Students Details Should Be Entered Online - Sakshi
Sakshi News home page

విద్యార్థుల వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి

Published Wed, Jul 26 2023 5:57 AM | Last Updated on Wed, Jul 26 2023 7:17 PM

Students details should be entered online - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో బడి బయట పిల్ల­ల­ను పాఠశాలల్లో చేర్పించడంతోపాటు అన్ని యా­జ­మాన్యాల్లోని విద్యా­ర్థుల వివరా­లను  స్టూడెంట్‌ ఇన్ఫర్మేషన్‌ పోర్టల్‌లో నమోదు చేసేలా కలెక్టర్లు, డీఈవో­లు ప్రత్యేక డ్రైవ్‌ నిర్వ­హించాలని పాఠ­శాల విద్యా­శాఖ ముఖ్య కార్య­దర్శి ప్రవీణ్‌ ప్రకాష్‌ ఆదే­శిం­­చారు. ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్‌ పాఠ­శాలల యాజమా­న్యాలు అందించిన విద్యా­ర్థుల వివరాలను అధికారులు  తనిఖీ చేసి ధ్రు­వీ­­కరించాలన్నారు. ఇప్పటికే వలంటీర్లు చేసి­­న సర్వే ప్రకారం18 లక్షల మంది విద్యా­ర్థుల పేర్లు ఇంకా స్టూడెంట్‌ ఇన్ఫర్మేషన్‌ పోర్టల్‌­లో అప్‌డేట్‌ కాలేదన్నారు. గ్రాస్‌ ఎన్‌రోల్‌మెంట్‌ రేషియో ప్రారంభించి బుధవా­రా­నికి వంద రో­జులు అవుతున్నందున అన్ని స్కూళ్ల హె­చ్‌ఎంలు  అప్‌లోడ్‌ చేసేలా కలెక్టర్‌లు తీసుకోవాలన్నారు.  విద్యార్థుల వి­వ­రా­­లు అప్‌లోడ్‌ చేయకుంటే కఠిన చర్యలు త­ప్ప­వని మంగళవారం ఓ ప్రకటనలో హెచ్చరించారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement