందరైతే తిట్టుకున్నారు. ఇప్పుడు వీటన్నంటికీ చెక్ పెట్టేందుకు డైరెక్ట్ గా సదరు కమెడియన్ స్పందించాడు. ఫుల్ క్లారిటీ ఇచ్చేశాడు. (ఇదీ చదవండి: విశాల్పై కేసును కొట్టివేసిన కోర్టు) 'జబర్దస్త్'లో కమెడియన్ గా చేసిన హరిబాబు ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులో కీలకపాత్రధారి. గత కొన్నేళ్ల నుంచి పరారీలో ఉన్న ఇతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. తాజాగా హరిబాబుపై మరో కేసు నమోదైంది. దీంతో మీడియాలో న్యూస్ వచ్చింది. అయితే ఇక్కడ చిన్న పొరపాటు జరగడంతో ఓ వ్యక్తికి బదులు మరోవ్యక్తి ఫొటోలతో వార్తలు రాసేశారు. ప్రస్తుతం ఇదే షోలో హరికృష్ణ అనే కమెడియన్ చేస్తున్నాడు. అతడి బదులు ఇతడి గురించి అందరూ రాశారు. దీంతో కమెడియన్ గంపా హరికృష్ణ ఇప్పుడు స్పందించాల్సి వచ్చింది. 'స్మగ్లింగ్ కేసులో ఉంది నేను కాదు. నాకు దీనితో ఎలాంటి సంబంధం లేదు. 2013లో షకలక శంకర్ టీమ్ లో హరిబాబు పనిచేశాడు. తర్వాత అతడు ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులో దొరికిపోయాడు. అప్పటికే నేను ఫేమ్ లో ఉండటంతో గూగుల్ లో ఆ పేరు కొడితే నా ఫొటోలు వచ్చాయి. నా ఫొటో పెట్టి వార్తలు రాసేశారు. నాకు దీనికి ఎలాంటి సంబంధం లేదు' అని 'జబర్దస్త్' హరికృష్ణ అన్నాడు. ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానెల్ లో మాట్లాడుతూ ఈ విషయాలన్నీ బయటపెట్టాడు. (ఇదీ చదవండి: టాంగో ఇక లేదు.. సాయి తేజ్ ఎమోషనల్ పోస్ట్) -
నాతో అసభ్యంగా ప్రవర్తించాడు.. జీర్ణించుకోలేకపోయా: ప్రగతి షాకింగ్ కామెంట్స్
టాలీవుడ్ సీనియర్ నటి ప్రగతి పరిచయం అక్కర్లేని పేరు. తెలుగు తెరపై తల్లి పాత్రలతో గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం సినిమాల్లో నటిస్తూనే సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు అభిమానులతో టచ్లో ఉంటోంది. యాక్టివ్గా ఉంటూ వీడియోలను షేర్ చేస్తూ ఉంటోంది ప్రగతి. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన సినీ కెరీర్లో ఎదురైన అనుభవాలను పంచుకున్నారు. ఓ సినిమా సెట్లో క్యాస్టింగ్ కౌచ్ వేధింపులకు గురైనట్లు తెలిపింది. అందులోనూ ఓ స్టార్ కమెడియన్ చేసిన పనికి ఏం చేయాలో అర్థం కాలేదని చెప్పుకొచ్చారు. (ఇది చదవండి: డబ్బు కోసం ఆ పని కూడా చేయాల్సి వచ్చింది: ప్రముఖ నటి ) ప్రగతి మాట్లాడుతూ..' ఆయన సెట్లో నాతో చాలా బాగా మాట్లాడతారు. చాలా పద్ధతిగా ఉంటారు. అయితే ఒకరోజు నాతో మిస్ బిహేవ్ చేశాడు. ఆ తర్వాత దాన్ని జీర్ణించుకోవడం నా వల్ల కాలేదు. ఆ రోజు నాకు ఏం వర్క్ చేయాలనిపించలేదు. లంచ్ చేయలేకపోయా. ఆఖరికి టీ కూడా తాగాలనిపించలేదు.' అని అన్నారు. ఆ తర్వాత జరిగిన విషయం గురించి మాట్లాడుతూ.. 'ఆయన షూటింగ్ అయిపోయి వెళ్లిపోతుంటే క్యారవాన్లోకి తీసుకెళ్లి ప్రశ్నించా. మీతో ఎప్పుడైనా మిస్ బిహేవ్ చేశానా అడిగా. నేను అక్కడే రియాక్ట్ అయితే మీ పరిస్థితి ఏంటని నిలదీశా. మీరు కాబట్టే ఒక్క నిమిషం అలా సైలెంట్గా ఉండిపోయా.' అంటూ చెప్పుకొచ్చారు. అయితే ప్రగతి పట్ల మిస్ బిహేవ్ చేసిన స్టార్ కమెడియన్ పేరు మాత్రం ఆమె బయటికి చెప్పలేదు. కాగా.. గతేడాది డీజే టిల్లు, రంగరంగ వైభవంగా, పెళ్లిసందడి చిత్రాల్లో కనిపించింది. (ఇది చదవండి: రెండోపెళ్లిపై ఆసక్తికర కామెంట్స్ చేసిన నటి ప్రగతి ) -
రైలు ప్రమాదం.. కమెడియన్ అనుచిత ట్వీట్.. ఆ వెంటనే డిలీట్!
ఒడిశాలో శుక్రవారం జరిగిన రైలు ప్రమాదంపై యావత్ దేశం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. శుక్రవారం రాత్రి ఒకే చోట ఏకంగా మూడు రైళ్లు ప్రమాదానికి గురవడంతో 260కి పైగా మంది మృత్యువాత పడగా వందలాదిమంది తీవ్రంగా గాయపడ్డారు. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా భయానక రైలు ప్రమాదం దృశ్యాలే కనిపిస్తున్నాయి. ఈ సమయంలో కమెడియన్ రాహుల్ రామకృష్ణ అనుచిత ట్వీట్ చేశాడు. కమెడియన్పై మండిపాటు సైలెంట్ అనే హాలీవుడ్ సినిమాలో నటుడు బస్టర్ కీటన్ రైలు ముందు చేసే విన్యాసానికి సంబంధించిన వీడియో షేర్ చేశాడు. దీంతో నెటిజన్లు అతడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ పక్క వందల కుటుంబాలు ట్రైన్ యాక్సిడెంట్లో సమాధి అయిపోతే మీకు కామెడీగా ఉందా? రైలు విన్యాసాలు షేర్ చేస్తున్నారేంటి? అని మండిపడ్డారు. వెంటనే తప్పు తెలుసుకున్న రాహుల్ సదరు ట్వీట్ డిలీట్ చేసి క్షమాపణలు చెప్పాడు. సోషల్ మీడియా వేదికగా క్షమాపణలు 'ఇంతకు ముందు చేసిన ట్వీట్పై క్షమాపణలు కోరుతున్నాను. ఒట్టేసి చెప్తున్నా.. ఆ విషాదం గురించి నాకసలు ఏమీ తెలియదు. అర్ధరాత్రి నుంచి స్క్రిప్ట్ రాసుకునే పనిలో ఉన్నాను.. ఏ వార్తలూ చూడలేదు. అందుకే తప్పు జరిగింది. మరోసారి క్షమాపణలు చెప్తున్నా' అని ట్వీట్ చేశాడు. దీనిపై ఓ నెటిజన్ స్పందిస్తూ 'మీ నిజాయితీని మెచ్చుకుంటున్నా. మిమ్మల్ని ట్రోల్ చేయాలనుకోలేదు. కేవలం మీకు ఆ ఘటన గురించి మరింత సమాచారం ఇవ్వాలనుకున్నాను' అని చెప్పుకొచ్చాడు. దీనికి రాహుల్ రిప్లై ఇస్తూ.. 'థాంక్యూ.. గత కొన్ని గంటలుగా నేను న్యూస్ ఫాలో అవడం లేదు. కేవలం నా పనిపైనే ఫోకస్ చేశాను. నన్ను అలర్ట్ చేసినందుకు థ్యాంక్స్' అని పేర్కొన్నాడు. Terribly sorry about the previous tweet. I had no idea about the tragedy on the news. Promise. I’ve been writing a script since midnight and have been cut off from all forms of news. Very sorry, once again. — Rahul Ramakrishna (@eyrahul) June 2, 2023 Thank you. I have generally not been following the news for a while on account of trying to focus my energies on work. This was definitely a faux pas. Thank you for alerting me about it. Much appreciated. — Rahul Ramakrishna (@eyrahul) June 2, 2023 A quote tweet I shared of a buster Keaton silent movie gif about trains in films . Doesn’t matter now. — Rahul Ramakrishna (@eyrahul) June 2, 2023 చదవండి: విషమంగా పంచ్ ప్రసాదం ఆరోగ్యం ఒడిశా రైలు ప్రమాదం: ఈ పాపం ఎవరిది? -
పెళ్లిపీటలెక్కనున్న జబర్దస్త్ కమెడియన్ కెవ్వు కార్తీక్!
జబర్దస్త్ కమెడియన్ కెవ్వు కార్తీక్ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ఈ శుభవార్తను అతడే స్వయంగా ఇన్స్టాగ్రామ్లో వెల్లడించాడు. మన జీవితంలోకి కొత్త వ్యక్తి వస్తే లైఫ్ మరింత హ్యాపీగా మారుతుందని కొందరు చెప్పారు. బహుశా అది ఇదేనేమో! నా జీవితంలోకి అడుగుపెడుతున్నందుకు థ్యాంక్యూ. నీతో కొత్త జీవితాన్ని ఆరంభించేందుకు ఎంతగానో ఎదురుచూస్తున్నాను అని రాసుకొచ్చాడు. తను పెళ్లి చేసుకోబోయే అమ్మాయితో కలిసి దిగిన ఫోటోలను షేర్ చేశాడు. అయితే ఇందులో ఆ అమ్మాయి ముఖాన్ని మాత్రం కనిపించనివ్వలేదు. ఈ పోస్ట్కు నటులు ప్రియాంక సింగ్, అభినవ్, గెటప్ శ్రీను తదితరులు శుభాకాంక్షలు చెప్తూ కామెంట్లు చేశారు. కాగా కెవ్వు కార్తీక్ ఎన్నో కష్టాలు దాటుకుని సెలబ్రిటీ స్థాయికి ఎదిగాడు. ఓపక్క ఇంజనీరింగ్ చదువుతూనే మిమిక్రీలో డిప్లొమా పూర్తి చేసిన అతడు ఎంటెక్ చేసి ఉద్యోగం సంపాదించాడు. కానీ మిమిక్రీ, కామెడీపై ఉన్న ప్యాషన్తో ఉద్యోగానికి రాజీనామా చేశాడు. తర్వాత హైదరాబాద్ వచ్చి మిమిక్రీ ఆర్టిస్టుగా స్టేజీ షోలు చేశాడు. అనంతరం కామెడీ క్లబ్, జబర్దస్త్ షోలలో మెరిశాడు. జబర్దస్త్లో ఒక టీమ్లో సభ్యుడిగా మాత్రమే ఉన్న కార్తీక్ తర్వాత టీమ్ లీడర్గా మారాడు. View this post on Instagram A post shared by Kevvu Kartheek (@kevvukartheek) చదవండి: డబ్బు కోసమే సల్మాన్ ఖాన్ చెల్లితో పెళ్లి? -
ఆ వార్తలు నమ్మకండి.. నేను చనిపోలేదు
-
నేను ఆరోగ్యంగా ఉన్నాను.. ఆ వార్తలు నమ్మకండి: నటుడు సుధాకర్
సీనియర్ నటుడు, కమెడియన్ సుధాకర్ చనిపోయినట్లు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. సుధాకర్ అనారోగ్యంతో బాధడపడుతున్నారని, ఐసీయూలో ఉన్నారంటూ గత వారం రోజులుగా సోషల్ మీడియాలో రూమర్స్ వినిపిస్తున్నాయి. దీనికి తోడు పరిస్థితి విషమించి ఆయన చనిపోయినట్లు ఒక్కసారిగా వార్తలు ఊపందుకున్నాయి. తాజాగా ఈ తప్పుడు వార్తలపై సుధాకర్ స్వయంగా స్పందించారు. కొంతకాలంగా తన ఆరోగ్యంపై వస్తున్న వార్తలన్నీ అవాస్తవాలని తెలిపారు. తాను ఆరోగ్యంగా, సంతోషంగా ఉన్నానని, తప్పుడు వార్తలను దయచేసి నమ్మవద్దని కోరారు. ఈ మేరకు స్వయంగా ఓ వీడియోను రిలీజ్ చేశారు. దయచేసి ఇలాంటి రూమర్స్ను క్రియేట్ చేయొద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. కాగా నటుడు సుధాకర్ చనిపోయినట్లు వార్తలు రావడం ఇదేం తొలిసారి కాదు. గతంలోనూ ఆయన ఆరోగ్యంపై రకరకాల వార్తలు సర్యులేట్ అయ్యాయి. ఈమధ్యే నటుడు కోట శ్రీనివాసరావు కూడా చనిపోయినట్లు తప్పుడు ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన కూడా స్వయంగా వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని, బతికున్న మనుషుల్ని కూడా చంపేస్తున్నారంటూ సినీ ప్రముఖులు, అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
పెళ్లి చేసుకున్న పటాస్ ప్రవీణ్.. కానీ ఫైమాను కాదు!
ప్రముఖ కామెడీ షో జబర్దస్త్ ద్వారా ఫేమ్ తెచ్చుకున్న కమెడియన్ కొమరం. కామెడీ పంచులతో అదరగొట్టే కొమరం అంటే ఇండస్ట్రీలో ఎవరూ గుర్తు పట్టలేరేమో. ఎందుకంటే తన పాత్ర కొమరక్కతోనే అభిమానుల గుండెల్లో పేరు సంపాదించుకున్నారు. తన యాస, భాష, కట్టు బొట్టుతో అందరిని మెప్పించారు. ఇటీవల నాని నటించిన దసరా చిత్రంలో కనిపించారు. అయితే యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించిన కొమరం ఎప్పటికప్పుడు తన వీడియోలతో అభిమానులను అలరిస్తుంటారు. (ఇది చదవండి: ఐదేళ్లు కష్టాలు అనుభవించా.. అలా ఎవరికీ జరగకూడదు: జబర్దస్త్ కొమరం) తాజాగా తన ఛానెల్ కోసం ఓ జంటకు పెళ్లి చేసిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. పటాస్ కామెడీ షోతో ఫేమస్ అయిన ప్రవీణ్కు పెళ్లి చేసిన వీడియోను తన ఇన్స్టాలో షేర్ చేశారు. అయితే దీనిపై నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ఈ పెళ్లి నిజంగానే జరిగిందా? అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మరికొందరేమో ఫైమా ఎక్కడ అని ప్రశ్నిస్తున్నారు. అయితే ఈ పెళ్లిపై పటాస్ ప్రవీణ్ క్లారిటీ ఇచ్చారు. ఈ వీడియో కేవలం కొమరక్క యూట్యూబ్ ఛానెల్ కోసమే చేసినట్లు చెప్పారు. ఈ ఎపిసోడ్ త్వరలోనే కొమరక్క ఛానెల్లో వస్తుందని తెలిపారు. -
కమెడియన్ సుధాకర్ చనిపోయాడంటూ ఫేక్ రూమర్స్..
ప్రముఖ హాస్యనటుడు బేతా సుధాకర్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందంటూ ఓ వార్త నెట్టింట వైరల్గా మారింది. కొందరైతే ఏకంగా ఆయన చనిపోయాడంటూ నివాళులు అర్పిస్తున్నారు. కొన్ని వెబ్సైట్లు, యూట్యూబ్ ఛానళ్లు సైతం ఆయన మరణించారని ప్రచారం చేస్తున్నారు. కానీ ఇందులో ఏమాత్రం నిజం లేదు. ఆయన ఆరోగ్యంగానే ఉన్నారు. దీంతో సుధాకర్పై తప్పుడు వార్తలను ప్రచారం చేసినవారిపై మండిపడుతున్నారు అభిమానులు. 'ఆరోగ్యంగా ఉన్న వ్యక్తిని చంపేస్తున్నారు, కాస్తైనా సిగ్గనిపించడం లేదా?' అని ఫైర్ అవుతున్నారు. కాగా 1959 మే 18న జన్మించిన సుధాకర్ సినిమాలపై ఆసక్తితో మద్రాస్ వెళ్లాడు. అక్కడ చిరంజీవి, నారాయణరావు, హరిప్రసాద్లతో కలిసి ఒకే గదిలో ఉండేవారు. ఛాన్సుల కోసం వెతుకుతున్న సమయంలో దర్శకుడు భారతీరాజాతో ఆయనకు పరిచయమేర్పడింది. అలా భారతీరాజా డైరెక్షన్లో కిళుక్కెమ్ పొగుమ్ రెయిల్ సినిమాలో హీరోగా చేశారు. ఇందులో రాధిక హీరోయిన్గా నటించింది. ఈ చిత్రం సూపర్ హిట్ కావడంతో తమిళంలో వరుస సినిమాలు చేశాడు. తర్వాత ఏమైందో ఏమోకానీ రూటు మార్చి టాలీవుడ్లో కమెడియన్గా, విలన్గా చేస్తూ ఇక్కడే స్థిరపడిపోయాడు. చదవండి: వెయ్యిమందిని దాటి హీరోగా.. కానీ వైవాహిక జీవితంలో మాత్రం శరత్బాబు.. -
అట్టహాసంగా బ్రహ్మానందం రెండో కొడుకు నిశ్చితార్థం వీడియో
-
మరోసారి సర్జరీ.. ఈ పరిస్థితి ఎవరికీ రాకూడదు: ఏడ్చేసిన రోహిణి
ఎంతటి కష్టాన్ని అయినా, బాధను అయినా పైకి కనిపించనీయకుండా చేసే అస్త్రం చిరునవ్వు. ఆ నవ్వును అందరికీ పంచగల సత్తా ఒక్క కమెడియన్కే సొంతం. తను నవ్వుతూ అందరినీ నవ్విస్తున్న కమెడియన్ రోహిణి చాలాకాలంగా భరించలేని బాధను అనుభవిస్తోంది. కానీ పైకి మాత్రం ఆ బాధను, నొప్పిని కనిపించనివ్వకుండా జాగ్రత్తపడుతోంది. 2016లో ఆమె యాక్సిడెంట్కు గురవగా కాలు ఫ్రాక్చర్ అయింది. దీంతో ఆమె కాలిలో రాడ్డు వేశారు. కాలిలో రాడ్డు ఉన్నప్పటికీ టీవీ షోలలో గెంతుతూ, కుప్పిగంతులు వేస్తూ, డ్యాన్సులు చేస్తూ అందరికీ వినోదాన్ని పంచింది రోహిణి. షూటింగ్లతో బిజీగా ఉన్న ఆమె గతంలో కాలిలో వేసిన రాడ్డును తీయించుకోవాలనుకుంది. ఇందుకోసం ఇటీవలే ఆస్పత్రికి వెళ్లింది. ఆమెకు మత్తుమందు ఇచ్చి ఆపరేషన్ థియేటర్కు తీసుకెళ్లిన వైద్యులు తీరా ఆ రాడ్డును తీయలేమంటూ చేతులెత్తేశారు. రాడ్డు లోపల కూరుకుపోయిందని, బలవంతంగా లాగితే దానికి అతుక్కున్న ఎముక విరిగే ప్రమాదం ఉందంటూ ఆ రాడ్డును అలాగే వదిలేశారు. దీంతో నిరాశకు లోనైన రోహిణి తన ప్రయత్నం విరమించలేదు. తనకు యాక్సిడెంట్ అయినప్పుడు సర్జరీ చేసిన డాక్టర్ దగ్గరకు వెళ్లి మళ్లీ సర్జరీకి సిద్దపడింది. ఈ మేరకు తన యూట్యూబ్ ఛానల్లో ఓ వీడియో రిలీజ్ చేసింది. ఇందులో రోహిణి మాట్లాడుతూ.. 'గంటలో సర్జరీ చేస్తామన్నారు. కానీ ఆ రాడ్డు రావడానికి 10 గంటలు పట్టింది. రాడ్డు సగందాకా వచ్చి ఆగిపోయిందట. చాలా కష్టపడి ఎలాగోలా దాన్ని బయటకు తీశారు. ఆరు వారాల దాకా కాలు కిందపెట్టకూడదన్నారు. చాలా కుట్లు వేశారు. ఎంతో నొప్పిగా ఉంది. ఇలాంటి పరిస్థితి ఎవరికీ రాకూడదు' అంటూ కన్నీళ్లు పెట్టుకుంది రోహిణి. ఆమె పరిస్థితి తెలిసిన అభిమానులు త్వరగా కోలుకోవాలంటూ కామెంట్లు చేస్తున్నారు. చదవండి: కంగనా చేతబడి చేసిందన్నాడు, ఇప్పుడేమో అడ్డు రాలేదంటూ.. -
టాలీవుడ్ ప్రముఖ కమెడియన్ పృథ్వీరాజ్కు అస్వస్థత
-
30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీరాజ్కు అస్వస్థత
ప్రముఖ కమెడియన్ పృథ్వీరాజ్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. 30 ఇయర్స్ ఇండస్ట్రీగా గుర్తింపు పొందిన పృథ్వీరాజ్ ఇప్పుడు కూతురి కోసం దర్శకుడిగా మారి సినిమా తీస్తున్న సంగతి తెలిసిందే. కొత్త రంగుల ప్రపంచం సినిమాకు ఆయన దర్శకత్వం వహిస్తున్నారు. ఈ క్రమంలో వరుసగా ప్రమోషన్స్ చేస్తూ బిజీబిజీగా గడపుతున్నారు. చదవండి: రానా తమ్ముడు హీరోగా 'అహింస'.. రిలీజ్ డేట్ ఫిక్స్ ఈ క్రమంలో అస్వస్థతకు గురై ఉన్నట్లుండి కుప్పకూలిపోయారు. దీంతో వెంటనే కుటుంబసభ్యులు ఆయన్ను ఆసుపత్రికి తరలించారు. సెలైన్తో హాస్పిటల్ బెడ్పై తన ఆరోగ్య పరిస్థితిని వివరిస్తూ పృథ్వీరాజ్ ఓ వీడియోను రిలీజ్ చేశారు. డైరెక్టర్గా తొలిసారి సినిమా తీస్తున్నాను. ఆసుపత్రిలో ఉన్నా సినిమా గురించి ఆలోచిస్తున్నానుకొత్త రంగుల ప్రపంచం సినిమాకి మీ అందరి ఆశీస్సులు కావాలి అంటూ పేర్కొన్నారు. కాగా ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు సమాచారం. చదవండి: ఫ్యాంటసీ బ్యాక్డ్రాప్లో అఖిల్ కొత్త సినిమా.. టైటిల్ ఇదే! -
ఆఖరి రోజుల్లో దయనీయ స్థితిలో కమెడియన్.. వీడియో వైరల్
ప్రముఖ నటుడు, కమెడియన్ మనోబాల అనారోగ్యంతో మే 3న కన్నుమూసిన విషయం తెలిసిందే! తమిళంలో అనేక చిత్రాలు చేసిన ఆయన తెలుగులో పున్నమి నాగు, మహానటి, దేవదాసు, వాల్తేరు వీరయ్య సినిమాలతో తెలుగు ప్రేక్షకులకూ దగ్గరయ్యారు. తాజాగా ఆయన చివరి రోజుల్లో ఎలా ఉన్నారో తెలియజేస్తూ ఓ వీడియోను మనోబాల యూట్యూబ్ ఛానల్లో రిలీజ్ చేశారు అతడి కుటుంబసభ్యులు. ఇందులో మనోబాలకు కనీసం కదలడానికి కాళ్లు, చేతులు సహకరించడం లేదు. నోరు పెగల్చడానికి కూడా ఎంతో ఇబ్బందిపడ్డారు. ఆయనతో మాట్లాడించేందుకు అందరూ కలిసి ఎంత ప్రయత్నించినా మనోబాల మాట పెదవి దాటి బయటకు రాలేకపోయింది. మనోబాల తన కొడుకు హరీశ్ పాడిన పాట చివరిసారిగా విని సంతోషించారు. మనోబాల కదల్లేని స్థితిలో వీల్చైర్కే పరిమితం కావడంతో ఆయన అసిస్టెంట్ అతడికి తినిపిస్తూ నీళ్లు తాగించాడు. అలా ఓపక్క కొడుకు పాట పాడుతుంటే మరోపక్క ఆయనకు భోజనం తినిపించారు. సినిమాల్లో ఎంతో యాక్టివ్గా కనిపించే మనోబాలను ఇలా వీల్చైర్కే పరిమితమవడాన్ని చూసి తట్టుకోలేకపోతున్నారు అభిమానులు. ఈ వీడియో చూస్తే కన్నీళ్లు ఆగడం లేదంటూ కామెంట్లు పెడుతున్నారు. కాగా మనోబాలాకు 'మనోబాలాస్ వేస్ట్ పేపర్' పేరిట ఓ యూట్యూబ్ ఛానల్ ఉంది. తెర వెనుక జరిగే సరదా సంఘటనలను, సెలబ్రిటీలతో ఇంటర్వ్యూలను, రివ్యూస్ను.. ఇలా రకరకాల వీడియో షేర్ చేస్తూ అభిమానులను ఎంటర్టైన్ చేసేవారు. ఆయన కామెడీకి కడుపుబ్బా నవ్వినవారు ఇప్పుడు ఈ చివరి వీడియో చూసి కంటతడి పెట్టుకుంటున్నారు. చదవండి: ఆ హీరో ఇండస్ట్రీకి పనికి రాడు: డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు -
కొందరిని నమ్మి రూ.60 లక్షలు పోగొట్టుకున్నా: కమెడియన్
క్యారెక్టర్ ఆర్టిస్టుగా, కమెడియన్గా దాదాపు వంద సినిమాల్లో నటించాడు కమెడియన్ రామచంద్ర. తన కామెడీ టైమింగ్తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే ఆయన ఆ మధ్యలో కొంతకాలం వెండితెరపై పెద్దగా కనిపించలేదు. తాజాగా తను సినిమాలకు గ్యాప్ ఇవ్వడానికి గల కారణాన్ని తెలియజేస్తూ జీవితంలో ఎదురైన చేదు సంఘటనలను ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నాడు. అదే నా మొదటి పారితోషికం.. '2016లో ఓ చిన్న సినిమాలో కిందపడిపోతే నా కాలు ఫ్రాక్చర్ అయింది. కోలుకోవడానికి మూడేళ్లు పట్టింది. ఆ తర్వాత కోవిడ్ వల్ల మరో రెండేళ్లు ఇంటికే పరిమితం కావాల్సి వచ్చింది. అలా అనుకోకుండా గ్యాప్ వచ్చింది. సినిమాల్లోకి రావాలని నాకు చిన్నప్పటి నుంచే ఆశగా ఉండేది. జూనియర్ ఎన్టీఆర్ నటించిన నిన్ను చూడాలని సినిమా ఆడిషన్కు వెళ్లగా వెంటనే నన్ను ఓకే చేశారు. ఇది నా తొలి సినిమా, రూ.11,000 పారితోషికం అందుకున్నాను. జబర్దస్త్కు ట్రై చేశా కానీ.. తర్వాత ఆనందం సినిమా చేశాను. ఈ సినిమాలు క్లిక్ అవ్వడంతో వరుసగా సినిమాలు చేసుకుంటూ పోయాను. బాధపడ్డ సందర్భాలు ఏంటంటే.. పరుగు సినిమా ఆడిషన్స్లో రిజెక్ట్ చేశారు. ఖలేజాలో నేను డబ్బింగ్ చెప్పిన తర్వాత సీన్స్ తీసేశారు. సర్కారువారి పాట, గబ్బర్ సింగ్, రామయ్యా వస్తావయ్యా సినిమాల్లోనూ ఎడిటింగ్లో నా సీన్స్ తీసేశారు. జబర్దస్త్ ప్రారంభమైన తొలినాళ్లలో ఆ కామెడీ షోలో ప్రయత్నించా కానీ తీసుకోలేదు. సంపాదించినదంతా పోగొట్టుకున్నా ఓసారి గెస్ట్ ఎపిసోడ్కు చలాకీ చంటి నన్ను షోకి పిలిస్తే వెళ్లాను. అతడికి ఈ మధ్య ఆరోగ్యం బాగోలేదు. వెళ్లి కలవాలి. నేను మోసపోయిన సందర్భం ఒకటుంది. కొందరిని నమ్మి ఓ బిజినెస్లో డబ్బులు ఇన్వెస్ట్ చేశాను. ఆ డబ్బులు తిరిగి రావడం కాదు కదా మరింత కట్టాల్సి వచ్చింది. అలా దాదాపు రూ.60 లక్షలు పోగొట్టుకున్నాను. అదే సమయంలో నా కాలు ఫ్రాక్చర్ కావడంతో వైద్యానికి బాగా ఖర్చయింది. సంపాదించినంతా పోయింది. ఆ తర్వాత అమ్మ చనిపోయింది. ఇలా దెబ్బ మీద దెబ్బ తగిలింది. వాటి నుంచి కోలుకోవడానికి చాలా సమయం పట్టింది' అన్నాడు రామచంద్ర. చదవండి: గ్లామర్ విషయంలో తగ్గేదేలే అంటున్న హీరోయిన్ -
Actor Manobala Funeral : కమెడియన్ మనోబాల అంత్యక్రియలు (ఫొటోలు)
-
అందుకే జబర్దస్త్లో ఎక్కువ పారితోషికం.. చైతన్య చివరి వీడియోపై అభి..
ఢీ షోలో కొరియోగ్రాఫర్గా పని చేసిన చైతన్య మాస్టర్ అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న సంగతి విదితమే! మే 1న అప్పులు తీర్చలేకపోతున్నానంటూ సెల్ఫీ వీడియో తీసి ప్రాణాలు తీసుకున్నాడు. ఢీ షో పేరు ఇస్తుంది కానీ జబర్దస్త్లో వచ్చినంత సంపాదన ఢీలో రాదని ఆయన వీడియోలో వాపోయాడు. తాజాగా చైతన్య మృతికి సోషల్ మీడియా వేదికగా నివాళులు అర్పించిన కమెడియన్ అదిరే అభి జబర్దస్త్ వర్సెస్ ఢీ పారితోషికాలపై స్పందించాడు. అలాగే కొత్తగా ఇండస్ట్రీకి వచ్చేవారికి పలు సలహాలు, సూచనలు ఇస్తూ ఇన్స్టాగ్రామ్లో వీడియో షేర్ చేశాడు. సినిమా, టీవీ పరిశ్రమలో ఉండేవాళ్లను చూసి చాలామంది కొత్తగా ఈ ఇండస్ట్రీకి రావాలనుకుంటారు. అలా వచ్చి సెటిలైన వాళ్లను చూసి.. మరింతమంది ఇన్స్పైర్ అయి వస్తుంటారు. అంటే.. మనం ఏం చేసినా దాని ప్రభావం తర్వాత వచ్చేవాళ్లపై పడుతుంది. కాబట్టి ఇండస్ట్రీలోకి రావాలనుకునేవాళ్లందరికీ ఓ విషయం చెప్పాలనుకుంటున్నా.. ఇండస్ట్రీ గురించి ముందు అవగాహన తెచ్చుకుంటే మున్ముందు వచ్చే ఇబ్బందులను ఎదుర్కోవడానికి మానసిక ధైర్యం వస్తుంది. ఇక్కడికి రాగానే ఎర్రతివాచీ పరిచి ఆఫర్లు ఇస్తారు, చాలా డబ్బులు వస్తాయి అని భ్రమపడితే పొరపాటే. కడుపు మాడ్చుకుని, ఎన్నో నిద్ర లేని రాత్రిళ్లు గడిపితేనే సక్సెస్ వస్తుంది. ఒక బ్రేక్ వచ్చాక దాన్ని మెయింటెన్ చేయడం కూడా చాలా పెద్ద విషయం! ఇండియన్ సినీ ఇండస్ట్రీలో నెంబర్ వన్ స్టార్గా వెలుగొందిన అమితాబ్ బచ్చన్ గతంలో ఓ నిర్మాణ సంస్థను ప్రారంభించాడు. ఆ బ్యానర్లో తీసిన సినిమాలన్నీ ఫ్లాపవడంతో వంద కోట్ల మేర నష్టం వచ్చింది. తన కార్లు కూడా అమ్మేసుకున్నాడు. కానీ.. కౌన్ బనేగా కరోడ్పతితో హోస్ట్గా మళ్లీ కెరీర్ మొదలుపెట్టి జీరో నుంచి మళ్లీ సూపర్ స్టార్ అయ్యాడు. అంటే పరిస్థుతులను ఎదుర్కొనేంత మానసిక ధైర్యం మనకు ఉండాలి. అందుకే ముందుగానే ప్లాన్ బి కూడా రెడీ చేసుకోవాలి. మనకు వచ్చే ఆదాయంలో ఎంతో కొంత దాచుకోవాలి. అప్పుడే ఏదైనా కష్టం వచ్చినప్పుడు అది మనకు సాయపడుతుంది. చిన్నవాటికే కుంగిపోయి ఆత్మహత్య చేసుకోకూడదు. ఇక షో రేటింగ్ను బట్టి ఆయా ప్రోగ్రామ్లో పని చేసే వాళ్లకు పారితోషికం ఇస్తారు. జబర్దస్త్కు రేటింగ్ ఎక్కువ కాబట్టి అక్కడ ఎక్కువ రెమ్యునరేషన్ ఇస్తారు. అయినా వాటి మీద ఆధారపడకుండా బయట ప్రోగ్రామ్స్, ఈవెంట్స్ ద్వారా ఆర్టిస్టులు మరింత సంపాదిస్తారు. ఇక్కడ ఆఫర్లు రానప్పుడు వేరే దారి ఎంచుకుని జీవించడం బెటర్' అని చెప్పుకొచ్చాడు అభి. చదవండి: అక్కినేని కుటుంబాన్ని వెంటాడుతున్న ఫ్లాపులు.. చై ఆన్సరేంటంటే -
కమెడియన్ మనోబాల మృతికి కారణం ఇదేనా?
బహుముఖ ప్రజ్ఞాశాలి మనోబాల (69) ఇకలేరు. కోలీవుడ్లో కింది స్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదిగిన ఆయన డబ్బింగ్ ఆర్టిస్ట్, నటుడు, దర్శకుడు, నిర్మాతగా రాణించారు. తంజావూర్ జిల్లా మరుంసూర్కి చెందిన ఈయన 1953 డిసెంబర్ 8న జన్మించారు. మనోబాల అసలు పేరు బాలచందర్. చిత్రలేఖనానికి సంబంధించిన విద్యను అభ్యసించిన ఈయన ఆ తరువాత చైన్నెకి చేరి భారతీరాజా వద్ద సహాయదర్శకుడిగా చేరారు. చదవండి: నాన్న చితికి కూడా నా వద్ద డబ్బులు లేవు: రంగస్థలం మహేశ్ డబ్బింగ్ ఆర్టిస్ట్ గానూ పలు చిత్రాలకు పని చేశారు. అదే విధంగా పుదియ వార్పుగళ్ చిత్రంలో చిన్నపాత్రలో కనిపించారు. అయితే కేఎస్.రవికుమార్ దర్శకత్వం వహించిన పట్పుక్కాగ చిత్రంతో పూర్తిస్థాయి నటుడిగా మారారు. ఆ తరువాత దర్శకుడిగా అవతారం ఎత్తి ఆకాయ గంగై చిత్రాన్ని రూపొందించారు. రజనీకాంత్ హీరోగా ఊర్క్కావలన్, విజయకాంత్తో ఎన్ పురుష న్ దాన్ ఎనక్కు మట్టుమ్దాన్ చిత్రం వంటి పలు విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించారు. కె.భాగ్యరాజ్, మణివన్నన్, కె.రంగరాజ్, మనోజ్కుమార్ వంటి దర్శకుల కోవలో చేరి మంచి చిత్రాల దర్శకుడి గా పేరు గడించారు. హాస్య నటుడిగా ప్రేక్షకులను అలరించిన మనోబాలా ధూమపానానికి బానిసగా మారి.. రోజుకు 100 సిగరెట్లు పీల్చేసేవారని చెబుతారు. ఈ కారణంగానే ఆయన కాలేయం దెబ్బతింది. చదవండి: సీనియర్ నటుడు శరత్ బాబుపై అసత్య వార్తలు.. సోదరి క్లారిటీ కొన్ని నెలల క్రితం ఈ సమస్య కారణంగానే ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. ఈనేపథ్యంలో బుధవారం కన్నుమూశారు. ఈయనకు భార్య, కొడుకు ఉన్నారు. మనోబాల మృతికి ముఖ్యమంత్రి స్టాలిన్ నుంచి రజనీకాంత్, కమలహాసన్ తదతర పలువురు సినీ రాజకీయ నాయకులు సంతాపం వ్యక్తం చేశారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ఆయన పరిస్థితిని చూస్తే భయమేసింది: మహేశ్
జబర్దస్త్ కమెడియన్ మహేశ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రంగస్థలం సినిమాతో ఓ రేంజ్లో గుర్తింపు వచ్చింది. రామ్ చరణ్ హీరోగా నటించిన ఈ చిత్రంలో ఫుల్ ఎమోషనల్ సీన్స్లో మహేశ్ అద్భుతమైన నటనతో మెప్పించారు. అతనికి యాస, లుక్ మహేశ్కు మరింత క్రేజ్ తీసుకొచ్చాయి. ప్రస్తుతం మహేశ్ సినిమాలతో బిజీగా ఉన్నారు. అయితే ఇటీవల ఢీ షో కొరియోగ్రాఫర్ చైతన్య సూసైడ్పై మహేశ్ స్పందించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన మహేశ్ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. (ఇది చదవండి: 'పుష్ప రాజ్' తగ్గేదేలే.. భారీ ధరకు ఆడియో రైట్స్!) మహేశ్ మాట్లాడుతూ.. 'చైతన్యతో నేను ఓసారి ట్రావెల్ చేశా. శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో నాకు డ్యాన్స్ నేర్పించారు. చైతన్య మంచి టాలెంటెడ్. ఆయన అలా చేసుకున్నాడంటే ఎంత స్ట్రగుల్ అయ్యాడో. ఆరోజు చాలా బాధపడ్డా. అంత క్రేజ్ ఉన్న ఆయనే అలా చేస్తే మిగిలిన వారి పరిస్థితి ఏంటి?' అని అన్నారు. రెమ్యూనరేషన్స్ గురించి మాట్లాడుతూ..'కానీ నాకు అయితే రెమ్యూనరేషన్స్ బాగానే వస్తున్నాయి. నాకు ప్రారంభంలో తక్కువగానే ఉండేది. ఎందుకంటే మనకు అవకాశం రావాలి కదా. క్రేజ్ను బట్టి అమౌంట్ డిసైడ్ చేస్తారు. ఫస్ట్ తక్కువ డబ్బులు వచ్చినా మనం కష్టపడాలి. ఆ తర్వాతే నాకు బాగా డబ్బులొచ్చాయి. కామెడీలో నాకు రవితేజ టైమింగ్ అంటే చాలా ఇష్టం. సీన్ వందశాతం నిలబెట్టడంలో ఆయన బెస్ట్. ఎలాంటి సీన్ అయినా పండించగలరు. నా ఫేవరేట్ హీరోయిన్ అంటే అనుష్క. నా చిన్నప్పుడు అయితే రమ్యకృష్ణ అంటే చాలా ఇష్టం. అయితే ఆమెను ఎప్పుడు కలవలేదు.' అని చెప్పుకొచ్చారు. (ఇది చదవండి: చిరంజీవితో రొమాన్స్ చేయాలని ఉంది: స్టార్ హీరోయిన్) -
కమెడియన్ మృతి.. మనోబాల అరుదైన ఫోటోలు
-
సినీ ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ కమెడియన్ కన్నుమూత
తమిళ చిత్రపరిశ్రమలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ కమెడియన్, డైరెక్టర్ మనోబాల(69) కన్నుమూశారు. గత కొద్దిరోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన బుధవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. మనోబాల మరణంపై సెలబ్రిటీలు, అభిమానులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. 1979లో మనోబాల నట ప్రస్థానాన్ని ప్రారంభించారు. పుట్టి వార్పుగల్ ఆయన నటించిన తొలి చిత్రం. సహాయ నటుడిగా వందల సినిమాలు చేసిన ఆయన భారతీ రాజా దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసినట్లు తెలుస్తోంది. అనంతరం 1982లో అగయ గంగై సినిమాతో డైరెక్టర్గా మారారు. దాదాపు పాతిక చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు. వెండితెరపైనే కాకుండా బుల్లితెరపై కూడా పలు సీరియల్స్లో నటించారు. కొన్ని సీరియల్స్కు దర్శకత్వం కూడా వహించారు. తమిళ ఇండస్ట్రీలో అనేక సినిమాల్లో హాస్యనటుడిగా మెప్పించిన మనోబాల తెలుగులోనూ పలు చిత్రాలు చేశారు. కథానాయకుడు, పున్నమి నాగు, మహానటి, దేవదాసు, రాజ్దూత్, వాల్తేరు వీరయ్య వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకూ ఆయన సుపరిచితులే! ఇన్నేళ్ల కెరీర్లో 450కి పైగా చిత్రాలు చేశారు. ఆయన చివరగా కాజల్ అగర్వాల్ నటించిన ఘోస్టీ చిత్రంలో కనిపించారు. Just in : Shell shocked to hear that character actor, comedian and director #Manobala passed away at a Chennai hospital! #OmShanti pic.twitter.com/5mKWygoOju — Sreedhar Pillai (@sri50) May 3, 2023 చదవండి: స్టార్ హీరో విక్రమ్కు గాయాలు -
బ్రహ్మాజీ చేయి కోసుకుంటే నేనే ఆస్పత్రికి తీసుకెళ్లా: కమెడియన్ భార్య
కమెడియన్గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడు నటుడు బ్రహ్మాజీ. రీల్ లైఫ్లో తక్కువ ప్రేమకథల్లోనే కనిపించినా రియల్ లైఫ్లో మాత్రం అతడికి ఓ ఇంట్రస్టింగ్ ప్రేమకథ ఉంది. ఆల్రెడీ పెళ్లై, కొడుకు ఉన్న బెంగాలీ మహిళ శాశ్వతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు బ్రహ్మాజీ. విడాకులు తీసుకుని ఒంటరిగా ఉన్న శాశ్వతితో ఏడడుగులు నడవడమే కాకుండా ఆమె కొడుకును తన కొడుకుగా భావించాడు. తనకు పిల్లలు పుడితే ఎక్కడ స్వార్థపూరిత ఆలోచనలు వస్తాయోనన్న భయంతో అతడి కోసం పిల్లలు కూడా వద్దనుకున్నాడు. ఆ అబ్బాయి మరెవరో కాదు సంజయ్ రావు. ఓ పిట్టకథ సినిమాతో అతడు తెలుగుతెరకు హీరోగా పరిచయమయ్యాడు. తన కొడుకుతో కలిసి నటించాలనుకున్న బ్రహ్మాజీ ఓ పిట్టకథలో పోలీసుగా నటించి తన కోరిక నెరవేర్చుకున్నాడు. తాజాగా బ్రహ్మాజీ తన భార్య శాశ్వతితో కలిసి ఓ ఇంటర్వ్యూకి హాజరయ్యాడు. ఈ సందర్భంగా వీరిద్దరూ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. బ్రహ్మాజీ మాట్లాడుతూ... 'ఓపక్క మూన్ లైట్, మరోపక్క సన్ రైజ్.. హైస్పీడ్లో శాశ్వతి దగ్గరకు వెళ్లి ఐ లవ్యూ చెప్పాను. ఆమె బర్త్డేకు నా చైన్ తాకట్టు పెట్టాను. తనతో బోలెడంత సేపు ఫోన్లో మాట్లాడేవాడిని. దాదాపు నా లైఫ్ అంతా పబ్లిక్ బూత్లోనే గడిచింది. కానీ తను ఒక్కసారి తిట్టిందంటే మూడు రోజులు భోజనం కూడా చేయలేం' అని చెప్పాడు. శాశ్వతి మాట్లాడుతూ.. తమ పెళ్లిలో డైరెక్టర్ కృష్ణవంశీ కన్యాదానం చేశాడని చెప్పింది. ఒకసారి బ్రహ్మాజీ సడన్గా చేయి కోసుకోవడంతో తాను ఆస్పత్రికి తీసుకెళ్లాను అని చెప్పుకొచ్చింది. చదవండి: ప్లాస్టిక్ సర్జరీ వికటించి మోడల్ మృతి జియా ఖాన్ కేసులో సంచలన తీర్పు -
ధర్మవరపు సుబ్రహ్మణ్యం చనిపోయాక కడసారి చూసేందుకు వచ్చింది వీళ్లే!
కామెడీలో కొత్త ఒరవడి సృష్టించిన వ్యక్తి ధర్మవరపు సుబ్రహ్మణ్యం. చిన్న, పెద్ద తేడా లేకుండా అన్ని సినిమాల్లోనూ నటించేవారు. తానొక స్టార్ కమెడియన్ అయినా సరే, ఎప్పుడూ పారితోషికం డిమాండ్ చేసేవారు కాదట, నిర్మాతలు ఎంతిస్తే అంత తీసుకునేవారట. ఆయన మంచితనాన్ని అలుసుగా తీసుకుని కొందరు నిర్మాతలు డబ్బు ఎగ్గొట్టిన సందర్భాలు కూడా ఉన్నాయని ఆనాటి క్షణాలను గుర్తు చేసుకున్నాడు ధర్మవరపు సుబ్రహ్మణ్యం తనయుడు రవి బ్రహ్మ తేజ. తాజాగా రవి బ్రహ్మ తేజ మాట్లాడుతూ.. 'మా నాన్న మంచితనాన్ని అలుసుగా తీసుకుని మోసం చేసిన నిర్మాతలు ఇప్పుడు కష్టాలు అనుభవిస్తున్నారు. అప్పుడు నిజాయితీగా వ్యవహరించి ఉంటే వారి బతుకులు బాగుండేవి. వెండితెరపై అనేక పాత్రలు పోషించిన నాన్న 2013లో చనిపోయారు. ఆయన పార్థివదేహం ఇంట్లో ఉన్నప్పుడు తనను చివరి చూపు చూసేందుకు మూవీ మొఘల్ రామానాయుడు, హీరో గోపీచంద్, రాజేంద్రప్రసాద్, అలీ, వేణుమాధవ్ సహా తదితరులు వచ్చారు. కానీ మెగా ఫ్యామిలీ నుంచి ఎవరూ చూసేందుకు రాలేదు. వచ్చేందుకు ప్రయత్నించారట, కానీ వీలు కాలేదని తెలిసింది. ఇకపోతే నాన్న ముందస్తుగా మాకేమీ చెప్పలేదు కాబట్టి ఆయన పార్థివ దేహాన్ని ఫిలిం ఛాంబర్కు పంపించలేదు. మా ఇంటి నుంచి నాన్న పార్థివ దేహాన్ని ఊరికి తీసుకెళ్లి అక్కడే అంత్యక్రియలు నిర్వహించాం' అని చెప్పుకొచ్చాడు. కాగా 1954లో జన్మించిన ధర్మవరపు సుబ్రహ్మణ్యం ఎన్నో సినిమాల్లో కమెడియన్గా నవ్వులు పూయించారు. మరీ ముఖ్యంగా లెక్చరర్ పాత్రల్లో తను పండించే కామెడీకి ప్రేక్షకులు పొట్ట చెక్కలయ్యేలా నవ్వేవారు. స్టార్ కమెడియన్గా రాణించిన ఆయన కాలేయ క్యాన్సర్తో 2013 డిసెంబర్ 7న కన్నుమూశారు. చదవండి: సాయిధరమ్ తేజ్ నాకు ఫోన్ నెంబర్ ఇవ్వలేదు, కలవలేదు: అబ్దుల్ ఓటీటీలోకి వచ్చేసిన దసరా -
తాగుడుకు బానిసయ్యా.. అసలు ఈ బతుకు ఎందుకు అనుకున్నా?: కమెడియన్
తనదైన బాడీ లాంగ్వేజీతో, తెలంగాణ యాసలో డైలాగులు పలికిస్తూ నవ్వించగల వ్యక్తి కర్తానందం. జబర్దస్త్ స్టేజీపై కమెడియన్గా సత్తా చాటిన ఆయన వెండితెరపై కూడా నటుడిగా రాణిస్తున్నాడు. ఇటీవల వచ్చిన బలగం, దసరా సినిమాల్లో నటించి మరింతమంది ప్రేక్షకులకు దగ్గరైన ఆయన తాజాగా ఓ ఇంటర్వ్యూలో తను ఎదుర్కొన్న కష్టాల గురించి చెప్తూ కన్నీటిపర్యంతమయ్యాడు. 'మాది సూర్యాపేట. ఖమ్మంలో పదవ తరగతి వరకు చదువుకున్నా. మేము నలుగురు అన్నదమ్ములం, ఒక చెల్లి. చిన్నప్పుడే నాన్న చనిపోయాడు. మా ఐదుగురిని అమ్మ రెక్కలు ముక్కలు చేసుకుని పోషించింది. తను ఇప్పుడు లేదు, కానీ తన గురించి తలుచుకుంటే కన్నీళ్లాగవు. నేను చిన్నతనం నుంచే నాటకాలు వేసేవాడిని. చదువుకునే వయసులోనే జలగం వెంగళ్రావు చేతుల మీదుగా అవార్డు తీసుకున్నాను. ఇంట్లో ఆర్థిక పరిస్థితులు బాలేకపోవడంతో కూలీ పనులు చేశాను. ఎన్నో బాధలు అనుభవించాను. ఈ పరిస్థితుల్లో తాగుడుకు బానిసయ్యాను. ఏ పని చేసినా కలిసిరాలేదు. రోడ్డు పక్కన ఎంగిలి బీడీలు ఏరుకుని తాగాను. ఎందుకు ఈ బతుకు? అనిపించింది. కానీ ఏదో ఒకటి సాధించాలనుకున్నాను. సాయం కోసం మా ఫ్రెండ్స్ను ఆశ్రయించాను. అప్పుడు పోలీస్ శాఖ ప్రతి జిల్లాకు కళాబృందాన్ని ఏర్పాటు చేస్తుందన్న విషయం తెలిసింది. వారు నన్ను ఆ కళాబృందానికి హోంగార్డుగా పనిచేయమన్నారు. 22 సంవత్సరాలు అదే ఉద్యోగం చేసి కొంతకాలం క్రితమే రిటైరయ్యాను. తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో వచ్చిన బోలెడన్ని సినిమాల్లో నటించాను. చాకలి ఐలమ్మ సినిమాలో జబర్దస్త్ రాజమౌళితో పరిచయం ఏర్పడింది. ఆయన ద్వారా వేణు టీమ్లో చేరాను. దాదాపు 200 ఎపిసోడ్లు చేశాను. నన్ను బుల్లితెరకు పరిచయం చేసిన వేణు బలగం సినిమాలోనూ అవకాశం ఇచ్చాడు. ఆయన నా దేవుడు. ఆయనకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలను' అంటూ కంటతడి పెట్టుకున్నాడు కర్తానందం. -
బ్రహ్మానందాన్ని ఇంటికి రానివ్వని ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఎందుకంటే?
ధర్మవరపు సుబ్రహ్మణ్యం.. ఆయన సజీవంగా లేకపోయినా వెండితెరపై ఆయన పంచిన నవ్వులు మాత్రం కలకాలం గుర్తుండిపోతాయి. అబ్బే.. మాక్కూడా తెలుసు బాబూ.. అంటూ ఆయన నోటి నుంచి జారిన మాటల విరుపులు చాలు పెదవులు చిరునవ్వుతో విచ్చుకోవడానికి! ఎక్కువగా లెక్చరర్ పాత్రల్లో కామెడీ పండించిన ఆయన యజ్ఞం, ఆలస్యం అమృతం సినిమాలకు ఉత్తమ కమెడియన్గా నంది అవార్డులు అందుకున్నారు. 1954లో జన్మించిన ఆయన 2013లో కాలేయ క్యాన్సర్తో కన్నుమూశారు. తాజాగా ఆయన తనయుడు రవి బ్రహ్మ తేజ.. ధర్మవరపు సుబ్రహ్మణ్యం గురించి ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. (మెగాస్టార్ సూపర్ హిట్ చిత్రం.. నిర్మాతగా సాయి ధరమ్ తేజ్ నాన్న!) 'మా నాన్న కష్టమనేది తెలియకుండా పెంచారు. ఆయన సంపాదించిన ఆస్తి వల్లే మేమిప్పటికీ సంతోషంగా ఉన్నాం. ఇదంతా ఆయనిచ్చిందే! 2001లో 'నువ్వు నేను' సక్సెస్ పార్టీకి వెళ్లొస్తున్న సమయంలో నాన్నకు యాక్సిడెంట్ అయింది. బస్సు నాన్న కారు మీదకు ఎక్కి దిగింది. అక్కడున్నవాళ్లు నాన్నను వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లడంతో ఆయన బతికిబట్టకట్టారు. నాన్న తలపై 21 కుట్లు, కుడి చేతికి సర్జరీ చేసి రాడ్స్ వేశారు. ఆ తర్వాత 2005లో నాన్న ఉన్నట్లుండి అనారోగ్యానికి లోనయ్యారు. సిగరెట్కు బానిస కావడంతో లంగ్స్ పాడయ్యాయని డాక్టర్లు చెప్పారు. పదిరోజులపాటు కోమాలో ఉన్నారు. అలా రెండుసార్లు నాన్నను కాపాడుకున్నాం, కానీ మూడోసారి కాపాడుకోలేకపోయాం. 2012 దీపావళి తర్వాత ఆయన ఆరోగ్యం దిగజారింది. లివర్ క్యాన్సర్ నాలుగో స్టేజీ అని చెప్పారు. 11 నెలల కంటే ఎక్కువ బతకరని చెప్పారు. బ్రహ్మానందం నాన్నకు తరచూ ఫోన్ చేసి మాట్లాడేవారు. ఒక్కసారి ఇంటికి వచ్చి చూస్తానంటే నాన్న ఒప్పుకునేవాడు కాదు. నన్ను చూస్తే తట్టుకోలేవు, ఆరు నెలలు ఆగు, నేనే వస్తా, మళ్లీ షూటింగ్ చేద్దాం అన్నారు. కానీ అంతలోనే 2013 డిసెంబర్ 7న ఆయన చనిపోయారు. నాన్న చనిపోయినప్పుడు బ్రహ్మానందం ఇంటికి రాలేదు కానీ ఫిలించాంబర్లో చాలా ఏడ్చారు' అని చెప్పుకొచ్చాడు రవి బ్రహ్మ తేజ. (సుధా కొంగర దర్శకత్వంలో రజనీకాంత్ సినిమా!) -
Chalaki Chanti: ఇంకా ఐసీయూలోనే చలాకీ చంటి
కమెడియన్, నటుడు చలాకీ చంటి గుండెపోటుతో ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే! ఈ నెల 21న చంటికి తీవ్రమైన ఛాతీనొప్పి రావడంతో కుటుంబ సభ్యులు ఆయన్ను హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని పరిశీలించిన వైద్యులు గుండెపోటుగా గుర్తించారు. వెంటనే ఐసీయూకు తరలించి చికిత్స అందించారు. రక్తనాళాల్లో పూడికలు ఉన్నట్లు తేలడంతో డాక్టర్లు స్టంట్ వేసినట్లు తెలుస్తోంది. తాజాగా ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఓ వార్త బయటకు వచ్చింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, ఐసీయూలో చికిత్స అందిస్తున్నామని వైద్యులు వెల్లడించినట్లు తెలుస్తోంది. చంటి ఆరోగ్య పరిస్థితి గురించి ఆయన కుటుంబ సభ్యులు మాత్రం ఇంతవరకు ఎక్కడా స్పందించనేలేదు. కాగా జబర్దస్త్ షోతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు చలాకీ చంటి. తనదైన కామెడీ టైమింగ్తో, కడుపుబ్బా నవ్వించే స్కిట్లతో ప్రేక్షకులను అలరించాడు. బిగ్బాస్ ఆరో సీజన్లోనూ పాల్గొన్న అతడు సినిమాల్లోనూ నటించి గుర్తింపు సంపాదించుకున్నాడు. కొంతకాలంగా మాత్రం అతడు అటు బుల్లితెరపై, ఇటు వెండితెరపై కనిపించడం లేదు. చదవండి: విరూపాక్ష సినిమా వేయలేదని థియేటర్పై తేజ్ ఫ్యాన్స్ దాడి -
పంచ్ ప్రసాద్కు తీవ్ర అనారోగ్యం.. మరోసారి ఆస్పత్రికి!
జబర్ధస్త్ కమెడియన్ పంచ్ ప్రసాద్ గత కొద్దిరోజులుగా కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. దీని కోసం ఆయన డయాలసిస్ చికిత్స తీసుకుంటున్నారు. రెగ్యులర్గా డయాలసిస్ చేయించుకుంటున్నా ఆరోగ్యంలో ఎలాంటి మార్పు రాలేదు. అంతే కాకుండా రోజు రోజుకు కొత్త అనారోగ్య సమస్యలు ఆయన్ని చుట్టుముడుతున్నాయి. ఇటీవలే తీవ్రమైన జ్వరంతో ఆస్పత్రిలో పంచ్ ప్రసాద్ మరోసారి ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం గొంతు సమస్యతో ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. ఈ విషయాన్ని ఆయన భార్య తమ యూట్యూబ్ ఛానెల్ ద్వారా పంచుకున్నారు. (ఇది చదవండి: ‘పుష్ప -2’ టీజర్.. ఐకాన్ స్టార్ దెబ్బకు యూట్యూబ్ షేక్) పంచ్ ప్రసాద్ భార్య మాట్లాడుతూ.. 'ఇప్పుడు ఆసుపత్రికి వచ్చాం. ఇప్పటికే ఆయనకు థైరాయిడ్ సమస్య ఉంది. అది మరింత తీవ్రంగా మారింది. అల్ట్రా సౌండ్ స్కానింగ్ తర్వాత రిపోర్టులు చూసిన డాక్టర్స్ సర్జరీ చేయాలని చెప్పారు. ఆయన కాలికి లెగ్ ఇన్ఫెక్షన్ కూడా ఉండడంతో సర్జరీ ఇప్పుడే వద్దని చెప్పారు. లెగ్ ఇన్ఫెక్షన్ తగ్గిన తరువాత సర్జరీ చేస్తామని డాక్టర్లు అన్నారు. మెడిసిన్స్తో తగ్గాలని దేవుడిని కోరుకుంటున్నా.' అని ఆమె అన్నారు. కాగా, పంచ్ ప్రసాద్ తన పేరు మీద ఓ యూట్యూబ్ ఛానల్ను నిర్వహిస్తున్నారు. తన ఆరోగ్యానికి సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. ఇది చూసిన ఆయన అభిమానులు త్వరగా కోలుకోవాలని దేవుడ్ని ప్రార్థిస్తున్నారు. -
ఛీ, ఇది ఒక అమ్మాయేనా? పంది, ఏనుగు అని తిట్టారు: విద్యుల్లేఖ
డిఫరెంట్ డైలాగ్ డెలివరీతో ఆకట్టుకునే లేడీ కమెడియన్ విద్యుల్లేఖ. వెండితెరపై నవ్వులు కురిపించిన ఆమె 2021లో ప్రియుడు, ఫిట్నెస్ నిపుణుడు సంజయ్ను పెళ్లాడింది. వివాహ అనంతరం వీరు హనీమూన్ కోసం మాల్దీవులు వెళ్లారు. ఆ సమయంలో బీచ్లో బికినీలో ప్రకృతిని ఎంజాయ్ చేస్తూ దిగిన ఫోటోలు షేర్ చేయడంతో తనపై చాలా ట్రోలింగ్ జరిగింది. ఒక నెటిజన్ అయితే ఏకంగా విడాకులు ఎప్పుడు తీసుకుంటున్నారని అడగడంతో ఆమె మనసు నొచ్చుకుంది. డ్రెస్సింగ్కు, విడాకులకు ఏమైనా సంబంధం ఉందా? అంటూ అతడిని ఏకిపారేసింది. తాజాగా బుల్లితెరపై ప్రసారమవుతున్న ఓ షోలో అడుగుపెట్టిన విద్యుల్లేఖ ఆనాటి పరిస్థితులను గుర్తు చేసుకుంటూ ఎమోషనలైంది. 'నేను లావుగా ఉన్నానని అందరూ నన్ను ట్రోల్ చేశారు. ఏనుగు, పంది.. ఇలా అన్ని జంతువులతో పోల్చారు. ఎంత లైట్ తీసుకున్నా ఏదో ఒక పాయింట్లో అది గుచ్చుకుంటుంది. నా హనీమూన్లో స్విమ్సూట్ వేసుకున్నానని.. ఛీ ఇది ఒక అమ్మాయేనా? అని తిట్టిపోశారు' అని పేర్కొంది నటి. అదే షోలో ఉన్న హీరోయిన్ కాజల్ సైతం స్పందిస్తూ.. నేను గర్భిణీగా ఉన్నప్పుడు కూడా లావెక్కానని ట్రోల్ చేశారని గుర్తు చేసింది. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. సీనియర్ నటుడు మోహన్ రామన్ కుమార్తె అయిన విద్యుల్లేఖ.. తెలుగు, తమిళంలో అనేక చిత్రాలు చేసింది. హీరోయిన్ ఫ్రెండ్ పాత్రలకు చిరునామాగా మారింది. ఎటో వెళ్లిపోయింది మనసు, రామయ్యా వస్తావయ్యా, భలే మంచిరోజు సహా పలు చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించింది. ఆ మధ్య వచ్చిన హారర్ మూవీ 'రాజుగారి గది'లో కామెడీ పాత్రతో అలరించింది. View this post on Instagram A post shared by Vidyullekha / Vidyu Raman (@vidyuraman) -
మళ్లీ ఆస్పత్రిలో చేరిన పంచ్ ప్రసాద్.. తీవ్రమైన నొప్పితో!
జబర్దస్త్ కమెడియన్ పంచ్ ప్రసాద్ గత కొంతకాలంగా కిడ్నీ సంబంధిత సమస్యతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. తీవ్ర అనారోగ్యం బారిన పడటంతో పంచ్ ప్రసాద్కు సాయం చేసేందుకు పలువురు కంటెస్టెంట్స్ అండగా నిలిచారు. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న పంచ్ ప్రసాద్ మరోసారి ఆస్పత్రిలో చేరారు. ఈ సందర్భంగా తన ఆరోగ్యంపై యూట్యూబ్ ఛానెల్ ద్వారా ఓ వీడియోను పంచుకున్నారు. ప్రస్తుతం పంచ్ ప్రసాద్ డయాలసిస్ చికిత్స తీసుకుంటున్నారు. ఇప్పటిదాకా ఆయన చేతులకే దాదాపు 50 ఇంజెక్షన్స్ చేశారని పంచ్ ప్రసాద్ సతీమణి తెలిపారు. ప్రస్తుతం కాస్త బాగానే ఉన్నా.. చికిత్స తర్వాత తీవ్రమైన నొప్పి ఉంటోందని వెల్లడించారు పంచ్ ప్రసాద్. ప్రస్తుతం నడవడానికి ప్రయత్నిస్తున్నారని ఆయన భార్య తెలిపారు. ఇటీవలే తీవ్రమైన జ్వరం రావడంతో మరోసారి ఆస్పత్రిలో చేరారు కమెడియన్. నడవడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. ట్రీట్మెంట్ తీసుకుంటున్న వీడియోను తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న పంచ్ ప్రసాద్ అభిమానులు త్వరగా కోలుకోవాలంటూ ప్రార్థిస్తున్నారు. -
ఐదేళ్లు కష్టాలు అనుభవించా.. అలా ఎవరికీ జరగకూడదు: జబర్దస్త్ కొమరం
ప్రముఖ కామెడీ షో జబర్దస్త్ ద్వారా ఫేమ్ తెచ్చుకున్న కమెడియన్ కొమరం. కామెడీ పంచులతో అదరగొట్టే కొమరం అంటే ఇండస్ట్రీలో ఎవరూ గుర్తు పట్టలేరేమో. ఎందుకంటే తన పాత్ర కొమరక్కతోనే అభిమానుల గుండెల్లో పేరు సంపాదించుకున్నారు. తన యాస, భాష, కట్టు బొట్టుతో అందరిని మెప్పించారు. పలు టీవీ ఛానెల్స్లో నటించిన కొమరం.. ప్రస్తుతం సినిమాల్లో నటిస్తూ బిజీ అయిపోయారు. ప్రస్తుతం నాని నటించిన దసరా చిత్రంలో కనిపించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన కొమరం తన జీవితంలో ఎదురైన అనుభవాలను పంచుకున్నారు. తన కెరీర్లో అన్ని కష్టాలు చూశానని ఎమోషనల్ అయ్యారు. కొమరక్క అని పిలిస్తేనే సంతోషం కొమరం మాట్లాడుతూ.. 'నాపేరు కొమరం కదా.. అందుకే కొమరక్క అని పేరును నా క్యారెక్టర్ పెట్టుకున్నా. కొమరక్క అంటే ఎవరినీ లెక్క చేయదు. అయితే ఈ క్యారెక్టర్ మామూలుగా సక్సెస్ కాలేదు. చాలామందికి కొమరక్క అంటే ఒక మహిళ అని తెలుసు. నన్ను బయట ఎవరైనా చూస్తే కొమరక్క అనే అంటారు. ఆ పేరుతోనే అందరూ ఫిక్సయిపోయారు. కానీ నాకు ఆ పేరుతో పిలిస్తేనే ఇష్టం. నేను పనిచేసే ఛానెల్లో షో ఆపేయడంతో కొమరక్క టీవీ అనే యూట్యూబ్ ఛానల్ ప్రారంభించా.' అని అన్నారు. అన్ని రకాల పనులు చేశా ఇండస్ట్రీలోకి రాకముందు అన్ని రకాల పనులు చేశానని కొమరం తెలిపారు. ఆయన మాట్లాడుతూ..' హైదరాబాద్లో సిగ్నల్స్ దగ్గర స్కూల్ బ్యాగులు, గొడుగులు అమ్మేవాడినని.. కోఠిలో నిలబడి వస్తువులు అమ్మేవాడిని. అవన్నీ చాలా హ్యాపీగా ఇష్టంతోనే అన్నీ పనులు చేశా. హోటల్లో కూడా పని చేశా. క్యాటరింగ్లో కూడా చేశా. పాత్రలు కడిగేవాడిని. ఇండస్ట్రీలోకి రాకముందు ఇవన్నీ చేశా. ఈ ఫీల్డ్లోకి వచ్చాక కూడా ఇబ్బందులు పడ్డా. కానీ సక్సెస్ అయ్యాను. నా జీవితంలో ఇంత మార్పు వస్తుందని ఊహించలేదు. నేను చదివింది పదో తరగతి మాత్రమే. ఇంత పేరు వస్తుందని నా లైఫ్లో అనుకోలేదు. ప్రస్తుతం మూవీస్తో బిజీ అవ్వడం వల్ల కామెడీ షో నుంచి బయటకొచ్చేశా. ' అని అన్నారు. ఆ ఐదేళ్లు నా లైఫ్లో మళ్లీ రాకూడదని కోరుకుంటా కొమరం మాట్లాడుతూ.. 'ఐదేళ్లు లైఫ్లో ఇబ్బందులు పడ్డా. అలాంటి పరిస్థితులు మళ్లీ రావొద్దని కోరుకుంటా. అవీ తలుచుకుంటే ఏడుపొచ్చేది. మా నానమ్మ చనిపోయినప్పుడు బాధేసింది. మా అమ్మ కూడా సినిమాల్లోకి పోమ్మని చెప్పేది. మా చెల్లెలు అంటే నాకు పిచ్చి. ' అని అన్నారు. ప్రస్తుతం నాని, కీర్తి సురేశ్ నటించిన దసరా చిత్రంలో నటించారు. -
రచ్చ రవి ఇంట్లో బలగం సీన్.. చెల్లె కోసం బోరుమని ఏడ్చిన కమెడియన్
చిన్నచిన్న గొడవలతో అయినవాళ్లకే దూరమవుతున్నాం. ఉరుకుల పరుగుల జీవితంలో బంధాలకు, బంధుత్వాలను మర్చిపోతున్నాం. కానీ అంతా మనవాళ్లే అనుకుని కలిసిమెలిసి ఉంటే అంతకు మంచిన ఆనందం మరొకటి ఉండదు. ఇదే విషయాన్ని బలగంతో నిరూపించాడు దర్శకుడు వేణు. ఈ సినిమాలో జబర్దస్త్ కమెడియన్ రచ్చ రవి కూడా నటించాడు. అయితే రచ్చ రవి నిజ జీవితంలోనూ బలగం సీన్ ఎదురైంది. తను ఎంతగానో ప్రేమించిన చెల్లె మాట్లాడటం లేదని కన్నీరుమున్నీరుగా విలపించాడు. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. '2016లో మా ఇంటి గృహప్రవేశం జరిగింది. అప్పుడు వచ్చిన చెల్లె రజిత ఆ తర్వాత ఎన్నడూ మా ఇంటికి రాలేదు. తనిచ్చిన 123 రూపాయలతో హైదరాబాద్కు వచ్చాను. ఎన్నో తిప్పలు పడి ఈ స్థాయికి వచ్చాను. నాకు సమయం లేక తనతో సరిగా మాట్లాడలేదు. దాన్ని ఆమె తప్పుగా అర్థం చేసుకుంది. ఎన్నిసార్లు బతిమాలినా ఇంటికి రాననే చెప్తుంది. నేనేమైనా తప్పు చేస్తే తిట్టాలి కానీ ఇన్నేళ్లవుతున్నా ఇంటికి రావడం లేదు. రాఖీ పండగ వస్తే నేనే చెల్లె ఇంటికి వెళ్లి రాఖీ కట్టించుకుంటున్నాను, తను మాత్రం మా ఇంటికి రావడం లేదు. ఆమె ఇచ్చిన డబ్బులతోనే సిటీకి వచ్చి ఇంత సంపాదించాను. తను నా ఇంటికి వస్తే చూడాలనుంది. చెల్లె గుర్తుకు వస్తే నాకు కన్నీళ్లు ఆగట్లేదు' అని కంటతడి పెట్టుకున్నాడు రచ్చ రవి. ఇది చూసిన నెటిజన్లు 'మీ అన్న చేసిన బలగం సినిమా చూసి తప్పకుండా వచ్చి కలుస్తావని ఆశిస్తున్నాం', 'ఒక్కసారి వచ్చిపోవమ్మా.. ఆయన ఏడుస్తుంటే మాకు కన్నీళ్లొస్తున్నాయి' అంటూ కామెంట్లు చేస్తున్నారు. -
రెండు పూటలు తినడానికి కూడా లేదు, ఆర్థిక ఇబ్బందులు: బ్రహ్మానందం
నవ్వినంత ఈజీ కాదు నవ్వించడం.. కానీ కమెడియన్లు రకరకాల డైలాగులతో, స్కిట్లతో, పంచులతో, చేష్టలతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తారు. సింగిల్ డైలాగ్ లేకుండా కేవలం హావభావాలతోనూ నవ్వించగల దిగ్గజ నటుడు బ్రహ్మానందం. అందుకే ఆయన్ను హాస్యబ్రహ్మ అని పిలుస్తారు. ఇప్పటివరకు కేవలం కామెడీ తరహా పాత్రలే చేసిన ఆయన రంగమార్తాండలో వైవిధ్యమైన పాత్ర పోషించాడు. బ్రహ్మీని ఇలా చూడటం కొత్తగా ఉందంటున్నారు ఆడియన్స్. తాజాగా బ్రహ్మానందం ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చాడు. 'నా జీవితంలో జరుగుతున్నదేదీ ముందుగా ఊహించలేదు. రెండు పూటలా తినడానికి కూడా ఆలోచించుకున్న రోజులున్నాయి. అటువంటిది ఎమ్ఏ చదివాను, లెక్చరర్ ఉద్యోగం చేశాను. ఊహించకుండా సినిమాల్లోకి వచ్చాను. ఇలా అవుతుందని నేనెప్పుడూ అనుకోలేదు. అంతకుముందు డబ్బు కోసం ఇబ్బందులు పడ్డాను. ఇప్పుడు మంచి స్థానంలోకి వచ్చాక పేరు కాపాడుకోవడానికి ఇబ్బంది పడుతున్నాను. ఎవరైనా సరే ఎదుటివారు బాగుండాలని కోరుకుంటారు. కానీ తమ కన్నా బాగుండాలని మాత్రం కోరుకోరు. నేను స్టార్ హీరోలందరితోనూ పనిచేస్తూ ఎదుగుతున్నప్పుడు చాలామంది అసూయపడ్డారు. సుధాకర్ వచ్చాడు బ్రహ్మానందం పనైపోయింది, బాబూ మోహన్, ఎల్బీ శ్రీరామ్ వచ్చారు.. ఇక బ్రహ్మీ పనైపోయినట్లే, పృథ్వీ వచ్చాడు బ్రహ్మీ వెనకబడిపోయాడు.. ఇలా కొత్తగా ఏ కమెడియన్ వచ్చినా సరే నా పనైపోయింది అన్నారు. ఇవన్నీ దాటుకుంటూ ఇక్కడిదాకా వచ్చాను. రంగమార్తాండ సినిమాలో ఆ పాత్ర మీరు తప్ప ఇంకెవరు చేయగలరు మాస్టారు అని కృష్ణవంశీ అన్నారు. నాకది చాలు' అని చెప్పుకొచ్చాడు బ్రహ్మానందం. -
తాగిన మత్తులో యువతిపై కమెడియన్ అత్యాచారం
కమెడియన్ ఖ్యాలి సహరన్ తనపై అత్యాచారం చేశాడంటూ ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. రాజస్థాన్ జైపూర్లోని ఓ హోటల్లో కమెడియన్ తనపై అత్యాచారానికి పాల్పడ్డాడంటూ తన ఫిర్యాదులో పేర్కొంది. యువతి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇద్దరు యువతులు ఉద్యోగం కావాలంటూ ఓ నెల క్రితం కమెడియన్ ఖ్యాలి సహరన్ సాయం కోరారు. ఎలాగోలా ఉద్యోగం ఇప్పిస్తానంటూ సదరు కమెడియన్ వారికి హామీ ఇచ్చాడు. ఈ విషయంపై మాట్లాడదామంటూ ఇటీవల ఓ హోటల్లో రెండు గదులను బుక్ చేశాడు ఖ్యాలి. ఇద్దరు యువతులకు ఓ గది ఇచ్చి మిగతా గది తాను తీసుకున్నాడు. వారితో సంభాషిస్తున్న సమయంలో తను మద్యం తాగడమే కాక వారిని కూడా తాగమని బలవంతం చేశాడు. దీంతో భయాందోళనకు గురైన ఓ యువతి అక్కడి నుంచి వెళ్లిపోగా మరో యువతిపై ఖ్యాలి అత్యాచారం చేశాడు. కాగా ఖ్యాలి ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్త అని తెలుస్తోంది. -
నవ్వుల పొట్లాలు పంచుతున్న టాప్ లేడీ కమెడియన్స్..
అమ్మ అంటుంది.. ‘‘ఎప్పటికైనా నువ్వు పరాయింటికి వెళ్లాల్సిందానివే’’ అని.. అత్తగారు అంటారు.. ‘‘ఎంతైనా నువ్వు పరాయింటి నుంచి వచ్చిందానివే’’ అని.. సో జస్ట్ చిల్ లేడీస్.. మనకంటూ ఒక ఇల్లున్నప్పుడు క్లీన్ చేసుకుందాం! జోక్లా వినిపించే వాస్తవం అది. పేల్చింది.. ఇన్స్టాలో ఇలాంటి వ్యంగ్యాస్త్రాల రీల్స్తో పాపులర్ అయిన గాయత్రి దర్శిక. ఆ విరుపు అమ్మాయిలకు అబ్బిన నేరుపు. ఎక్కడి నుంచో కాదు.. చుట్టూ ఉన్న వాతావరణం నుంచే! ఇలా సమాజంలోని పురుషాధిపత్య సూత్రాలు.. కార్పొరేట్ నైజాలు.. పాలిటిక్స్ ఆటలు.. పేరెంటిగ్ పాట్లు.. పెంపకంలో లోట్లు.. వాట్ నాట్.. పొద్దున లేచిన దగ్గర్నుంచి రాత్రి పడుకోబోయే వరకు ఎదురైన అనుభవంలోకి వచ్చిన సంఘటనలన్నింటినీ హాస్యంగా ఒలిచి.. సటిల్గా చుట్టి.. నవ్వులు పండిస్తున్నారు. మేల్ వరల్డ్గా ఉన్న హ్యూమర్ ఫీల్డ్లోకి స్టాండప్ కమెడియన్స్గా అడుగుపెట్టారు. అక్కడా జెండర్ ఈక్వాలిటీ సాధించేందుకు ప్రయత్నిస్తున్నారు. వాళ్లలో ప్రశస్తి సింగ్.. అదితి మిత్తల్.. సుముఖి సురేశ్, కనీజ్ సుర్కా.. రాధికా వాజ్.. వంటి టాప్ ఫిమేల్ స్టాండప్ కమెడియన్స్ గురించి ఓ పరిచయం.. ప్రశస్తి సింగ్.. బ్రాండ్ ఆఫ్ హ్యూమర్.. అనెక్డాటల్ కామెడీ రైటర్, యాక్టర్, ఇంప్రొవైజర్ కూడా అయిన ప్రశస్తి సింగ్ పుట్టింది, పెరిగింది ఉత్తరప్రదేశ్లోని అమేఠీలో. చదువులో ఫస్ట్. పదవ తరగతిలో జిల్లా టాపర్. ఢిల్లీలో ఇంజినీరింగ్, లక్నో ఐఐఎమ్లో ఎంబీఏ పూర్తిచేసింది. సంప్రదాయబద్ధమైన కుటుంబ నేపథ్యమున్న ప్రశస్తి.. అంతే రొడ్డకొట్టుడు కెరీర్ పాత్ను ఎంచుకుంది చదువైపోగానే. కార్పొరేట్ కొలువులో చేరింది. కొన్నాళ్లు బెంగళూరులో, ఇంకొన్నాళ్లు హైదరాబాద్లో పనిచేసింది. ఉద్యోగం బోర్కొట్టింది. కొత్తదేదైనా చేయడానికి ముంబైకి మకాం మార్చింది. స్టార్ టీవీలో చేరింది. అక్కడే కొంతమంది స్టాండప్ కమెడియన్స్ పరిచయం అయ్యారు. స్నేహం కుదిరింది. హ్యాంగవుట్స్లో వాళ్ల జోక్స్కి సమంగా ప్రశస్తి కౌంటర్ జోక్స్ వేయడం ఆ స్నేహితులు గమనించారు. ఆమెలోని హాస్యచతురతను పసిగట్టారు. ‘నువ్వు అద్భుతంగా కామెడీ చేయగలవు.. జనాల ముందుకు వెళ్లు’ అంటూ ఆమెకు మైక్ ఇచ్చి ప్రేక్షకుల ముందు నిలబెట్టారు. అలా ఆమె తొలి కామెడీ షో గొప్పగా కాకపోయినా.. ఆ రంగంలో ఆమె భవిష్యత్తుకు ఢోకా లేదనే భరోసానైతే ఇచ్చింది. కొద్దిపాటి ఆ ప్రోత్సాహంతోనే స్టాండప్ కామెడీ షోలు చేయడం మొదలుపెట్టింది. ఆ ప్రయాణం ఎనిమిది నెలలు సాగాక అమెజాన్ ప్రైమ్ కామెడీ షో ‘కామికిస్తాన్’లో పార్టిసిపేట్ చేసే చాన్స్ వచ్చింది ఆమెకు. ఈ ఎనిమిది నెలలూ తనను తాను ఎప్పటికప్పుడు తీర్చిదిద్దుకుంటూనే ఉంది. తన మైనస్లను గ్రహించి వాటిని స్ట్రెంత్గా మలచుకుంటూనే ఉంది. ఆ ప్రయత్నం ‘కామికిస్తాన్’ షోకి బాగా వర్కవుట్ అయింది. "కామికిస్తాన్లో కనిపించిన స్టాండప్ కమెడియన్స్ రాత్రికి రాత్రే పాపులర్ అయిపోతారు అనుకున్నా అందులో పార్టిసిపేట్ చేయకముందు.. కానీ పాల్గొన్న తర్వాత తెలిసింది పాపులర్ అయిన కమెడియన్స్కే అందులో పాల్గొనే చాన్స్ వస్తుంది అని" అంటుంది ఆ షో గురించి మాట్లాడుతూ. అందులో తను ఫెయిల్ అవకుండా ఏదో నెట్టుకొస్తాలే అనుకుంది కానీ ఊహించని రెస్పాన్స్ వచ్చి బాగా హిట్ అయింది. దాంతో ఆమె మరింత పాపులర్ అయింది. ప్రతి షోకి కొత్తదనాన్ని తేవడం ఒక ఎత్తయితే.. స్వరంలో ఆమె పలికించే మాడ్యులేషన్స్ మరో ఎత్తు. ఇవే ఆమె ఎసెట్స్. ‘స్పోకెన్ ఫెస్ట్ 2019’ షోలో ప్రశస్తికి ప్రేక్షకుల నుంచి స్టాండింగ్ ఒవేషన్ లభించింది. అందులో ఆమె.. తన తండ్రి చనిపోయినప్పుడు తన తల్లి చూపించిన ధైర్యం.. కుటుంబాన్ని ఆమె నిలబెట్టిన తీరు గురించి చెబుతూ ‘మా అమ్మ నాకు సూపర్ హీరో’ అంటూ తల్లిని అభివర్ణించింది. అంత సున్నితమైన.. సీరియస్ విషయాన్ని గాఢత ఏమాత్రం తగ్గకుండా.. హాస్యపు పాళ్లు మితిమీరకుండా వర్ణించిన తీరుకు ప్రేక్షకులు ముగ్ధులయ్యారు. ఓ కంట భావోద్వేగపు తడి.. మరో కంట నవ్వుల తడితో చప్పట్లు మోగించారు. అయితే కార్పొరేట్ జాబ్ వద్దనుకుని జోక్స్ని క్రాక్ చేసే పనిలో ప్రశస్తి పడడాన్ని మొదట్లో వాళ్లమ్మ భారతి సింగ్ అంతగా ఇష్టపడలేదు. తర్వాత్తర్వాత కూతురి పట్టుదల చూసి ఆమెకు సపోర్ట్గా నిలబడింది. ‘నేను ఆర్థికంగా కాస్త స్థిరపడ్డాకే ఈ ఫీల్డ్లోకి వచ్చా. అయినా చాలా విషయాల్లో ఆమెను ఇబ్బంది పెట్టా. అయినా సరే.. నాకు సపోర్ట్గానే ఉంది’ అంటుంది వాళ్లమ్మ గురించి ప్రశస్తి. చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్తో జోక్స్ వేస్తూ అందరిలో తన ప్రెజెన్స్ను స్పెషల్గా మలచుకునేదట. కానీ తనిలా స్టాండప్ కమెడియన్గా మారతానని.. తనలో అంత హాస్య చతురత.. అంత అద్భుతమైన టైమింగ్ ఉన్నాయని.. ఎప్పుడూ అనుకోలేదట. ఆ క్రెడిట్ వాళ్ల నాన్నకే ఇస్తుంది. ‘నాకు ఇది మా నాన్న నుంచే వచ్చింది’ అంటూ. ‘అయితే మా నాన్న ఇప్పుడు ఉండి ఉంటే.. నేను కమెడియన్ అవడం పట్ల చాలా ఆశ్చర్యపోయేవారు. ఎట్ ది సేమ్ టైమ్ హ్యాపీగా ఫీలయ్యే వారు కూడా. ఎందుకంటే మా నాన్న ఎప్పుడూ ఒకటే చెబుతుండేవారు.. ఏ పని చేసినా అందులో మన మార్క్ చూపించాలని. అందుకే ఇందులో నేను పెడుతున్న హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్స్ని చూసి తప్పకుండా సంతోషించేవారు’ అంటుంది. తనను తాను కన్ఫ్యూజ్డ్ సోల్గా వర్ణించుకుంటుంది ప్రశస్తి. ఆ నైజం, కార్పొరేట్ సెక్టార్లో పనిచేసిన అనుభవం.. మహిళలకు సంబంధించిన సమస్యలు.. వంటివన్నీ తన జోక్స్కి ముడి సరుకులే అంటుంది. ‘ఓపెన్ మైక్లో ఆడియెన్స్ ముందు ఎప్పటికప్పుడు కొత్త కొత్త జోక్స్ను క్రాక్ చేస్తున్నా.. వాళ్ల రెస్పాన్స్ను తెలుసుకుంటున్నా. కాబట్టి.. ఇంకా చాలా దూరం ప్రయాణించాలి అన్న నిజం తెలుస్తోంది’ అని చెబుతుంది. ప్రశస్తికి హిందీ భాషే సౌకర్యంగా ఉన్నప్పటికీ కార్పొరేట్ ఉద్యోగుల కోసం స్టాండప్ కామెడీ చేయాల్సి రావడంతో ఇంగ్లిష్లో తన కమ్యూనికేషన్ స్కిల్స్ను మెరుగుపరచుకోవాల్సి వచ్చింది. కానీ అభిషేక్ ఉపమన్యు, జకీర్ ఖాన్ వంటి స్టాండప్ కామెడీ స్టార్స్ వాళ్ల హాస్యానికి భాషా హద్దులను చెరిపేసి హిందీలోనే జోక్స్ పేలుస్తూ దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకోవడం మొదలెట్టేసరికి ప్రశస్తికీ దారి దొరికినట్టయింది. అంతే అప్పటి నుంచి ఆమే తనకు సులువైన హిందీలోనే హాస్యాన్ని పండిస్తూ వస్తోంది. ‘నాకు సహజంగా వచ్చేది హిందీనే. ఎప్పుడైతే ఈ ఇద్దరూ.. హిందీలో ఆలోచనలకు దారులు వేస్తూ వచ్చారో అప్పుడు నాకు భలే ఊరటగా అనిపించింది. ఎందుకంటే భాష కన్నా ఆలోచనలు ముఖ్యం కదా!’ అంటుంది ప్రశస్తి. కాంట్రవర్సీ... 2019, డిసెంబర్ 31న ప్రశస్తి తన ఇస్టాగ్రామ్ అకౌంట్లో.. బాలీవుడ్ నటుడు సిద్ధార్థ్ మల్హోత్రాతో తను కలసి దిగిన ఓ పాత ఫొటోని పోస్ట్ చేసింది.. అతన్ని వెయిటర్గా కామెంట్ చేస్తూ. అంతే సిద్ధార్థ్ ఫ్యాన్స్ ఆమె మీద విరుచుకుపడ్డారు. ఒక్క సిద్ధార్థ్నే కాదు మొత్తం వెయిటర్స్నే ఆమె అవమానించిందంటూ. అదితి మిత్తల్ బ్రాండ్ ఆఫ్ హ్యూమర్.. పర్సనల్ ఎక్స్పీరియెన్సెస్ అదితి మిత్తల్ను దేశంలోనే తొలి మహిళా స్టాండప్ కమెడియన్గా చెప్తారు. ఈమె రైటర్, యాక్టర్ కూడా. ఈ మూడింటిలో దేన్నయినా అవలీలగా చేసేస్తుంది. పుణెలో పుట్టి, పెరిగింది. కెనడా, అమెరికాల్లో చదువుకుంది. కొన్నాళ్లు న్యూయార్క్లో ఉద్యోగం చేసింది. అయితే మొదటి నుంచి హాస్యం అంటే ఇష్టం. అదంటే ఆమెకు ప్యాషన్ కూడా. అందుకే ఉద్యోగాన్ని వదిలిపెట్టి ముంబై వచ్చేసింది. అప్పటికీ స్టాండప్ కామెడీ రంగంలో మహిళలు ఎవరూ లేరు. పైగా అదితి ఎంచుకున్న టాపిక్స్ అన్నీ బోల్డ్ టాపిక్సే. సెక్స్.. బ్రాస్.. పీరియడ్స్ ఇలా అన్నీ మహిళలకు సంబంధించినవే. వాటి గురించి అమ్మాయిలు పెదవి విప్పితేనే సమాజం వాళ్ల మీద ‘బ్యాడ్ గర్ల్’ అని ముద్రవేసేంత నిషిద్ధమైన వాటిని తన కామెడీకి సబ్జెక్ట్స్గా తీసుకున్నది. దీంతో ఆమె కెరీర్ మొదట్లో కాస్త ఇబ్బందులనే ఎదుర్కోవాల్సి వచ్చింది. అయినా జంకలేదు. అలాగే ముందుకు సాగింది. తర్వాత్తర్వాత యూత్ ..ఆ జోక్స్ను ఓ ఎడ్యుకేషన్లా తీసుకోసాగింది. దాంతో ఆమె పాపులర్ అయింది. టీవీ చానెళ్లు ఆమెను ఇన్వైట్ చేయసాగాయి. ఆమె చేత కామెడీ షోస్ పెట్టించాయి. అలా అదితి స్టాండప్ కామెడీ దేశం దాటి యూకే, అమెరికాకూ చేరుకుంది. అమెరికన్, సౌత్ ఆఫ్రికన్ హాస్య దిగ్గజాలతో చేసిన అమెరికన్ డాక్యుమెంటరీ ‘స్టాండప్ ప్లానెట్’లో ఆమెకూ చోటు దక్కింది. అలా అంతర్జాతీయ ఖ్యాతినీ ఆర్జించింది. 2013లో లండన్లో బీబీసీ ఆధ్వర్యంలో జరిగిన 100 విమెన్ కాన్ఫరెన్స్కి ఆమెకూ ఆహ్వానం అందింది. సీఎన్ఎన్– ఐబీఎన్లోని ఓ రాజకీయ వ్యంగ్యాస్త్రపు షోలోనూ సైరస్ బ్రోచాతో కలసి నవ్వులు పూయించింది. ‘విమెన్ ఇన్ లేబర్’ అనే పాడ్కాస్ట్ ద్వారా ఉద్యోగినుల సమస్యలనూ చర్చించింది. నెట్ఫ్లిక్స్‘థింగ్స్ దే వుడ్ నాట్ లెట్ మి సే’, ‘గర్ల్ మీట్స్ మైక్’ వంటి షోలతో తన ప్రత్యేకతను చాటింది. ‘బ్యాడ్ గర్ల్స్’ అనే వెబ్ సిరీస్లోనూ నటించింది. కామెడీ షోలే కాక లండన్లోని సోహో థియేటర్లో కామెడీ వర్క్షాప్స్నూ నిర్వహిస్తోంది. ఆమె చేత హాస్య పాఠాలు చెప్పించుకున్న ఆమె స్టుడెంట్స్లో కొందరు ఆమెతో సరిసమంగా ఇంకొందరు ఆమెకన్నా గొప్ప కమెడియన్స్గా రాణిస్తున్నారు. ఇది తనకెంతో గర్వకారణం అంటుంది అదితి. ఇవన్నీ కాక ఆమె ‘గ్రేజియా మెన్’, ‘డీఎన్ఏ’, ‘ఫస్ట్పోస్ట్.కామ్’ వంటి వాటికి ఆర్టికల్స్ రాస్తుంది. అదితి గురించి ఇంకో విషయం చెప్పాలి ఇక్కడ.. ఘంటా అవార్డ్స్, ఫిల్మ్ఫెయిల్ అవార్డ్స్ వంటి రెండు పురస్కార ప్రదాన షోలకు ఆమె వ్యవస్థాపక సభ్యురాలు. వ్యంగ్యం పొట్లంలో తెలివైన జోక్స్ను ప్యాక్ చేసి ఆడియెన్స్కు అందిస్తుందని హాస్యలోకంలో కితాబునందుకుంటున్న అదితి సోషల్ మీడియాలోనూ అంతే ఫేమస్. లక్షల్లో సబ్స్క్రైబర్స్, ఫ్యాన్స్ ఉన్నారు. ‘ఏదో సరదాకి చేస్తున్న పని.. నా కెరీర్గా స్థిరపడుతుందని ఎప్పుడూ అనుకోలేదు. ఈ విషయంలో నేను నిజంగానే అదృష్టవంతురాలిని. ఎందుకంటే ఇష్టమైన పని చేసే చాన్స్ దొరికింది. అందులో సక్సెస్ కూడా దక్కింది’అంటుంది అదితి మిత్తల్. కాంట్రావర్సీ 2018లో అదితి ‘మీ టూ’ కింద ఆరోపణను ఎదుర్కొంది. కనీజ్ సుర్కా అనే మరో స్టాండప్ కమెడియన్ .. తన పెదవుల మీద అదితి బలవంతంగా ముద్దుపెట్టుకుందని ఆరోపించింది. దీనికి తర్వాత అదితి క్షమాపణ చెప్పుకుంది. ‘స్టేజ్ మీద ఒక షోలో భాగంగా.. జోక్గా పెక్ ఇచ్చాను అంతే. దానికి కనీజ్ హర్ట్ అయ్యుంటే అపాలజీ కోరుతున్నాను’ అంటూ! సుముఖి సురేశ్ బ్రాండ్ ఆఫ్ హ్యూమర్.. ఆల్రౌండర్ బహతీ నాక్, పుష్పవల్లి అనే కామెడీ వెబ్ సిరీస్తో సుముఖి వెల్నోన్. ఆమె ఒక్క స్టాండప్ కమేడియనే కాదు.. రైటర్, యాక్టర్, ప్రొడ్యూసర్.. ఔత్సాహిక స్టాండప్ కమేడియన్లను తీర్చిదిద్దుతున్న మెంటర్ కూడా. నాగ్పూర్లో పుట్టి పెరిగిన తమిళియన్ సుముఖి. ఫుడ్ సైన్స్ గ్రాడ్యుయేట్. హ్యూమర్ అంటే ఇష్టం. దాన్ని కెరీర్గా మొదలుపెట్టే కంటే ముందు బెంగళూరులోని ఓ చిన్నపిల్లల గ్రంథాలయంలో లైబ్రేరియన్గా పనిచేసింది. తర్వాత ఒక ఫుడ్ ల్యాబొరేటరీలోనూ పనిచేసింది. ఇంకొన్నాళ్లు ఓ ప్రైవేట్ కంపెనీలో బిజినెస్ డెవలప్మెంట్ మేనేజర్గానూ చేసింది. హాస్యం మీద ఆమెకున్న ప్రేమ ఆ ఉద్యోగాలను సవ్యంగా చేయనివ్వలేదు. దాంతో కామెడీ షోలు చేసే ‘ది ఇంప్రూవ్’ అనే గ్రూప్లో చేరింది. దాదాపు వందకు పైగా షోస్ చేసింది. అలా ఆమె స్టాండప్ కమెడియన్గా దేశమంతా పరిచయమైంది. ఆమె కామెడీలోనే కాదు జీవితంలోనూ ఆల్రౌండర్గా ఉండాలని కోరుకుంటుంది. అందుకే ఇటు రైటర్గా.. అటు యాక్టర్గా.. ప్రొడ్యుసర్గా.. కంటెంట్ క్రియేటర్గా.. ఓహ్.. ఎన్ని వీలైతే అన్ని పనులు చేయాలని ఉత్సాహపడుతుంది. అందులో సక్సెస్ అవుతుంది కూడా. ఈ మధ్యే ‘మోటర్మౌత్’ పేరుతో కంటెంట్ క్రియేట్ చేసే సంస్థనూ స్థాపించింది. మూడు బాలీవుడ్ సినిమాలకు రచనా సహకారమూ అందించింది. అమెజాన్ ప్రైమ్ ‘కామికిస్తాన్’ సీజన్ 1లో కో–హోస్ట్గా, థర్డ్ సీజన్లో జడ్జ్గా వ్యవహరించింది. ఇలాంటి వెబ్ షోస్ అన్నీ ఆమె ఫేమ్ని పెంచేవి అనే కంటే ఆమె ఫేమ్ని ఉపయోగించుకునేవి అని చెప్పొచ్చు. దేని మీదైనా కామెడీని పండించే సుముఖికి ఆమె కంఠ స్వరం ప్లస్ పాయింట్. నటనారంగంలోనూ తన సత్తా చాటాలనుకుంటోంది. ముఖ్యంగా కరణ్ జోహార్, విక్రమాదిత్య మోత్వాని దర్శకత్వంలో నటించాలని కోరుకుంటోంది. ‘ఎక్కడైనా ఆల్రౌండర్గా పేరు తెచ్చుకోవాలన్నదే నా లక్ష్యం. అయితే సినిమాల్లో నాకు రైటింగ్ శాఖలో వచ్చినన్ని అవకాశాలు స్క్రీన్ మీద రావడం లేదు. అయినా ఆ అవకాశాల అంతు చూసేదాకా వదిలిపెట్టను. ఇటు కమెడియన్గా.. రైటర్గా.. కంటెంట్ క్రియేటర్గా.. నా పని నేను చేసుకుంటూనే వెళ్తా. అఫ్కోర్స్ వీటన్నిటికన్నా కూడా నా ఫస్ట్ ప్రయారిటీ స్టాండప్ కామెడీయే. ఈ రంగంలో ఉన్న జెండర్ బయాస్ను రూపుమాపడంలో నా వంతు ప్రయత్నం నేను చేయాలి కదా! నవరసాల్లో ఇదొకటి. దీనికి జెండర్ ఏమిటి? ఆడవాళ్లు అద్భుతంగా హాస్యాన్ని పండిచగలరని నేనే కాదు నా కన్నా ముందే ఈ రంగంలోకి వచ్చిన వారంతా నిరూపించారు. వాళ్లే నాకు స్ఫూర్తి. అలా నేనూ ఇంకొంతమందికి స్ఫూర్తిగా నిలవాలి. ఈ రంగంలోకి చిన్న చిన్న టౌన్స్ నుంచి అబ్బాయిలు వస్తున్నంతగా అమ్మాయిలు రావడం లేదు. అలాంటి వాళ్లకు నేనే ఒక ఎగ్జాంపుల్గా నిలబడాలనుకుంటున్నా. నేనూ నాగ్పూర్ అనే టౌన్ నుంచే కదా వచ్చింది!’ అంటుంది సుముఖి సురేశ్. కనీజ్ సుర్కా బ్రాండ్ ఆఫ్ హ్యూమర్.. సెల్ఫ్ కంటైన్డ్ సౌత్ ఆఫ్రికాలో పుట్టిపెరిగిన గుజరాతీ. లా అండ్ సైకాలజీ గ్రాడ్యుయేట్. హైస్కూల్లో ఉన్నప్పుడు కనీజ్ వాళ్లకు ‘డ్రామా’ ఒక సబ్జెక్ట్ అట. అందులో తనెప్పుడూ కామెడీ రోల్స్నే తీసుకునేదట. మిగిలిన ముఖ్యపాత్రల కన్నా తనకే ఎక్కువ గుర్తింపు, కాంప్లిమెంట్స్ వచ్చేవట. అప్పుడే తనకు అర్థమైందట తన ఫ్యూచర్ హాస్యంతో ముడిపడి ఉందని. అందుకే డిగ్రీ పూర్తయి ఇండియాకు రాగానే ఒక కామెడీ ట్రూప్లో చేరింది. అందులో ట్రెయిన్ అవుతూనే సీఎన్ఎన్– ఐబీఎన్లో ప్రసారమైన పొలిటికల్ సెటైర్ షో ‘దిస్ వీక్ దట్ వజ్నాట్ (This Week That Wasn't)’లో సైరస్ బ్రోచాతో కలసి కామెడీ చేసింది. ఆ షోతో ఆమెకు దేశవ్యాప్త గుర్తింపు వచ్చింది. తాను ఈ రంగంలోకి వచ్చిన కొత్తలో మహిళలకు సంబంధించిన సమస్యల మీద జోక్స్ వేస్తే ఆడియెన్స్ గంభీరమైపోయేవారట. ఆ పరిస్థితులను మార్చడానికి మహిళా స్టాండప్ కమెడియన్స్ చాలానే సవాళ్లను ఎదుర్కోవల్సి వచ్చింది అంటుంది కనీజ్. ఆమె కేవలం స్టాండప్ కమేడియనే కాదు.. టెలివిజన్ షో క్రియేటర్, ప్రొడ్యూసర్, హాస్య నటి, ఇంప్రొవైజర్! నెట్ఫ్లిక్స్ స్పెషల్స్ ‘లేడీస్ అప్’, ‘కామెడీ ప్రీమియమ్ లీగ్’, అమెజాన్ ప్రైమ్ వీడియోస్ స్పెషల్స్ ‘సమ్థింగ్ ఫ్రమ్ నథింగ్’, ‘ఇంప్రూవ్ ఆల్ స్టార్స్ గేమ్స్ నైట్’ వంటి షోలన్నీ ఆమె సృష్టే. ఆమె పెర్ఫార్మ్ చేసినవే. అంతేకాదు అమెజాన్ప్రైమ్ వీడియోస్ ‘కామికిస్తాన్’ రెండు సీజన్లకు ఆమె జడ్జిగా వ్యవహరించింది. చెప్పుకుంటూ పోతే ఇటు టీవీ.. అటు ఓటీటీ.. సోషల్ మీడియాలో కనీజ్ చేసిన.. చేస్తున్న షోలు చాలా ఉన్నాయి. ఆ అన్ని ప్లాట్ఫామ్స్లో అభిమానులూ అంతేమంది ఉన్నారు. అయినా రాశి కన్నా వాసే ముఖ్యమని నమ్ముతుంది ఆమె. అందుకే యాభై నిమిషాల షోకి దాదాపు ఆరునెలలు వెచ్చిస్తుందట. హాస్యంలో టైమింగే ఎసెట్గా ఉన్న కనీజ్ సక్సెస్, ఫెయిల్యూర్ రెండిటినీ సమంగా తీసుకుంటానంటుంది. ‘విన్న జోక్ నిన్ను హాయిగా నవ్విస్తే అది మంచి జోక్. నవ్వించకుండా నిన్ను ఇబ్బంది పెట్టింది అంటే అది కచ్చితంగా జోక్ కాదు. నిన్ను హాయిగా నవ్విస్తూనే కొంత ఆలోచింప చేసింది అంటే అది అద్భుతమైన జోక్. హాస్యంతో పాటు దానికతీతమైనదేదో ఆడియెన్స్కివ్వాలి’ అంటుంది కనీజ్. ‘నేను ఈ రంగంలోకి వచ్చిన కొత్తలోకి.. ఇప్పటికీ చాలా మార్పు వచ్చింది. చాలా మంది అమ్మాయిలు వస్తున్నారు. అయినా ఇంకా రావాలి. ఆ ఉత్సాహం ఉన్నవాళ్లకు నేను చెప్పేది ఒకటే.. అనుకున్నది చేసేయండి.. మీనమేషాలు లెక్కపెడుతూ కూర్చోవద్దు. హండ్రెడ్ పర్సెంట్ నవ్వులను పండించలేం. కాని హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్స్ పెట్టాలి. హండ్రెడ్ పర్సెంట్ పెర్ఫార్మెన్స్ ఇవ్వాలి. భయాన్ని వదిలేయాలి. ధైర్యంగా మైక్ పట్టుకోవాలి. కాన్ఫిడెంట్గా వినిపించాలి. అంతే మ్యాజిక్ జరుగుతుంది’ అంటూ ఔత్సాహికులకు సూచనలిస్తుంది కనీజ్ సుర్కా. రాధిక వాజ్ బ్రాండ్ ఆఫ్ హ్యూమర్ .. వెరీ బోల్డ్ రాధిక వాజ్ డేర్ డెవిల్. సంచలనాల పుట్ట. ఆడవాళ్ల నెలసరి నుంచి వాళ్ల భద్రత మొదలు వర్జినిటీ, పెళ్లి, వయసు ముదరడం.. వివాదాస్పదమైన ఆచారవ్యవహారాలు, సెక్స్ వరకు అన్ని విషయాలను కామెడీకి కన్సిడర్ చేస్తుంది. స్టాండప్ కమేడియన్తోపాటు ఆమె యాక్ట్రెస్, రైటర్ కూడా. ఇప్పుడు ఆమె వయసు 49. దాదాపు ఎనిమిదేళ్ల కిందట.. ఒక యాడ్ క్యాంపెయిన్లో భాగంగా ఆమె న్యూడ్గా రెండు నిమిషాల నిడివిగల స్టాండప్ కామెడీ చేసింది. అప్పడూ ఇప్పుడూ అది సంచలనమే. కొంతమంది విమర్శించారు. ఇంకొంతమంది బ్రేవ్ యాక్ట్గా అభివర్ణించారు. రాధిక రెండిటినీ పట్టించుకోలేదు. ‘మనమేం చేయాలో.. అది చేస్తాం. దాని మీద ఎవరికి తోచిన విధంగా వాళ్లు స్పందిస్తారు’ అని మాత్రం కామెంట్ చేసింది అంతే. స్టాండప్ కామెడీలో ఆమెను ఫెమినిస్ట్ స్టాండప్ కమెడియన్గా చెప్తుంటారు. కానీ ఆ మాటను రాధిక ఖండిస్తుంది. ‘అమ్మాయి అంటే ఇలా ఉండాలి.. ఇలా ఉండకూడదు అనే ఆంక్షల మధ్యేమీ నేను పెరగలేదు. నాకు సిగరెట్, మందు తాగాలనిపిస్తే తాగుతాను. అంతే తప్ప మగవాళ్లతో సమంగా నేనెందుకు తాగొద్దు అనే భావనతో అయితే కాదు’ అంటుంది. ‘ఇప్పుడంటే సోషల్ మీడియా వచ్చి మహిళలకు సంబంధించిన చాలా విషయాల మీద చర్చిస్తున్నారు కానీ ఇదివరకైతే వాటి ఊసెత్తితేనే వాళ్లను బరితెగించిన వాళ్లుగా ముద్ర వేసేవారు. ఇప్పటికీ ఇంకా అలాంటి భావజాలం ఉంది. అలాంటి విషయాల మీద.. సమస్యల మీద విస్తృతంగా చర్చ జరగాలి. అందుకే వాటికి నేను నా స్టాండప్ కామెడీలో స్పేస్ ఇస్తున్నాను’ అని చెప్తుంది. ఆమె కొన్నాళ్లు అమెరికాలో పనిచేసింది. అక్కడే ఇంప్రొవైజేషనల్ కామెడీలో ప్రయోగాలు చేయడం ప్రారంభించింది. ఆ క్రమంలోనే స్టాండప్ కామెడీ ద్వారా స్త్రీల సమస్యలను.. పురుషాధిపత్య ధోరణిని ప్రేక్షకుల ముందుకు తెచ్చి వాళ్లలో ఆలోచనలను రేకెత్తించవచ్చుననీ గ్రహించింది. ఇక్కడికి రాగానే అమల్లో పెట్టింది. రాధిక వాజ్ తన చిన్నప్పటి సంఘటనలు, జ్ఞాపకాలతో ఓ పుస్తకం కూడా రాసింది ‘అన్లాడ్లీలైక్’ పేరుతో. అదీ సంచలనమే అయింది. ‘కామెడీ అనేది జీవితానుభవం నుంచి పుట్టాలి. ఆడ.. మగ ఏ కమెడియన్ అయినా సరే ఆ వాస్తవ కథానాలనే హాస్యంగా పండించాలి’ అని చెప్తుంది రాధిక వాజ్. -
డబ్బు, గుర్తింపు ఉన్నా ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా: కమెడియన్
నటించడం సులువేమో కానీ నవ్వించడం మాత్రం చాలా కష్టం. ఈ విషయాన్ని అనేక సందర్భాల్లో నటులే ఒప్పుకున్నారు. అయితే పైకి నవ్వుతూ కనిపించినంతమాత్రాన వారి జీవితాల్లో ఏ కష్టాలూ లేవనుకుంటే పొరపాటే! లోపల ఎన్ని బాధలున్నా బయటకు మాత్రం చిరునవ్వుతోనే దర్శనమిస్తారు. తాజాగా ప్రముఖ కమెడియన్, నటుడు కపిల్ శర్మ ఒకానొక దశలో మానసిక క్షోభతో ఆత్మహత్య చేసుకోవాలనుకున్న విషయాన్ని బయటపెట్టాడు. వివరాల్లోకి వెళితే.. నందితా దాస్ 'జ్విగాటో' సినిమాలో కపిల్ ముఖ్యపాత్రలో నటించాడు. ఈ సినిమా మార్చి 17న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రమోషన్లలో తాను డిప్రెషన్లోకి వెళ్లిన విషయాన్ని వెల్లడించాడు. 'ఒక సెలబ్రిటీగా కోట్లాది మందికి నేను తెలుసు.. ఎందుకంటే నేను వారికి వినోదాన్ని పంచుతాను. కానీ ఇంటి లోపల అడుగుపెట్టాక ఒంటరివాడిని అనిపించేది. సముద్రం ఒడ్డుకు వెళ్లి అలల అందాన్ని చూడాలనుకున్నా అది నాకు సాధ్యపడదు. రెండు గదుల రూములో ఒక్కడినే ఉండేవాడిని. సాయంత్రానికే అంతా చీకటయ్యేది. అప్పుడు నేనెంత విచారంగా ఫీలయ్యానో మాటల్లో చెప్పడం చాలా కష్టం. కొన్నిసార్లైతే ఆత్మహత్య చేసుకోవాలనిపించేది. నా గుండెలోని బాధను చెప్పుకుని మనసు తేలిక చేసుకోవడానికి నాకంటూ ఎవరూ లేరని భావించాను. మానసికంగా కుంగిపోయాను. అలా జరగడం అదే మొదటిసారని నేను చెప్పను. నా బాల్యంలోనూ నేను ఒంటరితనాన్ని ఫీలయ్యాను. కానీ ఎవరూ దాన్ని గుర్తించలేదు. తర్వాత బాగానే పేరు తెచ్చుకున్నాను, డబ్బులు సంపాదిస్తున్నాను. కానీ నాకంటూ ఎవరూ లేరు అన్న బాధ నన్ను వెంటాడేది. ఒక ఆర్టిస్టు అమాయకుడిగా ఉన్నాడంటే అతడు పిచ్చోడేం కాదు. కానీ నా చుట్టూ జరుగుతున్న విషయాలను గమనించేకొద్దీ నా కళ్లు తెరుచుకున్నాయి. జీవితంలో సుఖదుఃఖాలు ఏవీ శాశ్వతం కాదని తెలుసుకున్నాను' అని చెప్పుకొచ్చాడు కపిల్ శర్మ. -
జూనియర్ ఎన్టీఆర్ నా బాడీలో ఓ పార్ట్: కమెడియన్ రఘు
కమెడియన్ రఘు కారుమంచి.. తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. రోలర్ రఘుగా అభిమానుల్లో గుర్తింపు పొందారు. నటనకు కొద్దిగా బ్రేక్ ఇచ్చిన ఆయన అదుర్స్, లక్ష్మి, కిక్, నాయక్, ఊసరవెల్లి వంటి చిత్రాల్లో తనదైన కామెడీతో అలరించారు. మంచి కమెడియన్గా మంచి పేరు తెచ్చుకున్న రఘు దాదాపు 150 చిత్రాల్లో తనదైన నటనతో మెప్పించారు. ఇండస్ట్రీలో దాదాపు 20 ఏళ్ల క్రితమే జూనియర్ ఎన్టీఆర్ ఆది సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు. ఇటీవల ఓ ఇంటర్వ్యూకు హాజరైన రఘు జూనియర్ ఎన్టీఆర్పై ఆసక్తికరవ్యాఖ్యలు చేశారు. రఘు మాట్లాడుతూ 'నా కెరీర్ ఇంతవరకు రావడానికి కారణం రాజీవ్ కనకాల. రాజీవ్ కనకాల లాంటి గొప్ప వ్యక్తి దొరకడం గొప్ప విషయం. జూనియర్ ఎన్టీఆర్ కూడా అంతే. వారిద్దరంటే నాకు చాలా ఇష్టం. ఎన్టీఆర్ ఏది చేయమన్నా నేను సిద్ధం. ఆయన కోసం ఏం చేయడానికైనా వెనకాడను. నా బాడీలో ఆయనొక పార్ట్గా మిగిలిపోయారు. ఆయన నన్నెప్పుడు పెద్దన్న అని పిలిచేవారు. మేం ఎప్పుడు కలవలేదు అనుకుంటారు. మేం కలిశామని పబ్లిక్కు ఎందుకు తెలియాలి. ప్రస్తుతం నా జీవితంలో చాలా ప్రశాంతంగా ఉన్నా. రామ్ చరణ్, అల్లు అర్జున్, ప్రభాస్, వెంకటేశ్తో సినిమాలు చేశా. తారకరత్న మరణం నన్ను తీవ్రంగా కలిచివేసింది. పిల్లలంటే ఆయనకు ప్రాణం. నిషిక అప్పుడప్పుడు సెట్కు కూడా వచ్చేది. నాకు ఎలాంటి ఆస్తు లేవు. ఉన్నవే పోగొట్టుకున్నా. కానీ ఇప్పుడు సంపాదించుకున్నా. లైఫ్ అంటే ఔటర్ రింగ్ రోడ్డు కాదు. సిటీ రోడ్లు. అక్కడక్కడ స్పీడ్ బ్రేకర్లు ఉంటాయని తెలుసుకున్నా. నేను ఇంతవరకు సుకుమార్, త్రివిక్రమ్, రాజమౌళి దగ్గర పని చేయలేదు. ఈ ఏడాది కలిస్తోందేమో వేచి చూడాలి.' అని అన్నారు. కాగా.. ప్రముఖ కామెడీ షో జబర్దస్త్లో కామెడీ స్కిట్స్ చేయడమే కాదు టీం లీడర్గా వ్యవహరించాడు. అనంతరం వ్యక్తిగత కారణాలతో బుల్లితెరకు సైతం గుడ్బై చెప్పేశారు రఘు. ఆ తర్వాత సినీ ఇండస్ట్రీ నుంచి బయటకు వచ్చేశారు. ప్రస్తుతం సాధారణ వ్యక్తిగా జీవితం సాగిస్తున్న రఘు లాక్డౌన్లో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. అయితే తక్కువ కాలంలోనే ఓ లగ్జరీ ఇంటిని నిర్మించుకున్నారు.