details
-
ఐఐటీల ప్లేస్మెంట్స్.. వివరాలు గప్ చుప్
సాక్షి, ఏపీ సెంట్రల్ డెస్క్: దేశంలోనే ప్రతిష్టాత్మక విద్యా సంస్థలు.. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)(IIT)లు. ఇంజనీరింగ్ విద్య అనగానే విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు మొదట గుర్తుకొచ్చేవి ఇవే. జేఈఈ అడ్వాన్స్డ్లో విజయం సాధించి ఐఐటీలో సీటు సాధిస్తే జాక్పాట్ కొట్టినట్టేనని విద్యార్థులు భావిస్తారు. బహుళజాతి సంస్థల్లో మంచి ఉద్యోగాలు పొందాలన్నా, అత్యుత్తమ వార్షిక వేతన ప్యాకేజీలు దక్కాలన్నా అది ఐఐటీలతో మాత్రమే సాధ్యమనే అభిప్రాయం సర్వత్రా ఉంది.ఈ నేపథ్యంలో ఏటా జరిగే ఆయా ఐఐటీల క్యాంపస్ ప్లేస్మెంట్స్(Placements)పై అంతా ఆసక్తి కనబరుస్తుంటారు. కేవలం ఇంజనీరింగ్ ఔత్సాహికులే కాకుండా మిగతా వారు కూడా ఏ స్థాయిలో ఐఐటీల విద్యార్థులు వేతన ప్యాకేజీలు దక్కించుకున్నారో తెలుసుకోవడానికి ఆసక్తి చూపుతారు. అయితే ఈసారి ఎక్కువ ఐఐటీలు క్యాంపస్ ప్లేస్మెంట్స్ విషయంలో గోప్యత పాటిస్తుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. వివరాలు వెల్లడించింది కొన్ని ఐఐటీలే ఈ ఏడాది క్యాంపస్ ప్లేస్మెంట్స్కు సంబంధించి గతేడాది డిసెంబర్ 1నే ఆయా ఐఐటీల్లో ఆన్ క్యాంపస్ ప్రక్రియ ప్రారంభమైంది. అయితే విద్యార్థులకు ఏ స్థాయిలో వేతన ప్యాకేజీలు లభించాయో ఇప్పటివరకు కొన్ని ఐఐటీలు మాత్రమే బయటకు సమాచారాన్ని వెల్లడించాయి. ఐఐటీ కాన్పూర్, ఐఐటీ రూరీ్క, ఐఐటీ ఖరగ్పూర్, ఐఐటీ–బీహెచ్యూ ఈ కోవలో ఉన్నాయి. ఇవి కాకుండా మిగతా ఐఐటీలన్నీ నిశ్శబ్దాన్ని పాటిస్తున్నాయి. కారణాలు ఇవేనా? క్యాంపస్ ప్లేస్మెంట్స్ గురించి బయటకు సమాచారాన్ని వెల్లడించకపోవడానికి కారణం ఉందని ఐఐటీల ప్రొఫెసర్లు చెబుతున్నారు. విద్యార్థులపై ఒత్తిడిని తగ్గించడానికి, వారి సంక్షేమం కోసమే తాము ప్లేస్మెంట్స్ సమాచారాన్ని వెల్లడించడం లేదని అంటున్నారు. వేతన ప్యాకేజీల గురించి ఒకరితో మరొకరు పోల్చుకోవడం వల్ల విద్యార్థుల మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం çపడుతోందని.. అందుకే ఇలా చేస్తున్నామని పేర్కొంటున్నారు. ఈ మేరకు ఇటీవల జరిగిన అన్న ఐఐటీల ప్లేస్మెంట్స్ కమిటీ (ఏఐపీసీ) సమావేశంలో ఉద్యోగ నియామక వివరాలు, వేతన ప్యాకేజీల వివరాలు వెల్లడించవద్దని ప్రాథమికంగా ఒక నిర్ణయం తీసుకున్నామని చెబుతున్నాయి. వారం లేదా పక్షం రోజులకోసారి.. సాధారణంగా దేశంలో ఉన్న మొత్తం 23 ఐఐటీల్లో రెండు దశల్లో క్యాంపస్ ప్లేస్మెంట్లు ఉంటాయి. డిసెంబర్లో మొదటి దశ, జనవరి – జూన్ మధ్య రెండో దశ నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో క్యాంపస్ ప్లేస్మెంట్స్లో ఉద్యోగాలు సాధించినవారి సమాచారాన్ని రోజువారీ కాకుండా వారానికోసారి లేదా 15 రోజులకోసారి విడుదల చేయాలని ఐఐటీల ప్లేస్మెంట్స్ కమిటీల సమావేశంలో ఆయా సంస్థలు ప్రతిపాదించాయి. ప్లేస్మెంట్స్ గురించి మీడియాలో వచ్చే వార్తలు విద్యార్థులపై ఒత్తిడి పెంచకుండా, వారి మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీయకుండా చూడాలన్నదే తమ ఏఐపీసీ కన్వీనర్ ప్రొఫెసర్ కౌశిక్ పాల్ తెలిపారు. కొత్త ఐఐటీల ప్లేస్మెంట్స్ నివేదికలు అప్పుడే.. చాలా ఐఐటీలు క్యాంపస్ ప్లేస్మెంట్స్ సమయంలో విద్యార్థులు ఉద్యోగాలు సాధించిన కంపెనీల పేర్లు, అత్యధిక, మధ్యస్థ ప్యాకేజీలు, ఆఫర్ను పొందిన మొత్తం విద్యార్థుల సంఖ్య, వాటిలో అంతర్జాతీయ ఆఫర్ల సంఖ్య వంటివాటి గురించి రోజూ సమాచారమిచ్చేవి. అయితే ఐఐటీ హైదరాబాద్, ఐఐటీ ధార్వాడ్, మరికొన్ని కొత్త ఐఐటీలు 2024–25 సెషన్లో ప్లేస్మెంట్ ప్రక్రియ ముగిసిన తర్వాత ఆగస్టు, సెప్టెంబర్ల్లో ఒకేసారి తుది ప్లేస్మెంట్ నివేదికను విడుదల చేయాలని నిర్ణయించుకున్నాయి. ఐఐటీల నిర్ణయానికి మద్దతు విద్యార్థుల క్యాంపస్ ప్లేస్మెంట్స్, అత్యధిక వార్షిక వేతన ప్యాకేజీల వివరాలను బహిర్గతం చేయకూడదనే నిర్ణయానికి పలువురు ఐఐటీ ప్రొఫెసర్లు సైతం మద్దతు తెలుపుతున్నారు. ప్లేస్మెంట్లు, మంచి ప్యాకేజీలు పొందిన విద్యార్థుల వివరాలను బహిరంగంగా వెల్లడిస్తే ఇవి.. ప్లేస్మెంట్ దక్కనివారు, మంచి పే ప్యాకేజీలు పొందనివారిపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని ఐఐటీ ధన్బాద్లో కెరీర్ డెవలప్మెంట్ సెంటర్ హెడ్ ప్రొఫెసర్ సౌమ్యా సింగ్ అన్నారు. విద్యార్థులు ఏమంటున్నారంటే.. మొదటి ప్రయత్నంలో మంచి ప్లేస్మెంట్ దక్కకపోతే నిరుత్సాహం చెందాల్సిన అవసరంలేదని ఐఐటీ మద్రాస్లో సివిల్ ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ విద్యార్థి రిత్విక్రెడ్డి అభిప్రాయపడ్డారు. ఐఐటీయన్లపై మీడియా నివేదికలు ఒత్తిడి పెంచలేవన్నాడు. ఆందోళన చెందకుండా ఇతర పరీక్షలు, ఇంటర్వ్యూలపై దృష్టి సారిస్తానని స్పష్టం చేశారు.ప్రొఫెసర్లు, విద్యార్థుల మద్దతు.. ఏది ఏమైనప్పటికీ విద్యార్థుల ప్లేస్మెంట్లు, ప్యాకేజీల గురించి ఏ ఐఐటీ మీడియాకు వెల్లడించకూడదని ఏఐపీసీ అధికారికంగా నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అన్ని ఐఐటీల ప్రతినిధులకు ఈ విషయాన్ని తెలియజేసింది. ఈ నిర్ణయానికి ప్రొఫెసర్లు, విద్యార్థులు కూడా మద్దతు తెలిపారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో ఐఐటీల నిర్ణయం ఆందోళన తగ్గిస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్లేస్మెంట్లు, ప్యాకేజీల వివరాలు మీడియాలో రాకపోవడం మంచిదని ఐఐటీ ఢిల్లీ విద్యార్థి ఒకరు అభిప్రాయపడ్డారు.లేదంటే తమ ఇంటి ఇరుగుపొరుగువారు తన గురించి తన తల్లిదండ్రులను ఆరా తీస్తారని.. ఇది వారిపై అనవసర ఆందోళన పెంచుతుందన్నారు. అంతేకాకుండా ఇతర విద్యార్థులతో తనను పోల్చుతారని.. ఇది కూడా తన తల్లిదండ్రులను ఒత్తిడిలోకి నెడుతుందన్నారు. ఈ నేపథ్యంలో ప్లేస్మెంట్లు, ప్యాకేజీ వివరాలను బహిరంగంగా వెల్లడించవద్దని ఐఐటీలు మంచి నిర్ణయమే తీసుకున్నాయని అభిప్రాయం వ్యక్తం చేశారు. -
Tooth Brush టూత్ బ్రష్.. దీని కథ తెలుసా?
రోజూ పొద్దున లేచి, పళ్లు తోమిన తర్వాతే ఏదైనా తినాలి. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. కొందరు పళ్లు తోమడానికి బద్దకిస్తారు. తోమకుండానే ఉండి΄ోతారు. దీనివల్ల పళ్లు చెడిపోయి, దుర్వాసన వస్తుంది. కాబట్టి పళ్లు తోమడం తప్పనిసరి. పళ్లు తోమేందుకు బ్రష్ వాడతాం కదా, ఆ బ్రష్ చరిత్రేమిటో తెలుసా?పళ్లు తోమేందుకు బ్రష్ కనిపెట్టకముందే ఆదిమానవులు పళ్లు శుభ్రం చేసుకునేందుకు రకరకాల వస్తువులు వాడేవారు. చెట్టు బెరడు, పక్షి రెక్కలు, జంతువుల ఎముకలతో పళ్లను శుభ్రం చేసుకునేవారు. ఆ తర్వాత కాలంలో పళ్లను తోమేందుకు చెట్ల కొమ్మల్ని వాడేవారు. అందులోనూ వేపపుల్లల్ని ఎక్కువగా వాడేవారు. వాటిని నమలుతూ పళ్లను శుభ్రంగా ఉంచుకునేవారు. ఒక వైపు తోమాక, మరో వైపుతో నాలుక శుభ్రం చేసుకునేవారు. ప్రపంచంలో అనేకచోట్ల చెట్ల కొమ్మల్నే పళ్లు శుభ్రం చేసుకునేందుకు వాడినట్లు ఆధారాలున్నాయి. అయితే పుల్లలు వాడకుంటూ బొగ్గు, ముగ్గు, బూడిద, ఇతర పదార్థాలను ఉపయోగించి చేత్తోనే పళ్లు తోమే అలవాటు కూడా చాలామందికి ఉండేది. ఇదీ చదవండి: టూత్ బ్రష్ మారుస్తున్నారా?ఎన్నాళ్లకు మార్చాలి? లేదంటే...!ఆ తర్వాత తొలిసారి చైనాలో బ్రష్ కనిపెట్టారు. ఒక చేత్తో బ్రష్ చివర పట్టుకుంటే మరో వైపు ఉన్న బ్రిజిల్స్ పళ్ల మీద మదువుగా రుద్దుతూ శుభ్రం చేసేవి. ఆ బ్రిజిల్స్ని రకరకాల వస్తువులతో తయారుచేసేవారు. అయితే ఇది కొందరికే అందుబాటులో ఉండేది.1780లో యూకేలో మొదటిసారి విలియం అడ్డీస్ అనే వ్యక్తి జైల్లో ఉండగా, పళ్లను శుభ్రం చేసుకునేందుకు సొంతంగా బ్రష్ తయారుచేసుకున్నాడు. ఆయన బయటకు వచ్చాక వాటిని తయారు చేసి అమ్మడం మొదలుపెట్టాడు. అలా బ్రష్లు అందరికీ అందుబాటులోకి వచ్చాయి. ఆయన మరణించాక ఆయన కొడుకు ఆ పనిని కొనసాగించాడు. ఆ తర్వాత అనేక కంపెనీలు బ్రష్ల తయారీ మొదలుపెట్టాయి. ఇప్పుడు రకరకాల రూపాల్లో బ్రష్లు వస్తున్నాయి. చూశారా! ఇవాళ మనం వాడే బ్రష్ల వెనుక ఇంత చరిత్ర ఉంది. -
ఇతడేమో టాలీవుడ్ విలన్.. భార్య విదేశీ సింగర్.. గుర్తుపట్టారా? (ఫొటోలు)
-
ట్రెండింగ్లో సాక్షి మాలిక్: ఆమె భర్త ఎవరో తెలుసా? అతడి బ్యాగ్రౌండ్ ఇదే! (ఫొటోలు)
-
అనుమానమొస్తే వెంటనే చెప్పండి: జేకే పోలీసులు
జమ్ముకశ్మీర్లో ఉగ్రదాడులు పెరుగుతున్న నేపద్యంలో పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు. భద్రతా బలగాలు కూడా రాష్ట్రంలో అణువణువునా తనిఖీలు చేపడుతున్నాయి. తాజాగా జమ్ముకశ్మీర్ పోలీసులు రాష్ట్రంలోని ప్రజలకు పలు సూచనలు చేశారు.ఉగ్రవాదులు తరచూ దాడులకు తెగబడుతున్న ప్రస్తుత తరుణంలో రాష్ట్రంలోని ప్రజలంతా మరింత అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. అలాగే ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులుగానీ, వస్తువు గానీ కనిపిస్తే వెంటనే తమకు తెలియజేయాలని కోరారు.అనుమానాస్పదుల ఎత్తు, వారు ధరించిన దుస్తులు, వారి దగ్గర ఏవైనా ఆయుధాలు కనిపిస్తే ఆ వివరాలు వెంటనే పోలీసులకు తెలియజేయాలని జమ్ము పోలీసు అధికారి అజయ్ శర్మ తెలిపారు. ఇటీవల కొందరు అనుమానాస్పద వ్యక్తులు స్థానికంగా ఉన్న ఓ బాలునికి కనిపించారని, ఈ విషయాన్ని ఆ బాలుడు సమీపంలోని సెక్యూరిటీ ఏజెన్సీకి తెలియజేశాడన్నారు. అయితే అది ఆ బాలుని ఊహ మాత్రమేనని, నాలుగు గంటలపాటు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టినా ఎవరి ఆచూకీ తెలియలేదన్నారు. -
ఒకప్పుడు చిన్నపాటి గదిలో.. ఇప్పుడు హీరోలకు ధీటుగా రూ.550 కోట్ల సంపద.. ఎవరో గుర్తుపట్టారా? (ఫొటోలు)
-
ప్రపంచాన్ని వణికిస్తున్న ఇరాన్ రాకెట్ ఫోర్స్?
ఒకప్పుడు ఇరాన్, ఇజ్రాయెల్ సత్సంబంధాలు కలిగిన దేశాలు. ఇప్పుడు దానికి విరుద్ధంగా ఇరు దేశాలు బద్ధశత్రువులుగా మారాయి. ఈనెల (ఏప్రిల్) ఒకటిన సిరియా రాయబార కార్యాలయంపై జరిగిన దాడిలో 13 మంది ఇరాన్ సైనికులు మరణించారు. ఈ దాడిపై స్పందించిన ఇరాన్.. ఇజ్రాయెల్ను నిందించింది. ఇజ్రాయెల్పై చర్య తీసుకోవాలని అంతర్జాతీయ సమాజాన్ని కోరింది. అయితే ఈ ఆరోపణలను ఇజ్రాయెల్ ఖండించింది. దీని తరువాత ఏప్రిల్ 13న ఇరాన్ తన క్షిపణులు, డ్రోన్లతో ఇజ్రాయెల్పై దాడి చేసింది. నిజానికి ఇరాన్ నుండి ఇజ్రాయెల్కు వేల కిలోమీటర్ల దూరం ఉంది. అయినా ఇరాన్ దాడులను విజయవంతంగా నిర్వహించింది. దీనిని చూస్తే ఇరాన్ రాకెట్ ఫోర్స్ ఎంతో శక్తివంతమైనదని అర్థమవుతుంది. ఇరాన్ వద్ద అత్యంత శక్తివంతమైన తొమ్మిది బాలిస్టిక్ క్షిపణులు ఉన్నాయి. ఇవి వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇజ్రాయెల్పై దాడి చేసే శక్తిని కలిగివున్నాయి. ఈ క్షిపణుల్లో అత్యంత ప్రమాదకరమైనది ‘సెజిల్’. ఈ క్షిపణి గంటకు 17 వేల కిలోమీటర్ల వేగంతో 2,500 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యంపై దాడి చేయగలదు. ఖిబార్ క్షిపణి పరిధి రెండు వేల కిలోమీటర్లు. దీనితో పాటు, హజ్-ఖాసేమ్ దాడి పరిధి 14 వందల కిలోమీటర్లు. ఇరాన్ వద్ద హైపర్సోనిక్ బాలిస్టిక్ క్షిపణులు కూడా ఉన్నాయి. గత సంవత్సరం ఇరాన్ తన స్వదేశీ హైపర్సోనిక్ బాలిస్టిక్ క్షిపణులను పరీక్షించింది. ధ్వని కంటే ఐదు రెట్లు వేగంగా ప్రయాణించే వాటిని హైపర్సోనిక్ క్షిపణులు అంటారు. ఈ క్షిపణులను వాటి వేగం కారణంగా అడ్డుకోవడం అసాధ్యం. ఇరాన్ దగ్గర అణుశక్తితో రూపొందిన క్రూయిజ్ క్షిపణి కూడా ఉంది. దీని పరిధి మూడు వేల కిలోమీటర్లు. ఇరాన్కు డ్రోన్ల ఆయుధాగారం కూడా ఉంది. ఇరాన్ వద్ద మొహజిర్-10 అనే ప్రాణాంతక డ్రోన్ ఉంది. దీని పరిధి రెండు వేల కిలోమీటర్లు. ఇది 300 కిలోల బరువును మోయగలదు. ఇరాన్ దగ్గరున్న రాకెట్ ఫోర్స్ ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తోంది. -
అప్పులు, గ్యారంటీల వివరాలు పంపండి
సాక్షి, హైదరాబాద్: వివిధ కార్పొరేషన్లు, స్పెషల్ పర్పస్ వెహికిల్స్ (ఎస్పీవీ) ద్వారా తీసుకున్న రుణాలు, చెల్లించాల్సిన వడ్డీలు, ఈ రుణాల కోసం ప్రభుత్వం ఇచ్చిన గ్యారంటీల వివరాలను వెంటనే పంపాలని ఆర్థిక శాఖ అన్ని ప్రభుత్వ శాఖలను కోరింది. ఈ మేరకు రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఇటీవల అన్ని ప్రభుత్వ శాఖలకు లేఖలు రాశారు. ఆయా శాఖల పరిధిలో ఏర్పాటు చేసిన కార్పొరేషన్లు, ఎస్పీవీల ద్వారా 2023– 24 నాటికి తీసుకున్న అన్ని రుణాలు, వాటికి ప్రభుత్వం ఇచ్చిన గ్యారంటీలు, 2024–25లో తీసుకోవాల్సిన రుణాలు, 2025 మార్చి 31 నాటికి వాటి ఖాతాల నిల్వల వివరాలను పంపాలని ఆ లేఖలో కోరారు. ఆర్టీకల్ 293(3) ప్రకా రం ఈ వివరాలను కేంద్రానికి సమర్పించి అప్పులు తీసుకునేందుకు అనుమతి తీసుకోవాల్సి ఉన్నందున అత్యవసరంగా ఈ వివరాలను పంపాలని ప్రభుత్వ శాఖలకు రాసిన లేఖలో కోరారు. ఆర్థిక శాఖ వివరాలు కోరిన ఈ జాబితాలో డిస్కంలు, స్టేట్ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, హౌసింగ్ కార్పొరేషన్, ఐటీఈఅండ్సీ, టీఎస్ఐఐసీ, జలమండలి, జీహెచ్ఎంసీ, మెట్రో రైల్, యూఎఫ్ఐడీసీ, టీడీడబ్ల్యూఎస్సీఎల్ (మిషన్ భగీరథ), రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్, ఆర్డీసీఎల్, టీఎస్డబ్ల్యూఆర్ఐడీసీఎల్, కాళేశ్వరం తదితర కార్పొరేషన్లు ఉన్నాయి. -
వైష్ణోదేవి దర్శనానికి ఐఆర్సీటీసీ టూర్ ప్యాకేజీ!
వేసవి సెలవుల్లో మాతా వైష్ణో దేవి ఆలయాన్ని సందర్శించాలనుకునేవారికి ఐఆర్సీటీసీ ప్రత్యేక టూర్ ప్యాకేజీ ప్రకటించింది. ఈ ప్యాకేజీ మూడు రాత్రులతో పాటు మొత్తం నాలుగు రోజులు ఉండనుంది. ఈ ప్యాకేజీ న్యూఢిల్లీ నుండి ప్రారంభంకానుంది. ఐఆర్సీటీసీ అందిస్తున్న ఈ ప్యాకేజీలో మాతా వైష్ణో దేవి ఆలయంతో పాటు, కంద్ కండోలి ఆలయం, రఘునాథ్ ఆలయం, బేగ్ బహు గార్డెన్లను సందర్శించవచ్చు. ఈ టూర్ ప్యాకేజీ బుక్ చేసుకున్న ప్రయాణికులకు ఐఆర్సీటీసీ అన్ని సదుపాయాలను కల్పిస్తుంది. ఈ ప్రత్యేక టూర్ ప్యాకేజీ పేరు ‘మాతారాణి- రాజధాని’ ఈ యాత్రలో ప్రయాణికులు థర్డ్ ఏసీలో ప్రయాణించే అవకాశం లభిస్తుంది. ప్రయాణికులకు ప్రయాణ సమయంలో ఆహారపానీయాలను ఐఆర్సీటీసీ అందిస్తుంది. ఈ ప్యాకేజీ కింద రెండు బ్రేక్ఫాస్ట్లు, ఒక లంచ్, ఒక డిన్నర్ అందజేస్తారు. అలాగే బస ఏర్పాట్లను కూడా ఐఆర్సీటీసీ కల్పిస్తుంది. ఈ ప్యాకేజీని బుక్ చేసుకోవాలనుకునేవారు రూ.6,390 చెల్లించాల్సి ఉంటుంది. ఇందులో వివిధ టారిఫ్ ప్యాకేజీలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ ప్యాకేజీలో ప్రయాణానికి గరిష్ట ఛార్జీ రూ.8,300. మరిన్ని వివరాల కోసం irctctourism.comని సందర్శించవచ్చని ఐఆర్సీటీసీ తెలిపింది. -
టీచర్ కొలువుకు వేళాయె
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉపాధ్యాయ నియామక ప్రక్రియకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. 11,062 టీచర్ పోస్టులతో డీఎస్సీని ప్రకటించింది. గత ప్రభుత్వం 5,089 టీచర్ పోస్టుల భర్తీకి ఇచి్చన నోటిఫికేషన్ను బుధవారం రద్దు చేసిన ప్రస్తుత ప్రభుత్వం వాటికి అదనంగా 5,973 పోస్టులను చేరుస్తూ ఈ నోటిఫికేషన్ను విడుదల చేసింది. సీఎం రేవంత్రెడ్డి గురువారం డీఎస్సీ నోటిఫికేషన్ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్యతోపాటు విద్యాశాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏ కేటగిరీలో ఎన్ని పోస్టులు భర్తీ చేయనున్నారనే వివరాలతో కూడిన పోస్టర్ను వారు ప్రదర్శించారు. కొత్తగా ప్రకటించిన పోస్టుల్లో ప్రత్యేక అవసరాలుగల విద్యార్థులకు బోధించే ఉపాధ్యాయ నియామకాలు కూడా ఉండటం విశేషం. ఈ నెల 4 నుంచి దరఖాస్తుల స్వీకరణ.. డీఎస్సీ నోటిఫికేషన్లో స్కూల్ అసిస్టెంట్లు, భాషా పండితులు, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లు, ప్రాథమిక విద్యను బోధించే సెకండరీ గ్రేడ్ టీచర్లు, ప్రత్యేక అవసరాలు ఉండే విద్యార్థులకు బోధించే టీచర్లకు సంబంధించిన ఖాళీలను ప్రభుత్వం ప్రకటించింది. అయితే పరీక్షకు సంబంధించిన విధివిధానాలను ఈ నెల 4న విడుదల చేయనున్నట్లు పాఠశాల విద్య కమిషనర్ దేవసేన ఓ ప్రకటనలో తెలిపారు. ఆ రోజు నుంచే అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నట్లు పేర్కొన్నారు. గతేడాది సెప్టెంబర్లో ఇచి్చన నోటిఫికేషన్ సమయంలో 1.75 లక్షల మంది దరఖాస్తు చేశారు. పాత నోటిఫికేషన్ను రద్దు చేసినప్పటికీ గతంలో దరఖాస్తు చేసిన వారు మళ్లీ దరఖాస్తులు పంపాల్సిన అవసరం లేదని విద్యాశాఖ స్పష్టత ఇచ్చింది. కంప్యూటర్ ఆధారిత పరీక్ష.. కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్మెంట్ టెస్ట్ (సీబీఆర్టీ) పద్ధతిలోనే డి్రస్టిక్ సెలక్షన్ కమిటీ (డీఎస్సీ) పరీక్ష నిర్వహిస్తామని విద్యాశాఖ వెల్లడించింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 11 ఆన్లైన్ కేంద్రాలను గుర్తించింది. మహబూబ్నగర్, రంగారెడ్డి, హైదరాబాద్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్లగొండ, సంగారెడ్డిలలో పరీక్ష కేంద్రాలు ఉంటాయని తెలిపింది. 2023 జూలై ఒకటవ తేదీ నాటికి 18–46 ఏళ్ల మధ్య ఉన్న వారిని డీఎస్సీకి అనుమతిస్తారు. అయితే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఐదేళ్లు, మాజీ సైనికోద్యోగులకు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఐదేళ్లు, పీహెచ్సీలకు పదేళ్ల గరిష్ట వయోపరిమితి నుంచి మినహాయింపు ఉండనుంది. పరీక్షకు సంబంధించిన సిలబస్, సబ్జెక్టులవారీ పోస్టులు, రిజర్వేషన్ నిబంధనలకు సంబంధించిన సమాచార బులెటిన్ ఈ నెల 4న https:// schooledu. telangana. gov. in వెబ్సైట్లో విడుదల చేస్తామని అధికారులు తెలిపారు. డీఎస్పీ మే 20 తర్వాత 10 రోజులపాటు ఉండే అవకాశం ఉందని విశ్వసనీయంగా తెలిసింది. 21 వేల ఖాళీలను గుర్తించినప్పటికీ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉపాధ్యాయ నియామకాలు చేపట్టేందుకు డీఎస్సీని ప్రకటించడం ఇది మూడోసారి. 2017 అక్టోబర్ 21న 8,792 పోస్టుల భర్తీకి తొలిసారి టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ (టీఆరీ్ట) పేరుతో తొలిసారి నోటిఫికేషన్ ఇచ్చారు. ఆ తర్వాత 2023 సెపె్టంబర్ 5న 5,089 టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చారు. ప్రస్తుతం 11,062 పోస్టులతో నోటిఫికేషన్ వెలువడింది. విద్యాశాఖలో ప్రస్తుతం 21 వేల టీచర్ పోస్టుల ఖాళీలున్నాయని అధికారులు గుర్తించారు. స్కూల్ అసిస్టెంట్ ఖాళీలను 70 శాతం ఎస్జీటీలకు పదోన్నతులు కల్పించడం ద్వారా భర్తీ చేయనున్నారు. మరో 30 శాతం పోస్టులను డీఎస్సీ ద్వారా భర్తీ చేయాల్సి ఉంటుంది. పదోన్నతులకు న్యాయ సమస్యలు అడ్డంకిగా మారడంతో పూర్తిస్థాయి నియామకాలు చేపట్టలేకపోతున్నారు. -
కస్టమర్ల వివరాల కోసం పేటీఎంకు ఈడీ నోటీసులు
న్యూఢిల్లీ: పేటీఎం పేమెంట్స్ బ్యాంక్తో (పీపీబీఎల్) లావాదేవీలు జరిపే కస్టమర్ల వివరాలను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), ఇతరత్రా దర్యాప్తు సంస్థలు సేకరిస్తున్నాయి. పేటీఎం మాతృ సంస్థ వన్97 కమ్యూనికేషన్స్ బుధవారం స్టాక్ ఎక్సే్చంజీలకు ఈ విషయం తెలియజేసింది. తమతో లావాదేవీలు జరిపిన వారి వివరాలను ఇవ్వాలంటూ ఈడీ సహా ఇతరత్రా దర్యాప్తు సంస్థల నుంచి తమకు, తమ అనుబంధ సంస్థలు, అసోసియేట్ సంస్థ పీపీబీఎల్కు నోటీసులు, అభ్యర్ధనలు వస్తున్నట్లు వన్97 తెలిపింది. అధికారులు అడుగుతున్న సమాచారాన్ని, పత్రాలను, వివరణను ఎప్పటికప్పుడు అందజేస్తున్నామని పేర్కొంది. నిబంధనల ఉల్లంఘన ఆరోపణలపై పీపీబీఎల్పై ఆర్బీఐ ఆంక్షలు విధించిన ప్రభావంతో పేటీఎం షేర్లు కుప్పకూలిన సంగతి తెలిసిందే. ఈడీ కూడా విచారణ జరుపుతోందన్న వార్తలతో కంపెనీ షేర్లు బుధవారం మరో 10 శాతం క్షీణించి రూ. 342 వద్ద క్లోజయ్యాయి. -
Parliament security breach: వారి ‘ఫేస్బుక్’ వివరాలివ్వండి
న్యూఢిల్లీ: లోక్సభలో పొగబెట్టిన ఉదంతంలో అరెస్టయిన నిందితుల ‘ఫేస్బుక్’ ఖాతాల వివరాలు ఇవ్వాలని ‘మెటా’ సంస్థను ఢిల్లీ పోలీసులు కోరారు. నిందితులు సభ్యులుగా ఉన్న, ప్రస్తుతం మనుగడలో లేని ‘భగత్ సింగ్ ఫ్యాన్ క్లబ్’ ఫేస్బుక్ పేజీ వివరాలను అందించాలని ‘మెటా’కు ఢిల్లీ పోలీస్ కౌంటర్ ఇంటెలిజెన్స్ విభాగం లేఖ రాసిందని సంబంధితవర్గాలు వెల్లడించాయి. ఈ ఫేస్బుక్ పేజీని నిందితులే క్రియేట్ చేసి ఘటన తర్వాత డిలీట్ చేశారు. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్లకు ‘మెటా’ మాతృసంస్థ. ఈ నేపథ్యంలో నిందితుల మధ్య జరిగిన వాట్సాప్ ఛాటింగ్లనూ తమకు ఇవ్వాలని పోలీసులు ‘మెటా’ను కోరారు. -
లెక్కలు తీస్తున్నారు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక స్థితి ఏమిటో ప్రజలకు చెప్పేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. ‘ఇది ప్రజాప్రభుత్వం’అంటూ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రమాణస్వీకారం రోజే ప్రకటించిన విషయం తెలిసిందే. తొలి కేబినెట్ సమావేశంలోనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నుంచి ఈ పదేళ్ల కాలంలో నిధుల విడుదల, ఖర్చు, మిగులు తదితరాలు ప్రజలకు వివరించాలని నిర్ణయించిన సంగతి విదితమే. ఈ క్రమంలోనే ప్రభుత్వ శాఖల వారీగా నివేదికలు సేకరించాలని నిర్ణయించి ఆదేశాలు జారీ చేసింది. సాధారణంగా బడ్జెట్ రూపకల్పనలో భాగంగా శాఖల వారీగా బడ్జెట్ కేటాయింపులు, నిధుల విడుదల, చేసిన ఖర్చులకు సంబంధించి సమాచారం విభాగాధిపతులు సమర్పించడం ఆనవాయితీ. సీఎం ఆదేశాలతో శుక్రవారం పలు విభాగాధిపతులు ఆగమేఘాల మీద ఈ ఏడాదికి సంబంధించిన వివరాలు ప్రభుత్వానికి సమర్పించారు. ప్రత్యేక ఫార్మాట్ రూపకల్పన ! శాఖలవారీగా చేసిన ఖర్చులకు ప్రత్యేక ఫార్మాట్ రాష్ట్ర ప్రభుత్వం రూపొందించినట్టు తెలిసింది. 2014 నుంచి ఇప్పటివరకు వార్షిక బడ్జెట్లో జరిపిన కేటాయింపులు, నిధుల విడుదలకు సంబంధించి బడ్జెట్ రిలీజింగ్ ఉత్తర్వులు, చేసిన ఖర్చు, సంవత్సరం వారీగా నిధుల మిగులుకు సంబంధించిన సమాచారం సమర్పించాల్సి ఉంటుంది. ఖర్చుకు సంబంధించిన అంశాలను పథకాల వారీగా వ్యయం, అభివృద్ధి కార్యక్రమాల వివరాలతోపాటు మరమ్మతులు తదితరాలను పూర్తిస్థాయిలో సమర్పించాలని ప్రభుత్వం ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన నిధులతో కూడిన జాబితాతోపాటు కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాలు, విడుదలైన నిధులు, చేసిన ఖర్చు వివరాలు కూడా వేరుగా సమర్పించాలని స్పష్టం చేసింది. వీలైనంత త్వరగా ఈ ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించడంతో అధికారులు కసరత్తు వేగవంతం చేశారు. శనివారం నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానుండగా, సమావేశాలు ముగిసేనాటికి వీటిని ప్రజాక్షేత్రంలో ఉంచే అవకాశం ఉన్నట్టు సమాచారం. విద్యార్థుల ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్కు సంబంధించి పదేళ్ల కాలంలో రూ.25వేల కోట్లు ఖర్చు చేసినట్టు అంచనా. -
స్కిల్ కుంభకోణం వివరాలు బహిర్గతం చేయకుండా ఆదేశాలివ్వండి
సాక్షి, అమరావతి : స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు వ్యతిరేకంగా న్యాయస్థానాల్లో వాదనలు వినిపిస్తున్న న్యాయవాదులను, దర్యాప్తు చేస్తున్న అధికారులను లక్ష్యంగా చేసుకుంటూ భౌతిక దాడులకు, తీవ్ర ఆరోపణలకు దిగిన తెలుగుదేశం పార్టీ వర్గాలు... ఇప్పుడు మరో అడుగు ముందుకు వేశాయి. స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసులో చంద్రబాబుకు ఎలాంటి ఊరట రాకుండా న్యాయస్థానాల్లో గట్టిగా వాదనలు వినిపిస్తున్న అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్రెడ్డిని, సీఐడీ చీఫ్ సంజయ్ను లక్ష్యంగా చేసుకున్నాయి. అందులో భాగంగా స్కిల్ కుంభకోణం గురించిన వాస్తవాలను పత్రికలు, మీడియా ద్వారా ప్రజలకు వివరించేందుకు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసిన పొన్నవోలు సుధాకర్రెడ్డి, ఎన్.సంజయ్లపై ఆ వర్గాలు హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని (పిల్) దాఖలు చేశాయి. స్కిల్ కుంభకోణం కేసు లేదా ఇతర ఏ కేసుకు సంబంధించిన సమాచారాన్ని కూడా బహిర్గతం చేయకుండా, ఎలాంటి సమావేశాలు నిర్వహించకుండా సుధాకర్రెడ్డి, సంజయ్ను ఆదేశించాలని కోరుతూ ఏపీ యునైటెడ్ ఫోరం ఫర్ ఆర్టీఐ క్యాంపెయిన్ అధ్యక్షుడు ఎన్.సత్యనారాయణ ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. పత్రికా సమావేశాలు పెట్టడం తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయని, భవిష్యత్తులో ఇలాంటి చర్యలకు పాల్పడకుండా వారిద్దరిపై చర్యలు తీసుకునేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని ఆయన తన పిటిషన్లో కోర్టును కోరారు. అంతేకాక సుధాకర్రెడ్డి, సంజయ్ నిర్వహించిన సమావేశంపై విచారణ జరిపేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోర్టును కోరారు. ఈ వ్యాజ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, న్యాయ శాఖ కార్యదర్శి, హోంశాఖ ముఖ్య కార్యదర్శులను ప్రతివాదులుగా చేర్చారు. అలాగే పొన్నవోలు సుధాకర్రెడ్డి, సంజయ్ను వ్యక్తిగత హోదాలో ప్రతివాదులుగా పేర్కొన్నారు. సమావేశాలు పెడుతూ, హోటళ్లలో ఉంటూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని సత్యనారాయణ తన పిటిషన్లో పేర్కొన్నారు. సెంట్రల్ సివిల్ సర్వెంట్ రూల్స్కు విరుద్దంగా వీరు వ్యవహరిస్తున్నారని తెలిపారు. స్కిల్ డెవలప్మెంట్ కేసు వివరాలను రహస్యంగా ఉంచాల్సింది పోయి సమావేశాలు పెట్టి బహిర్గతం చేయడం నైతిక విలువలకు విరుద్ధమన్నారు. చంద్రబాబుతో పాటు ఇతర నిందితుల పట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. అధికార పార్టీకి అనుకూలంగా మాట్లాడుతూ, స్టేట్మెంట్లు ఇస్తున్నారని వివరించారు. స్కిల్ కేసులో నిర్వహించిన సమావేశాల కోసం ఖర్చు చేసిన మొత్తాన్ని సుధాకర్రెడ్డి, సంజయ్ నుంచి వసూలు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని సత్యనారాయణ తన పిటిషన్లో కోర్టును కోరారు. -
ఓటు ప్లాట్ఫామ్పై వందేభారత్
గౌరిభట్ల నరసింహమూర్తి: ఎన్నికల్లో తొలిసారి ‘రైలు’ ప్రచారాస్త్రంగా నిలవబోతోంది. గతంలో కొన్ని ప్రాంతాల్లో ‘ఇన్ని దశాబ్దాలు గడిచినా మా ప్రాంతానికి రైలు రాలేదు’ అన్న నెగెటివ్ అంశం ప్రచారంలో వినిపించినా.. ఇప్పుడు దానికి భిన్నంగా, ఓ రైలు ఘనతను తమకు అనుకూలంగా మలుచుకుంటూ నేతలు ప్రసంగ పాఠాన్ని సవరించుకుంటున్నారు. దేశవ్యాప్తంగా ఇప్పటికే జరిగిన కొన్ని ఉప ఎన్నికల్లో కనిపించిన ఈ పంథా, ఇప్పుడు తెలంగాణ ఎనిక్నల్లోనూ కనిపించబోతోంది. కేంద్రప్రభుత్వం ట్రెయిన్ 18 పేరుతో ప్రయోగాలు నిర్వహించిన తర్వాత ‘’వందేభారత్’గా పట్టాలెక్కిన సంగతి తెలిసిందే. తొలి రైలే ప్రజలను విపరీతంగా ఆకట్టుకుంది. బ్లూ చారలున్న తెలుపు రంగు కోచ్లు, ప్రత్యేకంగా పుష్ పుల్ పద్ధతిలో రెండు వైపులా ఇన్బిల్ట్ ఇంజిన్తో ఉండటం, 180 కి.మీ. వేగం అందుకునే సామర్ధ్యం, విలాసంగా కనిపించే కోచ్లు.. ఇలా ఒకటేమిటి, ఇంతకాలం విదేశాల్లోనే కనిపించిన రైలు మన పట్టాలపై పరుగు పెడుతుంటే ప్రజల్లో విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. ఫలితంగా మా ప్రాంతానికి కావాలంటే మా ప్రాంతానికి కావాలంటూ రైల్వేపై అన్ని రాష్ట్రాల నుంచి ఒత్తిడి పెరిగింది. ఏకంగా మూడు రైళ్లతో.. దేశవ్యాప్తంగా విపరీతమైన డిమాండ్ ఉన్న ఈ వందేభారత్ రైళ్లు తెలంగాణకు ఏకంగా మూడు అందుబాటులోకి వచ్చాయి. ఇప్పటికీ కొన్ని రాష్ట్రాలకు వాటిని కేటాయించనే లేదు. ఈ తరుణంలో సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం, సికింద్రాబాద్ నుంచి తిరుపతి, కాచిగూడ నుంచి బెంగళూరు మధ్య మూడు వందేభారత్ రైళ్లు పరుగుపెడుతున్నాయి. ఇప్పుడు ఇదే బీజేపీకి పెద్ద ప్రచారాస్త్రంగా మారింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న కొన్ని దశాబ్దాల కాలంలో తెలంగాణకు సాధారణ రైళ్లు మంజూరు కావటమే గొప్ప అనుకుంటున్న తరుణంలో, మోదీ ప్రభుత్వం సెమీ బుల్లెట్ రైళ్లుగా పేర్కొనే వందేభారత్ రైళ్లను మూడింటిని కేటాయించటాన్ని ప్రధానంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో జరిగిన సభల్లో వందేభారత్ అంశాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు. వాటి ప్రారంబోత్సవ కార్యక్రమాల్లో కేంద్రమంత్రి హోదాలో ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్రెడ్డి ప్రముఖంగా పేర్కొంటూ తెలంగాణకు వరాలుగా అభివర్ణించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు రాష్ట్రంలో జరిగే ఎన్నికల ప్రచారంలో బీజేపీ నేతలు వందేభారత్ను కీర్తిస్తూ ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. జనవరి నాటికి స్లీపర్ క్లాస్ రైళ్లు కూడా.. ప్రస్తుతం పగటి పూట నడిచే చెయిర్కార్ కోచ్ రైళ్లు మాత్రమే తిరుగుతున్నాయి. జనవరి నాటికి స్లీపర్ క్లాస్ రైళ్లు కూడా అందుబాటులోకి రానున్నాయి. వీటి చార్జీ ఎక్కువగా ఉన్నందున, సామాన్య ప్రజలకు కూడా అందుబాటులో ఉండేలా వందే సాధారణ్ రైళ్ల తయారీని కూడా ప్రారంభించారు. ప్రచారం చేయాలని.... ఆ రైళ్లపై విస్తృతంగా ప్రచారం చేయాలని నిర్ణయం మొత్తంగా వందేభారత్ రైళ్లు సంబంధించిన పూర్తి సమాచారాన్ని రాష్ట్ర బీజేపీ నేతలు రైల్వే శాఖ నుంచి సేకరించారు. వాటి వివరాలను పార్టీ కార్యకర్తలకు కూడా అందిస్తున్నారు. ప్రచారంలో వీటిని విస్తృతంగా ప్రజలకు తెలియజెప్పాలని సూచిస్తున్నారు. మనోహరాబాద్–కొత్తపల్లి ప్రాజెక్టులో భాగంగా సిద్దిపేట వరకు ప్రారంభించిన రైలు సర్వి సు కూడా ప్రచారంలో భాగమవుతోంది. ఆ రైలు సర్వీసు ప్రారంభం రోజు ఆ ఘనత తమదంటే తమది అంటూ బీజేపీ–బీఆర్ఎస్ నేతలు పేర్కొంటూ దాడులు చేసుకున్న సంగతి విదితమే. దీంతో ఎన్నికల్లో కూడా స్థానికంగా అది ప్రచారాస్త్రంగా మారబోతోంది. రెండు దశాబ్దాలుగా పెండింగులో ఉన్న ప్రాజెక్టును పూర్తి చేసి కాచిగూడ నుంచి దేవరకద్ర మీదుగా కర్ణాటక సరిహద్దులోని కృష్ణా స్టేషన్ వరకు రోజువారీ ప్యాసింజర్ రైలు సర్వి సును ఇటీవల ప్రారంభించారు. ఈ రెండు రైళ్లను ఎన్నికల షెడ్యూల్ విడుదలకు కొద్ది రోజుల ముందు స్వయంగా ప్రధాని మోదీ వచ్చి ప్రారంభించిన విషయం తెలిసిందే. అమృత్ భారత్స్టేషన్ల పేరుతో రాష్ట్రంలో 21 స్టేషన్లకు పూర్తి ఆధునిక భవనాలు నిర్మించే పని ప్రారంభించారు. ఆధునిక రూపు తెస్తున్న ఘనత బీజేపీ ప్రభుత్వానిదే అని ఆ పార్టీ నేతలు ప్రచారం చేస్తున్నారు. -
విద్యార్థుల వివరాలు ఆన్లైన్లో నమోదు చేయాలి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో బడి బయట పిల్లలను పాఠశాలల్లో చేర్పించడంతోపాటు అన్ని యాజమాన్యాల్లోని విద్యార్థుల వివరాలను స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ పోర్టల్లో నమోదు చేసేలా కలెక్టర్లు, డీఈవోలు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ ఆదేశించారు. ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ పాఠశాలల యాజమాన్యాలు అందించిన విద్యార్థుల వివరాలను అధికారులు తనిఖీ చేసి ధ్రువీకరించాలన్నారు. ఇప్పటికే వలంటీర్లు చేసిన సర్వే ప్రకారం18 లక్షల మంది విద్యార్థుల పేర్లు ఇంకా స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ పోర్టల్లో అప్డేట్ కాలేదన్నారు. గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో ప్రారంభించి బుధవారానికి వంద రోజులు అవుతున్నందున అన్ని స్కూళ్ల హెచ్ఎంలు అప్లోడ్ చేసేలా కలెక్టర్లు తీసుకోవాలన్నారు. విద్యార్థుల వివరాలు అప్లోడ్ చేయకుంటే కఠిన చర్యలు తప్పవని మంగళవారం ఓ ప్రకటనలో హెచ్చరించారు. -
డేంజర్: ఇది జరిగితే మీ బ్యాంక్ అకౌంట్ ప్రమాదంలో ఉన్నట్టే..
ప్రపంచవ్యాప్తంగా సైబర్ మోసాలు ఎక్కువయ్యాయి. అమాయక ప్రజల డబ్బును దోచుకునేందుకు సైబర్ మోసగాళ్లు రోజుకో ఎత్తు వేస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఓ షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. మీ డెబిట్, క్రెడిట్ కార్డ్ వివరాలు అత్యంత తేలికగా స్కామర్ల చేతికి చేరుతున్నాయి. టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం.. పలు అక్రమ వైబ్సైట్లు, టెలిగ్రామ్ చానెళ్లు డెబిట్, క్రెడిట్ కార్డ్ నంబర్లు, కార్డ్ హోల్డర్ పేర్లు, సీవీవీతో సహా వివరాలను స్కామర్లకు విక్రయిస్తున్నాయి. అదీ కూడా ఒక్కో కార్డు వివరాలు కేవలం 5 యూఎస్ డాలర్లు. అంటే రూ.410లకు మాత్రమే. పశ్చిమ దేశాలలో చెల్లింపులు ప్రాసెస్ చేయడానికి కార్డు వివరాలు ఉంటే సరిపోతుంది. ఓటీపీ అవసరం ఉండదు. అందుకే ఆయా దేశాల్లో పరిస్థితి చాలా భయంకరంగా ఉంది. కానీ భారత్లో వన్ టైమ్ పాస్వర్డ్ (OTP) ద్వారా రెండు-కారకాల ప్రామాణీకరణ తప్పనిసరి. అయినప్పటికీ దీన్ని కూడా అధిగమించడానికి స్కామర్లు కొత్త మార్గాన్ని కనుగొన్నారు. ఉన్నట్టుండి సిమ్ డీయాక్టివేట్ అయితే.. బాధితుల ఒరిజినల్ సిమ్ను డీయాక్టివేట్ చేయడం ద్వారా స్కామర్లు ఓటీపీని ఎలా యాక్సెస్ చేస్తున్నారో భారతీయ పోలీసు అధికారులను టైమ్స్ ఆఫ్ ఇండియా ఉటంకిస్తూ పేర్కొంది. హ్యాకర్లు డెబిట్, క్రెడిట్ కార్డ్ వివరాలను బాధితుడి పేరు, ఫోన్ నంబర్తో సహా షాడో వెబ్సైట్లు, టెలిగ్రామ్ చానెళ్ల ద్వారా అమ్మకానికి పెడుతున్నారు. సైబర్ మోసగాళ్లు ఈ వివరాలను కొనుగోలు చేసి టెలికాం సర్వీస్ ప్రొవైడర్లను సంప్రదించి బాధితుల సిమ్ కార్డ్ డీయాక్టివేట్ చేయిస్తున్నారు. తర్వాత డూప్లికేట్ సిమ్ పొంది ఓటీపీలను సునాయాసంగా యాక్సెస్ చేయగలుగుతున్నారు. నష్టం జరిగేంత వరకు బాధితుడి ఈ మోసం గురించి తెలియదు. కాబట్టి మీ సిమ్ కార్డ్ ఉన్నట్టుడి డీయాక్టివేట్ అయినట్లు గుర్తిస్తే వెంటనే అప్రమత్తం కావాలి. కొన్ని నిమిషాల్లోనే మీ బ్యాంక్ ఖాతా ఖాళీ అయ్యే ప్రమాదం ఉంది. ఈ వెబ్సైట్లను నిర్వహిస్తున్నదెవరు? నివేదిక ప్రకారం.. అక్రమ వెబ్సైట్లు, టెలిగ్రామ్ చానెళ్లను రష్యా, ఉక్రెయిన్ దేశాలకు చెందిన హ్యాకర్లు నిర్వహిస్తున్నట్లుగా తేలింది. వీళ్లు వెబ్సైట్లు, టెలిగ్రామ్ చానెళ్ల ద్వారా కార్డ్ వివరాలను హ్యాక్ చేసి విక్రయిస్తున్నారు. సంపన్న పాశ్చాత్య దేశాలకు చెందిన వారి కార్డు వివరాలకు ఒక్కో కార్డుకు 10 డాలర్లు (రూ.820) చొప్పున తీసుకుంటుండగా భారత్ సహా ఆసియా దేశాలకు చెందిన బాధితుల కార్డుల వివరాలకు చవగ్గా కేవలం 5 డాలర్లు (రూ.410)కే అమ్మేస్తున్నట్లుగా అధికారులు చెబుతున్నారు. 2022 జనవరిలో అటువంటి అక్రమ వెబ్సైట్ ఒకదానిని అధికారులు గుర్తించి చర్యలు తీసుకున్నారు. కానీ అలాంటి అక్రమ వెబ్సైట్లు, టెలీగ్రామ్ చానెళ్లు లెక్కకు మించి పుట్టుకొస్తున్నాయి. ఇదీ చదవండి: ఇంటర్నెట్ షట్డౌన్: ఆరు నెలల్లో ఇన్ని వేల కోట్ల నష్టమా? -
భారత్లో అధికంగా విక్రయమయ్యే కండోమ్ బ్రాండ్స్..
భారత్లో పలు కంపెనీలు తమ కండోమ్లను విక్రయిస్తున్నాయి. కండోమ్స్ ప్రొడక్ట్ రేంజ్ కూడా అధికంగానే ఉంటుంది. డ్యూరెక్స్ కండోమ్ భారత్తో పాటు ప్రపంచంలోనే అత్యధికంగా విక్రయమయ్యే నంబర్ వన్ బ్రాండ్. 150 దేశాల్లో ఈ కండోమ్స్ విక్రయమవుతున్నాయి. దేశరాజధాని ఢిల్లీలోని మ్యాన్ఫోర్స్ బ్రాండ్ భారత్లో అత్యధికంగా కండోమ్స్ విక్రయించే కంపెనీగా చెప్పుకుంటుంది. సంబంధిత చార్ట్లో ఈ బ్రాండ్ పేరు టాప్లో కనిపిస్తుంది. మ్యాన్కోర్స్ బ్రాండ్ మ్యాన్కైండ్ ఫార్మ్కు సంబంధించినది. ఇటీవలే ఈ కంపెనీ లిస్టింగ్ షేర్ మార్కెట్లోకి ప్రవేశించింది. స్కోర్.. టీటీకే ప్రొటెక్టివ్ డివైజెస్ లిమిటెడ్కు చెందిన ప్రముఖ కండోమ్ బ్రాండ్. బారత్లో ఈ బ్రాండ్ విక్రయాలు జోరుగా దూసుకుపోతున్నాయి. కామసూత్ర భారత్లోని ప్రముఖ కండోమ్ బ్రాండ్లలో ఒకటి. 2017లో రేమాండ్ ఈ కామసూత్ర బాండ్ను కొనుగోలు చేసింది. కోహినూర్ కండోమ్ బ్రాండ్ విక్రయాల విషయంలో భారత్లో ముందుంది. రాకెట్ అండ్ బెంకింజర్ ఇండియా 1979లో కోహినూర్ కండోమ్ బ్రాండ్ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. దీనితోపాటు భారత్లో ‘మూడ్స్’ కూడా ఆదరణ పొందిన కండోమ్ బ్రాండ్. మార్కెట్లో మూడ్స్ కండోమ్లలో పలు రకాల సిరీస్ అందుబాటులో ఉన్నాయి. ఇది కూడా చదవండి: యోగాకు గుర్తింపునిచ్చిన గురువులు వీరే.. -
ఐటీ రిటర్న్స్ దాఖలు చేసేటప్పుడు ఇవి ఖచ్చితంగా చెక్ చేసుకోండి
-
జయలలిత ఆస్తులను వివరాలను ఇవ్వండి!
ప్రత్యేక కోర్టు ఆదేశాల మేరకు తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఆస్తుల వివరాలను వెల్లడించేందుకు నిరాకరించిన పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆపీసర్(పీఓఐ) ఉత్తర్వును సివిల్ కోర్టు కొట్టేసింది. అలాగే ప్రత్యేక కోర్టు ఆదేశించిన ఉత్తర్వుల మేరకు దివగంత ముఖ్యమంత్రి జయలలిత ఆస్తుల వివరాలను వెల్లడించాల్సిందేనని పీఓ అధికారిని కోర్టు ఆదేశించింది. 1996 డిసెంబర్ 11న జప్తు చేసిన ఆస్తుల వేలానికి సంబంధించి ప్రత్యేక కోర్టు ఆదేశాలపై సమాచారం ఇవ్వాలని ఆర్టీఐ కార్యకర్త టీ నరసింహమూర్తి కోరారు. వాస్తవానికి జయలలిత ఆదాయనికి మించిన ఆస్తుల కేసును 2003లో సుప్రీం కోర్టు కర్ణాటకకు బదిలీ చేసింది. ఈ మేరకు జయలలిత చీరలు, శాలువాలు, పాదరక్షలతో సహా స్వాధీనం చేసుకుని బెంగళూరుకి తరలించారు. ఐతే 2014లో జయలలితతోపాటు, ఇతర నిందితులను ఇక్కడి ప్రత్యేక న్యాయస్థానం దోషులుగా నిర్ధారించింది. కానీ ఈకేసుకి సంబంధించిన భౌతిక ఆధారాలు కస్టడీలోనే ఉన్నాయి. ఆయా ఆస్తులను ఆర్టీఐ కార్యకర్త నరసింహమూర్తి వేలం వేయాలని కోరారు. ఈ క్రమంలో ప్రత్యేక కోర్టు ఆదేశాల మేరకు జయలలిత ఆస్తుల వివరాలను వెల్లడించేందుకు పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్(పీఐఓ) నిరాకరించారు. పైగా ఆయన సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించారు. ఐతే సివిల్ కోర్టు ప్రత్యేక కోర్టు తుది ఉత్తర్వుల తోపాటు కోర్టు నియమించిన ప్రత్యేక ప్రాసిక్యూటర్ ముందు ఆస్తుల వివరాలను వెల్లడించాలని అధికారులను ఆదేశించింది. (చదవండి: లక్నో భవనం కూలిన ఘటన: సమాజ్వాద్ పార్టీ నేత భార్య, తల్లి దుర్మరణం) -
ఆ విమానం నేరుగా మావైపే వచ్చింది... వెలుగులోకి కీలక విషయాలు
నేపాల్ విమానం కూలిన విషాద ఘటన గురించి ప్రత్యక్ష సాక్షులు కొన్ని ఆసక్తికర విషయాలు మీడియాకి వివరించారు. ఈ మేరకు ఒక స్థానిక నివాసి కల్పనా సునార్ ఆ విమానం బాంబు లాంటి పేలుడుతో తమ వైపుకు దూసుకురావడాన్ని చూసినట్లు పేర్కొంది. ఆ సమయంలో తాను బట్టలు ఉతుకుతున్నానని చెప్పింది. ఆ విమానం పాత విమానాశ్రయానికి, కొత్త విమానాశ్రయానికి మధ్య ఉన్న సేతి నది వద్ద కుప్పకూలిందని, ఆ నది లోయ చుట్టు నల్లటి దట్టమైన పొగ కమ్మేయడం చూశానని చెప్పుకొచ్చారు. ఆ సమయంలో విమానం అసాధారణ రీతిలో వంగి ఉండటం చూశానని చెప్పుకొచ్చింది. మరో ప్రత్యక్ష సాక్షి గీతా సునార్ తమ ఇంటికి 12 మీటర్ల దూరంలో విమానం రెక్క పడిందని తెలిపారు. అది మా నివాసాలకు కాస్త దూరంలో పడిందని లేదంటే మా నివాసాలు దగ్ధమయ్యేవని, చాలా నష్టం వాటిల్లేదని చెప్పింది. సేతి నదికి రెండువైపులా మంటలు చెలరేగాయని, మృతదేహాలు చెల్లచెదురుగా పడి ఉన్నాయని చెప్పింది. అలాగే 11 ఏళ్ల పిల్లలు సమీర్, ప్రజ్వల్ తాము ఆసమయంలో ఆడుకుంటుండగా ఏదో బొమ్మ విమానం పడుతున్నట్లుగా కనిపించిందని, ప్రయాణికులు అరుపులు కూడా వినిపించాయని చెప్పారు. కాసేపటికి మా వైపుకి దూసుకురావడంతో భయంతో పారిపోయామని చెప్పారు. ఏదో టైర్ క్రాష్ అయినంత సౌండ్ వినిపించిందని అది మమ్మల్ని తాకినట్లు అనిపించిందని చెప్పుకొచ్చారు. క్రాష్ అయిన కాసేపటికి దగ్గరకు వెళ్దామంటే దట్టమైన పొగ వ్యాపించి ఏమి కనిపించలేదని స్థానికుల చెప్పారు. అయితే విమానంలోని సుమారు ఏడు నుంచి ఎనిమిది విండోలు చెక్కు చెదరకుండా ఉంటే ఎవరైనా సజీవంగా బతికి ఉంటారని భావించామని అన్నారు. మరికొంతమంది ఈ ఘటన జరగుతుండగా భయాందోళనతో ఉన్నామని, తాము చూస్తుండగానే విమానం మిగతా సగం వైపుకి కూడా మంటలు వ్యాపించాయని చెప్పుకొచ్చారు. కాగా, ఈ ఘటనలో సుమారు 68 మంది ప్రయాణికులు చనిపోగా..ఇంకా నలుగురు మృతదేహాల ఆచూకి లభించలేదు. సోమవారం కూడా వారి కోసం నేపాల్ భద్రతా సిబ్బంది గాలించడం పునః ప్రారంభించారు. అలాగే ప్రమాద స్థలం నుంచి బ్లాక్బాక్స్ని స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. (చదవండి: నేపాల్ విమాన ఘటన: కోపైలట్ విషాద గాథ..నాడు భర్తలాగే భార్య కూడా..) -
ఈపీఎఫ్.. వెరీటఫ్..! మారిన రూల్స్.. ఈ విషయాలు తెలుసుకోకుంటే కష్టమే!
అమరేందర్రెడ్డి ఓ ప్రైవేటు సంస్థలో పనిచేస్తూ పదవీ విరమణ పొందాడు. సర్వీసు పూర్తి కావడంతో కుటుంబ అవసరాల కోసం తన ఈపీఎఫ్ ఖాతాలోని రూ.8.75 లక్షల నగదు ఉపసంహరణకు, పెన్షన్ పొందేందుకూ ప్రయత్నించాడు. కానీ అతని వినతిని ఈపీఎఫ్ఓ తిరస్కరించింది. అతడి ఈపీఎఫ్ ఖాతాలో తండ్రిపేరు నమోదు కానందునే ఇలా జరిగింది. వాస్తవానికి తండ్రి పేరును ఆన్లైన్లో పొందుపర్చి... కోవిడ్ సమయంలో రెండుసార్లు నగదును ఉపసంహరించుకున్న అమరేందర్రెడ్డి.. తాజాగా తండ్రి పేరు లేదని వినతిని తిరస్కరించడంతో ఆందోళనకు గురయ్యాడు. ఆన్లైన్లో తండ్రిపేరు సవరణకు రిక్వెస్ట్ సమర్పించినప్పటికీ దాన్ని కూడా రిజెక్ట్ చేయడంతో తను చివరగా పనిచేసిన కంపెనీని ఆశ్రయించాడు. సంబంధిత డాక్యుమెంట్లు సమర్పించి ఆర్నెల్లు కావస్తున్నా ఇప్పటికీ ఆయనకు పీఎఫ్ డబ్బులు అందలేదు. సాక్షి, హైదరాబాద్: ఉద్యోగి భవిష్యనిధి (ఈపీఎఫ్) ఖాతాలో వివరాల సవరణ అత్యంత కష్టతరంగా మారింది. సాధారణంగా కొత్తగా సంస్థలో ఉద్యోగంలో చేరినప్పుడు ఉద్యోగి సమర్పించిన వాస్తవ వివరాలను కంపెనీ యాజమాన్యం ఉద్యోగి ఈపీఎఫ్ ఖాతాలో నమోదు చేస్తుంది. సరైన వివరాలు పొందుపరిచినప్పటికీ ఇటీవల పలువురు ఉద్యోగుల ఈపీఎఫ్ ఖాతాల్లో ఆ వివరాలు కనిపించడం లేదు. దీంతో అకస్మాత్తుగా నగదు అవసరమైనప్పుడు ఈపీఎఫ్ ఖాతా నుంచి తీసుకోవాలనుకున్న ప్రయత్నాలు ఫలించక ఖాతాదారులు నివ్వెరపోతున్న ఘటనలు ఇటీవల అనేకం కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వివరాల సవరణలోనే చాలామంది నెలల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. కొందరు అన్ని వివరాలు సమర్పించి సరిచూసుకున్నప్పటికీ కొన్నాళ్ల తర్వాత తండ్రి పేరు, పుట్టినతేదీ, పాన్, ఆధార్, బ్యాంకు ఖాతా లింకు లేదని వెబ్సైట్లో సూచించడం గమనార్హం. ఇలాంటి వాటికి సాంకేతిక కారణాలను సాకుగా చూపి అధికారులు చేతులు దులుపుకుంటున్నారు. అంతా ఆన్లైన్లో అయినా... ప్రతి ఈపీఎఫ్ ఖాతాదారుడికి యూఏఎన్ (యూనివర్సల్ అకౌంట్ నంబర్) ఉంటుంది. ఉద్యోగి వివిధ కంపెనీలు మారినప్పటికీ యూఏఎన్ మాత్రం ఒకటే ఉంటుంది. ఈపీఎఫ్ వెబ్సైట్లో తమ వివరాలు సరిగ్గా లేవని గుర్తించిన పలువురు ఉద్యోగులు.. ఆన్లైన్లో సవరణల కోసం నమోదు చేసుకున్న వినతులు పెద్ద సంఖ్యలో తిరస్కరణకు గురవుతున్నాయి. చిన్నపాటి సవరణలకూ ఆధా రాలు సమర్పిస్తున్నప్పటికి వాటిని తిరస్కరించడం పట్ల ఖాతాదారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కొందరు రెండు, మూడుసార్లు దరఖాస్తులు సమర్పించుకుంటుండగా.. మరికొందరు నేరుగా ఈపీఎఫ్ కార్యాలయాలకు వెళ్లినప్పటికీ సవరణలు పొందలేకపోతున్నారు. నిబంధనలు కఠినతరం చేయడంతో పలువురి దరఖాస్తులు తిరస్కరణకు గురవుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. యాజమాన్యం ధ్రువీకరణ తప్పనిసరి ఉద్యోగి ఈపీఎఫ్ ఖాతాలో వివరాల సవరణలో యాజమాన్యం ధ్రువీకరణను కేంద్రం తప్పనిసరి చేసింది. దీంతో ఎలాంటి అంశాలకైనా యాజమాన్యం అనుమతి కావాలంటూ తిరస్కరిస్తున్నారు. సర్వీసులో ఉన్న ఉద్యోగులకు ఈ నిబంధనతో పెద్దగా ఇబ్బంది లేనప్పటికీ... ఉద్యోగం మానేసిన, ఇతర కంపెనీకి మారి పీఎఫ్ పరిధిలోకి రాకున్నా, ఉద్యోగం ఊడి కొత్త ఉద్యోగం పొందలేని వారికి మాత్రం సవరణ ప్రక్రియ కత్తిమీద సాములా మారింది. ప్రధానంగా యాజమాన్యం సహకారం కొరవడటం, ఈపీఎఫ్ కార్యాలయాల్లోకి ప్రవేశం లేకుండా కేవలం ఇన్వార్డ్ సెల్ వరకే ఖాతాదారులకు అనుమతి ఉండటం లాంటి కారణాలతో ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. ►ఉద్యోగి పేరు లేదా ఇంటి పేరు సవరణ చేయించాలంటే ప్రభుత్వ గెజిట్ తప్పనిసరి అయ్యింది. స్వల్ప మార్పులకైనా సరైన ఆధారాలు సమర్పించాల్సిందే. ►సవరణల కేటగిరీలో ఆధార్, పాన్ కార్డులను అప్లోడ్ చేసినప్పటికీ యాజమాన్యం ధ్రువీకరణ చేయాలి. సర్వీసులో లేని వారికి ఈ నిబంధన ప్రతిబంధకంగా మారింది. ►కొన్ని సందర్భాల్లో సవరణలకు ఒరిజినల్ పత్రాలు సమర్పించాలనే నిబంధన ఉంది. దీనికోసం ఉద్యోగి వ్యక్తిగతంగా ఈపీఎఫ్ కార్యాలయానికి వెళ్లాల్సి ఉంటుంది. ►సవరణలను యాజమాన్యాలు ధ్రువీకరించినప్పటికీ సంబంధిత అధికారులు సంతకాలు పెట్టకపోవడం వల్ల, కొన్నిసార్లు సంబంధిత అధికారులకు బదులు కిందిస్థాయి అధికారులు ధ్రువీకరించడం వల్ల సైతం వినతులు తిరస్కరణకు గురవుతున్నాయి. -
ఎల్ఐసీ కస్టమర్లకు గుడ్ న్యూస్: ఇక ఆ అవసరమే ఉండదు
LIC WhatsApp Service: దేశంలోనే అతిపెద్ద జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ) వినియోగదారులకు అద్భుతమైన వార్త అందింది. పాత, కొత్త పాలసీ వివరాలు, ప్రీమియం, బోనస్ ఇతర సర్వీసులపై తన కస్టమర్లకు పూర్తి సమాచారం అందించేలా వాట్సాప్ సర్వీస్ను ఎల్ఐసీ ప్రారంభించింది. ఇకపై ప్రతీ చిన్న పనికి ఆఫీసుకు వెళ్లాల్సిన అవసరం లేకుండా, ఏజెంట్ కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేకుండా ఈ చక్కటి అవకాశాన్ని అందిస్తోంది. ఎల్ఐసీ చైర్మన్ ఎంఆర్ కుమార్ వాట్సాప్ సర్వీస్ ప్రారంభమైందంటూ శుక్రవారం ట్వీట్ చేశారు. తమ పాలసీ వివరాలను ఎల్ఐసీ పోర్ట్లో రిజస్టర్ చేసుకున్న రిజిస్టర్డ్ మెంబర్స్కు ఈ సేవలు అందుబాటులో ఉంటాయిని తెలిపారు. (లగ్జరీ కారు కొన్న కుమార్తెలు: గర్ల్ పవర్ అంటున్న మ్యూజిక్ డైరెక్టర్) వాట్సాప్ నంబర్ ద్వారా అనేక సేవలు రిజిస్టర్డ్ వినియోగదారులు మొబైల్ ఫోన్ నుండి ‘8976862090’నంబర్కు 'హాయ్' అని మెసేజ్ పంపితే చాలు.. క్లయింట్లు ఎలాంటి సమాచారాన్నైనా పొందవచ్చు. (మారుతి కార్ లవర్స్కి షాకింగ్ న్యూస్: ఆ కారణం చెప్పి..!) ►ప్రీమియం బకాయి ► బోనస్ సమాచారం ► పాలసీ స్థితి ►లోన్ అర్హత కొటేషన్ ►లోన్ రీపేమెంట్ కొటేషన్ ►చెల్లించవలసిన రుణ వడ్డీ ► ప్రీమియం చెల్లింపు సర్టిఫికేట్ ►ULIP-యూనిట్ల స్టేట్మెంట్ ►LIC సర్వీస్ లింక్లు ►సేవలను ప్రారంభించడం/నిలిపివేయడం ఎలా నమోదు చేసుకోవాలి? ► పాలసీ నంబర్స్, ఇన్స్టాల్మెంట్ ప్రీమియం, పాస్పోర్ట్ లేదా పాన్ కార్డ్ స్కాన్ చేసిన కాపీ (ఫైల్ సైజ్ 100kb) ►ఎఎల్ఐసీ అధికారిక వెబ్సైట్కి వెళ్లి ‘కస్టమర్ పోర్టల్’ ఎంచుకోవాలి. ►మీరు ఇంతకు ముందు నమోదు చేసుకోకుంటే, ‘న్యూ యూజర్’పై క్లిక్ చేయండి. ►బేసిక్ సర్వీసెస్లో వినియోగదారు ID, పాస్వర్డ్తో లాగిన్ కావాలి. పాలసీ వివరాలను నమోదు చేసి యాడ్ పాలసీని సెలెక్ట్ చేయాలి. దీంతో మీ పాలసీ వివరాలన్నీ స్వయంచాలకంగా రిజిస్ట్రేషన్ ఫారమ్లో రిజిస్టర్ అయి ఉంటాయి. కాగా ఎల్ఐసీ న్యూ జీవన్ అమర్, కొత్త టెక్-టర్మ్ అనే రెండు ప్లాన్లు ఇటీవలే పునఃప్రారంభం చేసిన సంగతి తెలిసిందే. మూడేళ్ల క్రితం విడుదల చేసిన ఈ రెండు టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్లను మళ్లీ లాంచ్ చేశామని ఎల్ఐసీ తెలిపింది. ఈ పాలసీలు ఇప్పుడు ఆఫ్లైన్లో లేదా ఆన్లైన్లో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉన్నాయి. -
ఎక్కువ అప్పులు చేశారంటూ జగన్ సర్కార్పై ఎల్లో మీడియా విషం
-
ఏపీ సర్కార్పై ఎల్లో మీడియా విషం.. పార్లమెంట్ సాక్షిగా వెల్లడైన వాస్తవాలు
సాక్షి, ఢిల్లీ: వివిధ రాష్ట్రాల అప్పుల వివరాలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. లోక్సభలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్.. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలు తీసుకున్న అప్పుల వివరాలను వెల్లడించారు. దేశంలోనే అత్యధిక అప్పులున్న రాష్ట్రాలు మూడు ఉన్నాయి. రూ.6 లక్షల కోట్లకు పైగా అప్పులున్న రాష్ట్రాలు తమిళనాడు, యూపీ, మధ్యప్రదేశ్.. రూ.5 లక్షల కోట్లకు పైగా అప్పులున్న రాష్ట్రం బెంగాల్. రూ. 4లక్షల కోట్లకు పైగా అప్పులున్న రాష్ట్రాలు కర్ణాటక, గుజరాత్. జనాభా తక్కువ ఉన్న కేరళ అప్పులు రూ.3.35 లక్షల కోట్లు ఉండగా, అప్పుల్లో తమిళనాడు నంబర్వన్గా ఉంది. చదవండి: మరింత పారదర్శకత, జవాబుదారీతనం పెరగాలి: సీఎం జగన్ తమిళనాడు అప్పులు రూ.6.59 లక్షల కోట్లు కాగా.. రెండు, మూడు స్థానాల్లో యూపీ, మధ్యప్రదేశ్ ఉన్నాయి. బీజేపీ పాలిత యూపీ అప్పులు రూ.6.53 లక్షల కోట్లు, బీజేపీ పాలిత మధ్యప్రదేశ్ అప్పులు రూ.3.17 లక్షల కోట్లు, బీజేపీ పాలిత గుజరాత్ అప్పులు రూ.4.02 లక్షల కోట్లు, కాంగ్రెస్ పాలిత రాజస్థాన్ అప్పులు రూ.4.77 లక్షల కోట్లు. తృణమూల్ అధికారంలో ఉన్న బెంగాల్ అప్పులు రూ.5.62 లక్షల కోట్లు. ధనిక రాష్ట్రమైన తెలంగాణకు 3.12 లక్షల కోట్ల అప్పులు ఉండగా, ఏపీకి అప్పులు రూ.3.98 లక్షల కోట్లు ఉన్నాయి. ఎక్కువ అప్పులు చేశారంటూ సీఎం జగన్ ప్రభుత్వంపై ఎల్లో మీడియా విషం చిమ్ముతున్న సంగతి తెలిసిందే. పార్లమెంట్ సాక్షిగా వాస్తవాలు వెల్లడయ్యాయి. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలు తీసుకున్న అప్పులు ఆంధ్రప్రదేశ్: 3,98,903 లక్షల కోట్లు అరుణాచల్ ప్రదేశ్: 15, 122 వేల కోట్లు అస్సాం: 1,07,719 లక్షల కోట్లు బీహార్: 2,46,413 లక్షల కోట్లు చత్తీస్గఢ్: 1,14,200 లక్షల కోట్లు గోవా: 28,509 వేలకోట్లు గుజరాత్: 4,02,785 లక్షల కోట్లు హర్యానా: 2,79,022 లక్షల కోట్లు హిమాచల్ ప్రదేశ్: 74,686 వేల కోట్లు ఝార్ఖండ్: 1,17,789 లక్షల కోట్లు కర్ణాటక: 4,62,832 లక్షల కోట్లు కేరళ: 3,35,989 లక్షల కోట్లు మధ్యప్రదేశ్: 3,17,736 లక్షల కోట్లు మహరాష్ట్ర: 6,08,999 లక్షల కోట్లు మణిపూర్: 13,510 వేల కోట్లు మేఘాలయ: 15,125 వేల కోట్లు మిజోరాం: 11,830 వేల కోట్లు నాగాలాండ్: 15,125 వేల కోట్లు ఒడిశా: 1,67,205 లక్షల కోట్లు పంజాబ్: 2,82,864 లక్షల కోట్లు రాజస్థాన్: 4,77,177 లక్షల కోట్లు సిక్కిం: 11,285 వేల కోట్లు తమిళనాడు: 6.59 లక్షల కోట్లు తెలంగాణ: 3,12,191 లక్షల కోట్లు త్రిపుర: 23,624 వేల కోట్లు ఉత్తప్రదేశ్: 6,53,307 లక్షల కోట్లు ఉత్తరాఖండ్: 84,288 వేల కోట్లు వెస్ట్ బెంగాల్: 5,62,697 లక్షల కోట్లు -
సెక్స్ వర్కర్ల ఓటర్ ఐడీలపై నివేదికివ్వండి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని జీహెచ్ఎంసీతోపాటు అన్ని జిల్లాల్లో ఉన్న సెక్స్ వర్కర్లను ఓటర్లుగా నమోదు చేయడంతోపాటు వారికి ఓటర్ ఐడీ కార్డులెన్ని ఇచ్చారన్న దానిపై నివేదిక ఇవ్వాలని ఎన్నికల సంఘం జిల్లా కలెక్టర్లు, ఎన్నికల అధికారులను ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి శశాంక్గోయల్ లేఖ రాశారు. సుప్రీంకోర్టు ఉత్తర్వులకు అనుగుణంగా జిల్లాలు, నియోజక వర్గాల వారీగా సెక్స్ వర్కర్ల నమోదు, వారికి ఓటరు కార్డుల పంపిణీపై వీలున్నంత త్వరగా నివేదిక ఇవ్వాలని ఆ లేఖలో పేర్కొన్నారు. పీపుల్స్ ఫ్రెండ్లీ విధానాలు అమలు చేయండి: సీఎస్ సాక్షి, హైదరాబాద్: ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ (ఈఓడీబీ)లో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో ఉందని, ఇదే విధానాన్ని భవిష్యత్తులో కూడా కొనసాగించాలని సీఎస్ సోమేశ్కుమార్ పలు శాఖల ఉన్నతాధికారులకు సూచించారు. సీఎం కేసీఆర్ సూచనల మేరకు బీఆర్కే భవన్లో ఆయన రెవెన్యూ, పౌరసరఫరాలు, రవాణా, విద్యుత్, గృహ నిర్మాణం, మున్సిపల్, కార్మిక తదితర 12 విభాగాల పనితీరుపై సమీక్ష నిర్వహించారు. ఆయా శాఖల ద్వారా స్టేక్హోల్డర్లతో పాటు ప్రజలకు మెరుగైన సేవలందించాలని సీఎస్ సూచించారు. ఈ 12 శాఖల్లోని 20 విభాగాల పరిధిలో 301 సంస్కరణలు అమలవుతున్నాయని, వీటిని మరింత సరళీకృతం చేసి యూజర్, పీపుల్స్ ఫ్రెండ్లీ విధానాలను అమల్లోకి తేవాలన్నారు. చదవండి: కూతురు ప్రేమ వివాహం.. తండ్రి ఆత్మహత్య -
భార్యపై కోపంతో మ్యాట్రిమెునిలో వివరాలు
సాక్షి, తిరువళ్లూరు(తమిళనాడు): ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో విడిపోవాలని నిర్ణయించుకున్నారు. విడాకులు తీసుకోవాలని కోర్టును కూడా ఆశ్రయించారు. విచారణ సాగుతున్న క్రమంలో భార్యకు సంబంధించిన వివరాలను మ్యాట్రిమొనిలో పెట్టి వక్రబుద్ధి చాటుకున్నాడు. మామ ఫిర్యాదుతో చివరికి అరెస్టయ్యాడు. వివరాలు.. తిరువళ్లూరు జిల్లా కడంబత్తూరు యూనియన్కి చెందిన యువతి(32)కి వెళ్లియూర్ పంచాయతీ అధ్యక్షుడు సురేష్బాబు కుమారుడు ఓంకుమార్(34)తో 2016లో వివాహం జరిగింది. వీరికి ఐదేళ్ల కుమారుడు ఉన్నాడు. మనస్పర్థలు రావడంతో కొంతకాలంగా దూరంగా ఉంటున్నారు. విడాకులు కావాలని పూందమల్లి కోర్టులో ఓంకుమార్ పిటిషన్ దాఖలు చేయడంతో విచారణ సాగుతోంది. రెండు వారాల క్రితం ప్రముఖ మ్యాట్రిమొనిలో వరుడు కావాలని భార్య వివరాలను ఉంచాడు. ఆసక్తి ఉన్న వారు యువతి తండ్రిని సంప్రదించాలని పేర్కొన్నాడు. యువతి తండ్రికి ఫోన్కాల్స్ రావడంతో ఆయన తిరువళ్లూరు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విచారణలో ఓంకుమార్ విషయం తెలిసింది. పోలీసులు బుధవారం ఓంకుమార్ను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. చదవండి: 'లవ్స్టోరి'ని తలపిస్తున్న తమిళనాడు జంట కథ -
రేపటి నుంచే మరో మహా క్రికెట్ సంగ్రామం..
T20 World Cup Details: ఐపీఎల్-2021 కోలాహలం ముగిసిన గంటల వ్యవధిలోనే మరో మహా సంగ్రామానికి తెరలేవనుంది. యూఏఈ వేదికగా రేపటి(అక్టోబర్ 17 ) నుంచి టీ20 ప్రపంచ కప్ ప్రారంభం కానుంది. ఐదేళ్ల విరామం తరువాత జరగనున్న పొట్టి ప్రపంచ కప్లో ఈసారి అత్యధికంగా 16 జట్లు తలపడనున్నాయి. ఈ టోర్నీలో తొలుత గ్రూప్-ఏ, గ్రూ-బిలోని క్వాలిఫయర్స్ జట్ల మధ్య తొలి రౌండ్ లీగ్ మ్యాచ్లు జరగనున్నాయి. అనంతరం మేజర్ జట్ల మధ్య సూపర్ 12 స్టేజ్ మ్యాచ్లు అక్టోబర్ 23 నుంచి ప్రారంభమవుతాయి. రేపటి తొలి గేమ్లో ఒమన్-పపువా న్యూ గినియా జట్లు తలపడతాయి. మరో మ్యాచ్లో బంగ్లాదేశ్.. స్కాట్లాండ్ను ఢీకొట్టనుంది. గ్రూప్ ఏ: శ్రీలంక, ఐర్లాండ్, నెదర్లాండ్స్, నమీబియా గ్రూప్ బీ: బంగ్లాదేశ్, స్కాట్లాండ్, పపువా న్యూ గినియా, ఒమన్ ప్రతి జట్టు గ్రూపులోని ఇతర జట్టుతో ఓ మ్యాచ్లో తలపడుతుంది. రెండు గ్రూప్ల నుంచి తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు తదుపరి రౌండ్( సూపర్ 12)కు చేరుకుంటాయి. అక్కడ ఈ జట్లు ఎనిమిది అగ్రశ్రేణి జట్లతో రెండు గ్రూపులుగా విభజించబడతాయి. గ్రూప్ 1: ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్, A1, B2 గ్రూప్ 2: భారత్, పాకిస్తాన్, న్యూజిలాండ్, అఫ్గానిస్తాన్, B1, A2 ఇక్కడ కూడా ప్రతి జట్టు గ్రూపులోని ఇతర జట్టుతో ఓ మ్యాచ్లో తలపడుతుంది. అనంతరం రెండు గ్రూప్ల నుంచి తొలి రెండు స్థానాల్లో నిలిచే జట్లు సెమీ ఫైనల్కు అర్హత సాధిస్తాయి. గ్రూప్ దశలో గెలిచిన జట్టుకు రెండు పాయింట్ల చొప్పున కేటాయిస్తారు. మ్యాచ్ టై అయిన పక్షంలో ఇరు జట్లకు చెరో పాయింట్ కేటాయిస్తారు. చదవండి: ధోని ఫ్యాన్స్కు మరో గుడ్ న్యూస్.. ఐపీఎల్ ట్రోఫీతో పాటు..? -
అమ్మేది ఎవరో తెలియాల్సిందే.. సీసీపీఏ ఆదేశాలు
న్యూఢిల్లీ:ప్యాకింగ్పై విక్రేతల పేరు, చిరునామా, ఫిర్యాదుల పరిష్కార అధికారి నంబర్ను స్పష్టంగా, అందుబాటులో ఉండే పద్ధతిలో ఈ–కామర్స్ సంస్థలు ప్రదర్శించాల్సిందేనని సెంట్రల్ కంజ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (సీసీపీఏ) స్పష్టం చేసింది. ఈ మేరకు సీసీపీఏ అన్ని రాష్ట్రాలు, పారిశ్రామిక సంఘాలకు సమాచారమిచ్చింది. వినియోగదార్ల రక్షణ (ఈ–కామర్స్) నిబంధనలు–2020 ప్రకారం విక్రేతల వివరాలు పొందుపర్చడం లేదంటూ ఫిర్యాదులు వెల్లువెత్తిన నేపథ్యంలో సీసీపీఏ స్పందించింది. నిబంధనలను ఉల్లంఘించిన వారిపై చట్టం కింద చర్య తీసుకుంటామని సీసీపీఏ కమిషనర్ అనుపమ్ మిశ్రా తెలిపారు. ఈ ఏడాది ఏప్రిల్–జూలైలో దేశవ్యాప్తంగా నేషనల్ కంజ్యూమర్ హెల్ప్లైన్కు ఈ–కామర్స్ కంపెనీల మీద 69,208 ఫిర్యాదులు అందాయి. బ్యాంకింగ్, టెలికం రంగాలతో పోలిస్తే ఇవే అధికం. -
ఓలా, సింపుల్ వన్కు పోటీగా మరో ఎలక్ట్రికల్ వెహికల్స్
Electric Vehicle: దేశీయ మార్కెట్లో ఓలా, సింపుల్ వన్ ఎలక్ట్రికల్ వెహికల్స్కు అందుబాటులో ఉండగా.. ఆ వెహికల్స్ పోటీగా మరో ఎలక్ట్రికల్ వెహికల్ విడుదల కానుంది.పెట్రోల్ కంటే ఎలక్ట్రికల్ వెహికల్స్కు అయ్యే నిర్వహణ ఖర్చు చాలా తక్కువ. పైగా పెరుగుతున్న ధరలతో వాహనదారులు టెక్నాలజీకి అనుగుణంగా అప్డేట్ అవుతున్నారు. ఈనేపథ్యంలో ఒకినోవా ఆటో మొబైల్ సంస్థ ఒకి90, ఒకి100 పేరుతో ఎలక్ట్రికల్ వెహికల్ను వచ్చే ఏడాది మార్కెట్లో విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఒకినోవా ఈవీ స్పెసిఫికేషన్స్ కేవలం 40 నిమిషాల్లో ఫాస్ట్గా ఛార్జింగ్ ఎక్కేలా ఎలక్ట్రిక్ వెహికల్స్ లో లిథియం ఆయాన్ బ్యాటరీని అమర్చనున్నట్లు ఒకినోవా ఆటో మొబైల్ సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఈ వెహికల్లో సెంట్రల్ మౌంటెడ్ మోటార్ తో పాటు జియో ఫెన్సింగ్, నావిగేషన్, డయాగ్నోస్టిక్స్ ఫీచర్స్, ఇన్ బిల్ట్ 4జీ సిమ్ను కనెక్ట్ చేయనున్నారు. వాటి ధరలు వచ్చే ఏడాది మార్కెట్లో విడుదల కానున్న ఒకి90 ధర రూ.1లక్ష కంటే తక్కువగా ఉంటుందని ఒకినోవా ఆటోటెక్ ఎండీ జితేందర్ శర్మ అన్నారు.కాగా, ఒకి90 ని లాంఛ్ చేయడానికి ముందే ఒకి100 ఎలక్ట్రిక్ వెహికల్ను లాంఛ్ చేయాలని ఆ సంస్థ ప్రతినిధులు భావిస్తున్నారు. -
మిషన్ ‘ఆయిల్ పామ్’.. సబ్సిడీ తీరు ఇలా..
సాక్షి, అమరావతి: పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా వంట నూనెల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించేలా పామాయిల్ సాగును జాతీయ వంట నూనెల మిషన్ (ఎన్ఎంఈవో)లో కేంద్ర ప్రభుత్వం చేర్చింది. వంట నూనెల దిగుమతిని తగ్గించడం, ఇతర దేశాలపై ఆధారపడకుండా దేశీయంగా ఆయా పంటలు, ఉత్పత్తిని ప్రోత్సహించడం దీని లక్ష్యం. ఆహార ధాన్యాలైన వరి, గోధుమ, పంచదారలో మనదేశం స్వయం సమృద్ధి సాధించి ఎగుమతి దిశగా సాగుతుండగా వంటనూనెల్ని మాత్రం పెద్దఎత్తున దిగుమతి చేసుకుంటోంది. ఈ పరిస్థితిని నివారించేలా ఆంధ్రప్రదేశ్ సహా వివిధ రాష్ట్రాల్లో పెద్దఎత్తున ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహించాలని నిర్ణయించింది. దిగుమతుల్లో 56 శాతం పామాయిలే... మనదేశం ఏటా సుమారు 133.5 లక్షల టన్నుల వంట నూనెల్ని దిగుమతి చేసుకుంటుండగా దీని విలువ సుమారు రూ.80 వేల కోట్లు ఉంటుంది. దిగుమతి చేసుకునే నూనెల్లో 57 శాతం పామాయిల్ కాగా 27 శాతం సోయా, 16 శాతం సన్ఫ్లవర్ ఆయిల్ ఉంది. ఒక్క పామాయిల్పైనే కేంద్ర ప్రభుత్వం సుమారు రూ.11 వేల కోట్లను ఖర్చు చేస్తోంది. ఈ నేపథ్యంలో దేశీయంగా ఆయిల్ పామ్ తోటల విస్తీర్ణం, ఉత్పత్తిని పెంచేలా చర్యలు చేపట్టాలని నిర్ణయించింది. ఈశాన్య రాష్ట్రాలు, అండమాన్ నికోబార్ దీవులు, ఆంధ్రప్రదేశ్ తదితర చోట్ల ఆయిల్ పామ్ సాగుపై ప్రత్యేక దృష్టి సారించింది. ప్రస్తుత 3.28 లక్షల హెక్టార్లలో సాగులో ఉండగా 2025–26 నాటికి 10 లక్షల హెక్టార్లకు, 2029–30 నాటికి 16.7 లక్షల హెక్టార్లకు పెంచాలని నిర్దేశించారు. నూనె దిగుబడిని 3.15 లక్షల టన్నుల నుంచి 11 లక్షల టన్నులకు పెంచాలని లక్ష్యంగా నిర్ణయించారు. ప్రభుత్వ సాయం ఎలా ఉంటుందంటే... సాగు విస్తరణలో భాగంగా జాతీయ ఆహార భద్రత మిషన్ (ఎన్ఎఫ్ఎస్ఎం–ఓపీ) కింద మొక్కలకు 85 శాతం సబ్సిడీని ఉద్యాన శాఖ ఇస్తుంది. నాణ్యమైన మొక్కల్ని అందజేస్తుంది. తోటల నిర్వహణ, అంతర పంటలు, గొట్టపుబావులు, పంపు సెట్లు, వర్మీ కంపోస్ట్ యూనిట్లు, మెషినరీ, ఇతర పరికరాలకు 50 శాతం సాయం అందిస్తుంది. తోటల సాగుపై రైతులకు ఉచితంగా శిక్షణ ఇస్తుంది. రైతులకు లాభసాటిగా ఉండేలా ధరల ఫార్ములాను నిర్ణయిస్తుంది. ఏటా రూ.5 వేల కోట్లు ఖర్చు పెడితే.. వంట నూనెల దిగుమతులపై కేంద్రానికి ఏటా పన్నుల రూపంలో రూ.40 వేల కోట్ల ఆదాయం వస్తుంది. ఆయిల్ పామ్ తోటల పెంపకాన్ని ప్రోత్సహించేందుకు వచ్చే ఐదేళ్లలో ఏటా రూ.5 వేల కోట్లను వెచ్చిస్తే సత్ఫలితాలు కనిపిస్తాయని, రైతులు కూడా పెద్దఎత్తున ఆసక్తి చూపుతారని ఆయిల్ పామ్ రైతుల జాతీయ సంఘం నేతలు క్రాంతి కుమార్ రెడ్డి, బి.రాఘవరావు పేర్కొన్నారు. దేశంలో నంబర్ వన్ ఏపీ.. ఆయిల్ పామ్ సాగు, ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే నంబర్ వన్ స్థానంలో ఉంది. ప్రస్తుతం 1.62 లక్షల హెక్టార్లలో 1.14 లక్షల మంది రైతులు దీన్ని సాగు చేస్తున్నారు. సాలీనా హెక్టార్కు 19.81 టన్నుల ఆయిల్ దిగుబడి వస్తోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వస్తూనే పామాయిల్ రైతులను ఆదుకునేలా పలు చర్యలు చేపట్టారు. ఫలితంగా రాష్ట్రంలో సాగు పెరుగుతోంది. 9 జిల్లాల్లో 229 మండలాలలో ఈ పంట సాగవుతోంది. -
మీ పాన్ కార్డును అప్డేట్ చేయండి ఇలా...!
పర్మినెంట్ అకౌంట్ నెంబర్(PAN) పాన్ కార్డు దేశవ్యాప్తంగా ముఖ్యమైన గుర్తింపు కార్డులలో ఒకటి. బ్యాంకుల్లో ఎక్కువ లావాదేవీలను జరిపే వారికి పాన్కార్డ్ అనేది తప్పనిసరి. పాన్కార్డులో ఏదైనా తప్పుడు సమాచారం ఉంటే భవిష్యత్తులో సమస్యగా మారుతుంది. వీలైనంత త్వరగా పొరపాట్లను సరిదిద్దుకోవాలి. పాన్కార్డులోని పొరపాట్లను ఇంట్లో ఉండి ఆన్లైన్లోనే అప్డేట్ చేయవచ్చును. మీ పాన్ కార్డును ఇలా అప్డేట్ చేయండి...! 1. మీ బ్రౌజర్లో https://www.onlineservices.nsdl.com/paam/endUserRegisterContact.html వెబ్సైట్ను ఒపెన్ చేయండి. 2. మీకు ఆన్లైన్ పాన్ అప్లికేషన్ ఫారం మీకు కనిపిస్తోంది. అందులో ‘అప్లై ఆన్లైన్’ను ఎంచుకోండి. 3.అందులో ‘అప్లికేషన్ టైప్’ను ఎంచుకోండి. అందులో ఛేంజేస్ ఆర్ కరెక్షన్ ఇన్ ఎక్జ్సిటింగ్ పాన్ డేటాను ఎంచుకోండి. కేటగీరి ఆప్షన్లో ఇన్డివిజువల్ను ఎంచుకోండి. 4. మీ వ్యక్తిగత సమాచారాన్ని నమోదు చేయండి. 5. కాప్చాకోడ్ను ఫిల్ చేసి సబ్మిట్ ఆప్షన్పై నోక్కండి. 6. మీ సమాచారాన్ని ఫిల్ చేసి ఎంటర్ చేశాక వెబ్సైట్ నుంచి టోకెన్ నంబర్ ఈ-మెయిల్కు వస్తుంది. అందులో కంన్టిన్యూ బటన్ క్లిక్ చేయండి. 7. మీరు మరొక వెబ్ పేజీకి మళ్లించబడతారు. తరువాత ‘NSDL e-gov’లో ఈ-సైన్ ద్వారా స్కాన్ చేసిన చిత్రాలను సమర్పించండి. 8. వెబ్పేజీలో అడిగే అవసరమైన సమాచారాన్ని పూరించండి. తదుపరి క్లిక్ చేయండి. 9. తరువాత మీ అడ్రస్కు సంబంధించిన వెబ్ పేజీకి మళ్లించబడతారు. 10. మీ అడ్రస్, వయసు, గుర్తింపు ఉన్న కార్డును , పాన్ కార్డును అప్లోడ్ చేయండి. 11. డిక్లరేషన్పై సంతకం చేసి సబ్మిట్ బటన్పై క్లిక్ చేయండి. 12. తరువాత పేమెంట్ గేట్ వే ఆప్షన్ వెబ్ పెజీకి మళ్లించబడతారు . పేమెంట్ అయ్యాక మీకు రశీదు వస్తోంది. 13. రశీదును ప్రింట్ తీసుకొండి, మీ పాస్పోర్ట్ సైజు ఫోటోతో పాటు రసీదు స్లిప్లో సూచించిన ప్రదేశంలో సంతకం చేయాలి. ఈ పత్రాలను NSDL e-gov కార్యాలయానికి పంపాలి. కొద్దిరోజుల తరువాత మీ అప్డేట్ అయినా సమాచారంతో మీకు పాన్ కార్డు వస్తోంది. -
టోల్ ఫ్రీ నంబర్ల గురించి తెలుసుకుందామా..
కడప కార్పొరేషన్: మన మేదో పని మీద వెళ్తుంటాం. రోడ్డు మీద ప్రమాదం జరిగి ఇద్దరు వ్యక్తులు ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతుంటారు. వెంటనే మొబైల్ నుంచి 108కి ఫోన్ చేసి సమాచారం అందిస్తాం. ఒక్క కాల్తో రెండు ప్రాణాలు కాపాడుతాం. పైగా ఫోన్ చేయడం వల్ల ఒక్క పైసా ఖర్చుండదు. ఇలాంటి టోల్ ఫ్రీ నంబర్లు అన్ని రంగాలకూ విస్తరించాయి. కొన్ని ప్రయివేటు సంస్థలు కూడా సమాచారాన్ని టోల్ ఫ్రీ నంబర్ల ద్వారా అందిస్తున్నాయి. అలాంటి టోల్ ఫ్రీ నంబర్ల గురించి తెలుసుకుందాం. 155333 (ఏపీఎస్పీడీసీఎల్): విద్యుత్ సరఫరాలో అంతరాయం, లో ఓల్టేజీ, సిబ్బంది పనితీరు, ఇతర విద్యుత్ సమస్యలను ఈ నంబర్కు ఫోన్ చేసి చెప్పవచ్చు. 1910 (బ్లడ్ బ్యాంక్స్): అందుబాటులో ఉన్న గ్రూపు రక్తం, ఇతర వివరాలు ఈ నంబర్కు ఫోన్ చేయడం ద్వారా తెలుసుకోవచ్చు. 1950 (ఎన్నికల సంఘం): ఓటరు నమోదు, తొలగింపులు, పేరు మార్పిడి, ఓటు మార్పిడి, అవసరమైన సర్టిఫికెట్లు వంటి వివరాలు తెలుసుకోవచ్చు. 1100(మీ సేవ): ఆయా ప్రాంతాల్లో మీ సేవ పథకం అమలు తీరు, సమస్యలపై ఈ నంబర్కు ఫిర్యాదు చేయవచ్చు. 18004251110(వ్యవసాయ శాఖ): ప్రభుత్వం ప్రకటించిన ధాన్యం మద్దతు ధర, రైతుల సమస్యలు, మిల్లర్ల దోపిడీ, అధికారులు సహకరించకపోవడం వంటి వాటిపై ఫిర్యాదు చేయవచ్చు. 18002004599 (ఏపీఎస్ఆర్టీసీ): రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ సేవలు, సంస్థ బస్సుల్లో అసౌకర్యాలు, ప్రయాణికులతో సిబ్బంది ప్రవర్తనపై ఫిర్యాదు చేయవచ్చు. 101(అగ్ని మాపక శాఖ): అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు, ప్రకృతి వైపరీత్యాలు ఏర్పడినప్పుడు ఈ నంబర్కు ఫోన్ చేస్తే సిబ్బంది వచ్చి నియంత్రణ, సహాయ చర్యలు చేపడుతారు. విపత్తుల నిర్వహణలో సేవలు అందిస్తారు. 108 (ఎమర్జెన్సీ అంబులెన్స్): ప్రమాదం జరిగినా, ప్రాణాపాయ పరిస్థితుల్లో అస్వస్థతకు గురైనా ఈ నంబర్కు ఫోన్ చేయవచ్చు. క్షణాల వ్యవధిలో అంబులెన్స్ వచ్చి వైద్య సిబ్బంది చికిత్స అందిస్తారు. ఇంటి వద్ద ఉన్న రోగులనూ అత్యవసరంగా ఆసుపత్రికి చేరవేస్తారు. 1997(హెచ్ఐవీ–కంట్రోల్ రూమ్): హెచ్ఐవీ/ఎయిడ్స్ వ్యాధులపై బాధితులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకోవచ్చు. 100(పోలీసు శాఖ): పోలీసుల తక్షణ సాయం పొందేందుకు ఈ నంబర్కు కాల్ చేయవచ్చు. గృహహింస, వరకట్న వేధింపులు, చట్ట వ్యతిరేక కార్యకలాపాలు, పోలీసుల ప్రవర్తనపై కూడా ఫిర్యాదు చేయవచ్చు. 131(రైల్వే శాఖ): రైల్వే రిజర్వేషన్, రైళ్ల రాకపోకల వివరాలు తెలుసుకోవచ్చు. స్థానిక రైల్వేస్టేషన్ సమచారం తెలుస్తుంది. 1090 (క్రైం స్పెషల్ బ్రాంచ్): చోరీలు, ఇతర నేర సంబంధ సమస్యలను తెలియజేయవచ్చు. అది జిల్లా కేంద్రంలో క్రైం స్టాఫర్కు చేరుతుంది. అసాంఘిక కార్యకలాపాలు, వేధింపులు, జూదం, వ్యభిచారం వంటి వాటిపై ఫిర్యాదు చేయవచ్చు. 155361(అవినీతి నిరోధక శాఖ): ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులు అవినీతికి పాల్పడుతున్నట్లు తెలిస్తే సమాచారం ఇవ్వచ్చు. 155321 (ఉపాధి హామీ పథకం): మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం మరింత సమర్థవంతంగా అమలు చేసేందుకు గ్రామీణాభివృద్ధి శాఖ దీనిని వినియోగిస్తోంది. పథకంలో సమస్యలు, లోపాలు, అవకతవకలపై ఫిర్యాదు చేయవచ్చు. 198(బీఎస్ఎన్ఎల్): బీఎస్ఎన్ఎల్ సంస్థకు చెందిన టెలిఫోన్ సమస్యలపై వినియోగదారులు ఈ నంబర్కు ఫిర్యాదు చేయవచ్చు. 1098 (చైల్డ్ హెల్ప్ లైన్): ఎలాంటి ఆదరణ, రక్షణ లేని బాలలను ఆదుకొనేందుకు, బాలలు ఇబ్బందులు పడుతున్నట్లు తెలిసినా, బాల కార్మికులు తారసపడినా ఈ నంబర్కు తెలియజేయవచ్చు. 18004255314(ఐసీడీఎస్): స్త్రీ, శిశు అభివృద్ధి సంస్థలో సిబ్బంది పనితీరు, పిల్లలకు ఆహార సరఫరాలో లోపాలుంటే ఈ నంబర్కు ఫిర్యాదు చేయవచ్చు. 18001208757(కడప కార్పొరేషన్): కడప నగరపాలక సంస్థలో పారిశుధ్యం, తాగునీరు, డ్రైనేజీ, వీధిలైట్లు వంటి సమస్యలపై ఫోన్ చేసి తెలపవచ్చు. -
నేటి నుంచి వేములవాడలో హెలీకాప్టర్ సేవలు
వేములవాడ: వేములవాడ రాజన్న జాతర మహోత్సవాల్లో పాల్గొనే భక్తులకు బుధవారం నుంచి హెలికాప్టర్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు హెలిట్యాక్సీ సంస్థ ప్రతినిధులు మంగళవారం రాత్రి రాజన్న గుడి చెరువు కట్టపై స్థల పరిశీలన చేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు. భక్తులు గగనతలంలో 7 నిమిషాలపాటు తిరిగేందుకు ఒక్కొక్కరికి రూ.3 వేల చొప్పున తీసుకోనున్నారు. నాంపల్లి గుట్ట, వేములవాడ పట్టణం చుట్టూ తిప్పుతూ తిరిగి గుడి చెరువు వద్దకు తీసుకువస్తారు. 15 నిమిషాలు గగనతలంలో విహరించేందుకు ఒక్కొక్కరికి రూ.5,500 తీసుకొని నాంపల్లి గుట్ట, మిడ్మానేరు చూపించనున్నారు. హెలికాప్టర్ ఒక్కో ట్రిప్పులో ఐదుగురి చొప్పున తీసుకెళ్తారని అధికారులు తెలిపారు. మరిన్ని వివరాల కోసం 94003 99999, 74834 32752, 99800 05519, 95444 44693 ఫోన్ నంబర్లలో సంప్రదించాలని సూచించారు. చదవండి: వైరల్: ఆకలేస్తే అంతేమరీ! -
నల్లధనంపై పోరులో కీలక ముందడుగు
న్యూఢిల్లీ /బెర్న్ : స్విట్జర్లాండ్ బ్యాంకుల్లో భారతీయుల ఖాతాల వివరాలకు సంబంధించి రెండో జాబితా భారత్కు చేరింది. స్విట్జర్లాండ్తో సమాచార మార్పిడి ఒప్పందానికి (ఏఈఓఐ) అనుగుణంగా భారత్కు స్విట్జర్లాండ్ ఈ కీలక సమాచారం అందచేసింది. విదేశాల్లో మూలుగుతున్న నల్లధనంపై ప్రభుత్వం చేపట్టిన పోరాటంలో ఇది మైలురాయిగా భావిస్తున్నారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఈ ఒప్పందం కింద స్విట్జర్లాండ్ ఫెడరల్ ట్యాక్స్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్డీఏ) బ్యాంకు ఖాతాలపై సమాచారాన్ని అందిస్తున్న 86 దేశాల్లో భారత్ ఒకటి. ఏఈఓఐ కింద స్విస్ బ్యాంకుల్లో భారత పౌరుల బ్యాంకు ఖాతాల వివరాలకు సంబంధించి 2019 సెప్టెంబర్లో భారత్ స్విట్జర్లాండ్ నుంచి తొలి జాబితా అందుకుంది. చదవండి : బంజారాహిల్స్లో గుట్టలుగా కరెన్సీ కట్టలు ఈ ఏడాది 31 లక్షల ఫైనాన్షియల్ అకౌంట్లకు సంబంధించిన సమాచారాన్ని ఆయా దేశాలతో పంచుకున్నామని ఎఫ్డీఏ శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొంది. స్విస్ బ్యాంకుల్లో 86 దేశాలకు చెందిన 31 లక్షల ఖాతాల సమాచారాన్ని స్విట్జర్లాండ్ పంచుకోగా అందులో భారత జాతీయులు, సంస్ధల సంఖ్య భారీగానే ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. పన్ను ఎగవేత, ఇతర ఆర్థిక నేరాలకు సంబంధించిన దర్యాప్తులో భాగంగా గత ఏడాదిగా భారత అధికారుల విజ్ఞప్తి మేరకు స్విస్ అధికారులు 100కు పైగా వ్యక్తులు, సంస్ధలకు సంబంధించిన సమాచారాన్ని పంచుకున్నారని అధికారులు తెలిపారు. ఇక చురుగ్గా ఉన్న ఖాతాలు, 2018లో మూసివేసిన ఖాతాలకు సంబంధించిన సమాచారాన్ని ఏఈఓఐలో భాగంగా స్విస్ అధికారులు భారత్తో పంచుకుంటారు. స్విస్ అధికారులు పంచుకున్న ఖాతాల్లో పనామా, బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్, కేమాన్ దీవులు వంటి విదేశాల్లో భారతీయులు నెలకొల్పిన కంపెనీలు, వ్యాపారవేత్తలు, రాజకీయ నేతలు, రాజ కుటుంబాలకు చెందిన వ్యక్తుల వివరాలు ఉండవచ్చని భావిస్తున్నారు. అయితే రెండో జాబితాలో వెల్లడించిన భారతీయుల ఖాతాల్లో ఎంత మొత్తం సంపద ఉందనే వివరాలను అధికారులు వెల్లడించలేదున. ఒప్పంద నిబంధనల్లో పొందుపరిచిన గోప్యతా క్లాజుల కారణంగా సమాచారాన్ని వెల్లడించలేమని అధికారులు చెబుతున్నారు. స్విస్ అధికారులు పంచుకునే సమాచారంలో స్విస్ బ్యాంకు ఖాతాలకు సంబంధించి ఖాతాదారు పేరు, చిరునామా, నివసించే దేశం, పన్ను గుర్తింపు నెంబర్, ఆయా బ్యాంకుల పేర్లు, అకౌంట్లో బ్యాలెన్స్, క్యాపిటల్ ఇన్కం వంటి కీలక సమాచారం ఉంటుంది. పన్ను చెల్లింపుదారులు తమ ట్యాక్స్ రిటన్స్లో సరైన సమాచారం అందించారా లేదా అనే కోణంలో పన్ను అధికారులు ఈ సమాచారాన్ని పరిశీలించేందుకు అనుమతిస్తారు. ఇక వచ్చే ఏడాది సెప్టెంబర్లో స్విస్ అధికారులు తమ బ్యాంకుల్లో భారత జాతీయులు, వారి సారథ్యంలోని సంస్ధల ఖాతాలకు సంబంధించిన సమచారంతో కూడిన మూడో జాబితాను భారత్కు అందచేస్తారు. -
లీకైన రెడ్మి 9 వివరాలు..
ముంబై: ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం షావోమి రెడ్మి 9ఫోన్కు సంబంధించిన కీలక వివరాలు ఆన్లైన్లో లీకయ్యాయి. జూన్ 25, 2020లో రెడ్మి 9ను లాంచ్ చేయనున్నారు. రెడ్మి 9 లాంచ్ చేసిన తర్వాత రెడ్మి 9A, 9Cలను కూడా విడుదల చేయనున్నారు. లీకయిన వివరాల ప్రకారం.. 3జీబీ ర్యామ్, 34 జీబీ స్టోరేజ్తో కూడిన రెడ్మీ 9 సిరీస్ ధర భారత్లో రూ. 10,500వరకు ఉండవచ్చు. మరోవైపు 4జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్ ధర రూ.11,200 వరకు ఉండవచ్చు. ఓ సంస్థ తెలిపిన వివరాల ప్రకారం.. రెడ్మీ 9 ఫోన్ 6.5 అంగుళాల ఫుల్ హెచ్ డీ+ డిస్ ప్లేతో ఆకట్టుకోనుంది. ఈ స్మార్ట్ ఫోన్లో మీడియాటెక్ హీలియో జీ70 ను అందించనున్నారు. వీటిలో ప్రధాన కెమెరా సెటప్.. 13 మెగా పిక్సెల్ సెన్సార్, 8 మెగా పిక్సెల్ సెన్సార్, 5 మెగా పిక్సెల్ సెన్సార్, 2 మెగా పిక్సెల్ సెన్సార్లతో అలరించనుంది. ఇందులో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, యూఎస్బీ టైప్పోర్ట్, 3.5 ఎమ్ఎంఎం హెడ్ఫోన్ జాక్తో పాటు ఐఆర్ బ్లాస్టర్ లాంటి అత్యుధునికి సాంకేతికను అందించనున్నారు. చదవండి: అతిచవక ధరలో రెడ్మి టీవీ -
స్వైన్ఫ్లూ మృతుల వివరాలు ఎందుకివ్వలేదు?
సాక్షి, హైదరాబాద్: స్వైన్ఫ్లూ, టైఫాయిడ్, డెంగ్యూ, మలేరియా వంటి రోగాలు, విషజ్వరాల బారిన పడి మరణించినవారి వివరాలు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభు త్వం ఎందుకు దాటవేత వైఖరి అవలంబిస్తోందని హైకోర్టు ప్రశ్నించింది. తొలిసారి వివరాలు కోరినప్పుడు ఆయా రోగాల కారణంగా మృత్యువాత పడినవారి వివరాలు ఇవ్వకుండా ఎంతమంది ఆ రోగాల బారిన పడ్డారో, ఎంతమందికి వైద్య పరీక్షలు నిర్వహించారో వంటి వివరాలే ఇచ్చిన అధికారులు రెండో సారి కూడా మృతుల వివరాలు ఇవ్వకపోవడంపై ధర్మాసనం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ నెల 8న జరిగే విచారణ నాటికి పూర్తి వివరాలు అందజేయాలని హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ ఎ.రాజశేఖర్రెడ్డిలతో కూడిన ధర్మాసనం ఇటీ వల ఉత్తర్వులు జారీ చేసింది. ఆయా రోగాలు, విషజ్వరాల కారణంగా పేద రోగులకు ప్రభుత్వాసుపత్రుల్లో సరైన చికిత్స అందడం లేదని, రోగులు చని పోతున్నారని, ప్రైవేటు ఆస్పత్రుల్లో బిల్లుల భారాన్ని రోగులు మోయలేకపోతున్నారని న్యాయవాది రాపోలు భాస్కర్ రాసిన లేఖను హైకోర్టు ప్రజాహిత వ్యాజ్యంగా పరిగణించి విచారణ చేపట్టింది. ఎన్ని వైద్య శిబిరాలు నిర్వహించారో, ఎంతమందికి వైద్య పరీక్షలు చేశారో, వారిలో ఎంతమందికి ఆయా రోగా లు ఉన్నాయని తేలిందో, తీసుకున్న నివారణ చర్య లు తదితర వివరాలతో సమగ్ర నివేదిక అందజేయాలని ధర్మాసనం ప్రభుత్వాన్ని ఆదేశించింది. స్వైన్ఫ్లూపై ఆందోళన తెలంగాణ వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ఇచ్చి న రెండో నివేదికలో మరణించిన రోగుల వివరాలు లేకపోవడంపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఏడాది జనవరి నుంచి ఏప్రిల్ వరకూ 5,574 మందికి వైద్యపరీక్షలు నిర్వహిస్తే 1,165 మందికి స్వైన్ఫ్లూ ఉన్నట్లు తేలిందని నివేదికలోని వివరాలు చూసిన ధర్మాసనం ఆందోళన వ్యక్తం చేసింది. అందులో హైదరాబాద్లోనే 606 మంది ఉన్నారని, వ్యాధి నివారణకు తీసుకున్న చర్యలు, ఇప్పటి వరకు మరణించిన రోగుల వివరాలను అందజేయాలని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది సంజీవ్కుమార్ను ఆదేశించింది. కేంద్రం కూడా తమ వాదనలతో కౌం టర్ వ్యాజ్యాన్ని దాఖలు చేయాలని, రాష్ట్రప్రభుత్వం సమగ్ర వివరాలను తెలపాలని ఆదేశించింది. -
‘వేలిముద్రలతో మృతదేహాలను గుర్తించలేం’
న్యూఢిల్లీ: కేవలం వేలిముద్రలను ఉపయోగించి గుర్తు తెలియని మృతదేహాల వివరాలను కనుక్కోవడం అసాధ్యమని భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) ఢిల్లీ హైకోర్టుకు చెప్పింది. మృతదేహాల వేలిముద్రలను మాత్రమే ఉపయోగించి 120 కోట్ల మందిలో ఆ వేలిముద్రలు ఎవరివో గుర్తించే సాంకేతిక పరిజ్ఞానం తమ వద్ద లేదంది. ఒక వ్యక్తి ఆధార్ నంబర్ ఉన్నప్పుడు మాత్రమే.. ఆ ఆధార్కు అనుసంధానమై ఉన్న వేలి ముద్రలు ఆ వ్యక్తివేనా? కాదా? అన్నది తెలుసుకోవచ్చని చెప్పింది. గుర్తు తెలియని మృతదేహాల వివరాలను కనుక్కునేందుకు ఆధార్ను ఉపయోగించేలా ప్రభుత్వాలు, దర్యాప్తు సంస్థలను ఆదేశించాలంటూ ఓ న్యాయవాది వేసిన పిటిషన్ విచారణ సందర్భంగా ఈ వివరాలను యూఐడీఏఐ కోర్టుకు తెలిపింది. -
రాఫెల్ డీల్ : పదిరోజుల్లో వివరాలివ్వండి
సాక్షి, న్యూఢిల్లీ: రాఫెల్ జెట్ కొనుగోళ్లు వివాదం మరింత ముదురుతోంది. 36 రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు అంశంపై దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్డు నేడు (అక్టోబర్ 31, బుధవారం) విచారించింది. ఈ సందర్భంగా కేంద్రానికి సుప్రీం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ డీల్ పై పూర్తి వివరాలను సమర్పించాల్సిందిగా కోరింది. పదిరోజుల్లోగా నివేదికలను అందించాల్సిందిగా ఆదేవించింది. కాంగ్రెస్ నేతలు మాజీ కేంద్ర మంత్రులు యశ్వంత్ సిన్హా, అరుణ్ శౌరీ పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ తీర్పునిచ్చింది. రాఫెల్ ఒప్పందంలో భాగంగా అనిల్ అంబానీకి చెందిన డిఫెన్స్ సంస్థకు ఈ కాంట్రాక్టును ఎలా అందించారో చెప్పాలని కూడా అత్యున్నత న్యాయస్థానం కోరింది. ఒక్కొక్క రాఫెల్ను ఎంత ధర పెట్టి కొన్నారో స్పష్టం చేయాలని సుప్రీం కేంద్రాన్ని డిమాండ్ చేసింది. మరో పది రోజుల్లోగా సీల్డు కవర్లో రాఫెల్ ఖరీదు వివరాలను పంపాలని సుప్రీం ఆదేశించింది. అలాగే ఈ ఒప్పందం కోసం జరిగిన వ్యూహాత్మక వివరాలు ఏమైనా ఉంటే వాటిని కూడా స్పష్టం చేయాలని కోర్టు పేర్కొంది. కాగా ప్రభుత్వ రంగ సంస్థ ను కాదని రిలయన్స్ డిఫెన్స్ సంస్థకు రాఫెల్ డీల్ను అప్పగించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారీ అవినీతికి పాల్పడ్డారని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తున్నది. ముఖ్యంగా కాంగ్రెస్ అద్యక్షుడు రాహుల్ గాంధీ మోదీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. -
రాఫెల్ డీల్ వివరాలు కోరిన సుప్రీం
సాక్షి, న్యూఢిల్లీ : రాఫెల్ యుద్ధ విమానాలపై రాజకీయ రాద్ధాంతం జరుగుతున్న క్రమంలో ఈ ఒప్పందం ఎలా చేసుకున్నారనే వివరాలను అందించాలని సర్వోన్నత న్యాయస్ధానం బుధవారం కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. ఈనెల 29లోగా ఒప్పంద వివరాలను సీల్డ్ కవర్లో సమర్పించాలని కేంద్రాన్ని ఆదేశించింది. యుద్ధవిమానాల ధర, వాటి ప్రమాణాల వివరాల్లోకి తాను వెళ్లబోనని సుప్రీం కోర్టు వివరణ ఇచ్చింది. రాఫెల్ డీల్పై తాము కేంద్రానికి ఎలాంటి నోటీసులు జారీ చేయడం లేదని, పిటిషనర్ చేసిన ఆరోపణలు సరైనవికానందున కోర్టు వాటిని పరిగణనలోకి తీసుకోబోదని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ముగ్గురు సభ్యులతో కూడిన సుప్రీం బెంచ్ పేర్కొంది. ఈ ఒప్పందంపై పిటిషన్లు దాఖలు చేసిన ఇద్దరు న్యాయవాదులు రాఫెల్ డీల్పై కోర్టు పర్యవేక్షణలో విచారణ జరిపించాలని కోరారు. ఈ ఒప్పందంలోని వివరాలను కేంద్రం వెల్లడించాలని లేదా ఒప్పందాన్ని రద్దు చేయాలని పిటిషనర్లు తమ పిటిషన్లో కోరారు. కాగా పిటిషనర్లు రాజకీయ ప్రయోజనాలను ఆశించి కేసు వేశారని కేంద్రం తరపు న్యాయవాది అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ కోర్టుకు నివేదించారు. రాఫెల్ యుద్ధవిమానాలు జాతీయ భద్రతకు సంబంధించిన అంశమని అన్నారు. రూ 59,000 కోట్ల రాఫెల్ ఒప్పందంలో భారీగా అవినీతి చోటుచేసుకుందని పిటిషనర్ ఎంఎల్ శర్మ ఆరోపించారు. ప్రధాని నరేంద్ర మోదీ 2015లో అప్పటి ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండ్తో పారిస్లో చర్చలు జరిపిన అనంతరం ఈ ఒప్పందాన్ని ప్రకటించారన్నారు. -
వివరాలన్నీ ఒడిసిపట్టే సరికొత్త ట్రాకర్
గుండె కొట్టుకునే వేగం, వేసిన అడుగులు, ఖర్చయిన కేలరీల వివరాలు ఎప్పటికప్పుడు చూపగలిగే హెల్త్ ట్రాకర్స్ గురించి మీరు వినే ఉంటారు. ఫొటోలో కనిపిస్తోందే.. ఇదీ అలాంటిదే. కాకపోతే మన శరీరానికి సంబంధించిన కొన్ని వివరాలు మాత్రమే ఇవ్వడంతో ఆగిపోదు ఇది. రక్త కణాల సంఖ్యను కూడా లెక్కకట్టి చెప్పగల సూపర్ హెల్త్ ట్రాకర్ ఇది. తయారు చేసింది.. రట్గర్స్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు. బయో సెన్సర్ సాయంతో ఇది రక్త కణాల, బ్యాక్టీరియా సంఖ్యను లెక్కగట్టగలదని, అలాగే గాల్లోని కాలుష్య కణాలకూ లెక్కచెప్పగలదని అంటున్నారు మెహదీ జావాన్మర్ద్. ఇందుకు తగ్గట్టుగా ఈ గాడ్జెట్లో సూక్ష్మస్థాయి ద్రవాలను విశ్లేషించగల మైక్రోఫ్లుయిడిక్ సెన్సర్ ఒకటి ఉంటుందని, దీంతోపాటే ఉండే బ్లూటూత్ టెక్నాలజీ ద్వారా మొత్తం వివరాలను స్మార్ట్ఫోన్ యాప్కు పంపవచ్చునని వివరించారు. భవిష్యత్తులో ఈ గాడ్జెట్ను మరింత అభివద్ధి పరచడం ద్వారా అన్ని రకాల వివరాలను ఎప్పటికప్పుడు పొందేలా చేస్తామని చెప్పారు. లుకేమియా వ్యాధిగ్రస్తుల్లో తెల్ల రక్త కణాల మోతాదును ఎప్పటికప్పుడు లెక్కించడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని చెప్పారు. -
ఫేస్‘బుక్’!
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫేస్బుక్ డేటా లీక్ ఘటనలో 5.62 లక్షల మంది భారతీయుల వివరాలు ఉండొచ్చని ఫేస్బుక్ గురువారం వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా మొదట ఐదుకోట్ల మంది ఫేస్బుక్ వినియోగదారుల డేటా లీక్ అయినట్లు భావించినప్పటికీ.. తాజా వివరాల ప్రకారం ఇది 8.7 కోట్లు ఉండొచ్చని ఫేస్బుక్ ప్రతినిధి స్పష్టం చేశారు. ‘దిస్ ఈజ్ యువర్ డిజిటల్ లైఫ్’ అనే యాప్ను డౌన్లోడ్ చేసుకున్న వినియోగదారుల సమాచారం మాత్రమే లీకైందని ఆయన పేర్కొన్నారు. డాక్టర్ అలెగ్జాండర్ కోగాన్ ఈ యాప్ను రూపొందించగా.. దీన్నుంచి కేంబ్రిడ్జ్ అనలిటికా సంస్థ సమాచారాన్ని తీసుకున్న సంగతి తెలిసిందే. ‘భారత్లో మొత్తం 20 కోట్ల మంది ఫేస్బుక్ వినియోగదారులున్నారు. ఇందులో కేవలం 335 మంది మాత్రమే నేరుగా ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకోవటంతో వీరిపై ప్రత్యక్ష ప్రభావం ఉంది. 5,62,120 మందిపై పరోక్షంగా దీని ప్రభావం ఉండొచ్చు’ అని ఫేస్బుక్ ప్రతినిధి తెలిపారు. ఈ డేటా సేకరణ పూర్తిగా అనధికారికంగా జరిగిందని.. ఫేస్బుక్ నిబంధనలను ఉల్లంఘించారని ఆయన పేర్కొన్నారు. కేంబ్రిడ్జ్ అనలిటికా సంస్థకు వివరాలు తీసుకునేందుకు ఎప్పుడూ అనుమతివ్వలేదన్నారు. డేటా లీక్పై కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఫేస్బుక్ సమాధానం ఇచ్చింది. దీనిపై ప్రభుత్వం విచారణ జరుపుతోంది. భారీ తప్పిదమే: ప్రపంచవ్యాప్తంగా 8.7 కోట్ల మంది ఫేస్బుక్ వినియోగదారుల డేటా దుర్వినియోగం.. భారీ తప్పిదమని ఆ సంస్థ సీఈవో మార్క్ జుకర్బర్గ్ అంగీకరించారు. ఇది పూర్తిగా తన వ్యక్తిగత పొరపాటేనని.. ఇకపై తప్పులు జరగకుండా చూసుకుంటామన్నారు. తప్పులు సరిదిద్దుకునేందుకు మరో అవకాశం ఇవ్వాలని కోరారు. డేటా దుర్వినియోగం కారణంగా ఎక్కువగా ప్రభావితమైంది అమెరికా వినియోగదారులే. -
వినియోగదారుడా మేలుకో..!
కొనే ప్రతీ వస్తువులోనూ, సేవలోనూ లోపం లేకుండా సరైన ధర, తూకం, నాణ్యత, స్వచ్ఛత కలిగినవి పొందే హక్కు వినియోగదారులకు ఉంది. కానీ ప్రస్తుత కాలంలో మోసాలు ఎక్కువై పోయాయి. చివరికి మనం తాగే పాళ్లు, నీళ్లలో కూడా నాణ్యత లేకుండా పోతుంది. తూకాల్లో భారీగా తేడాలు ఉంటున్నాయి. వీటిపై ఎవరైనా ప్రశ్నిస్తే, నిలదీస్తే తప్ప న్యాయం జరగడం లేదు. ఈ తరహా మోసాలను అరికట్టాలంటే వినియోగదారులే మేల్కొనాల్సిన అవసరం చాలా ఉంది. తమ హక్కులపై అవగాహన పెంచుకోవాల్సిన అవసరముంది. నేడు ప్రపంచ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా వినియోగదారులకు అవగాహన కల్పించడంతో పాటు వారి హక్కులు, ఏర్పాటైన పరిరక్షణ చట్టం, ఫిర్యాదు ఏ విధంగా చేయాలనే వివరాలపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం.. – ఇందూరు(నిజామాబాద్ అర్బన్) వినియోగదారులెవరు..? వినియోగదారులు హక్కుల చట్టం 1986 ప్రకారం తమ అవసరార్థం వస్తువులు లేదా సేవలు కొనుగోలు చేసే వారు వినియోగదారులు. కొనుగోలు దారుల అనుమతితో ఆ వస్తువులు, సేవలు వినియోగించుకొనే వారు సైతం వినియోగదారులే. ఈ నిర్వచనం ప్రకారం అందరూ ఏదో ఒక రకంగా వినియోగదారులమే. చట్టంలో ఏముంది...? భారత ప్రభుత్వం 1986లో వినియోగదారుల రక్షణకు ఒక విప్లవాత్మకమైన చట్టాన్ని తెచ్చింది. అదే వినియోగదారులు హక్కుల పరిరక్షణ చట్టం. ఈ చట్టాన్ని అమలు చేయడానికి ప్రభుత్వం ‘రీడ్రసల్ ఫోరమ్స్’ను ప్రతీ జిల్లా కేంద్రంలోను ఏర్పాటు చేశారు. ఇవి జిల్లా, రాష్ట్ర, కేంద్ర స్థాయి ఫోరమ్స్గా మూడు విభాగాలుగా విభజించారు. జిల్లా స్థాయి కేంద్రానికి రిటైర్డ్ జిల్లా జడ్జి అధ్యక్షుడిగా, మరో ఇద్దరు మెంటర్లుగా ఉంటారు. మెజారిటీ కమిటీ సభ్యుల ఆమోదంతో ఫోరంలోని కేసులపై తీర్పు ఇస్తారు. వస్తువు లేదా సేవ విలువ, కోరే నష్ట పరిహారం రూ.లక్ష వరకు అయితే కోర్టు ఫీజు రూ.100, రూ.లక్ష నుంచి రూ.5 లక్షల వరకు రూ.200, రూ.10 లక్షల వరకు రూ.400, రూ.10 లక్షల పైన అయితే రూ.500 నామమాత్రపు కోర్టు ఫీజు మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. వినియోగదారుల హక్కులు... భద్రత హక్కు కొనే వస్తువులు, పొందే సేవలు వినియోగదారులు తక్షణ అవసరాలు తీర్చడమే కాకుండా అవి సుదీర్ఘ కాలం మన్నేలా ఉండాలి. అవి వినియోగదారుల జీవితాలకు, ఆస్తులకు నష్టం కలిగించే విధంగా ఉండకూడదు. ఈ భద్రత పొందటానికి వినియోగదారులు కొనే వస్తువుల నాణ్యతను నిర్ధారించుకోవాల్సి ఉంటుంది. వీలైనంత వరకు ఐఎస్ఐ, అగ్మార్క్, హాల్మార్క్, వంటి నాణ్యతా చిహ్నాలు గల వస్తువులనే కొనుగోలు చేయాలి. సమాచారం, ఎంపిక హక్కు.. వినియోగదారులు కొనే వస్తువులు, పొందే సేవల నాణ్యత, పరిమాణం, ధరల గురించి సంపూర్ణ సమాచార పొందటం కూడా ఒక హక్కే. నిర్ణయం తీసుకునే ముందు ఈ సమాచారాన్ని తప్పకుండా తెలుసుకోవాలి. అలాగే అనేక రకాల వస్తువులు, సేవలను తగిన, సరసమైన ధరలలో పొందటం వినియోగదారుల హక్కు. లభిస్తున్న వస్తువులు, సేవలలో ఏది పొందాలనే ఎంపిక హక్కు కూడా ఉంది. అభిప్రాయం వినిపించే హక్కు.. వినియోగదారుల సంక్షేమార్థం వినియోగదారులు ఎవరైనా సరే వినియోగదారుల వేదికలపై అభిప్రాయాన్ని వినిపించవచ్చు. ప్రభుత్వం, ఇతర సంస్థలు ఏర్పాటు చేసే పలు సంఘాల్లో ప్రాతినిథ్యం పొందగల రాజకీయేతర, వాణిజ్యేతర వినియోగదారుల సంఘాలను ఏర్పర్చుకోవడం ప్రాథమిక హక్కు. అలాగే అన్ని విషయాలు తెలిసిన వారు కావడానికి తగిన విజ్ఞానం, నైపుణ్యం, జీవన పర్యంతం పొందడం కూడా ఒక హక్కే. న్యాయం పొందే హక్కు.. అన్యాయమైన వాణిజ్య విధానాలు, మోసపూరిత పద్ధతుల నుంచి న్యాయబద్దమైన రక్షణ పొందవచ్చు. న్యాయ సమ్మతమైన ఫిర్యాదులను నమోదు చేయవచ్చు. ఫిర్యాదు ధనపరంగా చిన్న మొత్తానికో లేదా అంశానికో కావచ్చు... అయినా సమాజంపై దాని ప్రభావం అసమానం కావచ్చు. పర్యావరణ హక్కు.. పర్యావరణానికి ఏ హానీ కలుగకుండా ఉండే వస్తువులను, సేవలను పొందటం వినియోగదారులకు హక్కే. దీనిపై ప్రశ్నించడానికి సర్వ హక్కులు కల్పించారు. కొనుగోలు విషయంలో సూచనలు... కొనుగోలు చేస్తున్న వస్తువులు, సేవలపై గరిష్ట పరిమాణం, ఏ గ్రేడ్కు చెందినవి, వాటిలో కలిపిన పదార్థాలు, రంగులు, రసాయనాలు, ఎలా ఉపయోగించారో తెలిపే ప్రకటనను వినియోగదారులు కచ్చింతగా గమనించాలి. మందులు–ఆహార పదార్థాల చట్టం ప్రకారం అన్ని ఆహార పదార్థాల ప్యాకేజీలపై విధిగా నికర మొత్తం లేబుల్స్పై చూపాలి. దేనిలో నెట్ కంటెంట్స్ ఎక్కువగా ఉన్నాయో చూసి కొనాలి. కాస్మోటిక్ ఉత్పత్తులపై తప్ప కుండా వస్తువు ధర, తయారీ తేదీ, గడువు తేదీ, తయారీదారు చిరునామా, వస్తువు బరువు ముద్రించి ఉండాలి. ఉత్పత్తులపై ముద్రించిన ఎంఆర్పీపై స్టిక్కర్ అంటించి దాని ధరను మార్చి అమ్మడం జరుగుతుంది. ఈ విషయంలో కచ్చితంగా గమనించాలి. ఆటో మీటర్లను టాంపరింగ్ చేసి ఎక్కువ తిరిగేలా చేస్తుంటారు. వీటిని టైం టెస్ట్, బెంచ్ టెస్ట్ ద్వారా కనిపెట్టవచ్చు. వినియోగదారులు బాధ్యతలు.. - అవసరమైన వస్తువులను మాత్రమే కొనాలి - గుడ్డిగా ఏ వస్తువులు కొనవద్దు - కొనే వస్తువు గురించి సమాచారాన్ని సేకరించాలి - మోసపూరిత ప్రకటనల పట్ల జాగ్రత్త వహించండి - వస్తువుల నాణ్యతపై రాజీ పడవద్దు, నాణ్యమైనవే కొనాలి - కొనుగోలు చేసినప్పుడు తప్పకుండా రసీదును అడిగి తీసుకోవాలి - వస్తువు విషయంలో గ్యారంటీ/వారంటీ కార్డును షాపు యజమాని సంతకం, ముద్రతో సహా తీసుకోవాలి. ఇవి వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేసేందుకు ఉపయోగపడుతాయి - వాసిరకం వస్తువుల పట్ల, మోసపూరిత వ్యాపావస్తుల పట్ల వినియోగదారుల ఫోరాంను ఆశ్రయించడానికి వెనుకాడవద్దు ఫిర్యాదు చేయడానికి గల కారణాలు.. ఒక వ్యాపారుడి ద్వారా, డీలర్ ద్వారా గాని వినియోగదారుడు నష్టపోయి ఉంటే సదరు వ్యక్తిపై లేదా సంస్థపై ఫిర్యాదు చేయవచ్చు. వస్తువులో లేదా ప్రొడక్ట్ ఒకటి అంతకంటే ఎక్కువ లోపాలు ఉన్నప్పుడు సర్వీసు విషయంలో డీలర్ అశ్రద్ధ చేసేటప్పుడు, అసలు ధర కంటే ఎక్కువ మొత్తం సదరు వ్యాపారుడు, డీలర్ గాని వసూల్ చేసినప్పుడు, మరి ఏ ఇతర విధంగా నష్టపోయినా ఫిర్యాదు చేయవచ్చు. ఫిర్యాదు ఎలా చేయాలంటే..? ఫిర్యాదు చేసే విధానం చాలా సులభం. అలాగే దానిపై స్పందన కూడా త్వరగా ఉంటుంది. తెల్ల కాగితంపై ఫిర్యాదు వివరాలు రాసి పంపవచ్చు. న్యాయవాది అవసరం లేదు, ఫిర్యాదుదారుడైనా, అతని ఏజెంటైనా ఫోరంలో స్వయంగా ఫిర్యాదు ఇవ్వవచ్చు. అలా వీలు కాకపోతే పోస్టు ద్వారా కూడా పంపే వీలుంది. ఫిర్యాదులో ఏం రాయాలి..? ఫిర్యాదుదారు పూర్తి పూరు, చిరునామా, ఇతర వివరాలు ఏవైనా ఉంటే ఇవ్వడం మంచిది. అలాగే, అవతలి పార్టీ పూర్తి పేరు, చిరునామా, ఫిర్యాదు చేయడానికి గల కారణాలు, ఎప్పుడు.. ఎలా.. జరిగింది, ఏ విధంగా నష్టపోయారనే విషయాలు తెలుపుతూ డాక్యుమెంట్లు, రసీదులు, ఇతర వివరాలు ఏవైనా ఉంటే ఫిర్యాదుకు జత చేయాలి. ఇవి కేసు విచారణ సమయంలో ఉపయోగపడుతాయి. ఫిర్యాదుదారుడు ఏ విధంగా నష్ట పరిహారం అడుగుతున్నాడో వివరణ ఇవ్వాలి. పరిహారం బట్టి ఫోరం... - రూ.20 లక్షల విలువ వరకు జిల్లా ఫోరంలో ఫిర్యాదు చేయాలి. - రూ.20 లక్షల విలువ నుంచి రూ.కోటి వరకు రాష్ట్ర కమిషన్లో.. - రూ.కోటి మించిన పక్షంలో జాతీయ కమిషన్కు ఫిర్యాదు చేయాలి. - కొనుగోలు చేసిన లేదా నష్టం జరిగిన నాటి నుంచి రెండేళ్ల లోపు ఫిర్యాదు చేయవచ్చు. ఆలస్యానికి తగిన కారణం చూపినచో ఆపై సంవత్సరం వరకు ఫిర్యాదు చేయవచ్చు. ఇక్కడ సంప్రదించవచ్చు.. ఎం. రాజేశ్వర్, జిల్లా వినియోగదారులు సమాచార కేంద్రం చైర్మన్ కలెక్టర్ కార్యాలయం, వీడియో కాన్ఫరెన్స్ గది పక్కన, నిజామాబాద్ (93964 51999) కృష్ణప్రసాద్, డీఎస్వో జిల్లా పౌర సరఫరాల శాఖ కార్యాలయం, జిల్లా కలెక్టర్ కార్యాలయం, ప్రగతిభవన్ చివరి అంతస్తు, నిజామాబాద్ (80083 01506) -
పీఎన్బీ స్కాం మాస్టర్మైండ్: కొన్ని వివరాలు
సాక్షి, ముంబై: పీఎన్బీ కుంభకోణంలో కీలక పాత్రధారి, ప్రధాన నిందితుడు, బ్యాంకు మాజీ డిప్యూటీ మేనేజర్ గోకుల్నాథ్ శెట్టి గురించి అత్యంత ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. ఇప్పటికే శెట్టిని అరెస్ట్ చేసిన సీబీఐ ఆధ్వర్యంలో విచారణ సాగుతోంది. ఈ నేపథ్యంలో సీబీఐ వర్గాలు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. 2015లో వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ, గీతాంజలి జెమ్స్ అధిపతి మోహుల్ చోక్సీని కలిశారు. అదే ఏడాది ఖరీదైన ఇల్లును కొనుగోలు చేశాడు. మలాద్ లింక్ రోడ్లో సుమారు రూ. 4కోట్ల 4 బెడ్రూం ఫ్లాట్ను కొనుగోలు చేశారు. బోరివాలీలో మరొక ఇల్లు కూడా ఉంది, ప్రస్తుతం ఇది అద్దెకు ఇచ్చారు. అంతేకాదు తన పూర్వీకుల గ్రామంలో శెట్టి పలు స్థలాలను కూడా కొనుగోలు చేశారు. కర్నాటకలోని ముల్కిలో జన్మించిన గోకుల్నాథ్ శెట్టి 1981లో క్లర్క్గా పీఎన్బీలో జాయిన్ అయ్యాడు. 2005లో పీఎన్బీ ముంబై బ్రాంచ్కు బదిలీ అయ్యారు. ఇక్కడే నీరవ్ మోదీ, చోక్సి ఖాతాలు ఉన్నాయి. 11 ఏళ్ళ సర్వీసు అనంతరం ఒక్కసారి మాత్రమే ప్రమోషన్ తీసుకున్నాడు. అదీ దీర్ఘకాలం క్లర్క్గా పనిచేసిన తరువాత, నేరుగా డిప్యూటీ మేనేజర్ స్థాయికి చేరుకున్నాడు. నిబంధనల ప్రకారం 2010లో బదిలీ జరగాల్సి ఉన్నా..2017లో రిటైర్ అయ్యేదాకా అదే పదవిలో కొనసాగడం గమనార్హం. -
షాకింగ్: ప్రభుత్వ సైట్లలో ఆధార్ వివరాలు లీక్
సాక్షి, న్యూఢిల్లీ: ఆధార్ గోప్యతపై ఆందోళను తీవ్ర స్థాయిలో కొనసాగుతుండగానే ఆధారం సెక్యూరిటీపై షాకింగ్ విషయం వెలుగు చూసింది. అనేక మంది వినియోగదారుల వ్యక్తిగత వివరాలు 200 కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ వెబ్సైట్లలో లీక్ అయ్యాయి. దాదాపు 200కిపైగా వెబ్ సైట్లలో ఆధార్ డేటా లీక్ అయింది. వీటిలొ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన సంస్థలతో పాటు పలు విద్యాసంస్థలు ఉన్నాయి. సమాచార హక్కు చట్టం ద్వారా ఈ విషయం వెలుగులోకి వచ్చిందని పిటిఐ నివేదించింది. ఆధార్ వివరాలు చాలా సెక్యూర్డ్గా ఉంటాయని కేంద్రం పదే పదే హామి ఇస్తున్నప్పటికీ వందల మంది వినియోగదారుల వ్యక్తిగత వివరాలు భారీగా లీక్ అయ్యాయన్న వార్త సంచలనం రేపింది. మరోవైపు ఈ లీక్వ్యవహారంపై యూనిక్ ఐడెంటిటీ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు స్పందించారు. సమాచార లీక్ అంశం బహిర్గతం కావడంతో ఆ డేటాను వెబ్సైట్లనుంచి తొలగించినట్టు అధికారులు తెలిపారు. వినియోగదారుడి వ్యక్తిగత సమాచర భద్రత కోసం యూఐడీఏఐ పలు అంచెల్లో భద్రతా ప్రమాణాలు పాటిస్తుందని స్పష్టం చేశారు. ఎప్పటికప్పుడు వాటి పనితీరును అధికారులు సమీక్షిస్తారని ముఖ్యంగా డేటా సెంటర్లను కదలికలను నిరంతరం పర్యవేక్షిస్తామన్నారు. డేటా భద్రత, గోప్యతను బలోపేతం చేయడానికి సెక్యూరిటీ ఆడిట్లను క్రమ పద్ధతిలో నిర్వహిస్తామని, డేటా సురక్షితంగా ఉండటానికి అన్ని చర్యలు తీసుకుంటామని,ఆందోళన అవసరం లేదని హామీ ఇచ్చింది. -
చిక్కుల్లో రిలయన్స్ జియో..?
న్యూఢిల్లీ: టెలికాం మార్కెట్లో ఎదురులేని మహారాజుగా వెలుగుతున్న రిలయన్స్ జియోని భారీ డేటా లీక్ షాక్ బాగానే తగిలింది. ఆన్లైన్లో తమ వినియోగదారులకుచెందిన సమాచారం లీకైందన్న వార్తలతో ఇబ్బందుల్లో పడిన జియోకు తాజాగా చిక్కులు తప్పేలా లేవు. కోట్లాదిమంది జియో కస్టమర్ల వ్యక్తిగత సమాచారం బహిర్గతం కావడంపై టెలికాం శాఖ స్పందించింది. త్వరలోనే దీనిపై జియోని వివరణకోరనున్నట్టు తెలిపింది. ఇప్పటివరకూ జియో నుంచి తమకు సమాచారం లేదని, డేటా ఉల్లంఘన ఆరోపణపై జియోను వివరాలు కోరనున్నామని టెలికాం కార్యదర్శి అరుణ్ సుందర్రాజన్ తెలిపారు. జియో డేటా లీక్ వ్యవహారంపై శనివారం విలేకరులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానాలిచ్చారు. కాగా గత ఆదివారం వెలుగులోకి జియో కస్టమర్ల డేటా లీక్ ప్రకంపనలు రేపింది. ముఖ్యంగా ఈమెయిల్, ఫోన్ నెంబర్, ఆధార్ తదితర వివరాలు మాజిక్ఏపీ.కామ్ లో దర్శనమిచ్చాయి. ఈ విషయంపై జియో ముంబైలో ఫిర్యాదు చేయగా రాజస్థాన్కు చెందిన ఇమ్రాన్ చిప్ప (35)ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ లీక్ను ధృవీకరించిన మహారాష్ట్ర సైబర్ పోలీస్ సీనియర్ అధికారి, ఏ మేరకు లీకైందనే వివరాలందించడానికి నిరాకరించిన సంగతి తెలిసిందే. -
వెబ్సైట్లో ఖాళీ భూముల వివరాలు
♦ సిటీ కన్జర్వెన్స్ సమావేశంలో నిర్ణయం ♦ అనుమతించాల్సిందిగా ప్రభుత్వానికి లేఖ సాక్షి,సిటీబ్యూరో: జీహెచ్ఎంసీ పరిధిలో సమస్యగా మారిన భూ సంబంధ వివాదాలను నివారించేందుకు ఖాళీగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ భూముల వివరాలు ప్రజలకు తెలిసేలా ఒక వెబ్సైట్ను రూపొందించాలని సిటీ కన్జర్వెన్స్ సమావేశం అభిప్రాయపడింది. ఇందుకు అనుమతివ్వాల్సిందిగా ప్రభుత్వానికి లేఖ రాయాలని నిర్ణయించారు. శనివారం ఎంజీబీఎస్లోని ఆర్టీసీ కార్యాలయంలో జరిగిన కన్జర్వెన్స్ సమావేశంలో జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్రెడ్డి మాట్లాడుతూ గ్రేటర్ పరిధిలోని కలెక్టరేట్లు, జీహెచ్ఎంసీ కార్యాలయాలకు అందే ఫిర్యాదుల్లో భూ సంబందమైనవే ఎక్కువగా ఉంటున్నాయన్నారు. ఆయా భూముల వివరాలు ప్రజలకు తెలియనందునే వివాదాలు నెలకొంటున్నాయని, వీటి నివారణకు భూముల వివరాలు, వాటిపై యాజమాన్య హక్కులు, విస్తీర్ణం తదితర వివరాలను ప్రజలకు తెలిసేలా వెబ్సైట్లో ప్రదర్శించేందుకు అనుమతించాలని కోరుతూ ప్రభుత్వానికి లేఖ రాయాలన్నారు. నాలాల విస్తరణకు తీవ్ర అడ్డంకిగా ఉన్న 1002 ఆక్రమణలను తొలగించేందుకు జీహెచ్ఎంసీ, రెవెన్యూ, పోలీసు తదితర విభాగాలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. అహ్మదాబాద్లోని సబర్మతి పునరుద్ధరణ కోసం రికార్డు స్థాయిలో 10వేల ఆస్తులను తొలగించారని ఈ సందర్భంగా పేర్కొన్నారు. నగరంలోని రహదారులపై గుంతలను ఎప్పటికప్పుడు పూడ్చేలా ప్రత్యేక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. వృథా నీటిని రోడ్లపై వదులుతున్నందున రోడ్లు త్వరగా దెబ్బతింటున్నాయని, అలాంటి వారిని గుర్తించి జరిమానాలు విధించాలని సూచించారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించే వారిపై శాఖాపరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. నగరంలోని బస్టాండ్లు, బస్ డిపోలలో స్వచ్ఛత పాటించాలని, స్వచ్ఛ భారత్ను సమర్థవంతంగా అమలు చేసే బస్టాండ్లు, బస్ డిపోలకు ప్రత్యేక పురస్కారాలు అందించాలని ఆర్టీసీ అధికారులకు సూచించారు. ఆగస్టు నెలాఖరులోగా మరో 50 వేల ‘డబుల్’ ఇళ్ల నిర్మాణాలకు టెండరు ప్రక్రియ పూర్తిచేయాలన్నారు. వచ్చే నెలలో నిర్వహించనున్న తెలంగాణ హరితహారంలో నగరవాసులకు వారు కోరిన మొక్కలను అందజేయాలని నిర్ణయించినట్టు తెలిపారు. ప్రతి శాఖ తమ కార్యాలయాల్లోని ఖాళీ స్థలాల్లో వంద శాతం మొక్కలు నాటి వాటి నిర్వహణ బాధ్యతలను ఉద్యోగులకు అప్పగించాలని సూచించారు. బస్టాండ్లకు డొమెస్టిక్ వాటర్ కనెక్షన్లు జీహెచ్ఎంసీ పరిధిలో ఆర్టీసీకి 29 బస్డిపోలు, 29 ప్రధాన బస్టాండ్లు ఉన్నాయని, వీటికి డొమెస్టిక్ వాటర్ కనెక్షన్లు ఇవ్వాలని ఆర్టీసీ ఈడీ పురుషోత్తం నాయక్ జలమండలి అధికారులను కోరారు. ఇమ్లిబన్ బస్టాండ్కు లీజ్ మొత్తాన్ని త్వరితగతిన నిర్ధారించాల్సిందిగా కమిషనర్ను కోరారు. మెట్రో పిల్లర్లలో ప్రమాదభరితంగా ఉన్నవాటికి రేడియం స్టిక్కర్లు అంటించే ప్రక్రియ చేపట్టామని మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. లక్డీకాపూల్, ప్యారడైజ్ జంక్షన్ల వద్ద చిన్న వర్షానికే నీరు నిలుస్తున్నందున సమస్య పరిష్కారానికి జీహెచ్ఎంసీ, వాటర్ బోర్డ్, మెట్రోరైలు, కంటోన్మెంట్ అధికారులు సంయుక్తంగా అధ్యయనం చేయాలని నిర్ణయించారు. జంక్షన్ల అభివృద్దిని త్వరిగతిన పూర్తిచేయాలని హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సీపీ రవీందర్ విజ్ఞప్తి చేశారు. సమావేశంలో రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల కలెక్టర్లు రఘునందన్రావు, ఎంవీ రెడ్డి, హెచ్ఎండీఏ, రోడ్లు–భవనాలు, విద్యుత్, జలమండలి తదితర విభాగాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
బాలుడి ఆచూకీ లభ్యం
అనంతపురం సెంట్రల్ : మడకశిరకు చెందిన బాలకృష్ణ (14) రెండు రోజుల క్రితం అనంతపురానికి వచ్చి కనిపించకుండా పోయాడు. బాలుడి కుటుంబ సభ్యులు టూటౌ¯ŒS పోలీస్ స్టేష¯ŒSలో శనివారం ఫిర్యాదు చేశారు. బాలకృష్ణ అనంతపురం నుంచి వెళ్లి పెనుకొండలో ఉన్న బంధువుల ఇంటికి వెళ్లినట్లు సమాచారం అందడంతో కుటుంబ సభ్యులు ఊపిరిపీల్చుకున్నారు. ఈ విషయాన్ని పోలీసులకు సమాచారం అందించారు. -
లంబసింగిలో యూత్హాస్టల్స్ ట్రెక్కింగ్ క్యాంప్
భీమవరం : భీమవరం యూత్ హాస్టల్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో డిసెంబర్లో లంబసింగి, భద్రాచలం, కొల్లేరు తదితర ప్రాంతాల్లో ట్రెక్కింగ్ క్యాంప్ నిర్వహించనున్నట్టు యూత్ హాస్టల్స్ అసోసియేషన్ భీమవరం శాఖ అధ్యక్షుడు డాక్టర్ మట్లమూడి చెప్పారు. భీమవరంలో శుక్రవారం అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో క్యాంప్ వివరాలను వెల్లడించారు. ఇటీవల పట్టణంలో యూత్ హాస్టల్స్ అసోసియేషన్ నాయకులు డాక్టర్ వీవీజె సోమరాజు, డాక్టర్ సతీష్, డాక్టర్ ఉష, డాక్టర్ రమేష్, మైథిలీ బృందం కాంచనగంగ, పాండిమ్గొలుచా పర్వతాలపై ట్రెక్కింగ్ నిర్వహించారన్నారు. డిసెంబర్లో నిర్వహించే ట్రెక్కింగ్లో పాల్గొనే వారు 94926 89575 ఫోన్ నంబర్లో సంప్రదించాలని మట్లపూడి కోరారు. సమావేశలో డాక్టర్ సోమరాజు, సతీష్ పాల్గొన్నారు. -
మన వాయుసేన సత్తా ఎంతో తెలుసా?
రాయల్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పేరుతో భారతీయ వాయుదళం 1933లో కరాచీలో ప్రారంభమైంది. నేడు సరికొత్త ఫైటర్లతో వాయుదళ సామర్ధ్యాన్ని పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్న భారతీయ వాయుదళం ఇప్పటివరకూ వినియోగించిన ఫైటర్ల గురించి ఓ సారి చూద్దాం. తొలినాళ్లలో వెస్ట్ లాండ్ వాపిటి: నాలుగు వెస్ట్ లాండ్ వాపిటి-ఐఐఏ విమానాలతో రాయల్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్(ఆర్ఐఏఎఫ్) 1933లో కరాచీలో ప్రారంభమైంది. దాదాపు 12 ఏళ్ల పాటు ఈ విమానాలు ఆర్ఐఏఎఫ్కు సేవలు అందించాయి. ఆర్ఐఏఎఫ్ రెండో ప్రపంచ యుద్దంలో ఈ విమానాలను వినియోగించింది. కాగా, జపాన్ వాయుసేనలు బర్మా వద్ద ఈ విమానాల్లో కొన్నింటిని ధ్వంసం చేశాయి. టైగర్ మోత్: 1939-1957 సంవత్సరాల మధ్య టైగర్ మోత్ జెట్ లు భారతీయ వాయుదళం(ఐఏఎఫ్)(ఆర్ఐఏఎఫ్ ను 1950లో ఐఏఎఫ్ గా మార్చారు) లో సేవలు అందిచాయి. వీటిని బ్రిటిష్ విమాన తయారీ కంపెనీ డీ హవిల్ లాండ్ తయారుచేసింది. దీనిని 2012లో పునరుద్దరించారు. భారత వాయుదళంలోని వింటేజ్ ఫ్లీట్ లో టైగర్ మోత్ సేవలు అందిస్తోంది. కొత్త పైలట్లకు శిక్షణ ఇవ్వడానికి కూడా దీన్ని ఉపయోగించారు. బ్లెన్ హీమ్: 1941-42ల మధ్య బ్లెన్ హీమ్ ఆర్ఐఏఎఫ్ కు సేవలు అందించింది. లైట్ వెయిట్ బాంబులను మోసుకెళ్లగల బ్లెన్ హీమ్ లను రంగూన్ హార్బర్ లోని ఓడలకు కాపలాగా ఉపయోగించేవారు. లైశాండర్: 1940ల్లో లైశాండర్ ఆర్ఐఏఎఫ్ కు సేవలు అందించింది. బ్రిటన్ కు చెందిన ఓ ప్రముఖ విమాన తయారీదారు దీన్ని తయారుచేశారు. 1940 మే-జూన్ల మధ్య యూకేఆర్ఏఎఫ్ 118 లైశాండర్ విమానాలను కోల్పోయింది. దీంతో వీటిని చరిత్రలో రక్షించుకోవాల్సిన విమానాలుగా అప్పటి యూకే ప్రకటించింది. హరికేన్: హరికేన్ విమానాలను 1942లో ఆర్ఐఏఎఫ్ కు అందాయి. అప్పటి ఫైటర్లలో హరికేన్లే అత్యంత వేగవంతమైనవి. దాదాపు 300 మైళ్లకు పైగా వేగంతో హరికేన్లు దూసుకెళ్లేవీ. బర్మాలో అరకన్ యుద్దంలో హరికేన్ విమానాలు పాల్గొన్నాయి. స్పిట్ ఫైర్: 1946లో అత్యంత విజయవంతమైన జెట్ గా స్పిట్ ఫైర్ పేరుగాంచింది. హరికేన్ విమానాల స్ధానంలో స్పిట్ ఫైర్ జెట్లను చేర్చారు. 1950వ దశకం వరకూ స్పిట్ ఫైర్ జెట్లు వినియోగంలో ఉన్నాయి. డ్రాగన్ రాపిడ్, ఆడియో, డ్రాగన్ ప్లై, హార్వాడ్, హడ్సన్, వెన్ జియన్స్, డిఫియంట్, అట్లాంటా తదితర జెట్ లను ఆర్ఐఏఎఫ్ వినియోగించింది. స్వాతంత్ర్యం తర్వాత టెంపెస్ట్ 2: స్వతంత్ర దేశంగా భారత్ అవతరించిన తర్వాత దశాబ్ద కాలం పాటు ఐఏఎఫ్ టెంపెస్ట్-2 జెట్ లను వినియోగించింది. డకొటా: స్వతంత్రం వచ్చే కొద్ది నెలల ముందు ఆర్ఐఏఎఫ్ ట్రాన్స్ పోర్ట్ దళాన్ని సీ-47 డకోటాలతో ప్రారంభించింది. బీ-24 లిబరేటర్: 1948లో ఆర్ఐఏఎఫ్ మొదటి హెవీ బాంబర్ దళాన్ని అమెరికన్ లిబరేటర్లతో ప్రారంభించింది. యూఎస్ ఎయిర్ ఫోర్స్ వీటి వినియోగాన్ని నిలిపివేసిన తర్వాత హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(హెచ్ఏఎల్) వీటిని పునరుద్దరించింది. 1968 వరకూ ఇవి భారతీయ వాయుదళానికి సేవలు అందించాయి. వాంపైర్స్: 1948లో బ్రిటిష్ వాంపైర్స్ ను ఎయిర్ ఫోర్స్ కొనుగోలు చేసింది. 1960వ దశకం ముందువరకూ 400పైగా వాంపైర్లను భారత్ వినియోగించింది. భారత వాయుదళంలోకి ఫ్రెంచ్ జెట్లు డస్సాల్ట్ ఔర్గాన్: ఫ్రెంచ్ వారి నుంచి భారత వాయుదళంలోకి ప్రవేశించిన తొలి జెట్ డస్సాల్డ్ ఔర్గాన్. 1953లో ఐఏఎఫ్ లో చేరిన ఔర్గాన్ జెట్లు 1968 వరకూ సేవలు అందించాయి. మిస్టరీ ఐవా: 1957లో భారత వాయుదళంలో చేరిన రెండో ఫ్రెంచ్ జెట్ మిస్టరీ ఐవా. 1957లో ఐఏఎఫ్ బాగా విస్తరించింది. బ్రిటిషర్లకు చెందిన హాకర్ హంటర్లు, అమెరికన్లకు చెందిన ఎలక్ట్రిక్ కాన్ బెర్రా బాంబర్లు 1957లోనే ఐఏఎఫ్ లో చేరాయి. కాన్ బెర్రాలు: 1961-62 మధ్య కాలంలో కాన్ బెర్రాలు కాంగో యుద్ధంలో పాల్గొన్నాయి. 1999 కార్గిల్ సమస్య సమయంలో నియంత్రణ రేఖ పరిధిలోని ప్రాంతాలను ఫోటోలు తీసేందుకు కాన్ బెర్రా విమానాన్ని వినియోగించారు. ఫోటోలు తీస్తున్న సమయంలో కాన్ బెర్రాపై మిస్సైల్ దాడి జరిగింది. కానీ విమానాన్ని సురక్షితంగా కిందకు దించడంలో పైలట్ విజయం సాధించారు. డెవాన్, సీ-119 పాకెట్, డీహెచ్సీ-3 ఒట్టర్, విక్కర్స్ విస్కోంట్, సికోర్ స్కై ఎస్-55 చాపర్లు తదితరాలను 1950ల్లో ఐఏఎఫ్ లో చేరాయి. భారత వాయుదళం-సోవియట్ యూనియన్ సోవియట్ యూనియన్ కు సంబంధించిన యుద్ధవిమానాలు భారత వాయుదళంలో కీలకపాత్ర పోషించాయి. ఆ కాలంలో సోవియట్ యూనియన్ తో దౌత్యపరంగా భారత్ కు మంచి సంబంధాలు ఉన్నాయి. ఆ బంధమే ప్రస్తుత రష్యా-భారత్ ల రక్షణ ఒప్పందాలకు కారణం. మిగ్-21(మిగిలిన రకాలు): 1963లో మిగ్-21 యుద్ధవిమానాలు భారత వాయుసేనలో చేరాయి. వీటి చేరికతో భారత రక్షణ మార్కెట్లో సోవియట్ యూనియన్ ప్రాధాన్యం పెరిగిపోయింది. ఈ యుద్ధవిమానానికి చెందిన కొన్ని వేరియంట్లను ఇప్పటికీ ఐఏఎఫ్ వినియోగిస్తోంది. 1980 నుంచి మిగ్-23, మిగ్-25, మిగ్-27, మిగ్-29 లాంటి పలురకాలను ఐఏఎఫ్ కొనుగోలు చేసింది. ఆంటోనోవ్-12: 1961లో రష్యాకు చెందిన ఈ రవాణా విమానాన్ని ఐఏఎఫ్ కొనుగోలు చేసింది. వీటిని 1962 చైనా-భారత్ యుద్ధంలో ఉపయోగించారు. కెనడా డీహెచ్సీ-4 కార్గో యుద్ధవిమానాలను యుద్ధం తర్వాత భారత్ కు ఇచ్చింది. ఎమ్ఐ-4: సోవియట్ యూనియన్ కు చెందిన ఈ హెలికాప్టర్లను 1960ల్లో ఐఏఎఫ్ లో ప్రవేశపెట్టారు. దీని వేరియంట్లు ఎమ్ఐ-8లను 1970ల్లో, ఎమ్ఐ-17లను 1985లో, ఎమ్ఐ-17 వీ5లను 2012లో ఐఏఎఫ్ కొనుగోలు చేసింది. సుఖోయ్-7: 1968లో ఐఏఎఫ్ లో ప్రవేశించిన సుఖోయ్ లను 1971 ఇండో-పాక్ యుద్ధంలో వినియోగించారు. దీని వేరియంట్ సుఖోయ్-30ని 1997లో ఐఏఎఫ్ అందుకుంది. ఫైటర్ దళాన్ని సిద్ధం చేసేందుకు భారత్ 272 సుఖోయ్ జెట్ లను ఆర్డర్ ఇచ్చింది. ఆంటోనోవ్-32: 1983లో ఐఏఎఫ్ లో ప్రవేశించిన ఆంటోనోవ్-32లు ఇప్పటికీ సేవలు అందిస్తున్నాయి. 100కు పైగా ఆంటోనోవ్-32లు భారత వాయుసేనలో ఉన్నాయి. అమెరికా తిరిగి రంగ ప్రవేశం ఏహెచ్-64ఈ అపాచె ఎటాక్ హెలికాప్టర్లు: 2019లో యూఎస్ నుంచి భారత్ 22 అపాచె ఎటాక్ హెలికాప్టర్లను అందుకోనుంది. దీంతో హెలికాప్టర్ల ఫ్లీట్ ను భారత్ మరింతగా బలపర్చుకున్నట్లు అవుతుంది. ప్రస్తుతం 1980లో దళంలోకి వచ్చిన ఎమ్ఐ-25, ఎమ్ఐ-35 హెలికాప్టర్లను భారత్ వినియోగిస్తోంది. సీహెచ్-47ఎఫ్ చినుక్స్: భారీ బరువులను అత్యంత ఎత్తుకు మోసుకెళ్లగల సామర్ధ్యం కలిగిన చినూక్స్ ను 2019లో యూఎస్ నుంచి భారత్ కు అందనున్నాయి. ఈ కేటగిరిలో సోవియట్ యూనియన్ అందించిన నాలుగు ఎమ్ఐ-26లలో కేవలం ఒక్కటి మాత్రమే ఇప్పుడు సర్వీసులో ఉంది. సీ-17 గ్లోబ్ మాస్టర్3: 2014లో 10 గ్లోబ్ మాస్టర్ విమానాలను ఐఏఎఫ్ దళంలో చేర్చుకుంది. వీటిని అమెరికా వాయుదళం ఇరాక్, ఆప్ఘనిస్తాన్లలో వినియోగిస్తోంది. యుద్ధ ట్యాంకులను మోసుకెళ్లడం, హెలికాప్టర్లపై దాడి చేయడం తదితరాలకు దీన్ని వినియోగించవచ్చు. సీ-130జే సూపర్ హెర్ క్యూల్స్: ఆరు సీ-130జే సూపర్ హెర్ క్యూల్స్ విమానాల కొనుగోలుకు 2008లో అమెరికాతో భారత్ ఒప్పందం కుదుర్చుకుంది. వీటన్నింటిని ఇప్పటికే వాయుదళంలో కూడా చేర్చుకుంది. మరో ఆరు సీ-130జే సూపర్ హెర్ క్యూల్స్ ను కొనుగోలు చేయడానికి డీల్ ను కూడా ఐఏఎఫ్ కుదుర్చుకుంది. ప్రత్యేక ఆపరేషన్లు, మెరుపుదాడులకు వీటిని వినియోగిస్తారు. సొంత తయారీ గ్నాట్: బ్రిటిష్ కు చెందిన గ్నాట్ ను 1958లో వాయుసేనలోకి తీసుకున్నార. దీనికి హెచ్ఏఎల్ లైసెన్స్ ను విడుదల చేసింది. గ్నాట్ ఇంధన సామర్ధ్యాన్ని పెంచి అజీత్ గా నామకరణం చేశారు. హెచ్ఎఫ్-24 మారుత్: 1960వ దశకంలో దీన్ని ఐఏఎఫ్ లోకి ప్రవేశపెట్టారు. దేశీయంగా తయారుచేసిన తొలి ఫైటర్ మారుత్. తేజస్: తేజస్ యుద్ధవిమానాల దళాన్ని 2016 జులైలో రెండు తేజస్ విమానాలతో ఐఏఎఫ్ ప్రారంభించింది. భవిష్యత్తులో 120 తేజస్ జెట్లను ఫ్లీట్ లో ప్రవేశపెట్టాలని ఐఏఎఫ్ యోచిస్తోంది. -
271 మంది కంప్యూటర్ టీచర్ల ఎంపిక
ఏలూరు సిటీ : ప్రభుత్వ పాఠశాలల్లో కంప్యూటర్ విద్య అందించేందుకు కంప్యూటర్ టీచర్ల నియామకానికి సంబంధించి ఎంపికలు గురువారం పూర్తి చేశారు. జిల్లావ్యాప్తంగా 283 మంది కంప్యూటర్ టీచర్ల నియామకానికి ఆన్లైన్ పరీక్షలు నిర్వహించగా 1,256 మందికి పైగా అభ్యర్థులు పరీక్షలు రాశారు. ఈ అభ్యర్థుల కంప్యూటర్ నిపుణత, సర్టిఫికెట్స్, నేటివిటీ ఆధారంగా ఎంపికలు పూర్తిచేసినట్టు జిల్లా విద్యాధికారి డి.మధుసూదనరావు తెలిపారు. 271 మంది అభ్యర్థులు కంప్యూటర్ టీచర్లుగా ఎంపికయ్యారని తెలిపారు. ఎంపికైన అభ్యర్థుల వివరాలు డీఈవో వెబ్సైట్లో పొందుపరిచామని తెలిపారు. -
యాదాద్రి సమగ్ర స్వరూపం
జిల్లా కలెక్టర్ అనితా రామచంద్రన్ ఫోన్: 9849906059 భువనగిరి జోన్ డీసీపీ పి.యాదగిరి ఫోన్: 9490616421 ఇతర ముఖ్య అధికారులు జేసీ: గుగులోతు రవి డ్వామా పీడీ: దామోదర్రెడ్డి జిల్లా విద్యాశాఖాధికారి: దివ్య డీపీవో: శ్రీనివాస్రెడ్డి డీఎస్వో: సంధ్యారాణి సివిల్ సప్లై డీఎం: సత్యనారాయణ మండలాలు 16: (భువనగిరి, బీబీనగర్, భూదాన్పోచంపల్లి, వలిగొండ, చౌటుప్పల్, సంస్థాన్ నారాయణపురం, రామన్నపేట, ఆత్మకూర్(కొత్తది), ఆలేరు, రాజాపేట, యాదగిరిగుట్ట, మోటకొండూరు(కొత్తది), తుర్కపల్లి, బొమ్మలరామారం, మోత్కూరు, అడ్డగూడూరు(కొత్తది) రెవెన్యూ డివిజన్లు 2: (భువనగిరి, చౌటుప్పల్) మున్సిపాలిటీలు 1: (భువనగిరి) గ్రామ పంచాయతీలు: 304 ఎమ్మెల్యేలు: ఫైళ్ల శేఖర్రెడ్డి(భువనగిరి), గొంగిడి సునీత(ఆలేరు), కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి(మునుగోడు), వేముల వీరేశం(న కిరేకల్), గాదరి కిషోర్(తుంగతుర్తి) ఎంపీ: బూర నర్సయ్యగౌడ్ ప్రధాన పరిశ్రమలు: ఇనుము, ఎక్స్పో్లజివ్స్, కెమికల్, ఆటోమెుబైల్స్, ప్లాస్టిక్, క్రషర్, శానిటరీ, బాంబినో, గ్లాస్ ఇండస్ట్రీస్, పోచంపల్లి పట్టు చీరల తయారీ పర్యాటకం, ఆలయాలు: యాదాద్రి ఆలయం, కొలనుపాక జైనదేవాలయం, కొలనుపాక సోమేశ్వరాలయం, మత్స్యగిరి లక్ష్మీనర్సింహస్వామి, సుంకిశాల వెంకటేశ్వర దేవాలయం, భువనగిరి పచ్చలకట్ట సోమేశ్వరాలయం, భువనగిరి ఖిలా, కొలనుపాక పురావస్తు శాఖ మ్యూజియం, పోచంపల్లి గ్రామీణ పర్యాటక కేంద్రం, చౌటుప్పల్ మండలం ఆందోళ్మైసమ్మ జాతీయ రహదారులు 2: (బీబీనగర్ మండలం కేపాల్–ఆలేరు మండలం టంగుటూరు వరకు ఎన్హెచ్ 163, చౌటుప్పల్ మండలంలో ఎన్హెచ్ 67) రైల్వే లైన్లు: బీబీనగర్, ఆలేరు మీదుగా ఖాజీపేట వరకు, బీబీనగర్, వలిగొండ మీదుగా ఏపీలోని గుంటూరు జిల్లా వరకు హైదరాబాద్ నుంచి దూరం: 50 కి.మీ. ఖనిజ సంపద: ఇసుక, ఎర్రమట్టి, రాతిగుట్టలు -
జనగామ సమగ్ర స్వరూపం
జిల్లా కలెక్టర్ శ్రీ దేవసేన డీసీపీ టి.వెంకన్న ఇతర ముఖ్య అధికారులు జేసీ: జె.గోపాలకృష్ణ ప్రసాదరావు 8978780264 డీఆర్వో: ఎం భాగ్యమ్మ డీపీవో: ఎ.రవికుమార్ 9701534345 డీఈవో: ఎస్ యాదయ్య 9441219442 డీఎంహెచ్వో: బి.హరీశ్రాజ్ 9704587811 సివిల్ సప్లై ఆఫీసర్: పి.రుక్మీణి దేవి 9989932683 వెల్ఫేర్ ఆఫీసర్: బి.పద్మజ రమణ 9491051682 మండలాలు 13: జనగామ, లింగాల ఘనపురం, బచ్చన్నపేట, దేవరుప్పుల, నర్మెట, తరిగొప్పుల, రఘునాథపల్లి, గుండాల,స్టేçÙన్ ఘన్పూర్, చిల్పూర్, జఫర్గఢ్, పాలకుర్తి, కొడకండ్ల రెవెన్యూ డివిజన్లు 2: జనగామ, స్టేషన్ఘన్పూర్ మున్సిపాలిటీలు 1: జనగామ ఎమ్మెల్యేలు: ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి(జనగామ), ఎర్రబెల్లి దయాకర్రావు(పాలకుర్తి), తాటికొండ రాజయ్య(స్టేçÙన్ ఘన్పూర్) ఎంపీలు: ఎంపీ బూర నర్సయ్యగౌడ్(భువనగిరి), పసునూరి దయాకర్(వరంగల్) సాగునీటి ప్రాజెక్టులు: లింగాల ఘనపురం నవాబుపేట, రఘునాథపల్లి అశ్వరావుపల్లి, స్టేషన్ ఘనపూర్, నర్మెటలో బొమ్మకూరు, గండిరామారం, కన్నెబోయిన గూడెం రిజర్వాయర్లు భారీ పరిశ్రమలు: లేవు గ్రామ పంచాయతీలు: 217 పర్యాటకం, ఆలయాలు: బచ్చన్నపేట మండలం సిద్ధులగుట్ట, లింగాల ఘనపురం మండలం జీడికల్, పాలకుర్తిలో సోమేశ్వర ఆలయం, స్టేషన్ ఘనపురంలో చిల్పూర్, జనగామ మండలం పెంబర్తిలో హస్తకళల తయారీ కేంద్రం, రఘునాథపల్లి మండలంలోని ఖిలాషాపూర్లోని సర్దార్ సర్వాయి పాపన్న కోట జాతీయ రహదారులు: ఎన్హెచ్ 163 రైల్వే లైన్లు: హైదరాబాద్–వరంగల్ జిల్లా కేంద్రం నుంచి హైదరాబాద్కు: 75 కి.మీ. తాగునీటి ప్రాజెక్ట్: జనగామ చిటకోడూరు -
సూర్యాపేట సమగ్ర స్వరూపం
జిల్లా కలెక్టర్ సురేంద్రమోహన్ ఫోన్: 9764666457 ఎస్పీ పరిమళనూతన్ ఫోన్: 8332901100 ఇతర ముఖ్య అధికారులు జేసీ: సంజీవరెడ్డి 9491053535 డీఈవో: వెంకటనర్సమ్మ 8008090919 డీఎంహెచ్వో: టి.మురళీమోహన్ 8008488565 డీఆర్డీఏ, డ్వామా పీడీ: సుందరి కిరణ్కుమార్ 9705982226 వ్యవసాయశాఖ: కిరణ్మయి 7288894490 మండలాలు 23: సూర్యాపేట, ఆత్మకూర్.ఎస్, చివ్వెంల, పెన్పహాడ్, మోతె, నూతనకల్, మద్దిరాల, తిరుమలగిరి, తుంగతుర్తి, అర్వపల్లి, నాగారం, కోదాడ, అనంతగిరి, మేళ్లచెర్వు, మల్లారెడ్డిగూడెం, నేరేడుచర్ల, పాలకీడు, మఠంపల్లి, హుజూర్నగర్, మునగాల, గరిడేపల్లి, చిలుకూరు, నడిగూడెం రెవెన్యూ డివిజన్లు 2: (సూర్యాపేట, కోదాడ) మున్సిపాలిటీలు 2: (సూర్యాపేట, కోదాడ, హుజూర్నగర్), గ్రామపంచాయతీలు: 322 ముఖ్య పరిశ్రమలు: ఫార్మా, పీవీసీ, పారాబాయిల్డ్ రైస్ మిల్లులు, సిమెంట్ పరిశ్రమలు ఎమ్మెల్యేలు: జి.జగదీశ్రెడ్డి (సూర్యాపేట), గాదరి కిషోర్కుమార్ (తుంగతుర్తి), ఉత్తమ్కుమార్రెడ్డి (హుజూర్నగర్), పద్మావతి (కోదాడ) ఎంపీలు: బూర నర్సయ్యగౌడ్ (భువనగిరి), గుత్తా సుఖేందర్రెడ్డి (నల్లగొండ) పర్యాటకం: మఠంపల్లి శ్రీలక్ష్మీనర్సింహస్వామి, ఉండ్రుగొండ గిరి దుర్గం, పెద్దగట్టు లింగమంతులస్వామి ఆలయం, పిల్లలమర్రి, నాగులపహాడ్ శివాలయాలు, మేళ్ల చెర్వు శివాలయం. తిరుమలగిరిలోని ఫణిగిరి బౌద్ధక్షేత్రం జాతీయ రహదారులు: నంబర్ 65 హైదరాబాద్ నుంచి దూరం: 134 కిలోమీటర్లు -
మహబూబాబాద్ సమగ్ర స్వరూపం
జిల్లా కలెక్టర్ ప్రీతి మీనన్ ఎస్పీ జె.మురళీధర్ ఇతర ముఖ్య అధికారులు జేసీ: దామోదర్ రెడ్డి డీఆర్వో: కృష్ణవేణి డీఏవో: ఛత్రునాయక్ డీఎంహెచ్వో: డాక్టర్ శ్రీరాం డీఎస్వో: ఎ.లక్ష్మణ్ సివిల్ సప్లై జిల్లా మేనేజర్: విజయేందర్రెడ్డి డీఎఫ్వో: జి.కిష్టాగౌడ్ జిల్లా మార్కెటింగ్ అధికారి: వి.శ్రీనివాస్ ఐసీడీఎస్ పీడీ: స్వర్ణలత జిల్లా ఎస్సీ అభివృద్ధి అధికారి: ఆర్.రాజు జిల్లా బీసీ వెల్ఫేర్ ఆఫీసర్: సోమేశ్కుమార్ డీఈవో: డి.వాసంతి కమర్షియల్ ట్యాక్స్ డిప్యూటీ కమిషనర్: ఎం.సాగర్ డీపీవో: బి.రాణిభాయ్ జిల్లా రవాణా అధికారి: భద్రునాయక్ పరిశ్రమల శాఖ ఏడీ: వి.వీరేశం మండలాలు: 16 రెవెన్యూ డివిజన్లు: మహబూబాబాద్, తొర్రూర్ మున్సిపాలిటీ: మహబూబాబాద్ గ్రామపంచాయతీలు: 287 ప్రధాన పరిశ్రమలు: లేవు ప్రాజెక్టులు: బి.ఎన్.గుప్తా ప్రాజెక్ట్, బయ్యారం పెద్ద చెరువు, కంబాల్ చెరువు ఎమ్మెల్యేలు: బానోత్ శంకర్ నాయక్ (మహబూబాబాద్), డి.ఎస్.రెడ్యానాయక్ (డోర్నకల్), కోరం కనకయ్య (ఇల్లందు), అజ్మీర చందులాల్ (ములుగు), ఎరబెల్లి దయాకర్రావు (పాలకుర్తి) ఎంపీ: అజ్మీర సీతారాం నాయక్ పర్యాటకం, దేవాలయాలు: కురవి వీరభద్రస్వామి, డోర్నకల్ సీఎస్ఐ చర్చి, అనంతారంలో అనంతాద్రి, నర్సింహులపేట మండలంలో వెంకటేశ్వరస్వామి దేవస్థానం జాతీయ రహదారి: ఎన్హెచ్ 365 (మహబూబాబాద్, కురవి, మరిపెడ) రైల్వేలైన్లు: కేసముద్రం, మహబూబాబాద్, గుండ్రాతిమడుగు, డోర్నకల్, గార్ల ఖనిజాలు: ఇనుప ఖనిజం, డోలమైట్ -
నల్లగొండ సమగ్ర స్వరూపం
జిల్లా కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ ఫోన్: 9985915000 ఎస్పీ ఎన్.ప్రకాశ్రెడ్డి ఫోన్: 9440795600 ఇతర అధికారులు జేసీ: నారాయణరెడ్డి 9985915006 జెడ్పీ సీఈవో: ఆర్.మహేందర్రెడ్డి 9849903266 అగ్రికల్చర్ జేడీ: బి.నర్సింహారావు 8886614422 డీఆర్వో: ఆర్.అంజయ్య 9948455538 డీటీసీ: ఎం.చంద్రశేఖర్గౌడ్ 9948661750 డీపీవో: ప్రభాకర్రెడ్డి 9949810538 డీఎంహెచ్వో: డాక్టర్ భానుప్రకాశ్ 9966921036 మండలాలు 31: నల్లగొండ, కనగల్, తిప్పర్తి, మాడ్గులపల్లి, మిర్యాలగూడ, వేములపల్లి, దామరచర్ల, అడవిదేవులపల్లి, త్రిపురారం, నిడమనూరు, హాలియా, తిరుమలగిరి, పెదవూర, గుర్రంపోడు, మునుగోడు, నాంపల్లి, మర్రిగూడ, చండూరు, నకిరేకల్, నార్కట్పల్లి, కేతేపల్లి, కట్టంగూరు, చిట్యాల, శాలిగౌరారం, డిండి, చింతపల్లి, దేవరకొండ, పీఏపల్లి, చందంపేట, నేరేడుగొమ్ము, కొండమల్లేపల్లి రెవెన్యూ డివిజన్లు 3: నల్లగొండ, మిర్యాలగూడ, దేవరకొండ, మున్సిపాలిటీలు: నల్లగొండ, మిర్యాలగూడ, దేవరకొండ పంచాయతీలు: 516 ముఖ్య పరిశ్రమలు: ప్రతిపాదిత యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం, మిర్యాలగూడ పరిసరాల్లోని పారా బాయిల్డ్ రైస్ ఇండస్ట్రీస్ ఎమ్మెల్యేలు: కోమటిరెడ్డి వెంకటరెడ్డి(నల్లగొండ), ఎన్.భాస్కరరావు(మిర్యాలగూడ), కె.జానారెడ్డి(నాగార్జునసాగర్), వేముల వీరేశం(నకిరేకల్), రమావత్ రవీంద్రకుమార్(దేవరకొండ), కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి(మునుగోడు) ఎంపీలు: గుత్తా సుఖేందర్రెడ్డి(నల్లగొండ), బూర నర్సయ్యగౌడ్(భువనగిరి) పర్యాటక ప్రాంతాలు: నాగార్జునసాగర్, పానగల్లు దేవాలయాలు: వాడపల్లి శివాలయం, నాగార్జునసాగర్లోని బౌద్ధారామం, పానగల్లు ఛాయా సోమేశ్వరస్వామి, దామరచర్ల మండలం కల్లేపల్లి మైసమ్మ దేవాలయం జాతీయ రహదారులు: నార్కట్పల్లి-అద్దంకి ఎన్హెచ్ 65 రైల్వే లైన్లు: సికింద్రాబాద్ నుంచి చిట్యాల, నల్లగొండ, మిర్యాలగూడ, వాడపల్లి మీదుగా ఏపీలోని గుంటూరు జిల్లా వరకు లైన్ -
భూపాలపల్లి (జయశంకర్) సమగ్ర స్వరూపం
జిల్లా కలెక్టర్ ఎ.మురళి ఫోన్: 9701962226 ఎస్పీ ఆర్.భాస్కరన్ ఆచార్య జయశంకర్ జిల్లా విస్తీర్ణంలో రాష్ట్రంలో మూడోస్థానం, అడవుల్లో మొదటి స్థానంలో ఉంది. మండలాలు 20: భూపాలపల్లి, గణపురం, రేగొండ, మొగుళ్ళపల్లి, చిట్యాల, టేకుమట్ల, మల్హర్రావు, కాటారం, మహదేవ్పూర్, పలిమెల, మహాముత్తారం, ములుగు, వెంకటాపూర్, గోవిందరావుపేట, తాడ్వాయి, ఏటూరునాగారం, కన్నాయగూడెం, మంగపేట, వెంకటాపురం, వాజేడు రెవెన్యూ డివిజన్లు 2: భూపాలపల్లి, ములుగు మున్సిపాలిటీలు 1: భూపాలపల్లి నగర పంచాయతీ గ్రామ పంచాయతీలు: 262 భారీ పరిశ్రమలు: సింగరేణి, కేటీపీపీ, బిల్ట్ కాగితపు పరిశ్రమ ఇరిగేషన్: మేడిగడ్డ, దేవాదుల, చెరువులు(గణపసముద్రం, రామప్ప, లక్నవరం) ఎమ్మెల్యేలు: సిరికొండ మధుసూదనాచారి, పుట్ట మధు, అజ్మీరా చందూలాల్ పర్యాటకం, ఆలయాలు: రామప్ప, లక్నవరం, మల్లూరు, మేడారం సమ్మక్క–సారలమ్మ, కోటగుళ్ళు, పాండవులగుట్ట, కాళేశ్వరం ముక్తీశ్వరస్వామి, బోగత జలపాతం జాతీయ రహదారులు గుడెప్పాడ్ నుంచి కాళేశ్వరం వరకు జాతీయ రహదారి నిర్మాణ పనులు జరుగుతున్నాయి. రైల్వే లైన్లు: లేవు హైదరాబాద్ నుంచి దూరం: 222 కి.మీ. -
కామారెడ్డి జిల్లా సమగ్ర స్వరూపం
జిల్లా కలెక్టర్ ఎన్.సత్యనారాయణ ఎస్పీ శ్వేతారెడ్డి ఇతర అధికారులు జేసీ: సురభి సత్తయ్య డీఈవో: మదన్మోహన్ డీపీవో: జి.రాములు పరిశ్రమల శాఖ జీఎం: శ్రీనివాసులు జిల్లా మత్స్యశాఖ అధికారి: లక్ష్మీనారాయణ డీఆర్డీవో పీడీ: చంద్రమోహన్రెడ్డి రవాణా శాఖ జిల్లా అధికారి: దుర్గా ప్రమీల డీఎస్వో : జయదేవ్సింగ్ డీసీఎస్వో : ఎ.రమేశ్ చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్: ఎ.శ్రీనివాస్ జిల్లా వ్యవసాయ అధికారి: ఎం.విజయ్కుమార్ రెవెన్యూ డివిజన్లు 3: కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ మండలాలు 22: కామారెడ్డి, భిక్కనూరు, దోమకొండ, మాచారెడ్డి, రాజంపేట, రామారెడ్డి, బీబీపేట, సదాశివనగర్, తాడ్వాయి. ఎల్లారెడ్డి, లింగంపేట, గాంధారి, నాగిరెడ్డిపేట, బాన్సువాడ, బీర్కూర్, నిజాంసాగర్, పిట్లం, జుక్కల్, బిచ్కుంద, నస్రుల్లాబాద్, పెద్దకొడప్గల్ గ్రామ పంచాయతీలు: 323 మున్సిపాలిటీలు: కామారెడ్డి ఎమ్మెల్యేలు: గంప గోవర్ధన్(కామారెడ్డి), ఏనుగు రవీందర్రెడ్డి(ఎల్లారెడ్డి), పోచారం శ్రీనివాస్రెడ్డి(బాన్సువాడ), హన్మంత్ షిండే(జుక్కల్) ఎంపీ: బీబీ పాటిల్ (జహీరాబాద్) భారీ పరిశ్రమలు: షుగర్ ఫ్యాక్టరీలు సాగునీటి ప్రాజెక్టులు: నిజాంసాగర్, పోచారం, కౌలాస్నాలా, సింగీతం రిజర్వాయర్ ఆలయాలు: సిద్ధిరామేశ్వరాలయం (భిక్కనూరు), కాలభైరవస్వామి ఆలయం (రామారెడ్డి), లక్ష్మీనర్సింహస్వామి దేవస్థానం (చుక్కాపూర్), సోమ లింగేశ్వరాలయం (సోమేశ్వర్) పర్యాటక కేంద్రాలు: దోమకొండ గడికోట, పోచారం అభయారణ్యం, కౌలాస్ ఖిల్లా, నిజాంసాగర్, పోచారం ప్రాజెక్టులు. -
నిజామాబాద్ జిల్లా సమగ్ర స్వరూపం
జిల్లా కలెక్టర్ యోగితా రాణా ఫోన్: 9491036933 పోలీస్ కమిషనర్ కార్తికేయ ఫోన్: 9440795400 ఇతర ముఖ్య అధికారులు జేసీ: రవీందర్రెడ్డి 9491036090 జెడ్పీ సీఈవో: మోహన్లాల్ 9849900106 ఆర్డీవో: యాదిరెడ్డి 9491036891 డీఆర్వో: పద్మాకర్ 9491036911 మండలాలు 27: (నందిపేట, మాక్లూర్, నవీపేట, రెంజల్, ఎడపల్లి, బోధన్, వర్ని, కోటగిరి , డిచ్పల్లి, ఆర్మూర్, జక్రాన్పల్లి, వేల్పూరు, బాల్కొండ, మోర్తాడ్, కమ్మర్పల్లి, భీంగల్, సిరికొండ, ధర్పల్లి. కొత్త మండలాలు ఇవీ.. ఇందల్వాయి, మోపాల్, నిజామాబాద్ రూరల్, నిజామాబాద్ దక్షిణం, నిజామాబాద్ ఉత్తరం, ముప్కాల్, మెండోరా, ఎర్గట్ల, రుద్రూరు) రెవెన్యూ డివిజన్లు: నిజామాబాద్, బోధన్ , ఆర్మూర్ మున్సిపాలిటీలు/కార్పొరేషన్: నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, ఆర్మూర్, బోధన్ మున్సిపాలిటీలు పరిశ్రమలు: బోధన్ షుగర్ ఫ్యాక్టరీ సాగునీటి ప్రాజెక్టులు: ఎస్సారెస్పీ, అలీసాగర్, గోదావరిపై 18 ఎత్తిపోతల పథకాలు ఎమ్మెల్యేలు: బిగాల గణేశ్గుప్తా(నిజామాబాద్ అర్బన్) బాజిరెడ్డి గోవర్ధన్(నిజామాబాద్ రూరల్) ఆశన్నగారి జీవన్రెడ్డి(ఆర్మూర్) షకీల్ అహ్మద్(బోదన్), వేముల ప్రశాంత్రెడ్డి(బాల్కొండ) ఎంపీ: కల్వకుంట్ల కవిత(నిజామాబాద్) పర్యాటక ప్రాంతాలు: శ్రీరాంసాగర్ ప్రాజెక్టు, డిచ్పల్లి ఖిలా రామాలయం, రఘునాథ ఆలయం అలీసాగర్ ఉద్యానవనం, సిద్దుల గుట్ట జాతీయ రహదారులు: జిల్లా మీదుగా ఎన్హెచ్ 64. డిచ్పల్లి, ఆర్మూర్, బాల్కొండ మీదుగా ఎన్హెచ్ 44 రైల్వేలైన్: నిజామాబాద్-హైదరాబాద్ వరకు 185 కి.మీ. మార్గం ఖనిజాలు: ఇసుక క్వారీలు గ్రామ పంచాయతీలు: 395 -
వరంగల్ రూరల్ సమగ్ర స్వరూపం
వరంగల్ రూరల్ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ ఫోన్: 9000317131 పోలీస్ కమిషనర్ జి.సుధీర్బాబు ఫోన్: 9491089100 ఇతర ముఖ్య అధికారులు జేసీ: ఎం.హరిత డీఆర్వో: నాగరాజారావు ఆర్డీవో: సురేందర్రావు డీఈవో: వాసంతి డీఎంహెచ్వో: అశోక్ఆనంద్ ఐసీడీఎస్ అధికారి: సబిత డీపీఆర్వో: కిరణ్మయి రెవెన్యూ మండలాలు 15: రాయపర్తి, వర్ధన్నపేట, పరకాల, ఆత్మకూరు, దామెర, శాయంపేట, గీసుకొండ, సంగెం, పర్వతగిరి, నర్సంపేట, చెన్నారావుపేట, నల్లబెల్లి, దుగ్గొండి, ఖనాపూర్, నెక్కొండ రెవెన్యూ డివిజన్లు 2: వరంగల్ రూరల్, నర్సంపేట మున్సిపాలిటీలు 2: నగర పంచాయతీలు (నర్సంపేట, పరకాల) గ్రామ పంచాయతీలు: 280 భారీ పరిశ్రమలు: ప్రస్తుతానికి లేవు (జాతీయస్థాయి టెక్స్టైల్ పార్క్ ఏర్పాటుకు భూసేకరణ మెదలైంది) ఇరిగేషన్: కాకతీయ కాలువ, పాకాల చెరువు, చలివాగు ప్రాజెక్టు ఎంపీలు: పసునూరి దయాకర్ (వరంగల్), ఎ.సీతారాంనాయక్ ఎమ్మెల్యేలు: చల్లా ధర్మారెడ్డి, దొంతి మాధవరెడ్డి, అరూరి రమేశ్, ఎర్రబెల్లి దయాకర్రావు, ఎస్.మధుసూదనాచారి పర్యాటకం: పాకాల చెరువు జాతీయ రహదారులు: 163 (హైదరాబాద్-భూపాలపట్నం), 365 (సిరోంచా-రేణిగుంట) రైల్వే లైన్: కాజీపేట–విజయవాడ హైదరాబాద్ నుంచి దూరం: 136 కిలోమీటర్లు ఖనిజాలు: రాతి గుట్టలు -
వరంగల్ అర్బన్ సమగ్ర స్వరూపం
జిల్లా కలెక్టర్ కాట ఆమ్రపాలి ఫోన్: 9704560800 పోలీస్ కమిషనర్ జి.సుధీర్బాబు ఫోన్: 9491089100 ఇతర ముఖ్య అధికారులు: జేసీ: డి.దయానంద్ (9849904285) డీఆర్వో: కె.శోభ (9704560803) ఆర్డీవో: వెంకట మాధవరావు (7680906650) డీఈవో: కె.సత్యనారాయణ డీఎంహెచ్వో: సాంబశివరావు (9849902514) ఐసీడీఎస్ అధికారి: శైలజ (9440814433) మండలాలు: 11 వరంగల్, ఖిలావరంగల్, హన్మకొండ, కాజీపేట, హసన్పర్తి, ఐనవోలు, ధర్మసాగర్, వేలేరు, భీమదేవరపల్లి, ఎల్కతుర్తి, కమలాపూర్ రెవెన్యూ డివిజన్లు 1 (వరంగల్ అర్బన్) కార్పొరేషన్ 1: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ గ్రామ పంచాయతీలు: 45 భారీ పరిశ్రమలు: లేవు ప్రాజెక్టులు: ఎస్సారెస్పీ కాలువ, దేవాదుల పైప్లైను ఎంపీలు: పసునూరి దయాకర్(వరంగల్), బి.వినోద్కుమార్(కరీంనగర్) ఎమ్మెల్యేలు: దాస్యం వినయ్భాస్కర్(వరంగల్ పశ్చిమ), కొండా సురేఖ(వరంగల్ తూర్పు), అరూరి రమేశ్(వర్ధన్నపేట), వి.సతీశ్కుమార్ (హుస్నాబాద్), టి.రాజయ్య(స్టేçÙన్ఘన్పూర్), ఈటల రాజేందర్(హుజూరాబాద్) పర్యాటకం: కాకతీయుల కోట(ఖిలా వరంగల్), వెయ్యి స్తంభాల గుడి(రుద్రేశ్వర ఆలయం), భద్రకాళి ఆలయం, మల్లికార్జున ఆలయం(ఐనవోలు) జాతీయ రహదారులు: 163 (హైదరాబాద్–భూపాలపట్నం) రైల్వే లైన్లు: ఉత్తర, దక్షిణాది రాష్ట్రాలను కలిపే కాజీపేట జంక్షన్, విజయవాడ–కాజీపేట–హైదరాబాద్, విజయవాడ–కాజీపేట–ఢిల్లీ లైన్లు హైదరాబాద్ నుంచి దూరం: 135 కి .మీ. ఖనిజాలు: రాతి గుట్టలు -
వెబ్సైట్లోకి ‘ప్రతిభా’వంతుల వివరాలు
అనంతపురం ఎడ్యుకేషన్ : మార్చి–16 పదో తరగతి పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించి ప్రతిభా అవార్డులకు ఎంపికైన జిల్లాలోని 378 మందికి సంబంధించిన బ్యాంక్ అకౌంటు తదితర వివరాలు ఈనెల 10లోగా నమోదు చేయాలని డీఈఓ అంజయ్య ఓ ప్రకటనలో సూచించారు. ఈ బాధ్యతను ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు తీసుకోవాలన్నారు. వివరాలు నమోదు చేయని పక్షంలో అవార్డు నగదు జమ కాదన్నారు. -
‘గడువు లోపల పనులు పూర్తి చేయాలి’
బాల్కొండ : శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ బ్యాక్వాటర్ ఆధారంగా జలాల్పూర్ శివారులో నిర్మిస్తున్న మిషన్ భగీరథ ఇంటెక్ వెల్ పనులను గడువు లోపల పూర్తి చేయాలని కలెక్టర్ యోగాతా రాణా అధికారులను ఆదేశించారు. బుధవారం ఆమె ఇంటెక్వెల్ నిర్మాణ పనులను పరిశీలించారు. పనులు ఎప్పటి వరకు పూర్తి చేస్తారని కాంట్రాక్టు కంపెనీ ప్రతినిధులను ప్రశ్నించారు. గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఎక్కువ సమయం తీసుకుంటే చర్యలు తప్పవన్నారు. పనులను అధికారులు పరిశీలించాలని, నాణ్యతతో సాగేలా చూడాలని ఆదేశించారు. పనులన్నీ సకాలంలో పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం ఫెడస్టల్ పైప్లైన్, సబ్స్టేషన్ పనులను పరిశీలించారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ పండరినాథ్, ఎంపీడీవో శ్రీనివాస్, జలాల్పూర్ సర్పంచ్ జక్కగంగారాం, ఆర్డబ్ల్యూఎస్, మిషన్ భగీరథ అధికారులు ఉన్నారు. -
గల్ఫ్ వెళ్తున్నారా.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి
తాడేపల్లిగూడెం : గల్ఫ్ దేశాలకు ఉపాధి కోసం వెళ్తున్నారా.. అయితే మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. లేకుంటే ప్రమాదాలను కొని తెచ్చుకున్నట్టే. ప్రవాస భారతీయ మంత్రిత్వశాఖ ఇటీవల పార్లమెంటులో ఈ వివరాలు ప్రకటించింది. ప్రపంచంలోని 184 దేశాలలో సుమారు మూడుకోట్ల మంది భారతీయులు ఉన్నారు. ఆరు అరబ్ గల్ఫ్ దేశాలలో సుమారు 60 లక్షల మంది భారతీయులు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్కు చెందిన వారు సుమారు 20 లక్షల మంది ఉన్నారు. ప్రపంచంలోని 17 దేశాలకు ఉద్యోగాలకు వెళ్లాలనుకునే భారతీయ కార్మికులు ప్రొటెక్టర్ ఆఫ్ ఇమిగ్రెంట్స్ (పీఈఇ) (వలసదారుల సంరక్షకులు) వారి కార్యాలయం ద్వారా ఇమిగ్రేషన్ క్లియరెన్సు (వలసవెళ్లడానికి అనుమతి) తీసుకోవాలి. బహెరిన్, సౌదీ అరేబియా, కువైట్, ఖతార్, ఓమన్, యూఏఈ, ఆప్ఘనిస్తాన్, ఇరాక్, జోర్డాన్, లెబనాన్, లిబియా, మలేషియా, సూడాన్, యెమెన్, ఇండోనేషియా, థాయ్లాండ్ వెళ్లే వారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వారికి కొన్ని హక్కులూ ఉంటాయి. అవేమిటో ఓ సారి తెలుసుకుందాం. ప్రవాస కార్మికుల హక్కులు ఇవీ.. – స్వదేశం నుంచి విదేశానికి పోడానికి , రావడానికి స్వేచ్ఛగా ప్రయాణించే హక్కు. – బానిసత్వానికి , బలవంతపు చాకిరీకి వ్యతిరేకంగా రక్షణ పొందే హక్కు. – ఆలోచన, మనస్సాక్షి, మత విషయంలో స్వేచ్ఛగా ఉండే హక్కు – హింస, అవమానమైన అణచివేత లేదా శిక్షల నుంచి స్వేచ్ఛగా ఉండే హక్కు గల్ఫ్ వెళ్లే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు – పాస్పోర్టు దరఖాస్తులో ఇంటిపేరు పేరు, తండ్రిపేరు, తల్లిపేరు, జీవిత భాగస్వామి ( భర్త లేదా భార్య) పేరు స్పష్టమైన స్ఫెల్లింగ్తో రాయాలి. జన్మస్థలం. పుట్టినతేదీ, చిరునామా, విద్యార్హతలు, సరిగ్గా పేర్కొనాలి. సరైన సమాచారంతో తప్పులు లేకుండా పాస్పోర్టు పొందాలి. – ప్రభుత్వం ద్వారా ఉచిత శిక్షణ కార్యక్రమాల్లో పాల్గొని, వత్తి నైపుణ్యం పెంచుకోవాలి – విదేశాలకు వెళ్లే ముందు వైద్య,ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి. విదేశాలలో మెడికల్ చెకప్లో ఫెయిలైతే ఉద్యోగం నుంచి తొలగించి ఇంటికి పంపిస్తారు. ఏ దేశానికి ఏ పనిమీద వెళ్లాలనుకుంటున్నారో స్పష్టత కలిగి ఉండాలి. విజిటింగ్ వీసా, ఆజాద్ వీసా, ఫ్రీ వీసా. ఖఫాలత్ వీసా, ప్రైవేట్ వీసాలపై విదేశాలకు వెళ్లవద్దు. చట్టబద్దమైన కంపెనీల వీసాలపై మాత్రమే వెళ్లాలి. ప్రవాసీ భారతీయ వ్యవహారాల శాఖ , ప్రొటెక్టర్ జనరల్ ఆఫ్ ఇమిగ్రెంట్స్చే జారీచేసిన లైసెన్సు కలిగిన రిజిస్టర్డ్ రిక్రూటింగ్ ఏజెన్సీల ద్వారా మాత్రమే విదేశాలకు వెళ్లాలి. విదేశీ యాజమాన్యం నుంచి పొందిన డిమాండ్ లెటర్, పవర్ ఆఫ్ అటార్నీ పత్రాలు ఉన్న ఏజంటు ద్వారా మాత్రమే వెళ్లాలి. ఇండియన్ ఎంబసీచే ధ్రువీకరించబడిన ఆరబ్బీతోపాటు ఇంగ్లీషు. తెలుగు, భాషలలోని ఉద్యోగ ఒప్పంద పత్రం కలిగి ఉండాలి. ఉద్యోగ ఒప్పంద పత్రం ఒక శ్రామికునిగా హక్కులను కాపాడుతుంది. – ఇమిగ్రేషన్ యాక్టు 1983 ప్రకారం.. సబ్ ఏజంట్లకు అనుమతి ఉండదు. కాబట్టి విదేశాలకు వెళ్లేవారు వారితో సంప్రదించకూడదు. – కనీసం ఆరు నెలల పాటు చెల్లుబాటయ్యే పాస్పోర్టు ఉండేటట్టుగా చూసుకోవాలి. చెల్లుబాటులో ఉన్న వీసా తప్పకుండా పాస్పోర్టుపై స్టాంపింగ్ అయ్యి ఉండాలి. విడిగా వీసా అయ్యినా ఉండాలి. – విదేశాలకు ఉద్యోగానికి వెళ్లడానికి సర్వీస్ చార్జీగా 45 రోజుల వేతనం( రూ.20 వేలకు మించకుండా) మాత్రమే ఏజంటుకు చెల్లించాలి. చెల్లింపులు డిమాండ్ డ్రాప్టు లేదా చెక్కు ద్వారా చెల్లించాలి. రశీదు తీసుకోవాలి. – విదేశాలకు వెళ్లేటప్పుడు మీ పాసుపోర్టు, వీసా తదితర అన్ని రకాల డాక్యుమెంట్ల జిరాక్స్సెట్ను మీ కుటుంబసభ్యులకు ఇచ్చి వెళ్లాలి. – ముఖ్యమైన టెలిఫోన్ నంబర్లను గుర్తుంచుకోవాలి. విదేశానికి వెళ్లాక ఏం చేయాలి – విదేశానికి చేరిన తర్వాత సాధ్యమైనంత త్వరగా రెసిడెంటు పర్మిట్ , వర్క్సు పర్మిట్, ఐడెంటిటీ కార్డు, లేబర్ కార్డు, అఖామా, బాతాకా పొందాలి. – ఉపాధి కోసం విదేశాలలో ఉన్న చట్టాలను, సంప్రదాయాలను పాటించాలి. గౌరవించాలి. – ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. అనవసరమైన ఆడంబరాలకు , విలాసాల జోలికి వెళ్లవద్దు. విలాస వస్తువుల కోసం డబ్బును వథా చేయకూడదు. పొదుపు చేసుకోవాలి. – విదేశాలలో ఉద్యోగాలు శాశ్వతం కాదు. ప్రపంచంలోని పరిస్థితులు , ఉద్యోగం చేస్తున్న దేశంలో సంభవించే పరిణామాల వల్ల ఏ క్షణంలోౖ¯ð నా ఉద్యోగానికి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందన్న స్పహతో అప్రమత్తంగా ఉండాలి. – అరబ్, గల్ఫ్ దేశాలలో యజమాని నుంచి పారిపోయి వేరేచోట పనిచేయడం వల్ల అక్రమ వాసులు (ఖల్లివెల్లి) గా మారి తమ హక్కులను కోల్పోతారు. – ఓవర్ టైం పనిచేయాలని ఒత్తిడి చేసే అధికారం యజమానికి లేదు. ఇష్టమైతే అదనపు పనికి, అదనపు వేతనం ఇస్తేనే ఓవర్టైం చేయాలి. వారానికి ఒక రోజు సెలవు పొందే హక్కు ఉంది. – గల్ఫ్ దేశాల చట్టాల ప్రకారం సమ్మె, ఆందోళనలు చేయడం నిషేధం. – మహాత్మాగాంధీ ప్రవాసీ సురక్షా ( ఎంజీపీఎస్వై) ,సాంఘిక భద్రతా పొదుపు పథకంలో చేరాలి. మీరే చేసే పొదుపునకు ప్రవాసీ భారతీయ వ్యవహారాల మంత్రిత్వశాఖ కూడా కొంత ప్రోత్సాహక చందా జమచేస్తుంది. – విదేశాల నుంచి డబ్బును పంపడానికి పొదుపుకోసం సొంత ఊరిలో ఉన్న బ్యాంకులో ఎన్ఆర్ఐ ఖాతాను తెరవాలి. సెల్ఫోన్లు వాడుతున్నప్పటికీ, రెండు మూడు నెలలకు ఒకసారి కుటుంబ సభ్యులకు ఉత్తరాలు రాస్తుండాలి. పోస్టు ద్వారా వచ్చే ఈ ఉత్తరాలపై ఉన్న ముద్రలు ఆపద కాలంలో ఉపయోగపడవచ్చు. విదేశాలలో ఇబ్బంది ఉంటే సమీపంలోని భారత రాయబార కార్యాలయంలో సంప్రదించవచ్చు. -
గుర్తుతెలియని మృతదేహం ఆచూకీ లభ్యం
చింతలపూడి : చింతలపూడి మండలం యర్రగుంటపల్లి అటవీ ప్రాంతంలో సోమవారం లభ్యమైన గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం ఆచూకీ లభించినట్టు ఎస్సై సైదానాయక్ మంగళవారం తెలిపారు. ఈ మృతదేహం కర్ణాటక రాష్ట్రం, రాయ్చూర్ జిల్లా గిలకషుగర్గాయ్ గ్రామానికి చెందిన బొబ్బా శేషగిరిరావు (60)కు చెందినదిగా గుర్తించామన్నారు. దినపత్రికల్లో వచ్చిన మృతుని ఫొటో చూసి ద్వారకాతిరుమలలో ఉంటున్న అతని బంధువులు గుర్తుపట్టారని చెప్పారు. దీంతో మృతుని కుటుంబ సభ్యులకు సమాచారం అందించామన్నారు. మృతుడు అనారోగ్య కారణాలతో కొద్ది కాలంగా బాధపడుతున్నట్టు బంధువులు తెలిపారని ఎస్సై చెప్పారు. మృతికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నామన్నారు. -
సుకన్య సమృద్ధి.. పొదుపునకు నాంది
చింతలపూడి : ఆడపిల్లల పట్ల లింగ వివక్షను రూపుమాపి అసమానతలను అంతం చేయాలన్న లక్ష్యంతో ప్రధాని నరేంద్రమోదీ సుకన్య సమృద్ధి యోజనను ప్రవేశపెట్టారు. పదేళ్లలోపు ఉన్న బాలికలకు ఈ పథకం వర్తిస్తుంది. ఆడపిల్లల పేరిట తల్లిదండ్రులతో పొదుపు చేయించడం ద్వారా భవిష్యత్ వారికి భరోసా కల్పించే విధంగా ఈ పథకాన్ని రూపొందించారు. దీనిలో పొదుపు చేసే వారికి అత్యధిక వడ్డీ లభిస్తుంది. ప్రజల నుంచి ఎంతో ఆదరణ పొందిన సుకన్య సమృద్ధి యోజనలో ఇటీవల కేంద్ర ప్రభుత్వం కొన్ని మార్పులు చేసింది. ఆ వివరాలు మీ కోసం.. పౌరసత్వంలో మార్పు భారత పౌరసత్వం కలిగిన వారికి మాత్రమే ఇందులో లబ్ధిదారులుగా ఉండే అవకాశం ఉంది. ఒక వేళ ఖాతాదారు భారత పౌరసత్వం కోల్పోయి ఎన్ఆర్ఐ అయితే ఖాతా మూసివేసినట్టుగా పరిగణిస్తారు.పౌరసత్వం మారిన తరువాత వడ్డీ జమ అవ్వదు. ఖాతా బదిలీ పోస్టాఫీస్, బ్యాంక్ శాఖల్లో తెరిచిన సుకన్య సమృద్ధి ఖాతాను ఒక చోటి నుంచి మరొక చోటికి బదిలీ చేసుకోవచ్చు. ఇల్లు మారుతున్నట్టు ఆధారాలు చూపితే ఎటువంటి రుసుం లేకుండా ఖాతాను బదిలీ చేస్తారు. అలా కాకుండా పోస్టాఫీస్కు కానీ లేదా బ్యాంకుకు రూ.100 చెల్లించి వేరే చోటుకు ఖాతాను మార్పు చేసుకోవచ్చు. ఎంత వరకు జమ చేయచ్చంటే.. ఒక ఆర్థిక సంవత్సరంలో అమ్మాయి పేరిట జమ చేసే సొమ్ము రూ. లక్షా 50 వేలకు మించరాదు. పరిమితికి మించిన డబ్బుకు వడ్డీ రాదు. వార్షిక పరిమితికి మించి జమ చేసిన సొమ్మును ఏడాదిలో ఎప్పుడైనా డిపాజిట్దారు వెనక్కు తీసుకోవచ్చు. వడ్డీ రేటు ఇలా ఏడాదికోసారి చక్రవడ్డీ రూపంలో లెక్కింపు జరుగుతుంది. సమయానుకూలంగా ప్రభుత్వం ప్రకటించిన వడ్డీ రేట్లు అమల్లో ఉంటాయి. ప్రస్తుతానికి ప్రభుత్వం ప్రతి త్రైమాసికానికి వడ్డీ రేట్లను మారుస్తుంది. సుకన్య సమృద్ధి యోజనలో వడ్డీ రేటును ప్రభుత్వం 9.2 శాతంగా నిర్ణయించింది. డిపాజిట్ వయసు ఇంతకుముందు అమ్మాయి గరిష్ట వయసు 14 ఏళ్ల దాకా డిపాజిట్లు చేసే వీలుంది. ప్రస్తుతం మారిన నిబంధనల ప్రకారం 15 ఏళ్లకు పెంచారు. కనీస డిపాజిట్ ఇంతకు ముందు వడ్డీ రావాలంలే కనీసం ఏడాదికి రూ.1,000 డిపాజిట్ చేయాలని నియమం ఉండేది. ప్రస్తుతం కనీస డిపాజిట్ చేయకున్నా ఉన్న సొమ్ముకు 4 శాతం వడ్డీ వచ్చేలా మార్పు చేశారు. ఎలక్ట్రానిక్ బదిలీ (నెఫ్ట్, ఐఎంపీఎస్) ఇంతకుముందు డిపాజిట్లను నగదు లేదా చెక్కు లేదా డీడీ రూపంలో మాత్రమే చేసేందుకు వీలుండేలా పథకం ఉండేది. ప్రస్తుతం తల్లిదండ్రులు లేదా సంరక్షకులు ఆన్లైన్ లేదా ఎలక్ట్రానిక్ బదిలీలను చేసేందుకు సైతం అవకాశమిస్తున్నారు. ఏ పోస్టాఫీస్ లేదా బ్యాంక్లో ఖాతా ఉందో అక్కడ కోర్ బ్యాంకింగ్ ఉంటే ఎలక్ట్రానిక్ బదిలీ చేసుకోవచ్చు. మెచ్యూరిటీ ఇలా అమ్మాయికి 21 ఏళ్లు రాగానే ఖాతా మెచ్యూర్ అయ్యేటట్టు ఉండేది. ఖాతా తెరచినప్పటి నుంచి 21 ఏళ్లు పూర్తయిన తర్వాత మెచ్యూరిటీ తీరుతుంది. ఖాతా తెరిచే సమయానికి అమ్మాయి వయసు 10 ఏళ్లు మించకూడదు. విత్ డ్రాయల్ ఇంతకుముందు ఆడపిల్లకు 18 ఏళ్ల వయసు వచ్చే వరకు ఈ పథకంలో డిపాజిట్ అయిన మొత్తాన్ని ఉపసంహరించుకోవడం సాధ్యంకాదని చెప్పిన కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం పదో తరగతి పాసై ఉన్నత విద్య కోసం అవసరమైతే డిపాజిట్లో సగం వరకు విత్ డ్రా చేసుకోవచ్చని తెలిపింది. -
పాన్ కార్డు ప్రయోజనాలెన్నో..
చింతలపూడి: ఆదాయపు పన్ను శాఖ కేటాయించే పర్మినెంట్ అక్కౌంట్ నెంబర్ను పాన్ అంటారు. సాధారణంగా ఆదాయపన్ను రిటర్న్లు దాఖలు చేసేటప్పుడు ఆదాయపన్ను శాఖాధికారులతో ఉత్తర ప్రత్యుత్తరాలు జరపడానికి పాన్ తప్పనిసరి. పాన్ కార్డు ఎక్కడ తీసుకోవాలి, ఎలా తీసుకోవాలో తెలియక చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. పాన్ కార్డు అవసరం విస్తృతం. ఈనేపథ్యంలో పాన్ కార్డు గురించి వివరాలు తెలుసుకుందాం. పాన్కార్డు ఎప్పుడు అవసరమంటే.. బ్యాంక్లో ఖాతా తెరిచేందుకు, చెక్కులు, డీడీలు 50 వేలకు మించితే , స్థిరాస్థి, వాహన కొనుగోలు, అమ్మకాలు సమయంలో.. ఆదాయపు పన్ను రిటర్న్లు దాఖలు చేసే సమయంలో.. 50 వేలకు పైబడి బ్యాంక్ డిపాజిట్లు చేసినప్పుడు.. –డీమ్యాట్, ట్రేడింగ్ ఖాతాలు తెలిచేటప్పుడు పాన్ కార్డు అవసరం ఉంటుంది. పాన్ ఎవరికి అవసరం.. ప్రస్తుతం ఆదాయపన్ను చెల్లించే వారికి, ఇతరుల తరఫున ఆదాయపన్ను రిటర్న్లు దాఖలు చేయాల్సిన వారికి, పాన్ నెంబర్ను విధిగా నమోదు చేయాల్సిన లావాదేవీల్లోకి కొత్తగా ప్రవేశించాలనుకునే వారికి ఇది తప్పనిసరి దరఖాస్తు చేసుకోండిలా.. పాన్ సేవలను మెరుగుపర్చడం కోసం ఆదాయపన్ను శాఖ కార్యాలయం ఉన్న ప్రతి పట్టణంలో ఐటీ పాన్ సేవా కేంద్రాలను ఏర్పాటు చేశారు. యుటీఐ ఇన్వెస్టర్ సర్వీసెస్ లిమిటెడ్ సంస్థకు ఆదాయపన్ను శాఖ అనుమతి ఉంది. ఆ సంస్థ ఆధ్వర్యంలో సర్వీస్ సెంటర్లను నెలకొల్పింది. వీటితో పాటు టిన్ ఫెసిలిటేషన్ కేంద్రాలు కూడా ఉన్నాయి. వీటన్నింటిలో పాన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుదారునికి ఇవి తప్పనిసరి.. పాన్ కార్డు దరఖాస్తు చేసుకునేవారు దరఖాస్తుతో పాటు పాస్పోర్ట్ సైజ్ కలర్ ఫొటో, రూ.107 డిమాండ్ డ్రాప్ట్, వ్యక్తిగత గుర్తింపు, చిరునామా గుర్తింపు పత్రాలు జెరాక్స్లు జతచేయాలి. ఇవి వ్యక్తిగత గుర్తింపు పత్రాలు.. వ్యక్తిగత గుర్తింపు పత్రాలుగా స్కూల్ టీసీ, పదో తరగతి మార్కుల జాబితా , గుర్తింపు పొందిన విద్యా సంస్థ నుంచి పొందిన డిగ్రీ మార్కుల జాబితా, క్రెడిట్ కార్డు స్టేట్మెంట్, బ్యాంక్ ఖాతా పాస్బుక్, రేషన్ కార్డు, పాస్పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, ఓటరు గుర్తింపు కార్డులలో ఏదో ఒకదాని జెరాక్స్ కాపీ సమర్పించవచ్చు. ఇవి చిరునామా గుర్తింపు పత్రాలు..చిరునామా గుర్తింపు పత్రాలుగా విద్యుత్ బిల్లు, టెలిఫోన్ బిల్లు, క్రెడిట్ కార్డు స్టేట్మెంట్, బ్యాంక్ ఖాతా పాస్బుక్, రేషన్ కార్డు, పాస్పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, ఓటరు గుర్తింపు కార్డు, ప్రాపర్టీ ట్యాక్స్ అసెస్మెంట్ ఆర్డర్లలో ఏదో ఒకదాని జెరాక్స్ కాపీ జతచేయాలి. -
కాంగ్రెస్వి కాకిలెక్కలు
గిరిజనేతరులు పోడు చేస్తే పీడీ యాక్టు రెండు, మూడు ఎకరాలు సాగుచేస్తే గిరిజనులను వేధించొద్దు ఎంపీ సీతారాం నాయక్ ఇల్లెందు: ప్రతి పక్ష కాంగ్రెస్ కాకి లెక్కల పవర్ ప్రజెంటేషన్ చేసి, ప్రభుత్వాన్ని అభాసుపాలు చేసే యత్నం తగదని మహబూబాబాద్ ఎంపీ సీతారామ్ నాయక్ అన్నారు. గురువారం ఇల్లెందులో టీఆర్ఎస్ మాజీ జిల్లా అధ్యక్షుడు దిండిగల రాజేందర్ను పరామర్శించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. సీఎం కేసీఆర్ అసెంబ్లీలో రాష్ట్ర అభివృద్ధే లక్ష్యంగా కోటి ఎకరాలకు నీరు అందించాలనే లక్ష్యంతో పవర్ ప్రజెంటేషన్ ఇవ్వగా, కాంగ్రెస్ అభివృద్ధిని అడ్డుకునేందుకు కాకి లెక్కల పవర్ ప్రజెంటేషన్ ఇచ్చిందని విమర్శించారు. ప్రతిపక్షాలు ఓర్వలేనితనంతో అభూత కల్పనలను దుష్ప్రచారం చేస్తున్నాయని అన్నారు. ఈ విషయమై చర్చించేందుకు ప్రజా వేదిక, బహిరంగ చర్చకు తాము సిద్ధమన్నారు. గోదావరి నీటిని వినియోగించడంలో కాంగ్రెస్ పాలకులు విఫలమయ్యారని ఆరోపించారు. దళితుల రక్షణ కోసం చట్టాలు ఉన్నా అమలు చేయడంలో పాలకులు విఫలమయ్యారని అన్నారు. ఇల్లెందు నియోజకవర్గంలో రూ.30 లక్షలతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. గిరిజనుల సాగులో ఉన్న రెండు, మూడు ఎకరాల పోడు భూములు లాక్కొని మొక్కలు నాటడం తగదన్నారు. గిరిజనేతరులు పోడు చేస్తే పీడీ యాక్టు కేసులు నమోదు చేయాలని ప్రభుత్వమే సూచించిందన్నారు. అటవీ శాఖ హద్దులు దాటి ప్రవర్తిస్తోందని, ఈ విషయమై జిల్లా సమావేశంలో తాము అటవీ శాఖను ప్రశ్నిస్తామని చెప్పారు. టీఆర్ఎస్ జిల్లా మాజీ అధ్యక్షుడు దిండిగల రాజేందర్, మున్సిపల్ కౌన్సిలర్ జానీ పాషా, టీఆర్ఎస్ నేతలు చిలువేరు సత్యనారాయణ, భావ్సింగ్ నాయక్, మండల రాము, సోదపాక సత్యనారాయణ, మెరుగు కార్తీక్ తదితరులు పాల్గొన్నారు. -
వ్యాపారులు ఆదాయ వివరాలు వెల్లడించాలి
నాగులపాడు(పెదనందిపాడు): ప్రతి వ్యాపారి అతని వ్యాపారానికి సంబంధించిన ఆదాయవివరాలు వెల్లడించాలని బాపట్ల ఇన్కం ట్యాక్స్ ఆధికారిణి సీహెచ్ అంజనీదేవి అన్నారు. మండలపరిధిలోని నాగులపాడు శ్రీనివాస పాఠశాలలో శుక్రవారం సాయంత్రం వ్యాపారులకు ఆదాయవెల్లడి పథకం–2016పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ ఆర్థిక సంవత్సరం 2015–2016 లేదా అంతకుముందు సంవత్సరాలలో సరిగా ఆదాయం ప్రకటించనివారు, ఇప్పుడు ప్రకటించేందుకు ముందుకు రావచ్చని ఆమె చెప్పారు. సదరు డిక్లరేషన్కు సంబంధించి ఆదాయపన్ను చట్టం–1961, ఆస్తిపన్ను చట్టం–1957 కింద పెనాల్టీ, ప్రాసిక్యూషన్ నుంచి మినహాయింపు పొందవచ్చని వివరించారు. వెల్లడించిన ఆస్తులకు ఆస్తిపన్ను చట్టం–1957 నుంచి మినహాయింపు కూడా ఉంటుందని ఆమె తెలిపారు.స్థిర, చరాస్తుల వెల్లడి 01–06–2016 నుంచి 30–09–2106లోపు చేయాల్సి ఉంటుందని, వెల్లడించిన ఆస్తుల విలువ 01–06–2016 నాటికి మార్కెట్ విలువ, కొన్నప్పటికి విలువలతో గరిష్ట విలువ మీద పన్ను సర్చార్జ్, పెనాల్టీలు కలిపి 45 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుందని ఆమె వ్యాపారులకు వివరించారు. ఈ ఆదాయ వెల్లడిని అన్లైన్లో కూడా ధాఖలు చేయవచ్చని ఆమె చెప్పారు. ఈ అవగాహన సదస్సులో ఒంగోలు ఇన్కం ట్యాక్స్ ఆధికారులు ఈ వెంకట్రావు, ఎస్ జగదీష్, బి.టి.సత్యనారాయణ, ట్యాక్స్ బార్ ఆసోషియేషన్ సెక్రటరి ఎ బాలాజీరావు, సీనియర్ ఇన్కం ట్యాక్స్ ప్రాక్టీషనర్ వి.రఘురామయ్య, పారిశ్రామికవేత్తలు దాసరి శేషగిరిరావు, చారెర్టడ్ అకౌంటెంట్లు, మరియు ఇన్కం ట్యాక్స్ కార్యాలయ సిబ్బంది పెదనందిపాడు, కాకుమాను మండలాల వ్యాపారులు పాల్గొన్నారు. -
ఎన్హెచ్ఎం నిధుల వివరాలను అందించాలి
డీఎంహెచ్ఓ కొండల్రావు ఖమ్మం వైద్య విభాగం : నేషన్ హెల్త్ మిషన్ ద్వారా వచ్చే నిధుల ఖర్చు వివరాలు ఎప్పటి కప్పుడు అందజేయాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి ఏ. కొండల్రావు వైద్యాధికారులను ఆదేశించారు. శుక్రవారం డీఎంహెచ్ఓ కార్యాలయంలో ఎస్పీహెచ్ఓలు, వైద్యాధికారులు, సీనియర్ అసిస్టెంట్లలతో ఎన్హెచ్ఎం కార్యక్రమంపై సమీక్ష సమావేశం జరిగింది.డీఎంహెచ్ఓ మాట్లాడుతూ క్లస్టర్ పరిధిలో జరిగే కార్యక్రమాల నివేదికను సరైన సమయంలో పంపించాలని సీనియర్ పబ్లిక్ హెల్త్ ఆఫీసర్(ఎస్పీహెచ్ఓ)లను ఆదేశించారు. ప్రతీ పీహెచ్సీ పరిధిలో ఏఎన్సీ పరీక్షకు రాని గర్భిణులను గుర్తించి వారికి రిజిస్ట్రేషన్ చేసి సేవలు అందించాలని కోరారు. అగస్టు 10న జరిగే నేషనల్ డీ వార్మింగ్ డే కార్యక్రమాన్ని జిల్లాలో ప్రతిష్టాత్మకంగా చేపట్టి పిల్లలకు ఆల్బెండ్ జోల్ మాత్రలు వయస్సును బట్టి వేయాలని సూచించారు. ఎన్హెచ్ఎం డీపీఎంఓ కళావతిబాయి మాట్లాడుతూ ప్రధాన మంత్రి మాతృత్వ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ప్రతీ గర్భిణీని పరీక్షించాలన్నారు. ప్రతీనెల న్యూట్రిషన్ డైట్ అందించే విధంగా చూడాలని కోరారు. కార్యక్రమంలో జబ్బార్ జిల్లా కోఆర్డినేటర్ నిర్మల్కుమార్, డిప్యూటీ డెమో మంగళాబాయి, అన్నామేరి, నీలోహన, జి. సాంబశివారెడ్డి, జిల్లాలోని ఎస్పీహెచ్ఓలు, వైద్యాధికారులు, సీనియర్ అసిస్టెంట్లు పాల్గొన్నారు. -
ప్రై వేట్ విద్యార్థులకు ఉమ్మడి ప్రవేశ పరీక్ష
నిడమర్రు: 10వ తరగతి పబ్లిక్ పరీక్షలకు ప్రై వేట్ విద్యార్థులుగా హాజరై రాసే విధానాన్ని ఈ విద్యాసంవత్సరం నుంచి విద్యాశాఖ అధికారులు రద్దు చేశారు. దీంతో రెగ్యులర్ విద్యార్థులుగా ఎస్ఎస్సీ పరీక్షలు రాసేందుకు వారంతా ఏదో ఒక ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో తప్పనిసరిగా 10వ తరగతిలో నమోదై ఉండాలి. ఆ పాఠశాలలో అడ్మిషన్ పొందేందుకు ‘ప్రత్యేక వార్షిక ఉమ్మడి పరీక్షలు’ తప్పనిసరిగా హాజరవ్వాల్సి ఉంది. వీటి గురించి తెలుసుకుందాం.. విద్యాహక్కు చట్టం ప్రకారం 1 నుంచి 8వ తరగతి వరకూ ఏదైనా ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో నమోదు చేసుకునేందుకు ఎటువంటి అర్హత పరీక్షలు నిర్వహించకూడదు. బాలుడు/బాలిక వయసు ఆధారంగా ఆయా తరగతిలో విద్యార్థి అడ్మిషన్ పొందవచ్చు. అయితే 9వ, 10వ తరగతుల్లో ఉన్నత పాఠశాలలో అడ్మిషన్ పొందాలంటే తప్పనిసరిగా జిల్లా ఉమ్మడి పరీక్షల నిర్వహణ సంస్థ నిర్వహించే ‘ప్రత్యేక వార్షిక ఉమ్మడి పరీక్షలు’ రాసి ఉత్తీర్ణత సాధించాలి. ఈ ఉత్తీర్ణత ధ్రువీకరణ పత్రంతో ఆయా తరగతుల్లో అడ్మిషన్ నమోదు చేస్తారు. ప్రై వేట్ పాఠశాలల యాజమాన్యాల విజ్ఞప్తి మేరకు ఈ విద్యా సంవత్సరం ప్రై వేట్ విద్యార్థులు రెగ్యులర్ విద్యార్థులుగా అర్హత పొందేందుకు వీలుగా ప్రత్యేక ఉమ్మడి పరీక్షను జిల్లా అధికారులు నిర్వహిస్తున్నట్టు నిడమర్రు ఎంఈవో పాశం పాండురంగారావు తెలిపారు. సంబంధిత పాఠశాలల్లో వచ్చేనెల 2 వ తేదీలోపు విద్యార్థులు తప్పనిసరిగా దరఖాస్తు చేసుకోవాలి. అర్హతలు ..వయసు: 9వ తరగతి ప్రవేశ పరీక్షకు 2016 ఆగస్టు 31 నాటికి 13 ఏళ్లు నిండి ఉండాలి. 10వ తరగతి ప్రవేశ పరీక్షకు 2016 వచ్చేనెల 31 నాటికి 14 ఏళ్లు నిండి ఉండాలి. సిలబస్: 9వ తరగతి ప్రవేశ పరీక్షలో 8వ తరగతి స్టేట్ బోర్డు సిలబస్, 10వ తరగతి ప్రవేశ పరీక్షలో 9వ తరగతి స్టేట్ బోర్డు సిలబస్లో ప్రశ్నలు ఉంటాయి. సీసీఈ మాదిరి ప్రశ్నాపత్రం 50 మార్కులకు సీసీఈ మాదిరిలో ఉన్న ప్రశ్నలతో ప్రశ్నపత్రం ఉంటుంది. నిర్దేశించిన తేదీల్లో ఉదయం 10 నుంచి 12.30 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి 4.30 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు. పరీక్ష తేదీ ఉదయం మధ్యాహ్నం వచ్చేనెల 16 తెలుగు గణితం వచ్చేనెల 17 హిందీ భౌతిక శాస్త్రం వచ్చేనెల 18 ఇంగ్లిష్ జీవ శాస్త్రం వచ్చేనెల 19 సాంఘికశాస్త్రం –––– ఫీజు వివరాలు: దరఖాస్తుతోపాటు రూ.700 రుసుం చెల్లించాలి. కార్యదర్శి, జిల్లా ఉమ్మడి పరీక్షల నిర్వహణ సంస్థ, పశ్చిమగోదావరి, ఏలూరు వారి పేరున రూ.700ను బ్యాంక్ డీడీ రూపంలో వచ్చేనెల 2లోపు సంబంధిత పరీక్ష కేంద్రాల పాఠశాలల్లో దరఖాస్తుతో అందజేయాలి. దరఖాస్తులు ఆయా కేంద్రాల వద్ద ఉచితంగా అందిస్తారు. పరీక్ష కేంద్రాలు.. ఏలూరు ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల జంగారెడ్డిగూడెం జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాల కొవ్వూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాల తాడేపల్లిగూడెం జెడ్పీ ఉన్నత పాఠశాల తణుకు జెడ్పీ ఉన్నత పాఠశాల భీమవరం పీఎస్ఎం బాలికల ఉన్నత పాఠశాల పాలకొల్లు ఎంఎంకేఎస్ మున్సిపల్ ఉన్నత పాఠశాల -
ఆ ల్యాప్టాప్లో ఏముంది..?
* మావోయిస్టుల కార్యకలాపాలపై పోలీసుల ఆరా * అగ్రనేతల కోసం జల్లెడ పడుతున్న బలగాలు భద్రాచలం: ఆ ల్యాప్టాప్లో ఏముందో..దానిలో ఎవరెవరి వివరాలు ఉన్నాయో? ఆ పెట్టెలో దాగి ఉన్న సమాచారంతో ఎవరి బాగోతం బయట పడుతుందో..? అంతటా ప్రస్తుతం హాట్టాపిక్గా మారిన అంశమిదే. ఛత్తీస్గఢ్ రాష్ట్రం లోని బొట్టెంతోగు అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్ ప్రదేశంలో పోలీసులకు అధునాతన ఆయుధాలతోపాటు, ఓ ల్యాప్టాప్, రెండు ప్రింటర్లు లభ్యమయ్యాయి. ఈ విషయాన్ని ఇప్పటివరకు పోలీసులు బయటకు వెల్లడించకపోవటానికి గల కారణాలేమటన్నదానిపై గుసగుసలు వినిపిస్తున్నాయి. అగ్రనేతల వద్దనే ల్యాప్టాప్లు, ప్రింటింగ్ మిషనరీ ఉంటుంది. ఆధునిక టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో అటవీ ప్రాంతంలోంచి కూడా ల్యాప్టాప్ల ద్వారా మావోయిస్టులు తమ కార్యకలాపాల సమాచారాన్ని తెప్పించుకుంటున్నారు. ఎన్కౌంటర్ ప్రదేశంలో లభించిన ల్యాప్టాప్లో నిగూఢమైన సమాచారమేదో ఉందని, అందుకనే ఇప్పటివరకు పోలీసులు వాటి స్వాధీనంపై ప్రకటన చేయలేదని ఈ ప్రాంతవాసులు అంటున్నారు. అగ్రనేతలు పాల్గొన్న ప్లీనరీలో లభించిన ఈ ల్యాప్టాప్ను పోలీసు ఉన్నతాధికారులు పూర్తిస్థాయిలో పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తోంది. దీని ద్వారా మావోయిస్టుల కార్యకలాపాలు ఏ రీతిన సాగుతున్నాయనే దానిపై ఓ అంచనాకు రావటంతో పాటు, వారికి సహరిస్తున్నవారెవరైనా ఉన్నారా..? అనే వివరాల కోసం పూర్తిస్థాయిలో శోధిస్తున్నారు. ఇదిలా ఉంటే ల్యాప్టాప్లో ఏముందోననే దానిపై సర్వత్రా చర్చసాగుతోంది. రాజకీయ పార్టీల నాయకులతోపాటు, ఏజెన్సీ ప్రాంతంలో కోట్లాది రూపాయలతో పనులు చేసిన కాంట్రాక్టర్లు సైతం ఆందోళన చెందుతున్నారు. తమ పేర్లు దానిలో ఉంటే, పోలీ సులు భవిష్యత్లో చేపట్టే విచారణలో ఎటువంటి ఇబ్బం దులు ఎదుర్కోవాల్సి వస్తుందోనని భయపడుతున్నారు. తప్పించుకున్నవారి కోసం వేట బొట్టెంతోగు ప్లీనరీ నుంచి తప్పించుకున్న మావోయిస్టు అగ్రనేతలతోపాటు, వందలాది మందిగా పాల్గొన్న వారు ప్రస్తు తం ఎక్కడ తలదాచుకున్నారనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. వారి కోసమని ప్రత్యేక పోలీసు, గ్రేహాం డ్స్ బలగాలు ఛత్తీస్గఢ్, తెలంగాణ రాష్ట్రాల సరిహద్దుల్లో అటవీ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నారు. పెద్ద ఎత్తున సాగుతున్న కూంబింగ్ ఆపరేషన్లో భాగంగానే గురువారం రాత్రి ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని కిష్టారం పోలీస్స్టేషన్ పరిధిలోని దబ్బమడక అటవీ ప్రాంతంలో ఎదురుకాల్పులు జరిగాయి. ఈ పరిణామాలతో సరిహద్దు గ్రామాల్లో భయానక వాతావరం నెలకొంది. గాయపడినవారు ఎక్కడ? బొట్టెంతోగు ప్లీనరీపై ప్రత్యేక పోలీసు, గ్రేహౌండ్స్ బలగాలు ఒక్కసారిగా మెరుపుదాడి చేయటంతో ఎనిమిది మంది మావోయిస్టులు మృతి చెందారు. శుక్రవారం నాటికి మరో మృతదేహం కూడా అటవీ ప్రాంతంలో లభ్యమైనట్లుగా ప్రచారం సాగింది. అయితే ఈ విషయాన్ని పోలీసులు ధ్రువీ కరించడం లేదు. పోలీసుల మెరుపుదాడిలో పదుల సంఖ్యలోనే మావోయిస్టులు గాయాలపాలైనట్లుగా పరిసర గ్రామాలకు చెందిన ఆదివాసీలు చెబుతున్నారు. ఎన్కౌంటర్ ముగి సిన తర్వాత మంగళవారం రోజు సాయంత్రం ఆ ప్రదేశానికి వెనుదిరిగి వచ్చిన కొంతమంది మావోయిస్టులు, గాయపడిన వారికి తగిన రీతిలో సాయం చేయాలని పరిసర గ్రామా ల ప్రజలకు చెప్పి వెళ్లినట్లుగా తెలిసింది. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు, గాయాల పాలైన మావోయిస్టుల కోసం గాలింపు ముమ్మరం చేశారు. -
ఆస్తుల అఫిడవిట్ కోర్టుకు ఇచ్చిన అగ్రిగోల్డ్
హైదరాబాద్: హైకోర్టు ఆదేశాలకు అగ్రిగోల్డ్ యాజమాన్యం స్పందించింది. తమ ఆస్తుల వివరాల అఫిడవిట్ను కోర్టుకు సమర్పించింది. తమకు ఏడు కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయని కోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో కోర్టు పేర్కొంది. ఇక తెలంగాణ, ఏపీలో రూ.14కోట్ల ఆస్తులు ఉన్నాయని అగ్రిగోల్డ్ యాజమాన్యం వివరించింది. సామాన్య ప్రజల నుంచి అగ్రిగోల్డ్ రూ.6,350 కోట్లను డిపాజిట్లుగా వసూలు చేసి చేతులెత్తేసిందని, ఈ కుంభకోణంపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ అగ్రిగోల్డ్ డిపాజిట్ల, ఏజెంట్ల సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎ.రమేష్బాబు హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాన్ని ధర్మాసనం విచారించింది. పిటిషనర్ తరఫు న్యాయవాది రజా సమీర్ అహ్మద్ వాదనలు వినిపిస్తూ ఈ వ్యవహారంలో ప్రభుత్వం ఇప్పటి వరకూ ఎవ్వరినీ అరెస్ట్ చేయలేదని తెలిపారు. ఈ సమయంలో ఏపీ ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది కృష్ణ ప్రకాశ్ స్పందిస్తూ అగ్రిగోల్డ్ ఆస్తులను జప్తు చేశామని, కేసు కూడా నమోదు చేశామన్నారు. ఆస్తుల జప్తును సవాలు చేస్తూ అగ్రిగోల్డ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిందని వివరించారు. ధర్మాసనం స్పందిస్తూ, జప్తుపై హైకోర్టును ఆశ్రయించడం ద్వారా అగ్రిగోల్డ్ ఉద్దేశం అర్థమవుతోందని, వారికి నిజాయితీ ఉంటే కోర్టుకు వచ్చే వారే కాదని వ్యాఖ్యానించింది. ఈ సమయంలో అగ్రిగోల్డ్ తరఫు న్యాయవాది డి.ప్రకాశ్రెడ్డి జోక్యం చేసుకుంటూ, ఆస్తులు విక్రయించి డిపాజిట్లను వెనక్కు చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నామని, ఇందుకు సంబంధించిన 14 ఆస్తుల వివరాలను కూడా ఇచ్చామని తెలిపారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ డిపాజిట్ దారులకు చెల్లించేంత మొత్తం ఆస్తుల వివరాలు తెలపాలని కోరింది. -
ఆస్తుల విలువ, వివరాలు చెప్పండి
► విక్రయానికి రాతపూర్వక హామీ ఇవ్వండి ► అగ్రిగోల్డ్ యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం ► డిపాజిటర్లకు న్యాయం చేయడమే మా ఉద్దేశం ► తేల్చి చెప్పిన ధర్మాసనం.. విచారణ 24కు వాయిదా సాక్షి, హైదరాబాద్: ‘మీకు ఎంత మేర ఆస్తులున్నాయి? వాటి విలువ ఎంత? వాటి విక్రయం లేదా వేలం ద్వారా ఎంత మొత్తం రాబట్టవచ్చు.. ఆ మొత్తం డిపాజిటర్లకు చెల్లించేందుకు సరిపోతుందా..? ఈ వివరాలను మా ముందు ఉంచండి...’ అంటూ హైకోర్టు సోమవారం అగ్రిగోల్డ్ యాజమాన్యాన్ని ఆదేశించింది. ఆస్తులను విక్రయించి, డిపాజిటర్లకు చెల్లిస్తామని రాతపూర్వకంగా హామీ ఇవ్వాలని అగ్రిగోల్డ్ చైర్మన్ అవ్వా వెంకటరామారావు, ఇతర డెరైక్టర్లకు హైకోర్టు స్పష్టం చేసింది. ఆ అఫిడవిట్ను పరిశీలించిన తర్వాత తగిన ఉత్తర్వులు జారీ చేస్తామని తెలిపింది. డిపాజిటర్లకు న్యాయం చేయడమే తమ ఉద్దేశమని, అందుకే యాజమాన్యం నుంచి హామీ కోరుతున్నాని కోర్టు పేర్కొంది. తదుపరి విచారణ ఈ నెల 24కు వాయిదా పడింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. సామాన్య ప్రజల నుంచి అగ్రిగోల్డ్ రూ.6,350 కోట్లను డిపాజిట్లుగా వసూలు చేసి చేతులెత్తేసిందని, ఈ కుంభకోణంపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ అగ్రిగోల్డ్ డిపాజిట్ల, ఏజెంట్ల సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎ.రమేష్బాబు హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాన్ని సోమవారం ధర్మాసనం మరోసారి విచారించింది. పిటిషనర్ తరఫు న్యాయవాది రజా సమీర్ అహ్మద్ వాదనలు వినిపిస్తూ ఈ వ్యవహారంలో ప్రభుత్వం ఇప్పటి వరకూ ఎవ్వరినీ అరెస్ట్ చేయలేదని తెలిపారు. ఈ సమయంలో ఏపీ ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది కృష్ణ ప్రకాశ్ స్పందిస్తూ అగ్రిగోల్డ్ ఆస్తులను జప్తు చేశామని, కేసు కూడా నమోదు చేశామన్నారు. ఆస్తుల జప్తును సవాలు చేస్తూ అగ్రిగోల్డ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిందని వివరించారు. ధర్మాసనం స్పందిస్తూ, జప్తుపై హైకోర్టును ఆశ్రయించడం ద్వారా అగ్రిగోల్డ్ ఉద్దేశం అర్థమవుతోందని, వారికి నిజాయితీ ఉంటే కోర్టుకు వచ్చే వారే కాదని వ్యాఖ్యానించింది. ఈ సమయంలో అగ్రిగోల్డ్ తరఫు న్యాయవాది డి.ప్రకాశ్రెడ్డి జోక్యం చేసుకుంటూ, ఆస్తులు విక్రయించి డిపాజిట్లను వెనక్కు చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నామని, ఇందుకు సంబంధించిన 14 ఆస్తుల వివరాలను కూడా ఇచ్చామని తెలిపారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ, ఎన్ని ఆస్తులను జప్తు చేశారని ప్రశ్నించింది. 433 ఆస్తులను జప్తు చేసిందని ప్రకాశ్రెడ్డి చెప్పారు. మరి 14 ఆస్తుల వివరాలనే ఎందుకు ఇచ్చారని, వాటి విక్రయం ద్వారా మొత్తం సొమ్ము తిరిగి చెల్లించడం సాధ్యమవుతుందా..? అని ధర్మాసనం తిరిగి ప్రశ్నించింది. సరిపోతాయని ఆయన చెప్పడంతో, తాము ఆస్తుల వేలానికి అనుమతిస్తామని ధర్మాసనం తెలిపింది. ఆస్తుల పూర్తి వివరాలను కోరింది. -
బర్మా దేశస్థుల వివరాలు సేకరించిన పోలీసులు
పహాడీషరీఫ్ (హైదరాబాద్) : మయన్మార్ (బర్మా) దేశం నుంచి శరణార్థుల రూపంలో మూడేళ్ల క్రితం బాలాపూర్ రాయల్ కాలనీకి వచ్చి నివాసం ఉంటున్న వారి వివరాలను పహాడీషరీఫ్ పోలీసులు సోమవారం సేకరించారు. కాలనీలోని నాలుగు క్యాంప్లతోపాటు ఒక్కో ఇంట్లో నివాసం ఉంటున్న బర్మా కుటుంబాల వివరాలను సేకరించారు. ఒక్కో వ్యక్తి ఫొటో, వేలి ముద్రలు, పూర్తి బయోడేటాలను తీసుకున్నారు. రాయల్ కాలనీలోనే 150 కుటుంబాలలో 533 మంది నివాసం ఉంటున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ సందర్భంగా డీసీపీ శ్రీనివాస్ మాట్లాడుతూ....శరణార్థులుగా సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని పహాడీషరీఫ్, మైలార్దేవ్పల్లి పోలీస్స్టేషన్ల పరిధిలో 1450 మంది నివాసం ఉంటున్నారన్నారు. ప్రస్తుతం చాలామంది గుర్తింపు కార్డులు లేకుండా అక్రమంగా నివాసం ఉంటున్నారన్నారు. దీనికి తోడు ఒకరిద్దరికి ఉగ్రవాదులతో సంబంధాలున్నట్లు తేలిందన్నారు. ఈ నేపథ్యంలో వీరి పూర్తి వివరాలు సేకరించాలని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సి.వి.ఆనంద్ ఆదేశించారన్నారు. ఇక్కడ నివాసం ఉంటున్న వారికి గుర్తింపు కార్డులు ఇవ్వడానికి యూఎన్హెచ్సీఆర్ కూడా సముఖత తెలిపిందని వెల్లడించారు. -
ఉత్కంఠ..
తిరుమలగిరి/అర్వపల్లి: సూర్యాపేట హైటెక్ బస్టాండ్లో ఈనెల 31తేదీ అర్థరాత్రి ఇద్దరు పోలీసుల ప్రాణాలను బలిగొన్న దుండగులు శనివారం ఉదయం సినీఫక్కీలో జరిగిన పోలీసు ఛేజింగ్లో మోత్కూరు మండలం జానకీపురం సమీపంలో ఎన్కౌంటర్లో హతమయ్యారు. అందుకు సంబంధించిన వివరాలు సమయం వారీగా ఇలా ఉన్నాయి. ఉదయం 5గంటలకు అర్వపల్లి శివారులోని నసీరుద్దీన్బాబా దర్గా నుంచి దుండగులు ఆయుధాలతో కాలినడక బయటకు వచ్చారు. ఉదయం 5:15గంటలకు అర్వపల్లిలోని 10వ వార్డు మీదుగా సీతారాంపురం శివారులోని ఎస్సారెస్పీ కాలువ వద్దకు వెళ్లారు. 5:20 గంటలకు వీరి గురించి స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. 5:30 గంటలకు తుంగతుర్తి సీఐ గంగారాం ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది ఎస్సారెస్పీ కాలువ వద్దకు వెళ్లారు. 5:35గంటలకు పోలీసులకు, దుండగులకు మధ్య ఎదురు కాల్పులు ప్రారంభమయ్యాయి. 5:40గంటలకు పోలీసుల వద్ద ఉన్న సీఐ తుపాకీ మొరాయించడంతో కాల్పులు అగిపోయాయి. 5:50గంటలకు దుండగులు నడుచుకుంటూ అరకిలోమీటర్ దూరంలో ఉన్న అర్వపల్లి చౌరస్తాకు వెళ్లారు. 6:00గంటలకు దుండగులు అర్వపల్లిలో జాజిరెడ్డిగూడెం వాసి లింగమల్లును తుపాకీతో బెదిరించి బైక్తో తిరుమలగిరివైపు వెళ్లారు. 6:30గంటలకు ఫణిగిరి స్టేజీ నుంచి ఈటూరు మీదుగా అనంతారం వైపు వెళ్లారు. 6:50గంటలకు అనంతారం బస్టాండ్ వద్ద బైక్లో పెట్రోల్ పోయించుకున్నారు. 6:55గంటలకు మోత్కూరు పోలీసులు తిరుమలగిరి వైపు వెళ్తుండగా దుండగులను చూసి వెనక్కి వచ్చారు. 7:05గంటలకు పోలీసులు వెంబడించడంతో మోత్కూరు మండలం చిర్రగూడురు మీదుగా జానకీపురం వైపు వెళ్లారు. 7:15గంటలకు మోత్కూరు కానిస్టేబుళ్లు, గ్రామ యువకులు వెంటపడగా బైక్పై బిక్కేరు వైపు వెళ్లారు. 7:30గంటలకు ఇసుకలో బైక్ ముందుకు వెళ్లకపోవడంతో అక్కడే వదిలేసి రోడ్డువైపునకు వెళ్లారు. 7:40గంటలకు రోడ్డుపక్కన ఉన్న మరోబైక్ను తీసుకొని జానకీపురం వైపునకు వెళ్లారు. 7:50గంటలకు జానకీపురం గ్రామ సమీపంలో ఆత్మకూర్ (ఎం) పోలీసు వాహనం ఎదురుగా రావడంతో బైక్దిగి పోలీసు వాహనంపై కాల్పులు జరిపారు. 7:55గంటలకు దుండగుల కాల్పుల్లో కానిస్టేబుల్ నాగరాజు మృతి చెందగా ఆత్మకూర్ (ఎం) ఎస్ఐ సిద్ధయ్య తీవ్రంగా గాయపడ్డాడు. 7:55-8:00 గంటల మధ్య పోలీసుల కాల్పుల్లో దుండగులు అస్లాం అయ్యూబ్, జాకీర్లుగా భావిస్తున్న ఇద్దరు దుండగులు హతమయ్యారు. 8:15గంటలకు సంఘటనా స్థలానికి నల్లగొండ ఎస్పీ ప్రభాకర్రావు చేరుకున్నారు. 10:50 గంటలకు డీజీపీ అనురాగ్ శర్మ హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. 11:15గంటలకు విలేకరుల సమావేశంలో డీజీపీ మాట్లాడారు. ఎన్కౌంటర్లో చనిపోయింది సూర్యాపేటలో కాల్పులు జరిపిన దుండగులేనని స్పష్టం చేశారు. 11:30గంటలకు డీజీపీ అనురాగ్శర్మ తిరిగి హెలికాప్టర్లో హైదరాబాద్కు వెళ్లారు. 1:30గంటలకు ఎదురు కాల్పుల్లో చనిపోయిన దుండగుల మృతదేహాలను నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృత్యువుతో పోరాడుతూ భర్త.. ప్రసవ వేదనతో భార్య.. ఎల్బీనగర్ ‘కామినేని’లో చేరిన ఎస్ఐ డి. సిద్ధయ్య, ఆయన భార్య ధరణి ఆత్మకూరు(ఎం): మృత్యువుతో భర్త పోరాడుతూ ఉండగా... ప్రసవ వేదనతో భార్య ఉంది.. ఇది ఎల్బీ నగర్ కామినేని హాస్పిటల్లో చోటు చేసుకున్న దయనీయ స్థితి. వివరాలలోకి వెళితే... ఆత్మకూరు(ఎం) మండలం ఎస్ఐ డి. సిద్ధయ్య మోత్కూరు మండలం జానకీపురం వద్ద జరిగిన ఎదురుకాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డారు. దీంతో హైదరాబాద్ ఎల్బీ నగర్లోని కామినేని హాస్పిటల్కు తరలించి వైద్య సేవలు అందిస్తున్నారు. కాగా ఎస్ఐ సతీమణి ధరణి నిండు గర్భిణి. టీవీ చానళ్ల ద్వారా సంఘటన సమాచారం తెలుసుకున్న ఆమె తన భర్తను చూడటానికి ఎల్బీ నగర్ హాస్పిటల్కు హుటాహుటిన వచ్చింది. అదే రోజు ఆమె డెలివరీ డేట్ కావడంతో ప్రసూతి నొప్పులు రావడంతో అదే ఆస్పత్రిలో చేర్పించారు. మృత్యువుతో పోరాడుతున్న భర్త, ప్రసవ వేదనతో భార్య ఒకే హాస్పిటల్లో ఉండడం అక్కడ ఉన్న వారిని కలచి వేసింది. ఎస్ఐ భార్య ధరణి మగబిడ్డకు జన్మనిచ్చింది. -
సజీవ దహనం కేసు: ఆ యువతి పూజిత
హైదరాబాద్ : సంచలనం సృష్టించిన యువతి మృతి కేసును పోలీసులు ఛేదించారు. హైదరాబాద్ పంజాగుట్ట ఐఏఎస్ కాలనీలో శుక్రవారం కలకలం రేపిన యువతి సజీవ దహనానికి సంబంధించిన వివరాలను వారు కనుగొన్నారు. కృష్ణాజిల్లా నందిగామకు చెందిన ఆ యువతి పేరు పూజితగా తెలిపారు. విజయవాడలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఆమె ప్రస్తుతం సీఏ ఇంటర్ చదువుతోంది. యువతి హైదరాబాద్ బయలుదేరే ముందు ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు రాసిన సూసైడ్ నోట్ ను పోలీసులు శనివారం స్వాధీనం చేసుకున్నారు. తన అక్క రోహితకు ఉద్యోగం వచ్చిందని, తను ఇంకా ఉద్యోగం సాధించలేకపోయానని, జీవితం మీద విరక్తి చెంది చనిపోతున్నట్లుగా పూజిత సూసైడ్ నోట్ లో పేర్కొన్నట్లు సమాచారం. అయితే సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు పూజితను అత్యాచారం చేసి ఆ తర్వాత చంపేసి ఉండొచ్చనే అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి పూజిత బాయ్ ఫ్రెండ్ ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పూజిత మరణవార్త విని ఆమె తల్లిదండ్రులు, స్నేహితులు పూర్తి విషాదంలో మునిగిపోయారు. -
కిరాయిదారులకు సర్వే కష్టాలు
వివరాలు ఇవ్వొదంటూ అడ్డుకున్న యజమానులు పలు చోట్ల ఇళ్లను ఖాళీ చేయించిన వైనం సాక్షి,సిటీబ్యూరో: అద్దె ఇళ్లల్లో ఉండేవారికి కుటుంబ సర్వే చుక్కలు చూపించింది. తమ ఇంటి చిరునామా పైన వివరాలు ఇవ్వరాదంటూ కొందరు ఇంటి యజమానులు అడ్డుకొన్నారు. మరి కొన్ని చోట్ల సర్వే అయిపోయే వరకు ఇళ్లల్లో ఉండొద్దంటూ ఒత్తిడి తెచ్చారు. దీంతో మంగళవారం చేట్టిన సమగ్ర సర్వేలో సొంత ఇళ్లు లేని కుటుంబాలుగా గుర్తింపు పొందాలనుకున్న వాళ్లకు నిరాశే మిగిలింది. నగరంలోని రసూల్పురా, బేగంపేట్, సికింద్రాబాద్ తదితర ప్రాంతాల్లో ఇలాంటి పరిస్థితులే ఎదురయ్యాయి. బన్సీలాల్పేట్ చాచా నెహ్రూనగర్లో ఒక ఇంటి యజమాని తన ఇంట్లో కిరాయికి ఉండే నాలుగు కుటుంబాలకు ఇలాగే బయటకు పంపినట్లు సమాచారం. సర్వేలో తమకు ఎక్కువ ఆస్తి ఉన్నట్లుగా నమోదు కావద్దనే ఉద్దేశంతో కి రాయికి ఉన్నవాళ్లను తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. మరి కొన్ని చోట్ల సర్వే సందర్భంగా ఇంటి నెంబర్, కరెంట్ మీటర్ నెంబర్లు సర్వేలో చెప్పొద్దంటూ అడ్డుకున్నారు. చందానగర్ రాజీవ్ గృహకల్ప సముదాయంలోని ఇంటి యజమానులు, కిరాయిదారుల మధ్య వాగ్వాదం నెలకొంది. సర్వేలో తాము ఆయా నివాసాల్లో లేమని తేలితే తమ ఇంటిపై హక్కును కోల్పోతామని ఆందోళన చెందారు. ఇంటిని కిరాయికి ఇచ్చిన వారినిపేర్లు చెప్పొద్దని తమ పేర్లే రాయాలని డిమాండ్ చేశారు. కంటోన్మెంట్ బోర్డు పరిధిలో 2,3 వార్డుల్లో సమగ్ర కుటుంబ సర్వే కార్యక్రమం ఆలస్యంగా ప్రారంభం కాగా, 2వవార్డులో కొంత మంది ఇంటి యజమానులు తమ ఇళ్లల్లో కిరాయికి ఉంటున్న వారి వివరాలు ఇవ్వకుండా అడ్డుకున్నారు. మరికొందరు ఎన్యుమరేటర్లు ఇళ్లలోకి రాకుండా బయటినుంచే పంపించేశారు. కొన్ని బస్తీల్లో అనుబంధ ఎన్యుమరేటర్లు తమకు పది ఇళ్లను మాత్రమే కేటాయించారని.. మరికొందరు స్టిక్కరింగ్ చేయని ఇళ్లను సర్వే చేసేది లేదని తేల్చేశారు. 2వ వార్డు పరిధిలోని కృష్ణనగర్, ఇందిరమ్మ నగర్, అర్జున్ నగర్ బస్తీల్లోని కొందరు ఇంటి యజమానులుతమ ఇళ్లల్లో కిరాయిదారుల వివరాలు ఇవ్వరాదని, తక్షణమే ఇళ్లను ఖాళీ చేయాలని ఆదేశించారు. -
17 లోపు ఎన్నికల ఖర్చుల వివరాలు పంపాలి
చిత్తూరు (జిల్లాపరిషత్): ఎన్నికల నియ మ నిబంధనలను అతిక్రమించిన వారిపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ కేసుల వివరాలను, అభ్యర్థుల ఖర్చుల వివరాలను ఈనెల 17వ తేదీలోగా సమర్పిం చాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి భన్వర్లాల్ కోరారు. అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహిం చినందుకు అన్ని జిల్లాల ఎన్నికల అధికారులను ఆయన అభినందించారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల అధికారులతో వీడియో కాన్ఫరె న్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గాల వారీగా అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల ఫలి తాలను పోలింగ్ కేంద్రాల వారీగా ఫాం-20ను ఈసీ వెబ్సైట్ నందు పొం దుపరచాలన్నారు. ఇందుకు గాను హార్డ్కాపీతో పాటు సాప్టుకాపీని హైదరాబా ద్ ఎన్నికల కార్యాలయానికి పంపాల న్నారు. ఎన్నికల్లో అభ్యర్థులు చేసిన ఖర్చులు ఏ విధంగా నమోదు చేసి సమర్పించాలన్న దానిపై ఒకరోజు అవగాహన సదస్సు నిర్వహించకపోతే వెంటనే నిర్వహించాలన్నారు. జిల్లాలో ఫాస్ట్ట్రా క్ ఖర్చుల వివరాలను తెలియజేయాలని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా డీఆర్వో ఒంగోలు శేషయ్య మాట్లాడుతూ ఫాం-20ను ఇదివరకే సమర్పించామన్నారు. జిల్లాలో 203 మంది అభ్యర్థులు ఎన్నికల్లో పోటీ చేశారని, వీరిలో 45 మంది అభ్యర్థులు ఖర్చుల వివరాలను అందజేశారన్నారు. మోడల్కోడ్ ఆఫ్ కాండక్టు (ఎంసీసీ) కమిటీచే గుర్తించిన నాలుగు కేసులు పెండింగ్లో ఉన్నాయన్నారు. నిబంధన లు అతిక్రమించిన 217 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశామన్నారు. జిల్లాలో అభ్యర్థులు తమ ఖర్చులను ఏ విధంగా నమోదు చేయాలన్న దానిపై ఒకరోజు అవగాహన సదస్సును ఈనెల 9న నిర్వహించామని ఎన్నికల అధికారికి డీఆర్వో తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్లో మదనపల్లె సబ్కలెక్టర్ భరత్గుప్తా, చిత్తూ రు, తిరుపతి ఆర్డీవోలు పెంచలకిషోర్, సీహెచ్.రంగయ్య, జిల్లా ఆడిట్ అధికారి తదితరులు పాల్గొన్నారు. -
ఆస్తులున్నా.. ‘లెక్కే’లేదు
‘గ్రేటర్’ నిర్లక్ష్యం ఆస్తుల వివరాలు లేవు సిబ్బంది ఇష్టారాజ్యం కార్పొరేషన్కు టోపీ ‘నాక్కొంచెం తిక్క ఉంది... దానికో లెక్క ఉంది...’ ఆ మధ్య హిట్టైన సిన్మాలో హీరో పాపులర్ డైలాగ్ ఇది. సరదాకే అన్నా తిక్కకూ ఓ లెక్క ఉందన్నది ఆ హీరో వాదన. ఘనత వహించిన మన జీహెచ్ఎంసీ వద్ద అసలు దేనికీ లెక్కే లేదు. షాపింగ్ కాంప్లెక్స్లు, చెరువులు, పార్కులు, హోర్డింగ్లు, శ్మశానవాటికలు.. వెరసి తమకెన్ని ఆస్తులున్నాయో తెలీదు. ఈ దుస్థితిపై ఎవరన్నా ఏమన్నా అంటారన్న భయం అంతకన్నా లేదు. ఉన్నదేమైనా ఉందంటే.. అది లెక్కలేనితనమే. సాక్షి, సిటీబ్యూరో : ప్రజలకు అవసరమైన రహదారులు, పారిశుధ్యం తదితర సేవలెన్నో అందించడంతోపాటు ఇంటి నిర్మాణం జరపాలన్నా, వ్యాపార సంస్థలకు లెసైన్సులివ్వాలన్నా, ఐదంతస్తుల్లోపు ఫైర్సేఫ్టీకి సంబంధించి ఎన్ఓసీ ఇవ్వాలన్నా జీహెచ్ఎంసీకే అధికారం ఉంది. అంతేకాదు.. తనకున్న ఎన్నో షాపింగ్ కాంప్లెక్సుల్లోని ఎన్నో దుకాణాల్ని ఎందరికో అద్దెలకిచ్చింది. ఇన్ని ఆస్తులు, బాధ్యతలున్న జీహెచ్ఎంసీ వద్ద వాటికి సంబంధించిన వివరాలన్నీ ఉండాలి. కానీ.. కార్పొరేషన్లో ఏ ఒక్కదానికీ లెక్కాపత్రం ఏమీ లేదు. ఆటస్థలాలు ఎన్ని కబ్జా అయ్యాయో తెలియదు! పార్కు స్థలాలు ఎన్ని పరాధీనమయ్యాయో రికార్డుల్లేవు. ఏయే శ్మశానవాటికల్లో ఎవరు తిష్ట వేశారో లెక్కల్లేవు! ఎన్ని మార్కెట్లలో ఎవరుంటున్నారో.. ఏ షాపింగ్ కాంప్లెక్స్లో ఎవరికి దుకాణాలు కేటాయించారో.. వాటిల్లో ఎవరుంటున్నారో సమాచారం లేదు!! లీజు పొందిన స్థలాలు, భవనాల్లో ఎందరు లీజు సొమ్ము చెల్లిస్తున్నారో.. ఎవరెంత చెల్లించారో కూడా తెలియదంటే తెలియదు. ఎన్ని బహిరంగ ప్రదేశాలున్నాయో.. ఎన్ని భవనాలకు అనుమతులిచ్చారో.. ఎన్ని అక్రమ భవనాలు వెలిశాయో కూడా వివరాలు లేవు. నగరంలో తాను వేసిన రోడ్లు ఎన్ని ఉన్నాయో.. వేటిని ఎవరు పర్యవేక్షించాలో కనీస సమాచారం కూడా ఇంతవరకూ లేదు. ఆస్తిపన్ను వసూళ్లు తదితరమైన వాటిదీ అదే దారి! ఇలా చెప్పుకుంటూ పోతే.. జీహెచ్ఎంసీకి తెలియని జాబితా కొండవీటి చాంతాడంత అవుతుంది. ఇదీ గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) తీరు ! సిబ్బంది ఇష్టారాజ్యం ఆస్తులకు సంబంధించి.. రావాల్సిన ఫీజులు, పన్నులకు సంబంధించి సరైన లెక్కలంటూ ఉంటే లోపాలెక్కడున్నాయో తెలుసుకోవచ్చు. వివరాలే లేనప్పుడు ఎవరెంత దోచుకున్నా గుర్తించడం తరం కాదు. జీహెచ్ఎంసీలో జరుగుతున్నదదే. రికార్డులు లేని పరిస్థితిని ఆసరా చేసుకున్న సిబ్బంది ఇష్టారాజ్యంగా సొంత వసూళ్లకు పాల్పడుతున్నారు. దీనికితోడు అధికారుల అంతులేని నిర్లక్ష్యమూ ఇబ్బందికరంగా మారింది. ఆయా ప్రాంతాల్లోని అక్రమాలపై ప్రజలు సమాచారమిస్తున్నా చర్యలు లేవు. కబ్జాపాలవుతున్న చెరువులు, పార్కులపై సమాచారమిచ్చినా పట్టించుకోరు. దొంగ రసీదులతో వివిధ రకాల ఫీజులు వసూలు చేస్తున్నారు. ముడుపులు పుచ్చుకొని ప్లింత్ ఏరియాను తక్కువ చూపుతూ జీహెచ్ఎంసీ ఖజానాకు గండి కొడుతున్నారు. ఆస్తిపన్ను అసెస్మెంట్లలో ఎక్కువ విస్తీర్ణంలోని భవనాలను తక్కువ విస్తీర్ణంలో చూపుతూ ప్రైవేటు వ్యక్తులకు సాయపడుతున్నారు. అందుకుగాను వారిచ్చే ముడుపులతో లాభపడుతున్నారు. జీహెచ్ఎంసీలోని కొన్ని విభాగాలను పరిశీలించినా దాని పనితీరు ఎలా ఉందో ఎవరికైనా ఇట్టే అర్థమవుతుంది. ఎన్ని విద్యాసంస్థలకు, ఎన్ని ప్రార్థనా మందిరాలకు ఆస్తిపన్నులో మినహాయింపు ఉందో తెలపాల్సిందిగా కోరినా.. ఏ సర్కిల్/జోన్లో ఎన్ని భవనాలకు అనుమతిచ్చారో తెలపాలని ఆర్టీఐల ద్వారా కోరినా సమాధానం లేదు. చెరువుల లెక్కల్లేవు జీహెచ్ఎంసీ పరిధిలో ఎన్ని చెరువులున్నాయో.. వాటిల్లో వేటి ఎఫ్టీఎల్ ఎంతో.. ఎన్ని ఆక్రమణలకు గురయ్యాయో కచ్చితమైన సమాచారం లేదు. తొలుత 178 చెరువులున్నాయన్నారు. అనంతరం వాటిని 168గా తగ్గించి పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో 126కు మించి కనిపించడం లేవని చెబుతున్నారు. చెరువుల భూములు కబ్జా కాకుండా ఎఫ్టీఎల్ నిర్ధారించాల్సి ఉన్నప్పటికీ, ఆ పని పూర్తికాకముందే ఆయా చెరువులకు ఫెన్సింగ్ పేరిట రూ.18 కోట్లు ఖర్చు చేస్తున్నారు. అంటే అడ్డగోలుగా పనులు చేస్తున్నారు. ప్రకటనలపైనా పట్టింపు లేదు గ్రేటర్లోని ప్రకటనల ఆదాయం మొత్తం జీహెచ్ఎంసీకే చెందాల్సి ఉండగా.. నగరంలో ఎన్ని హోర్డింగులున్నాయో వివరాల్లేవు. ఆదాయం వచ్చే ప్రకటనల్లో ముఖ్యమైనవి.. హోర్డింగులు, నియాన్/ గ్లో సైన్బోర్డులు, ఆర్చిలు, గోడలపై పెయింటింగ్లు, ఫ్లెక్సీబోర్డులు, గ్లాస్ పోస్టర్లు, షాప్ షట్టర్లు, లాలీపాప్స్, బస్షెల్టర్లు, బెలూన్లు. వీటిద్వారా ఏటా రూ. 100 కోట్ల మేర ఆదాయం రావాలి. కానీ చూసీ చూడనట్లు వదిలేస్తుండటంతో రూ.25 కోట్లు కూడా వసూలు కావడం లేదు. ఏదీ ఫైర్సేఫ్టీ ? ఏవైనా ప్రమాదాలు జరిగినప్పుడు మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పే జీహెచ్ఎంసీ.. తర్వాత ఆ విషయం మరచిపోతుంది. ఫైర్సేఫ్టీ లేని సంస్థల లెసైన్సులు రద్దు చేస్తామని మూడేళ్లుగా చెబుతున్నప్పటికీ ఫైర్సేఫ్టీ లేని సంస్థలు నగరవ్యాప్తంగా ఎన్ని ఉన్నాయో సమాచారమే లేదు. ఆయా ఆస్పత్రుల్లో అగ్నిప్రమాదాలు జరిగినప్పుడు హూంకరింపులు తప్ప.. ఆపై చర్యలు లేవు. ఇటీవల ముషీరాబాద్లో జరిగిన అగ్నిప్రమాదం వల్ల నిబంధనలకు విరుద్ధంగా అక్కడ టింబర్డిపోలు ఏర్పాటైనట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో, పాఠశాలల సమాచారం కోసం జిల్లా విద్యాశాఖాధికారులకు, ఆస్పత్రుల సమాచారం కోసం ‘అప్నా’కు, సినీ సంస్థలకు సంబంధించిన సమాచారం కోసం ఫిల్మ్చాంబర్కు లేఖలు రాశారు. 2009 నుంచి ఈ విభాగం పని ప్రారంభించినప్పటికీ , కావాల్సిన సమాచారాన్నే ఇంతవరకు సమకూర్చుకోలేకపోయింది. ఏవీ లేవు.. టౌన్ప్లానింగ్ ఎన్ని భవనాలకు అనుమతులున్నాయో డేటా బేస్ లేదు. ఎన్ని సెల్ టవర్లున్నాయో లెక్క లేదు. శిథిల భవనాలు సిటీలైట్ హోటల్ ప్రమాదం జరిగినప్పుడు శిథిల భవనాలపై నిద్ర లేచారు. జీహెచ్ఎంసీ ఏర్పాటు కాకముందు ఎప్పుడో చేసిన గణాంకాలతో 558 శిథిల భవనాలున్నాయన్నారు. సిటీలైట్ ప్రమాదం తర్వాత 737 ఉన్నట్లు చెప్పారు. అంతకన్నా ఎక్కువే ఉంటాయనేది అంచనా. గుర్తించిన శిథిల భవనాలపై తగు చర్యలు తీసుకున్నారా అంటే అదీ లేదు. ఇంజనీరింగ్ ఏ డివిజన్లో ఎన్ని కి.మీ.ల మేర రోడ్లున్నాయో.. వాటిమరమ్మతులను పర్యవేక్షించే ఇంజనీర్లెవరో తెలియదు. ఏ రోడ్డును ఎప్పుడు నిర్మించారో తెలియదు. అవి ఎప్పటిదాకా మన్నికగా ఉండాలో తెలియదు. ఏ రోడ్డు కింద ఏ పైపులున్నాయో తెలియదు. గోతులేర్పడ్టప్పుడు మాత్రం హడావుడి చే యడం.. ఆపై మరచిపోవడం పరిపాటిగా మారింది. ఫ్లై ఓవర్లకు సంబంధించిన ప్రాథమిక సమాచారమూ లేదు. ఆరోగ్యం, పారిశుధ్యం ఏయే మార్గాల్లో ఎవరు ఏయే విధులు నిర్వహిస్తున్నారో ఇప్పటిదాకా తెలియదు. ఇటీవలే.. ఇందులో సంస్కరణలు ప్రారంభించారు. కొనసాగిస్తారో, అర్ధాంతరంగా ఆపేస్తారో తెలియదు. ఎస్టేట్స్ ఎస్టేట్స్ విభాగమంటూ ఒకటి ఉన్నప్పటికీ.. ఎన్ని ఆస్తులున్నాయో.. లీజుదార్లెందరో.. అద్దెలెన్ని వస్తున్నాయో, ఎన్ని ఆస్తులు అన్యాక్రాంతమయ్యాయో తెలియదు. సాక్షాత్తూ జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలోనే.. కార్పొరేషన్తో సంబంధం లేనివారు యూనియన్ల పేరిట, అసోసియేషన్ల పేరిట కార్యాలయాలను ఆయాచితంగా వినియోగించుకుంటున్నప్పటికీ పట్టించుకున్న పాపాన పోలేదు. ట్రేడ్ లెసైన్సులు ఆదాయ వనురుల్లో ఒకటైన ట్రేడ్ లెసైన్సులకు సంబంధించిన డేటాబేస్ లేకపోవడంతో లెసైన్సులే లేని వ్యాపారసంస్థలెన్నో తెలియదు. లెసైన్సులు పొందాక సక్రమంగా ఫీజులు చెల్లించని వారెందరో.. వారి నుంచి ఎంతమొత్తం రావాలో వివరాల్లేవు. ఏ దుకాణం నుంచి ఎంత ఫీజు వసూలు కావాలో రికార్డుల్లేవు. దీంతో సిబ్బంది ఇష్టారాజ్యం సాగుతోంది. ఎలక్ట్రికల్ విభాగం ఏ వీధిలోఎన్ని విద్యుత్ దీపాలు ఎప్పుడు వేసిందీ లెక్కలుండవు. కొత్త బల్బులు వేసినప్పుడు పాత బల్బులనేం చేస్తున్నారో తెలియదు. ఇక ఆయా ప్యాకేజీల్లో ఉండాల్సినంతమంది కార్మికులు విధుల్లో ఉంటున్నదీ లేనిదీ తెలియదు. అంతా అయోమయం. రవాణా విభాగం ఇందులో అక్రమాలకు అంతు లేదు. కార్మికుల నుంచి ఇంధనం దాకా, అద్దె వాహనాల నుంచి స్పేర్పార్ట్స్ దాకా అంతా అక్రమాలే. అన్నింటికీ విద్యార్థులే.. ప్రకటనల హోర్డింగుల్ని గుర్తించడం జీహెచ్ఎంసీ సిబ్బంది వల్ల కాకపోవడంతో పాలిటెక్నిక్ విద్యార్థులకు వాటికి సంబంధించిన సర్వే బాధ్యతలు అప్పగించారు. ఫైర్సేఫ్టీ లేని భవనాలను గుర్తించే పనినీ, ఇంటినెంబర్లకు సంబంధించిన సర్వే పనిని సైతం వారికే అప్పగించారు. ఏ విభాగంలోనూ తగినంత మంది సిబ్బంది లేకపోవడంతో సర్వే వంటి ఏ పని చేయాలన్నా పాలిటెక్నిక్ విద్యార్థులకు అప్పగించడమో.. ప్రైవేటు సంస్థలకు అప్పగించడమో చేస్తున్నారు. వాటి ద్వారానైనా మొత్తం సమాచారాన్ని సేకరిస్తున్నారా అంటే అదీ లేదు. అర్ధాంతరంగా నిలిపివేస్తున్నారు. ట్రేడ్ లెసైన్సుల కోసం వాణిజ్య సంస్థల సర్వే, ఆస్తిపన్ను వసూళ్లకు భవనాల సర్వేను ప్రైవేటు సంస్థలకు ఇచ్చారు. అవి ఎంతవరకు పూర్తయిందో తెలియదు.