Collectors
-
మధ్యాహ్న భోజనానికీ ఫేస్ రికగ్నిషన్!
కొత్తగూడెం అర్బన్: రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల హాజరు నమోదు కోసం ఉపయోగిస్తున్న ఫేస్ రికగ్నిషన్ (ఎఫ్ఆర్ఎస్) డేటాను మధ్యాహ్న భోజన పథకా నికి కూడా ఉపయోగించాలని భద్రాద్రి కొత్తగూడెం, పెద్దప ల్లి జిల్లా కలెక్టర్లు ప్రభుత్వానికి సూచించారు. మధ్యాహ్న భోజన పథకంలో లోపాలను సరిచేసి, మెరుగైన ఫలితాలు రాబట్టేందుకు చేపట్టాల్సిన చర్యలపై ఈ రెండు జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టుగా అధ్యయనం చేయాలని గత శనివారం ప్రభుత్వం ఆదేశించింది.దీంతో భద్రాద్రి కొత్తగూడెం, పెద్ద పల్లి జిల్లాల కలెక్టర్లు జితేశ్ వి.పాటిల్, కోయ శ్రీహర్ష రెండు జిల్లాల్లో మధ్యాహ్న భోజనం పథకం అమలు, బిల్లుల చెల్లింపు తదితర అంశాలను పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. పథకంలో మార్పుచేర్పులపై రాష్ట్రస్థాయిలో 12 మంది ఉన్నతాధికారులతో కమిటీని ఏర్పాటుచేశారు. ఈ బృందంలో భద్రాద్రి, పెద్దపల్లి కలెక్టర్లు, డీఈఓలతోపాటు కొత్తగూడెం ఎంఈఓ, విద్యాశాఖ ఉన్నతాధికారులు ఉన్నా రు. వీరు మరోమారు అధ్యయనం చేసి సంస్కరణలపై నివేదిక సమర్పించనున్నారు. బిల్లుల పెండింగే సమస్య..మధ్యాహ్న భోజన పథకానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిధు లు సమకూరుస్తున్నాయి. వారానికి మూడుసార్లు కోడిగుడ్ల తో పాటు ఆకు, కూరగాయలతో మెనూ అమలు చేస్తున్నా రు. ఇటీవల మెనూలో మార్పులు చేసినా పూర్తిస్థాయిలో అమలు కావటంలేదు. ఈ పథకం బాధ్యతలు నిర్వహిస్తున్న మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు సకాలంలో బిల్లులు అందక ఇబ్బంది పడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ పథకంలో 54,200 మంది కార్మికులు ఉండగా, భద్రాద్రి జిల్లాలో 2,150 మంది పని చేస్తున్నారు. ఈ జిల్లాలో 1 నుంచి 8వ తరగతి వరకు విద్యార్థులకు సంబంధించి గతేడాది నవంబర్ నుంచి.. 9, 10 తరగతుల వారివి సెప్టెంబర్ నుంచి బిల్లులు పెండింగ్ ఉన్నాయి. వీరికి నెలకు రూ.3,000 చొప్పున ఇచ్చే గౌరవ వేతనాలు కూడా అందాల్సి ఉంది.కలెక్టర్ల నివేదికలోని అంశాలు⇒ ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల హాజరును ఫేస్ రికగ్నిషన్ సిస్టం ద్వారా నమోదు చేస్తున్నారు. ఇదే డేటాను మధ్యాహ్న భోజన బిల్లులకూ అనుసంధానం చేయాలి. దీనివల్ల రోజువారీగా ఎందరు విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందుతుందో తెలిసిపోతుంది. ⇒ ప్రస్తుతం 1 నుంచి 5 వరకు.. 6 నుంచి 8వ తరగతి వరకు ..9 నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులకు సంబంధించి మూడేసి బిల్లులు రూపొందిస్తున్నారు. అలాగే, కోడి గుడ్లకు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వేతన బిల్లు.. ఇలా ఆరు బిల్లులను రూపొందించి ప్రభుత్వానికి పంపుతున్నారు. వీటి ఆధారంగా ఈ–కుబేర్ నుంచి కార్మికులకు బిల్లుల సొమ్ము అందిస్తున్నారు. ఈ ప్రక్రియలో ఎక్కడైనా అవాంతరం ఎదురైతే నెలల తరబడి బిల్లులు పేరుకుపోతు న్నాయి. దీంతో కొందరు వంట సిబ్బంది అప్పులు చేసి భోజనాలు వండిపెడుతున్నారు. ఎలాంటి జాప్యం లేకుండా బిల్లుల తయారీ, చెల్లింపునకు ఎఫ్ఆర్ఎస్ను భోజన బిల్లులకు అనుసంధానిస్తే మెరుగైన ఫలితం ఉంటుందని కలెక్టర్లు నివేదికలో సూచించారు. -
అదనపు కలెక్టర్లు, ఆర్డీఓలకు ‘ధరణి’ పవర్స్
సాక్షి, హైదరాబాద్: ధరణి పోర్టల్కు వచ్చిన వివిధ కేటగిరీల పెండింగ్ దరఖాస్తుల పరిష్కారంలో భాగంగా వాటికి తుది ఆమోదం తెలిపే అధికారాలను అదనపు కలెక్టర్లు, ఆర్డీఓలకు కట్టబెడుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కొత్త మార్గదర్శకాలను ప్రకటిస్తూ భూపరిపాలన విభాగం చీఫ్ కమిషనర్ (సీసీఎల్ఏ) నవీన్మిట్టల్ ఈ నెల 26న సర్క్యులర్ జారీచేశారు. ధరణి కమిటీ సిఫారసుల అమల్లో భాగంగా ఈ చర్యలు తీసుకున్నారు.అదనపు కలెక్టర్లకు 4 కొత్త అధికారాలు అదనపు కలెక్టర్లు(రెవెన్యూ) కొత్తగా ధరణి సాఫ్ట్వేర్లోని నాలుగు మాడ్యూల్స్కు తుది ఆమోదం తెలిపే అధికారం పొందనున్నారు. మ్యూటేషన్ దరఖాస్తులు(టీఎం3), పీపీబీ–కోర్టు కేసు(టీఎం24), ఇళ్లు/ఇంటి స్థలంగా పేరు ఉన్న సందర్భంలో పీపీబీ/నాలా కన్వర్షన్ జారీ(టీఎం31), పాస్బుక్లో తప్పుల దిద్దుబాటు/పేరు మార్పు(టీఎం33)కు సంబంధించిన దరఖాస్తులకు ఆయన స్థాయిలోనే పరిష్కరిస్తారు. ఈ ప్రక్రియకు సంబంధించిన విధివిధానా లను సైతం సీసీఎల్ఏ ప్రకటించింది. తొలుత తహసీల్దార్లు దరఖాస్తుదారులను విచారించి తమ ఆదేశాలను అప్లోడ్ చేయడం ద్వారా వారి దరఖాస్తులను ఆర్డీ ఓలకు పంపించాలి. ఆర్డీఓలు దరఖాస్తు లను పరిశీలించి తమ ఆదేశాలను అప్లోడ్ చేయడం ద్వారా అదనపు కలెక్టర్లకు ఫార్వ ర్డ్ చేయాలి. తహసీల్దార్/ఆర్డీఓ సిఫారసుల ఆధారంగా అదనపు కలెక్టర్లు దరఖాస్తులను ఆమోదించాలి లేదా తిరస్కరించాలి. ఒకవేళ దరఖాస్తులను తిరస్కరిస్తే అదనపు కలెక్టర్లు అందుకు సరైన కారణాలు తెలపాలి. ఆర్డీఓలకు మరిన్ని అధికారాలు..ఆర్డీఓలకు ఇప్పటికే ఉన్న ధరణి మాడ్యూల్ అధికారాలకు అదనంగా మరో నాలుగు మాడ్యూల్స్కు తుది ఆమోదం తెలిపే అధికారాన్ని ప్రభుత్వం కట్టబెట్టింది. అసైన్డ్ భూములతో సహా పట్టా భూముల వారసత్వ బదిలీ దరఖాస్తులు(టీఎం4), పెండింగ్ నాలా దరఖాస్తులు (టీఎం27), సర్వే నెంబర్ డిజిటల్ సైనింగ్(టీఎం 33), సర్వే నెంబర్ డిజిటల్ సైనింగ్(జీఎల్ఎం) దరఖాస్తులకు తుది ఆమోదం తెలిపే అధికారాన్ని వారికి కల్పించింది. గత ఫిబ్రవరి 28న ప్రకటించిన గడువుల్లోగానే దరఖాస్తులను పరిష్కరించాలని ప్రభుత్వం ఆదేశించింది. జిల్లా కలెక్టర్లు ప్రత్యేక చొరవ తీసుకొని ధరణి పెండింగ్ దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించింది. -
పొరపాట్లకు తావివ్వకండి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో జరుగుతున్న సామా జిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ, రాజకీయ, కుల సర్వే చివరి దశకు చేరుకున్న నేపథ్యంలో అప్రమత్తంగా వ్యవహ రించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సూచించారు. ఈ దశలో డేటా ఎంట్రీ చాలా ముఖ్యమైనదని, ఈ ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లకు తావివ్వొద్దని సంబంధిత అధికారులను ఆదేశించారు.జార్ఖండ్ రాష్ట్రం రాంచీలో ఉన్న ఆయన అక్కడి నుంచి రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి సర్వే స్థితిగతులను అడిగి తెలుసుకోవడంతో పాటు మిగిలిన ప్రక్రియపై దిశానిర్దేశం చేశారు. సర్వే జరిగిన క్రమంలో పట్టణ ప్రాంతాల్లో కొన్ని చోట్ల డోర్లాక్ ఉండటం, ఇంటివద్ద అందుబాటులో లేకపోవడం లాంటి సమస్యలు వచ్చాయని, వారి వివరాలను ఫోన్ ద్వారా.. లేదంటే నేరుగా కలిసి సేకరించాలని కోరారు. అదే విధంగా గ్రామీణ ప్రాంతాల నుంచి వలసలు వెళ్లిన వారి వివరాలను కూడా జాగ్రత్తగా క్రమబద్ధీకరించాలని సూచించారు. -
వివాదాస్పద భూములపై... నిర్ణయాధికారం కలెక్టర్లకే
కేంద్ర ప్రభుత్వం గురువారం లోక్సభలో ప్రవేశపెట్టిన వక్ఫ్ (సవరణ) బిల్లు తేనెతుట్టను కదిపింది. విపక్షాలు, ముస్లిం సంస్థలు దీనిపై తీవ్ర అభ్యంతరాలను వ్యక్తం చేస్తున్నాయి. వక్ఫ్ ఆస్తుల రిజి్రస్టేషన్ ప్రక్రియను సెంట్రల్ పోర్టల్ ద్వారా క్రమబదీ్ధకరించాలని ఈ బిల్లు ప్రతిపాదిస్తోంది. వక్ఫ్ భూముల యాజమాన్య హక్కులపై వివాదం తలెత్తితే ఇప్పటిదాకా వక్ఫ్ ట్రిబ్యూనల్కు నిర్ణయాధికారం ఉండేది. కొత్త బిల్లు ఈ అధికారాన్ని కలెక్టర్లకు కట్టబెడుతోంది. వక్ఫ్ చట్టం–1995ను ఇకపై యునిఫైడ్ వక్ఫ్ మేనేజ్మెంట్, ఎంపవర్మెంట్, ఎఫీషియెన్సీ అండ్ డెవలప్మెంట్ యాక్ట్గా మారుస్తోంది. మొత్తం 44 సవరణలను ప్రతిపాదిస్తోంది. వక్ఫ్ అంటే ఏమిటి? ఇస్లామిక్ చట్టం కింద మతపరమైన, ధారి్మక కార్యక్రమాల నిమిత్తం అంకితం చేసిన ఆస్తిని వక్ఫ్గా పేర్కొంటారు. ఒకసారి వక్ఫ్ ఆస్తిగా ప్రకటిస్తే.. ఇక అది అంతిమం. దాన్ని తిరగదోడటానికి ఉండదు. ఈ అంశంపై దృష్టి సారించాలని బిల్లు ప్రతిపాదిస్తోంది. 9 లక్షల ఎకరాలు దేశంలోని 30 వక్ఫ్ బోర్డులు 9 లక్షల పైచిలుకు ఎకరాలను నియంత్రిస్తున్నాయి. వీటి విలువ రూ.1.2 లక్షల కోట్లు ఉంటుందని అంచనా. భారత్లో పెద్ద మొత్తంలో భూములు కలిగి ఉన్న వాటిల్లో రైల్వేలు, రక్షణ శాఖ తర్వాత వక్ఫ్ బోర్డులు మూడోస్థానంలో ఉన్నాయి. బిల్లులోని కీలకాంశాలు → ఏదైనా ఒక ఆస్తిని వక్ఫ్ ఆస్తిగా ప్రకటించే అధికారాన్ని వక్ఫ్ బోర్డులకు కట్టబెట్టింది వక్ఫ్ చట్టం– 1995. అందులోని సెక్షన్– 40 ఇందుకు వీలు కలి్పంచింది. కొత్త బిల్లులో ఈ సెక్షన్– 40 రద్దుకు ప్రతిపాదించారు. ఇలా చేయడం ద్వారా వక్ఫ్ బోర్డుల చేతుల్లో నుంచి కేంద్ర ప్రభుత్వం అధికారాన్ని లాగేసుకుంటోందని తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. దుమారం రేగుతోంది. → కేంద్ర వక్ఫ్ కౌన్సిల్ ఏర్పాటు. కౌన్సిల్లో, రాష్ట్ర వక్ఫ్ బోర్డుల్లో ఇద్దరేసి ముస్లిం మహిళలకు చోటు. ముస్లిమేతరులకూ స్థానం. ఇద్దరు లోక్సభ, ఒక రాజ్యసభ ఎంపీకి కేంద్ర వక్ఫ్ కౌన్సిల్లో చోటు కలి్పంచాలి. ఈ ముగ్గురు ఎంపీలు ముస్లింలే అయ్యుండాలనే నిబంధనేమీ లేదు. పాత చట్టం ప్రకారం తప్పనిసరిగా ముస్లిం ఎంపీలకే కౌన్సిల్లో చోటు ఉండేది. కేంద్ర వక్ఫ్ కౌన్సిల్ కూర్పును మార్చే అధికారాన్ని కూడా బిల్లు కేంద్రానికి కట్టబెడుతోంది. → ఒక ఆస్తి వక్ఫ్కు చెందినదా, ప్రభుత్వానిదా అనే వివాదం తలెత్తితే ఇక కలెక్టర్లదే నిర్ణయాధికారం. వక్ఫ్ చట్టం–1995 సెక్షన్– 6 ప్రకారం ఇలాంటి వివాదాల్లో వక్ఫ్ ట్రిబ్యునళ్లు తీర్పు చెప్పేవి. వక్ఫ్ ఆస్తిగా పేర్కొంటున్న దేన్నైనా కలెక్టర్ ప్రభుత్వ భూమిగా తేలి్చతే ఆ మేరకు రెవెన్యూ రికార్డుల్లో మార్పులు చేసి రాష్ట్ర ప్రభుత్వాలకు నివేదిక సమరి్పంచొచ్చు. అక్రమంగా ఆస్తులు దక్కించుకోవడానికి స్వార్థపరులు ట్రిబ్యునళ్లను అడ్డం పెట్టుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. → ఏదైనా ఆస్తిని వక్ఫ్ ఆస్తిగా నమోదు చేసే ముందు సంబంధిత పక్షాలన్నిటికీ నోటీసులు ఇవ్వడం. రెవెన్యూ చట్టాల ప్రకారం నిర్దిష్ట ప్రక్రియను అనుసరించి మ్యూటేషన్ చేయడానికి మార్గదర్శకాలను రూపొందించడం. → కాగ్ నియమించిన ఆడిటర్ ద్వారా ఏదేని వక్ఫ్ బోర్డు ఆస్తుల తనిఖీకి ఆదేశించే అధికారాన్ని కేంద్ర ప్రభుత్వానికి ఈ బిల్లు దఖలు పరుస్తుంది. → బోరాలు, అగాఖానీల కోసం ప్రత్యేకంగా ఔఖాఫ్ బోర్డును ఏర్పాటు చేస్తారు. వక్ఫ్ బోర్డుల్లో షియాలు, సున్నీలు, బోరాలు, ఆగాఖానీలు, ముస్లింలోని ఇతర వెనుకబడిన వర్గాలకు ప్రాతినిధ్యం ఉండేలా చూస్తుంది. → తన ఆస్తిని దానంగా ఇవ్వడానికి ఒక వ్యక్తి సిద్ధపడినపుడు.. అతను రాసిన చెల్లుబాటయ్యే అంగీకారపత్రాన్ని (వక్ఫ్నామా)ను కొత్త బిల్లు తప్పనిసరి చేస్తోంది. ప్రస్తుతం ఒక వ్యక్తి మౌఖికంగా కూడా తన ఆస్తిని వక్ఫ్కు ఇవ్వొచ్చు. → ఐదేళ్లుగా ఇస్లాంను ఆచరిస్తూ.. ఆస్తిపై యాజమాన్య హక్కులున్నపుడే వక్ఫ్ ఇవ్వొచ్చు. → వక్ఫ్ బోర్డులకు వచ్చే డబ్బును వితంతువులు, విడాకులు పొందిన మహిళలు, అనాథల సంక్షేమం కోసం వినియోగించాలి. అదీ ప్రభుత్వం సూచించిన పద్ధతుల్లో. – నేషనల్ డెస్క్, సాక్షి -
అమరావతిలో కలెక్టర్లతో సీఎం చంద్రబాబు సమీక్ష
-
శంకరన్, శ్రీధరన్లా పనిచేయండి: కలెక్టర్లతో సీఎం రేవంత్
సాక్షి,హైదరాబాద్: ఇది ప్రజా ప్రభుత్వం అని ప్రజలకు విశ్వాసం కల్పించేలా పనిచేయాలని కలెక్టర్లకు సీఎం రేవంత్రెడ్డి సూచించారు. ఒక శంకరన్, ఒక శ్రీధరన్లా సామాన్య ప్రజలు ఎప్పుడూ గుర్తు పెట్టుకునేలా పనిచేయాలని కోరారు. మంగళవారం(జులై 16) సచివాలయంలో నిర్వహించిన కలెక్టర్ల సమావేశంలో సీఎం రేవంత్రెడ్డి మాట్లాడారు. ‘ప్రజాపాలన ద్వారా దరఖాస్తులు స్వీకరించి నిజమైన లబ్ధిదారులను గుర్తించాలని మీతో జరిగిన తొలి సమావేశంలో ఆదేశించాం. ఎన్నికల కోడ్ ముగియగానే పారదర్శకంగా కలెక్టర్ల బదిలీలు నిర్వహించాం. ప్రభుత్వానికి కళ్లు, చెవులు మీరే. కలెక్టర్లలో వివిధ రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చినవారు ఉన్నారు. తెలంగాణ సంస్కృతిలో భాగస్వామ్యమైతేనే మీరు ప్రజలకు సరైన సేవలు అందించగలుగుతారు. తెలంగాణను మీ సొంత రాష్ట్రంగా భావించి పనిచేయాలి. ప్రజలకు ప్రయోజనం చేకూరేలా మానవీయ కోణంలో మీ నిర్ణయాలు ఉండాలి. క్షేత్ర స్థాయిలో ప్రజల ఆలోచన ఏంటో తెలుసుకోండి. కేవలం ఏసీ గదులకే పరిమితమైతే మీకు కూడా ఎలాంటి సంతృప్తి ఉండదు. మీ ప్రతీ చర్య. ఇది ప్రజా ప్రభుత్వం అని ప్రజలకు తెలిసేలా ఉండాలి. సంక్షేమం, అభివృద్ధిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు తీసుకెళ్ళాల్సిన బాధ్యత మీపైనే ఉంది. కలెక్టర్లు క్షేత్రస్ధాయిలో పర్యటించాల్సిందే. ప్రతీ పేద విద్యార్థి కోసం ప్రభుత్వం ప్రతీ నెలా రూ.85వేలు ఖర్చు పెడుతోంది. తెలంగాణ పునర్నిర్మాణంలో విద్యా వ్యవస్థ అత్యంత కీలకం. విద్యావ్యవస్థ దెబ్బతినకుండా చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వ స్కూళ్లు, ప్రభుత్వ ఆస్పత్రులను పర్యవేక్షించాల్సిన బాధ్యత కలెక్టర్లు తీసుకోవాలి. కొన్ని ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్లు బదిలీ అయితే విద్యార్థులు సొంత కుటుంబ సభ్యుడిలా స్పందించారు. కలెక్టర్లు బదిలీ అయినా ప్రజల నుంచి అలాంటి స్పందన వచ్చేలా మీ పనితనం ఉండాలి. ప్రజావాణి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలి. ఆరు గ్యారంటీలను పారదర్శకంగా అమలు చేసే బాధ్యత మీపైనే ఉంది’అని రేవంత్ కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం, మంత్రులు, సీఎస్ ఇతర ఉన్నతాధిరులు పాల్గొన్నారు. -
9 అంశాల ఎజెండా !
ఇవీ ఎజెండాలోని అంశాలు ప్రజాపాలన, ధరణి, వ్యవసాయం – కాలానుగుణ పరిస్థితులు, ఆరోగ్యం– సీజనల్ వ్యాధులు, వన మహోత్సవం, మహిళా శక్తి, విద్య. శాంతిభద్రతలు–రక్షణ సంబంధిత సమస్యలు, మాదక ద్రవ్యాల వ్యతిరేక ప్రచారం.సాక్షి, హైదరాబాద్ : అసెంబ్లీ పూర్తిస్థాయి బడ్జెట్ సమావేశాలకు ముందే సీఎం రేవంత్రెడ్డి ఈనెల 16న మంత్రులతో కలిసి కీలక సమావేశం నిర్వహించనున్నారు. సచివాలయంలో జరిగే ఈ సమావేశంలో ఆయా జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్కమిషనర్లు, ఆయా శాఖల ముఖ్యకార్యదర్శులు పాల్గొంటారు. పాలనను పూర్తిస్థాయిలో పరుగులు పెట్టించే క్రమంలో ఈ సమావేశం నిర్వహిస్తున్నట్టు సమాచారం.గత డిసెంబర్లో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒకసారి కలెక్టర్లు, ఎస్పీలు, కమిషనర్లతో సమావేశం నిర్వహించినా, ఆ తర్వాత వెంటనే లోక్సభ ఎన్నికల కోడ్ రావడం, కలెక్టర్లు, ఎస్పీలంతా పూర్తిగా ఎన్నికల విధుల్లోనే నిమగ్నం కావడంతో పాలనపై దృష్టి సారించలేకపోయారు. కోడ్ ముగియడం, ఈ మధ్యనే కలెక్టర్లు, కార్యదర్శులు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్ల బదిలీలు చేయడం ద్వారా కొత్తగా ఆయా స్థానాల్లోకి వచ్చిన అధికారులకు పూర్తిస్థాయిలో ప్రభుత్వ ప్రా«థమ్యాలపై దిశానిర్దేశం చేయడానికి ఈ సమావేశాన్ని వినియోగించుకోనున్నారు. 16న నిర్వహించే సమావేశ ఏజెండాలోని అంశాలను కూడా వారికి పంపించారు. ప్రధానంగా తొమ్మిది అంశాలను ఎజెండాలో చేర్చారు. ⇒ రాష్ట్రప్రభుత్వం అధికారంలోకి వచి్చన వెంటనే ప్రగతిభవన్ను ప్రజాభవన్గా మార్చి, అక్కడ ప్రతీ మంగళ, శుక్రవారాల్లో ప్రజల నుంచి విజ్ఞాపన పత్రాలు స్వీకరించడం, వాటిని సంబంధిత విభాగాలకు పంపించి అవి పరిష్కారమయ్యేలా చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం ప్రకటించింది.గడిచిన ఆరేడు నెలల్లో ఎన్ని దరఖాస్తులు వచ్చాయి? వాటిలో ఏ విధమైన విజ్ఞాపనలు ఉన్నాయి? వచి్చన విజ్ఞాపనల్లో ఎన్నింటికి పరిష్కరించారు? ఇంకా ఎన్ని పెండింగ్లో ఉన్నాయి? పెండింగ్లో ఉండడానికి గల కారణలేంటి? అన్న అంశాలను ఈ సమావేశంలో సమీక్షించనున్నారు. ⇒ ఆర్థికంగా పెద్దగా భారం కాని పనులు కూడా పరిష్కరించకుండా ఉన్న పక్షంలో వాటిపై అధికారులకు నిర్ణీత గడువులోగా వాటిని పరిష్కరించేలా ఆదేశాలు ఇవ్వనున్నట్టు ఉన్నతాధికారి ఒకరు వివరించారు. ⇒ భూముల సమస్యకు సంబంధించి ధరణిని రద్దు చేస్తామని, రైతులకు ప్రయోజనకరంగా ఉండే కొత్త వ్యవస్థ తీసుకొస్తామని ఎన్నికల సమయంలో కాంగ్రెస్ హామీ ఇచి్చన సంగతి తెలిసిందే. ధరణిపై ఇప్పటికే ఉన్నతస్థాయి కమిటీని ప్రభుత్వం నియమించిన సంగతి విదితమే. ఆ కమిటీ ఇప్పటికే పలుమార్లు సమావేశమై పూర్తిస్థాయిలో నివేదిక సిద్ధం చేసినట్టు తెలిసింది. దీనిపై కలెక్టర్ల నుంచి ఫీడ్ తీసుకొని ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకునే అవకాశముంది. ⇒ వ్యవసాయ సీజన్ ప్రారంభమై దాదాపు నెలన్నర రోజులు అవుతున్న నేపథ్యంలో రైతులకు ఎరువులు, వర్షాభావ పరిస్థితులున్న చోట ప్రత్యామ్నాయ మార్గాలను కూడా ఈ సమావేశంలోనే చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. ⇒ వర్షాకాలసీజన్లో వ్యాధులు ప్రబలే అవకాశం అధికంగా ఉన్నందున, ముందస్తుగా చేపట్టాల్సిన జాగ్రత్తలు గురించి ప్రజలను అప్రమత్తం చేయడంతోపాటు, ఆస్పత్రుల్లో సరైన వైద్య సదుపాయం కలి్పంచేందుకు డాక్టర్లు, సిబ్బంది, మందులు తదితర అంశాలను చర్చించనున్నారు. ⇒ వర్షాకాలంలో దాదాపు 20 కోట్ల మొక్కలను ఈసారి నాటాలని నిర్ణయించారు. కార్యక్రమం కొనసాగుతున్న తీరును కూడా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సమీక్షించనున్నారు. ⇒ మహిళాశక్తి క్యాంటీన్ల ఏర్పాటు, వారిని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఏ విధంగా ముందుకు వెళ్లాలని చర్చించనున్నారు.⇒ విద్యాసంవత్సరం ప్రారంభం, పాఠశాలల పరిస్థితి, వసతి గృహాలు, మధ్యాహ్న భోజనం, ఉపాధ్యాయుల కొరత తదితర అంశాలను క్షుణ్ణంగా కలెక్టర్లతో సమీక్షిస్తారు. ⇒ ఇక శాంతిభద్రతలు, రక్షణపరమైన అంశాలతోపాటు, రాష్ట్రంలో పెరిగిపోతున్న మాదక ద్రవ్యాలను అరికట్టడానికి తీసుకోవాల్సిన చర్యలు, మాదకద్రవ్యాల వ్యతిరేక ప్రచారంపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పోలీస్ ఉన్నతాధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వనున్నారు. రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లోనూ మత్తు పదార్థాల మాట వినిపించరాదని సీఎం ఇదివరకు ఇచి్చన ఆదేశాలు మరోసారి ఈ సమావేశంలో పునరుద్ఘాటించనున్నారు. -
మీరు గడప దాటండి..: సీఎం రేవంత్రెడ్డి
సాక్షి, హైదరాబాద్: ‘ఎన్నికల కోడ్ కారణంగా వంద రోజులు ప్రభుత్వ కార్యక్రమాలు, పనులు నిలిచిపోయాయి. ఇకపై ఉన్నతాధికారులు విధిగా పరిపాలనపైనే దృష్టి సారించాలి. ప్రజలకు సుపరిపాలనను అందించేందుకు క్రమశిక్షణ పాటించాలి. ప్రజా ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. సమయపాలనను తప్పనిసరిగా పాటించాలి. ప్రతిరోజూ పనివేళల్లో సచివాలయంలో అందుబాటులో ఉండాలి. కేవలం కార్యాలయాలకు పరిమితం కాకుండా తమ విభాగం పనితీరును పర్యవేక్షించేందుకు వారానికో రోజు విధిగా జిల్లాల పర్యటనలకు వెళ్లాలి. నెలకోసారి అన్ని జిల్లాల ఉన్నతాధికారులతో సమావేశం ఏర్పాటు చేసుకోవాలి. కార్య క్రమాల అమలు, పనుల పురోగతిని తెలుసుకోవాలి. చాలా జిల్లాల్లో కలెక్టర్లు కార్యాలయాలు దాటడం లేదు. కలెక్టర్లు విధిగా క్షేత్ర పర్యటనకు వెళ్లేలా సీఎస్ చూడాలి. ఆసుపత్రులు, అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలలు, ప్రభుత్వ సేవలందించే అన్ని విభాగాలను కలెక్టర్లు సందర్శించాలి..’అని సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. మంగళవారం సచివాలయంలో 29 ప్రభుత్వ శాఖలు, విభాగాల కార్యదర్శులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. శాఖల పనితీరుపై పట్టు సాధించాలి ‘ఐఏఎస్ అధికారులందరూ సచివాలయం నుంచి క్షేత్ర స్థాయి వరకు విధిగా తమ పరిధిలోని శాఖలు, విభాగాల పనితీరుపై పట్టు సాధించాలి. దేశంలోనే అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా ఉండేలా తెలంగాణను తీర్చిదిద్దాల్సిన బాధ్యత అధికారులపైనే ఉంది. రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడే కొత్త కార్యక్రమాలు, వినూత్న ఆలోచనలను ఎప్పటికప్పుడు నేరుగా సీఎంవోతో పంచుకోవాలి. ఒక్కో అధికారి ఒక్కో ఫ్లాగ్ షిప్ ఐడియాను రెండు వారాల్లో ప్రభుత్వానికి సమరి్పంచాలి..’అని ముఖ్యమంత్రి కోరారు. అవసరమైతే ప్రక్షాళన చేయండి ‘మీ శాఖల పని తీరును మెరుగుపరిచేందుకు అవసరమైతే అధికారులు, సిబ్బంది ప్రక్షాళన చేపట్టాలి. ఉమ్మడి రాష్ట్రం నుంచి ఇప్పటివరకు పలువురు ముఖ్యమంత్రులతో పని చేసిన అనుభవమున్న అధికారులు ఇప్పటికీ కీలక విభాగాల్లో ఉన్నారు. వీరు ఎప్పటికప్పుడు ప్రభుత్వ ప్రాధాన్యతలను గుర్తించి తమ పనితీరును చాటుకోవాలి. ప్రజలకు మేలు జరిగే పనులు చేయాలనే సంకల్పంతో విధులు నిర్వహించాలి. ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా పని చేయాలి. ప్రజలకు జవాబుదారీగా ఉండే ప్రజా పాలనను అందించేందుకు బాధ్యతగా పని చేయాలి. అధికారులందరూ ఏకతాటిపై పని చేస్తేనే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. వ్యక్తుల ఇష్టాయిష్టాలతో ప్రభుత్వానికి సంబంధం లేదు. అధికారులపై రాగద్వేషాలేమీ లేవు. కేవలం పని తీరు ఆధారంగానే అధికారులకు తదుపరి ఉన్నత అవకాశాలుంటాయి. బాగా పని చేసే వారికి ప్రోత్సాహకాలుంటాయి. లేనిపోని సొంత నిర్ణయాలతో ప్రభుత్వానికి చెడ్డపేరు తేవద్దు. ముఖ్యమంత్రి కార్యాలయం ఇచ్చే సలహాలు సూచనలు పాటించాలి..’అని సీఎం స్పష్టం చేశారు. త్వరలో జిల్లాల పర్యటన త్వరలోనే వారానికో జిల్లా పర్యటనకు వెళతానని రేవంత్రెడ్డి తెలిపారు. ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి పనులతో పాటు క్షేత్ర స్థాయిలో వివిధ కార్యక్రమాల అమలు తీరును స్వయంగా పరిశీలిస్తానని అన్నారు. ప్రజలను స్వయంగా కలుసుకునేలా తన పర్యటన ఉంటుందని చెప్పారు. ఈ మేరకు షెడ్యూలు త్వరలో విడుదల చేస్తామన్నారు. మంత్రులు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, సీఎంవో ముఖ్య కార్యదర్శి వి.శేషాద్రి పాల్గొన్నారు. -
ధరణి సమస్యలకు చెక్.. కలెక్టర్లకు నవీన్ మిట్టల్ కీలక ఆదేశాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 2.20 లక్షల పెండింగ్ దరఖాస్తులను వీలైనంత త్వరలో పరిష్కరించాలని కలెక్టర్లకు భూపరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ) నవీన్ మిట్టల్ ఆదేశాలు జారీ చేశారు. ధరణి సమస్యలపై శుక్రవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈనెలాఖరులోగా వీలైనన్ని దరఖాస్తులు పరిష్కరించాలని స్పష్టం చేశారు.పాస్ బుక్ డేటా కరెక్షన్లోనే ఎక్కువ దరఖాస్తులు ఉన్నాయి. ధరణిలో 188 టెక్నికల్ సమస్యలు గుర్తించాం. అందులో 163 టెక్నికల్ సమస్యలను పరిష్కరించాం. వారం పది రోజుల్లో మరోసారి భేటీ అవుతాం. ఎన్నికల ప్రక్రియలో భాగంగా పెండింగ్ దరఖాస్తులు పెరిగాయి. అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో, అతి తక్కువ ములుగులో పెండింగ్ దరఖాస్తులు ఉన్నాయి. కలెక్టర్లతో పాటు అడిషనల్ కలెక్టర్లు, ఆర్డీవో లు, తహసీల్దార్లకు ధరణిపై టెక్నికల్ సమస్యలను క్లియర్ చేశాం’’ అని నవీన్ మిట్టల్ వెల్లడించారు. -
AP: పలు జిల్లాలకు కలెక్టర్లు, ఎస్పీల నియామకం
సాక్షి, విజయవాడ: ఏపీలో మూడు జిల్లాలకు కలెక్టర్లు, 5 జిల్లాలకు ఎస్పీలను నియామకం జరిగింది. ఇటీవల బదిలీ చేసిన అధికారుల స్థానంలో ఎన్నికల కమిషన్ నియామకాలు చేపట్టింది. ఈ రోజు రాత్రి 8 గంటల లోపు విధుల్లోకి చేరాలని ఈసీ తెలిపింది. ►కృష్ణ కలెక్టర్గా డీకే బాలాజీ ►అనంతపురం కలెక్టర్గా వినోద్ కుమార్ ►తిరుపతి కలెక్టర్గా ప్రవీణ్ కుమార్ ►ప్రకాశం ఎస్పీగా సుమిత్ సునీల్ ►పల్నాడు ఎస్పీగా బిందు మాధవ్ ►చిత్తూరు ఎస్పీగా మణికంఠ చందోలు ►అనంతపురం ఎస్పీగా అమిత్ బర్దర్ ►నెల్లూరు ఎస్పీగా అరిఫ్ హఫీజ్ ►గుంటూరు ఐజీగా సర్వశ్రేష్ఠ త్రిపాఠి బదిలీ -
నీటి ఎద్దడి నివారణ ఎలా?
సాక్షి, హైదరాబాద్: ‘కరీంనగర్ చొప్పదండి మునిసిపాలిటీలో గత కొద్ది రోజులుగా నీటి సమస్య తీవ్రమైంది. పట్టణంలోని కొన్ని వార్డులకు తాగునీటిని అందించలేక మునిసిపల్ అధికారులు సతమతమవుతున్నారు. ఐదు కిలోమీటర్ల దూరంలో గాయత్రి పంప్ హౌజ్ , పక్కనుంచే ఎస్ఆర్ఎస్పీ కాలువలు పోతున్నా ఈ మునిసిపాలిటీకి సరైన నీటి సదుపాయం లేదు. మిషన్ భగీరథ పథకం ద్వారా వచ్చే నీరు కూడా రావడం లేదు. ‘జగిత్యాల జిల్లా రాయికల్ మునిసిపాలిటీలోని కొన్ని వార్డుల్లో తాగునీటి సమస్య ఎక్కువైంది. ఎస్ఆర్ఎస్పీ నీరు ఉన్నప్పటికీ మూడు వార్డులకు సరిపడా నీళ్లను మునిసిపాలిటీ వాళ్లు అందించలేకపోతున్నారు. దీంతో ఎమ్మెల్సీ జీవన్రెడ్డి వార్డులోనే ఓ బావి తవ్వించి ఆ నీటిని మిషన్భగీరథ కోసం కట్టిన ట్యాంకుల్లోకి పంపించి ఇళ్లకు సరఫరా చేస్తున్నారు’ ‘కరీంనగర్ కార్పొరేషన్లో గతంలో ప్రతిరోజూ ఇంటింటికీ తాగునీటిని అందించగా, తగ్గుతున్న దిగువ మానేరు నీటిమట్టంతో ఇప్పుడు రోజు విడిచి రోజు నీటి సరఫరా జరపడమే కష్టంగా మారిందని మునిసిపల్ అధికారులు ఆందోళన చెందుతున్నారు. కాగజ్నగర్ మునిసిపాలిటీలో కరెంటు సమస్య కారణంగా అధికారులు ఇంటింటికీ తాగునీరు అందించలేకపోతున్నారు’ మంగళవారం సీడీఎంఏ కార్యాలయంలో మునిసిపాలిటీల్లో తాగునీటి సమస్యపై జరిగిన అధికారుల సమావేశంలో ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చిన అంశాల్లో కొన్ని ఇవి. జలాశయాల్లో సరిపడినంతగా నీటి నిల్వలు లేకపోవడం, పెరిగిన సూర్యతాపానికి జలాశయాల్లోని నీరు కూడా క్రమంగా తగ్గుతుందనే భయంతో పాటు భూగర్భ జలాలు అడుగంటుతుండడంతో రాష్ట్రంలో నీటి సమస్య ప్రమాద ఘంటికలను మోగిస్తోంది. ఈ నేపథ్యంలో సీడీఎంఏ దివ్య 140 పట్టణాల్లో తాగునీటి ఎద్దడి ఎదురవకుండా యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. జిల్లాల వారీగా ఐఏఎస్ అధికారుల నియామకం రాష్ట్రంలో మునిసిపాలిటీలతో పాటు గ్రామాల్లో నీటి నిర్వహణపై దృష్టి పెట్టిన ప్రభుత్వం నీటి అవసరాలు, నిర్వహణ కోసం ప్రత్యేకంగా ఐఏఎస్ అధికారులను నియమించింది. ఈ మేరకు బుధవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులను జారీ చేశారు. హైదరాబాద్ మినహా ఉమ్మడి తొమ్మిది జిల్లాలను విభజించి, పది మంది ఐఏఎస్ అధికారులను ఇన్చార్జులుగా నియమించారు. రానున్న రెండు నెలల పాటు అధికారులెవరూ సెలవులు పెట్టకూడదంటూ ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలకు ప్రత్యేక ఐఏఎస్ అధికారులు వీరే... ఆదిలాబాద్, నిర్మల్ – ప్రశాంత్ జీవన్ పాటిల్ , కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల – కృష్ణ ఆదిత్య , కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్లకు – ఆర్ వి కర్ణన్, నల్గొండ, యాదాద్రి భువనగిరి, సూర్యాపేట – అనిత రామచంద్రన్, నిజామాబాద్, కామారెడ్డి – శరత్, రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్– మల్కాజ్గిరి – విజయేంద్ర , మహబూబ్నగర్, నారాయణపేట, వనపర్తి, జోగుళాంబ గద్వాల, నాగర్ కర్నూల్ – శృతి ఓజా, వరంగల్, హనుమకొండ, జనగామ, భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్ – గోపి, మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట – భారతి కొలిగేరి , ఖమ్మం భద్రాద్రి, కొత్తగూడెం– సురేంద్రమోహన్ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. హైదరాబాద్ ప్రజలకు ఇబ్బంది లేదనే అంచనా హైదరాబాద్, శివారు ప్రాంతాలకు అవసరమైన తాగునీటిని కృష్ణా, గోదావరి నదుల నుంచి తరలిస్తున్నారు. నాగార్జున సాగర్, ఎల్లంపల్లి, మంజీరా, సింగూరు జలాశయాలతో పాటు ఉస్మాన్సాగర్, హిమాయత్సాగర్ నుంచి కూడా హైదరాబాద్ వాటర్బోర్డు తీసుకుంటోంది. జలాశయాల నుంచి ప్రతిరోజూ 2,559 మిలియన్ లీటర్ల (ఎంఎల్డీ) నీటిని హైదరాబాద్ నగర వాసుల కోసం వినియోగిస్తున్నారు. ఇందులో జీహెచ్ఎంసీ కోర్సిటీకి (హైదరాబాద్ జిల్లా) 1082.62 ఎంఎల్డీ, శివారు సర్కిల్స్ (50 డివిజన్లు)కు 1,049. 58 ఎంఎల్డీ, ఓఆర్ఆర్ పరిధిలోని మునిసిపాలిటీలు, కార్పొరేషన్లకు 277.21 ఎంఎల్డీ, మిషన్ భగీరథకు 149.47 ఎంఎల్డీ నీటిని వినియోగిస్తున్నారు. సింగూరు, ఉస్మాన్సాగర్, హిమాయత్సాగర్ రిజర్వాయర్లలో అవసరమైన మేర నీరు అందుబాటులో ఉందని ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. గతేడాది 2,270 ఎంఎల్డీ నీటిని హైదరాబాద్కు సరఫరా చేయగా, ప్రస్తుతం 2,409.53 ఎంఎల్డీ నీటిని సరఫరా చేస్తున్నట్లు వెల్లడించింది. గతేడాది కంటే 139.53 ఎల్ఎండీ అదనంగా సరఫరా చేస్తున్నట్లు తెలిపింది. ట్యాంకర్ల డిమాండ్ అక్కడే హైదరాబాద్ నగరానికి పశ్చిమాన ఉన్న మణికొండ, గచ్చిబౌలి, కొండాపూర్, మాదాపూర్, కూకట్పల్లి, జూబ్లిహిల్స్, బంజారాహిల్స్ ప్రాంతాల్లోనే ట్యాంకర్ల డిమాండ్ ఉన్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. 644 ట్యాంకర్లు అందుబాటులో ఉండగా, మంగళవారం 6,593 ట్రిప్పుల్లో నీటి సరఫరా చేశాయి. భూగర్బ జలాలు తగ్గడం వల్లనే ట్యాంకర్లకు డిమాండ్ పెరుగుతోందని వాటర్బోర్డు చెబుతోంది. -
AP: ఎన్నికల నియమావళి కట్టుదిట్టంగా అమలు చేయాలి: సీఎస్
సాక్షి, విజయవాడ: లోక్సభతో పాటు అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటన నేపథ్యంలో రాష్ట్రంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని కట్టుదిట్టంగా అమలు చేయాలని ప్రభుత్వ కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి జిల్లా ఎన్నికల అధికారులైన కలెక్టర్లను ఆదేశించారు. ఈ మేరకు శనివారం విజయవాడ సిఎస్ క్యాంపు కార్యాలయంలో సాధారణ, అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ ఎన్నికల షెడ్యూల్ వెలువడిన 24 గంటలలోగా ప్రభుత్వ ఆస్తులపై గల అన్ని రకాల వాల్ రైటింగులు, పోస్టర్లు, కటౌట్లు, హోర్డింగులు, బ్యానర్లు, జెండాలు వంటివన్నీ తొలగించాలని ఆదేశించారు. అలాగే వివిధ పబ్లిక్ ఆస్తులైన బహిరంగ ప్రదేశాలు, బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లు, రైల్వే,రోడ్డు వంతెనలు,ప్రభుత్వ బస్సులు, విద్యుత్ స్తంభాలు,మున్సిపల్ సమావేశ ప్రదేశాల్లోని అన్ని రకాల రాజకీయ పరమైన యాడ్లు, వాల్ రైటింగ్లు, పోస్టర్లు, కటౌట్లను వెంటనే తొలగించాలని సీఎస్ ఆదేశించారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రసార మాధ్యమాల్లో ప్రభుత్వ నిధులతో జారీ చేసే యాడ్లను నిలిపి వేయాలని స్పష్టం చేశారు. అంతేగాక ప్రభుత్వ వెబ్సైట్లో మంత్రులు తదితర ప్రజా ప్రతినిధులు, రాజకీయ పార్టీలకు సంబంధించిన ఫోటోలను వెంటనే తొలగించాలని సీఎస్ జవహర్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగాన్ని ఆదేశించారు. ఎన్నికల ప్రకటన వచ్చాక మంత్రులెవరూ అధికారిక వాహనాలను ఎన్నికల ప్రచారం వినియోగించరాదని సీఎస్ స్పష్టం చేశారు. మంత్రుల ఎన్ని కల పర్యటనలకు ప్రభుత్వ అతిథి గృహాలను కేటాయించరాదని కలెక్టర్లకు స్పష్టం చేశారు. ఎంపీ, ఎమ్మెల్యే నిధులు, ఇతర ప్రభుత్వ పథకాల నిధులతో నిర్వహించే వాటర్ ట్యాంకులు, అంబులెన్సులు వంటి వాటిపై ఎంపీ, ఎమ్మెల్యేల ఫొటోలు ఉండ రాదని సీఎస్ స్పష్టం చేశారు. ఎన్నికల ప్రకటన వచ్చాక ప్రభుత్వ భవనాలు, కార్యాలయిల్లో ప్రధాన మంత్రి, ముఖ్యమంత్రి సహా మంత్రుల ఫొటోలు ఉండరాదన్నారు. అదే విధంగా మంత్రులు అధికారుల మధ్య ఎటువంటి వీడియో సమావేశాలు నిర్వహించరాదని స్పష్టం చేశారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి వచ్చాక విద్యుత్, నీటి బిల్లులు, బోర్డింగ్ పాస్లు, వ్యాక్సినేషన్ సర్టిఫికెట్లపై ప్రజాప్రతినిధుల ఫొటోలు, సందేశాలు వంటివి ఉండరాదని సీఎస్ స్పష్టం చేశారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి వచ్చాక ప్రభుత్వ అధికారులు ఎవరూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ముందస్తు అనుమతి లేకుండా వారి హెడ్ క్వార్టర్ విడిచి వెళ్లడానికి వీలు లేదని సీఎస్ స్పష్టం చేశారు. అదే విధంగా ఎన్నికల విధులతో సంబంధం ఉన్న అధికారులు, సిబ్బందిని బదిలీ చేయడానికి వీలులేదని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా ఏ రాజకీయ పార్టీకైనా అనుకూలంగా వ్యవహరించినా, ఆయా పార్టీలు నిర్వహించే ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నా, గిఫ్టులు, ఇతర లబ్దిలు పొందినా అలాంటి వారిపై సీసీఏ నిబంధనలు ప్రకారం ఐపీసీ సెక్షన్ 171, 1951 ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని 123,129,134,134 ఏ నిబంధనలు ప్రకారం క్రమశిక్షణా చర్యలు తీసుకోవడం జరుగుతుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్పష్టం చేశారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి వచ్చాక బడ్జెట్ ప్రావిజన్ ఉన్నప్పటికీ నూతన ప్రాజెక్టులు, పథకాల మంజూరు, కన్సిజన్లు, గ్రాంట్లు, హామీలు, శంకుస్థాపనలు పూర్తి నిషేధమని సీఎస్ స్పష్టం చేశారు. వర్క్ఆర్డర్ ఉన్న కేత్ర స్థాయిలో మొదలు కాని పనులు చేపట్ట కూడదని తెలిపారు. పనులు పూర్తయిన వాటికి నిధులు విడుదలలో ఎలాంటి నిషేధం లేదని స్పష్టం చేశారు. అలాగే పీఎం,సీఎం సహాయ నిధి కింద గుండె, కిడ్ని, కేన్సర్ వంటి రోగులకు చికిత్సలకై సకాలంలో నిధులు మంజూరుకు ఆయా శాఖలకు ఎలాంటి అభ్యంతరం లేదని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.జవహర్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ వీడియో సమావేశంలో అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, పలువురు అధికారులు పాల్గొన్నారు. -
ధరణి: కలెక్టర్ల మొర.. మమ్మల్ని బాధ్యులను చేయడం సరికాదు!
సాక్షి, హైదరాబాద్: ధరణి పునర్నిర్మాణ కమిటీ సమావేశంలో భాగంగా పలు సమస్యలను జిల్లా కలెక్టర్లు కమిటీ దృష్టికి తీసుకువచ్చినట్టు తెలుస్తోంది. ధరణి విషయంలో వారు ఎదుర్కొంటున్న సమస్యలకు తమను భాద్యులు చేయవద్దని కమిటీకి మొర పెట్టుకున్నారు. ధరణితో పాటు రెవెన్యూ వ్యవస్థలోని లోపాలకు తమను బాధ్యులను చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కోర్టు పరిధిలోని అంశాలకు తమను బాధ్యులను చేయడం సరికాదంటున్న కలెక్టర్లు ధరణి కమిటీ దృష్టి తీసుకువచ్చారు. తెలంగాణ సెక్రటేరియట్లో ధరణి కమిటీ సమావేశం సుదీర్ఘంగా కొనసాగుతోంది. ధరణి వాస్తవ పరిస్థితులను కలెక్టర్లు కమిటీ దృష్టికి తీసుకువచ్చారు. బుధవారం ధరణి కమిటీ సమావేశంలో రంగారెడ్డి, సిద్దిపేట, వరంగల్, ఖమ్మం , నిజామబాద్ జిల్లాల కలెక్టర్లు పాల్గొన్నారు. చదవండి: ‘కాంగ్రెస్ పార్టీకే రేవంత్ ముఖ్యమంత్రా?.. తెలంగాణకు కాదా?’ -
విజయ గాథలతో వీడియోలు
సాక్షి, అమరావతి: వైఎస్సార్ ఆసరా, వైఎస్సార్ చేయూత పథకాల ద్వారా అక్క చెల్లెమ్మలను నాలుగేళ్ల పాటు చేయి పట్టుకుని నడిపిస్తూ ప్రత్యామ్నాయ జీవనోపాధి కల్పించామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. ఈ పథకాల లబ్ధిదారుల విజయగాథలను వీడియోల రూపంలో వలంటీర్ల ద్వారా సేకరించి పంపాలని కలెక్టర్లకు సూచించారు. ఈ పథకాలు, ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు మహిళల జీవితాలు, స్థితిగతులను ఏ రకంగా మార్చాయో వీడియోల్లో పొందుపరచాలని సూచించారు. పంపిన వాటిల్లో అత్యుత్తమమైన వాటికి బహుమతులు ఇస్తామని ప్రకటించారు. ఇవి మరి కొందరిలో స్ఫూర్తిని పెంచుతాయన్నారు. సచివాలయాల స్థాయిలో రూ.10 వేలు, మండల స్థాయిలో రూ.15 వేలు, నియోజకవర్గ స్థాయిలో రూ.20 వేలు, జిల్లా స్థాయిలో రూ.25 వేలు చొప్పున ఉత్తమ విజయ గాథలకు బహుమతులు ఇస్తామని చెప్పారు. ఉత్తమ సేవలు అందించిన వలంటీర్లకు ఫిబ్రవరి 15, 16 తేదీల్లో సేవామిత్ర, సేవా రత్న, సేవా వజ్ర అవార్డులు ఇస్తామని, వాటితో పాటే లబ్ధిదారులపై ఉత్తమ వీడియోలు పంపినవారికి అవార్డులు అందచేస్తామని తెలిపారు. సీఎం జగన్ గురువారం తన క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లతో మాట్లాడారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను నిలబెట్టాం వైఎస్సార్ ఆసరా, చేయూత, సున్నా వడ్డీ, అమ్మ ఒడి పథకాలతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థను నిలబెట్టాం. 2019లో మన ప్రభుత్వం రాకముందు పొదుపు సంఘాలన్నీ పూర్తిగా కుదేలైపోయాయి. ఏ గ్రేడ్, బీ గ్రేడ్ సంఘాలు పూర్తిగా కనుమరుగైపోయి సీ గ్రేడ్, డీ గ్రేడ్గా మారిపోయిన దుస్థితి నెలకొంది. 18 శాతం పైచిలుకు ఖాతాలన్నీ అవుట్ స్టాండింగ్, ఎన్పీఏల స్థాయిలోకి వెళ్లిపోయాయి. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కుదేలైపోయింది. మనం అధికారంలోకి వచి్చన తర్వాత వారికి చేయూతనిచ్చి ఆసరా, సున్నా వడ్డీ, చేయూత, అమ్మ ఒడి పథకాల ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను నిలబెట్టగలిగాం. ఆర్థిక స్వావలంబన, సాధికారత క్రమం తప్పకుండా ఏటా లబ్ధిదారులకు పలు పథకాలను అందించడం ద్వారా మహిళల ఆర్థిక స్వావలంబన, సాధికారితను సాధించగలిగాం. అందువల్లే ఈ రోజు పొదుపు సంఘాల్లో ఎన్పీఏలు కేవలం 0.3 శాతానికి పరిమితమయ్యాయి. అక్క చెల్లెమ్మలకు ఇంతగా తోడుగా నిలిచి నడిపించిన ప్రభుత్వం మనది. జనవరిలో వైఎస్సార్ ఆసరా చివరి విడత ఒక్క వైఎస్సార్ ఆసరా ద్వారానే రూ.25 వేల కోట్లకుపైగా మహిళలకు లబ్ధి చేకూరుస్తున్నాం. ఈ పథకం కింద మూడు విడతలుగా ఇప్పటికే రూ.19,195 కోట్లు ఇచ్చాం. నాలుగో విడతగా, చివరి ఇన్స్టాల్మెంట్ కింద సుమారు రూ.6,400 కోట్లు్ల ఇస్తున్నాం. జనవరి 23న ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. ఇది జనవరి 23 నుంచి 31వ తారీఖు వరకూ కొనసాగుతుంది. దీని ద్వారా 78.94 లక్షల మంది మహిళలు లబ్ధి పొందారు. ఈ కార్యక్రమాలన్నీ ఉత్సవ వాతావరణంలో జరగాలి. ఇందులో మహిళా సంఘాల కార్యకలాపాలను వివరించే స్టాల్స్ను కూడా ఏర్పాటు చేయాలి. సుస్థిర జీవనోపాధి.. మహిళలకు సుస్థిర జీవనోపాధి కల్పించాలన్నదే ఆసరా, చేయూత పథకాల ఉద్దేశం. స్వయం ఉపాధి పథకాల ద్వారా వారి జీవితాల్లో వెలుగులు చూడగలుగుతాం. ఇందులో భాగంగానే పలు మల్టీ నేషనల్, ప్రముఖ కంపెనీలు, బ్యాంకులతో అనుసంధానించాం. ప్రీ లాంచ్, లాంచ్, పోస్ట్ లాంచ్ కార్యక్రమాల ద్వారా మహిళలు, మహిళా సంఘాలకు దీనిపై అవగాహన పెంపొందించాలి. ఆసరా, చేయూత కార్యక్రమాల లబ్ధిదారులకు ఇది చాలా అవసరం. మహిళా సంఘాలు తీర్మానాలు చేస్తే ఆసరా కింద ఇచ్చే డబ్బు గ్రూపు ఖాతాల నుంచి వారి వ్యక్తిగత ఖాతాల్లోకి వెళ్తుంది. ‘చేయూత’తో రూ.14,129 కోట్లు ఫిబ్రవరి 5 నుంచి 14 వరకూ వైఎస్సార్ చేయూత కార్యక్రమం వేడుకలా జరుగుతుంది. ఇలాంటి కార్యక్రమం గతంలో ఎప్పుడూ జరగలేదు. పథకం కింద ఇప్పటివరకూ రూ.14,129 కోట్లు అందచేశాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారీ అక్క చెల్లెమ్మలకు తోడుగా నిలిచి వారికి జీవనోపాధి చూపించేలా కార్యక్రమం చేపట్టాం. 45 ఏళ్లకు పైబడ్డ మహిళలకు ఏడాదికి రూ.18,750 చొప్పున అందిస్తూ 26.50 లక్షల మందికి పైగా అక్కచెల్లెమ్మలకు మంచి చేస్తున్నాం. లబ్ధిదారులు 31,23,466 మంది ఉన్నారు. ఈ పథకం వారి జీవితాల్లో ఏ రకంగా మార్పులు తెచి్చందో తెలియజెప్పాలి. జీవనోపాధి మార్గాలపై అవగాహన కలి్పస్తూ వారికున్న అవకాశాలను వివరించాలి. ఈ కార్యక్రమంలో కూడా నా తరపున లేఖను లబ్ధిదారులకు అందించాలి. నా వీడియో సందేశాన్ని కూడా వారికి చేరవేయాలి. సామాజిక న్యాయానికి చిహ్నంగా అంబేడ్కర్ విగ్రహావిష్కరణ సామాజిక న్యాయానికి చిహ్నంగా విజయవాడలో 19 ఎకరాల్లో రూ.404 కోట్లతో రూపొందించిన 125 అడుగుల ఎత్తైన డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ విగ్రహాన్ని జనవరి 19న ఆవిష్కరిస్తున్నాం. సచివాలయం నుంచి రాష్ట్ర స్థాయివరకూ ప్రతి అడుగులోనూ సామాజిక న్యాయ నినాదం వినిపించాలి. ప్రతి సచివాలయం పరిధిలో సమావేశాలు నిర్వహించాలి. ప్రతి సచివాలయం నుంచి ఐదుగురిని 19న జరిగే అంబేడ్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి ఆహ్వానించాలి. ప్రతి మండల కేంద్రం నుంచి ప్రత్యేకంగా బస్సులు నడుపుతాం. సామాజిక న్యాయానికి ప్రతిరూపంగా అంబేడ్కర్ విగ్రహ ఆవిష్కరణలో వారందరినీ భాగస్వాములను చేస్తాం. గ్రామ స్థాయిలో పరిపాలనను చేరువ చేసి సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చాం. తద్వారా గ్రామ స్వరాజ్యాన్ని సాకారం చేశాం. ఇదొక గొప్ప మార్పు. అంబేడ్కర్ విగ్రహావిష్కరణ ఈ మార్పులకు ప్రతిరూపంగా నిలుస్తుంది. -
అన్ని జిల్లాల కలెక్టర్లతో సీఎం జగన్ సమీక్ష
-
వైఎస్సార్సీపీ ప్రభుత్వం విశ్వసనీయతకు మారుపేరు: సీఎం జగన్
గుంటూరు, సాక్షి: జిల్లా కలెక్టర్లతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం సమీక్ష నిర్వహించారు. తాడేపల్లిలోని తన కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్లతో సమావేశమయ్యారు. పెన్షన్లు, ఆసరా, చేయూత పథకాలపై అధికారులతో సీఎం సమీక్ష జరిపారు. అంబేద్కర్ విగ్రహం ప్రారంభోత్సవం తదితర కార్యక్రమాలపై కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. జనవరిలో 3, ఫిబ్రవరిలో 1, మొత్తంగా నాలుగు ప్రధానమైన కార్యక్రమాలు చేస్తున్నామని, ఎక్కడాకూడా పొరపాట్లు లేకుండా చూసుకోవాలని సీఎం సూచించారు. ప్రతి కార్యక్రమానికి ప్రీలాంచ్, లాంచ్, పోస్ట్ లాంచ్ కార్యక్రమాలు ఉంటాయి. అవి సక్రమంగా నడిచేలా కలెక్టర్లు షెడ్యూల్ చేసుకోవాలి. జనవరి నుంచి వైఎస్సార్ పెన్షన్ కానుక రూ.3 వేలకు పెంచుతాం. రూ.3 వేలకు పెన్షన్ పెంచుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీని పూర్తిగా నెరవేరుస్తున్నాం. విశ్వసనీయతకు ఈ ప్రభుత్వం మారు పేరు అని రుజువు చేస్తున్నామని సీఎం చెప్పారు. సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే ఆయన మాటల్లోనే.. ►జనవరి 1 నుంచి 8వ తారీఖు వరకూ పెన్షన్ల పెంపు కార్యక్రమం జరుగుతుంది ►2019లో మన ప్రభుత్వం రాకముందు ఎన్నికలకు 2 నెలల ముందు వరకూ పెన్షన్ కేవలం రూ.1000 మాత్రమే ఇచ్చేవారు ►మనం అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.2,250 లు చేశాం ►ఆ తర్వాత ఇప్పుడు రూ.3 వేల వరకూ పెంచుకుంటూ వచ్చాం ►గత ప్రభుత్వంలో నెలకు రూ.400 కోట్ల మాత్రమే సగటున పెన్షన్లకోసం ఖర్చు చేసేవారు ►ఇవాళ మన ప్రభుత్వ హయాంలో నెలకు సుమారు రూ.1950 కోట్ల ఖర్చు చేస్తున్నాం ►మన రాకముందు ఎన్నికలకు ఆరు నెలల ముందు వరకు పెన్షన్ల సంఖ్య 39 లక్షలు అయితే ఇవాళ పెన్షన్ల సంఖ్య దాదాపు 66 లక్షలు ►ప్రతి అడుగులోనూ కూడా ఏ లబ్ధిదారు మిగిలిపోకూడదు, ప్రతి ఒక్కరికీ కూడా మంచి జరగాలి, ఎవ్వరూ కూడా ఇబ్బందులు పడకూడదని.. ఎప్పుడూ లేని విధంగా వాలంటీర్ – సచివాలయ వ్యవస్థను గ్రామస్థాయిలో తీసుకు వచ్చాం ►ఒకటో తారీఖు అది ఆదివారమైనా, పండుగైనా సరే .. పొద్దునే వాలంటీర్ చిక్కటి చిరునవ్వుతో పెన్షన్ను ఇంటివద్దే ఇచ్చే పరిస్థితిని, మార్పును తీసుకురాగలిగాం ►ఈ నాలుగున్నర సంవత్సరాల కాలంలో ఈ మార్పును తీసుకురాగలిగాం: ►ఈ మార్పును ఎలా తీసుకు రాగలిగాం? ఇంత మంచి ఎలా చేయగలిగాం? అన్నది ప్రతి గడపకూ తెలియజేయాల్సిన అవసరం ఉంది ►రెండో కార్యక్రమం జనవరి 19న అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నాం ►మూడో కార్యక్రమం వైఎస్సార్ ఆసరాలో భాగంగా జనవరి 23 నుంచి 31 వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది ►నాలుగోది వైయస్సార్ చేయూత కార్యక్రమం.. ఇది ఫిబ్రవరి 5 నుంచి 14వరకూ కొనసాగుతుంది ►ఈ నాలుగు కార్యక్రమాలను ప్రభుత్వం చాలా ప్రతిష్ట్మాత్మకంగా నిర్వహిస్తుంది ►అర్హత ఉండీ ఎవరైనా ఎక్కడైనా మిగిలిపోయిన సందర్భాల్లో .. మరలా రీవెరిఫికేషన్ చేసి, వారికి పథకాలు వర్తింపు చేసే బై యాన్యువల్ కార్యక్రమం జనవరి 5న జరుగుతుంది: ►ఈ కార్యక్రమం జరిగే లోపే వెరిఫికేషన్ పూర్తి చేసిన దాదాపు 1.17 లక్షల పెన్షన్లు ఒకటో తారీఖు నుంచే ఇస్తారు ►66,34,742మందికి సుమారు రూ.1968 కోట్లకుపైగా పెన్షన్ల రూపంలో అందుతాయి ►మన ప్రభుత్వం విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచింది ►క్రెడిబులిటీకి అర్ధం చెబుతూ ఈ ప్రభుత్వం పనిచేస్తోంది ►ఈ సందేశం ప్రతి ఒక్కరికీ చేరాలి ►పెన్షన్ల పెంపు కార్యక్రమం జనవరి 1వ తేదీనే ప్రారంభమవుతుంది ►ఇందులో భాగంగా నేను కూడా 3వ తారీఖున కాకినాడలో ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నాను ►అవ్వాతాతలు వేచిచూసే పరిస్థితి లేకుండా 1వ తారీఖునే ఈ కార్యక్రమం ప్రారంభం అవుతుంది ►ప్రజా ప్రతినిధులు అందరూ కూడా పెన్షన్ కానుక కార్యక్రమంలో భాగస్వాములు కావాలి ►ఎమ్మెల్యేలు ప్రతి మండలంలో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలి ►8 రోజులపాటు పెంచిన పెన్షన్లతో పెన్షన్ కానుక కార్యక్రమం జరుగుతుంది ►ఏయే మండలాల్లో ఏయే రోజుల్లో జరుగుతుందన్న దానిపై షెడ్యూలు చేసుకోవాలి పెన్షన్తోపాటు నా తరపున లేఖను కూడా లబ్ధిదారులకు అందించాలి అలాగే నేను ఇచ్చే వీడియో సందేశం కూడా లబ్ధిదారులకు చేరవేయాలి ►ప్రజాప్రతినిధులు, వాలంటీర్లు, ఉత్సాహవంతులు, లైక్ మైండ్స్.. ఈ కార్యక్రమంలో పాల్గొనేలా చూడాలి ►ఈ కార్యక్రమాన్ని ఒక పండగ వాతావరణంలో నిర్వహించాలి ►రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ కూడా అవ్వాతాతలను ఈ విధంగా పట్టించుకున్న ప్రభుత్వం లేదు ►వారి ఆత్మగౌరవాన్ని కాపాడుతూ, వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇంటి వద్దకే పెన్షన్ అందిస్తున్నాం ►వాళ్ల కోసం పట్టించుకునే వాలంటీర్లు, సచివాలయ వ్యవస్థలాంటి ఏర్పాటు గతంలో ఎప్పుడూ లేదు ►దేశంలో కూడా ఇంత పెద్ద మొత్తంలో పెన్షన్ డబ్బు ఎక్కడా ఇవ్వలేదు ►మనం చెప్పిన మాటను నెరవేర్చాలా మన ప్రభుత్వం కృతనిశ్చయంతో అడుగులు వేసింది ►ఇచ్చిన హామీని మనసా వాచా అమలు చేయడానికి ఎంతగా కష్టపడ్డామో, ఎంత గొప్పగా చేయగలుగుతున్నామో అందరికీ తెలిసిందే ►ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యలను ప్రతి లబ్ధిదారులకు తెలియాలి ►ఈ పెన్షన్ కార్యక్రమం కోసం ఏడాదికి దాదాపు రూ.23 వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం ►కాని రాష్ట్ర ప్రభుత్వం ఎంతో అంకిత భావంతో అవ్వాతాతలకు అండగా నిలబడేందుకు సమర్ధవంతంగా నిర్వహిస్తున్నాం వైఎస్సార్ ఆసరా... ►2019లో మన ప్రభుత్వం రాకముందు పొదుపు సంఘాలన్నీ పూర్తిగా కుదేలైపోయాయి ►ఏ గ్రేడ్, బి గ్రేడ్ సంఘాలు పూర్తిగా కనుమరుగైపోయి సీ గ్రేడ్, డీ గ్రేడ్గా సంఘాల్లో చేరిన పరిస్థితి ►18శాతం పైచిలుకు అక్కౌంట్లు అన్నీ కూడా అవుట్ స్టాండింగ్, ఎన్పీఏల స్థాయిలోకి వెళ్లిపోయాయి ►గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కుదేలైపోయింది ►మనం అధికారంలోకి వచ్చిన తర్వాత వారికి చేయూత నిచ్చి ఆసరా, సున్నావడ్డీ, చేయూత, అమ్మ ఒడి పథకాల ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను నిలబెట్టగలిగాం: ►మహిళల ఆర్థిక స్వావలంబన, సాధికారితను సాధించగలిగాం ►క్రమం తప్పకుండా ప్రతి ఏటా లబ్ధిదారులకు అందించగలిగాం ►అందుకనే ఈరోజు పొదుపు సంఘాల్లో ఎన్పీఏలు కేవలం 0.3 శాతానికి చేరాయి: ►అక్క చెల్లెమ్మలకు ఇంతగా తోడు ఉండి నడిపించిన ప్రభుత్వం మనది ►ఒక్క ఆసరా కోసమే రూ.25,570 కోట్లు ఖర్చు చేశాం ►మూడు విడతలుగా ఇప్పటికే రూ.19,195 కోట్లు ఇచ్చాం ►నాలుగో విడతగా.... చివరి ఇన్స్టాల్మెంట్ కింద సుమారు రూ.6,400 కోట్లు ఇస్తున్నాం ►జనవరి 23న ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం ►ఇది కూడా జనవరి 23 నుంచి 31వ తారీఖు వరకూ కొనసాగుతుంది ►ఈ కార్యక్రమం ద్వారా 78.94 లక్షల మంది మహిళలు లబ్ధి పొందారు ►మహిళల్లో సుస్థర జీవనోపాధి కల్పించాలన్నదే ఆసరా, చేయూత పథకాల ఉద్దేశం ►ఇందులో భాగంగానే అనేక మల్టీ నేషనల్, ప్రముఖ కంపెనీలతో టై అప్ చేయించాం ►బ్యాంకులతో టై అప్ చేయించాం ►స్వయం ఉపాధి పథకాల ద్వారా వారి జీవితాల్లో వెలుగులు చూడగలుగుతాం: ►ప్రీలాంచ్, లాంచ్, పోస్ట్ లాంచ్ కార్యక్రమాల్లో మహిళలు, మహిళా సంఘాల్లో అవగాహన కల్పించాలి ►ఆసరా, చేయూత కార్యక్రమాల లబ్ధిదారులకు ఇది చాలా అవసరం : ►మహిళా సంఘాలు తీర్మానాలు చేసుకుంటే ఆసరా కింద ఇచ్చే డబ్బు గ్రూపు ఖాతాల నుంచి వారి వ్యక్తిగత ఖాతాల్లోకి వెళ్తుంది: వీడియోల రూపంలో విజయ గాథలు ►పెన్షన్ కానుక, ఆసరా, చేయూత లబ్ధిదారుల విజయగాధలను వీడియోల రూపంలో పంపాలి ►ఇలా పంపిన వాటిలో అత్యుత్తమమైన వాటికి బహుమతులు ఇస్తాం ►ఇవి మరికొందరిలో స్ఫూర్తిని పెంచుతాయి: ►ఏ రకంగా ఈ పథకాలు, కార్యక్రమాలు వారి జీవితాలను మార్చాయో ఈ వీడియోల ద్వారా తీసుకోవాలి ►ఈ పథకాల ద్వారా మహిళల్లో వచ్చిన మార్పులను ఈ వీడియోల ద్వారా తీసుకోవాలి ►ఉత్తమమైన వాటికి సచివాలయాల స్ధాయిలో రూ.10వేలు, మండల స్థాయిలో రూ.15వేలు, నియోజకవర్గ స్థాయిలో రూ.20వేలు, జిల్లా స్థాయిలో రూ.25వేలు బహుమతిగా ఇస్తాం ►ఫిబ్రవరి 15–16 ప్రాంతంలో ఉత్తమ సేవలు అందించినందుకు వాలంటీర్లకు సేవామిత్ర, సేవా రత్న, సేవా వజ్ర అవార్డులు ఇస్తాం ►వాటితోపాటు లబ్ధిదారులపై రూపొందించివాటిలో ఉత్తమ వీడియోలు పంపినవారికి అవార్డులు ►ఆసరా కార్యక్రమాలన్నీ ఉత్సవ వాతావరణంలో జరగాలి ►ఇందులో మహిళా సంఘాల కార్యకలాపాలు తెలియజేసే స్టాల్స్ను కూడా ఏర్పాటు చేయాలి వైఎస్సార్ చేయూత కార్యక్రమం... ►ఫిబ్రవరి 5 నుంచి 14 వరకూ వైయస్సార్ చేయూత కార్యక్రమం జరుగుతుంది ►గతంలో ఆంధ్రరాష్ట్రంలో ఇలాంటి కార్యక్రమం ఎప్పుడూ జరగలేదు ►ఇప్పటివరకూ రూ.14,129 కోట్లు ఇచ్చాం ►ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల్లో అట్టడుకు వర్గాల్లో వారికి తోడుగా నిలబడ్డమే కాకుండా, వారికి జీవనోపాధి చూపించే దిశగా ఈ కార్యక్రమం చేస్తున్నాం ►45 ఏళ్ల పైబడ్డ ఉన్న మహిళలకు ఏడాదికి రూ.18,750లు ఇచ్చాం ►26 లక్షల మందికి పైగా అక్కచెల్లెమ్మలకు మంచి చేస్తున్నాం ►ఈ పథకంలో ఇప్పటివరకు యూనిక్ లబ్ధిదారులు 31,23,466 మంది ఉన్నారు ►ఈ పథకం వారి జీవితాల్లో ఏరకంగా మార్పులు తీసుకు వచ్చిందో తెలియజెప్పాలి ►చివరి విడతద్వారా 26,39,703 మంది లబ్ధి పొందారు ►అదే విధంగా మహిళల జీవనోపాథి మార్గాలపై వారిలో మరింత అవగాహన కల్పించి, వారికున్న అవకాశాలనుకూడా వివరించాలి ►ఈ కార్యక్రమంలో కూడా నా తరపున లేఖను కూడా లబ్ధిదారులకు అందించాలి ►అలాగే నేను ఇచ్చే వీడియో సందేశం కూడా లబ్ధిదారులకు చేరవేయాలి జనవరి 19 – అంబేద్కర్ విగ్రహం ప్రారంభం. ►జనవరి 19 విజయవాడలో అంబేద్కర్ విగ్రహాన్ని ప్రారంభిస్తున్నాం ►19 ఎకరాల్లో రూ.404 కోట్లతో 125 అడుగుల డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నాం ►సామాజిక న్యాయానికి ప్రతిరూపంగా ఈ విగ్రహాన్ని నిర్మిస్తున్నాం ►సచివాలయం స్థాయి నుంచి రాష్ట్రస్థాయివరకూ ప్రతి అడుగులోనూ సామాజిక న్యాయ నినాదం వినిపించాలి ►ప్రతి సచివాలయం పరిధిలోకూడా సమావేశాలు పెట్టి, అవగాహన కలిగించాలి ►ప్రతి సచివాలయం నుంచి 5 మందిని 19న జరిగే అంబేద్కర్ విగ్రహం ప్రారంభోత్సవానికి ఆహ్వానించాలి ►ప్రతి మండల కేంద్రం నుంచి ప్రత్యేకమైన బస్సులు నడుపుతాం ►సామాజిక న్యాయానికి ప్రతిరూపంగా అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణలో వాళ్లూ భాగస్వామ్యులయ్యేటట్టు చేయాలి ►గ్రామ స్థాయిలో మనం గొప్ప వ్యవస్థను తీసుకు వచ్చాం ►గ్రామ స్వరాజ్యం తీసుకు వచ్చాం ►ఇదొక గొప్ప మార్పు ►దీనికి మద్ధతు తెలిపే కార్యక్రమాలు జరగాలి ►ఈ మార్పునకు ప్రతిరూపంగా అంబేద్కర్ విగ్రహం నిలుస్తుంది -
ఐఏఎస్, ఐపీఎస్లకు సీఎం రేవంత్ వార్నింగ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కలెక్టర్లు, ఎస్పీలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం ముగిసింది. కాగా, ఈ సమావేశంలో భాగంగా సీఎం రేవంత్ కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వం చాలా ఓపెన్ మైండ్తో ఉంది. అధికారులు ఇచ్చే సలహాలు, సూచనలు కూడా ప్రభుత్వం తీసుకుంటుంది. అలాగే, ప్రతీ ఒక్కరూ పని చేయాల్సిందే. ఎవరికైనా ఇబ్బందులు ఉంటే వెంటనే తప్పుకోవచ్చు.. పని విషయంలో ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఇదే క్రమంలో అక్రమార్కులపై చర్యలు తీసుకునేందుకు పోలీసులకు పూర్తి స్వేచ్చను ఇస్తున్నట్టు తెలిపారు. అయితే, సమీక్ష సందర్బంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. ఆరు గ్యారంటీలు అమలు కావాలంటే ప్రజా ప్రతినిధులు, అధికారులు జోడెద్దులుగా పనిచేయాలి. ప్రజా ప్రతినిధులు, అధికారులకు సమన్వయం లేకపోతే టార్గెట్ రీచ్ కాలేం. సచివాలయంలో ఏ నిర్ణయం తీసుకున్నా క్షేత్ర స్థాయిలో అమలు చేసే బాధ్యత ప్రజా ప్రతినిధులు, కలెక్టర్లదే. ప్రజాపాలన పేరుతో గ్రామసభను నిర్వహించి లబ్ధిదారుల ఎంపిక చేయాలి. నిస్సహాయులకు సహాయం అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలి. అభివృద్ధి అంటే అద్ధాల మేడలు, రంగుల గోడలు కాదు. చివరి వరుసలో ఉన్న పేదవాడికి సంక్షేమం అందించే బాధ్యత అధికారులదే. గ్రామసభల్లో ప్రభుత్వ సందేశాన్ని ప్రజలకు అర్థం అయ్యేలాగా వినిపించాలి. అర్హులైన ప్రతీ ఒక్కరికీ సంక్షేమం అందించడమే మా లక్ష్యం. పోలీసులకు ఫ్రీడమ్.. అక్రమార్కులపై చర్యలు తీసుకునేందుకు పోలీసులకు పూర్తి స్వేచ్చ ఇస్తున్నాం. భూకబ్జాదారులపై కఠినంగా వ్యవహరించాలి. భూకబ్జా అనే పదం రాష్ట్రంలో వినిపించకూడదు. బుక్ మై షో, సన్బర్న్ నిర్వహణపైన పోలీసులు నిఘా పెట్టి అసలు విషయాలు తేల్చాలి. సన్బర్న్ ఈవెంట్ను మహారాష్ట్ర, కర్ణాటక ప్రభుత్వాలు నిషేధించాలి. వీటి వెనకాల ఎవరున్నా వదిలిపెట్టకండి. గంజాయిపై పోలీసులు కఠినంగా వ్యవహరించాలి. గంజాయి విస్తరణ కాలేజీలకు చేరింది.. పోలీసులు వీటిపై నిఘా పెట్టాలి. నకిలీ విత్తనాల సరఫరాపై నిఘా పెట్టాలి. నిబంధనలు అతిక్రమిస్తే కఠినంగా చర్యలు తీసుకోవాలి. ప్రతీ ఒక్కరికీ బాధ్యత అవసరం.. జిల్లాలకు మంత్రులు, ప్రతీ సెగ్మెంట్కు స్పెషల్ ఆఫీసర్ నియామకం. గ్రామ సభల్లో ప్రభుత్వ సందేశాన్ని ప్రజలకు అర్థం అయ్యే విధంగా వినిపించాలి. అర్హులైన ప్రతీ ఒక్కరికీ సంక్షేమం అందించడమే మా లక్ష్యం. మాతో పనిచేయడానికి అధికారులు ఎవరికైనా ఇబ్బందులు ఉంటే వెంటనే సీఎస్, డీజీపీకి చెప్పి తమ బాధ్యతల నుంచి తప్పుకోవచ్చు. బాధ్యత తీసుకున్న ప్రతీ అధికారి వారి బాధ్యతను పూర్తిస్థాయిలో నిర్వర్తించాల్సిందే. రోజుకు 18 గంటలు పని చేయండి అని సూచించారు. ఫ్రెండ్లీ ప్రభుత్వమే కానీ.. ప్రతీ నాలుగు నెలలకు ఒకసారి గ్రామ సభలపై సమీక్షలు ఉంటాయి. ప్రభుత్వం చాలా ఓపెన్ మైండ్తో ఉంది. అధికారులు ఇచ్చే సలహాలు, సూచనలు కూడా ప్రభుత్వం తీసుకుంటుంది. ఎస్ఆర్ శంకర్ను ఆదర్శంగా తీసుకుని ప్రతీ ఒక్క అధికారి విధులను నిర్వర్తించాలి. మాది ఫ్రెండ్లీ గవర్నమెంట్ ప్రజల చేత ఫ్రెండ్లీగా ఉన్నంతవరకే ఫ్రెండ్లీ గవర్నమెంట్. అధికారులు సంక్షేమం అమలులో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠినంగా వ్యవహరించాల్సి ఉంటుంది. అధికారులు ప్రజల మనసును గెలిచి మంచి పేరు తెచ్చుకోవాలి. అధికారులు ఎలాంటి పరిస్థితుల్లోనైనా, ఎక్కడైనా పని చేయగలను అన్న ఆలోచనలో ఉండాలి. అధికారులకు మానవీయ కోణం అనేది ఉండాలి. తెలంగాణ రాష్ట్ర సాధనలో ఎంతోమంది అమరులయ్యారు. తెలంగాణ ప్రజల డీఎన్ఏ స్వేచ్ఛను హరిస్తే సహించదు. ప్రజల స్వేచ్ఛను హరిస్తే ఎంతటి వారైనా ఇంటికి పోవాల్సిందే. ప్రభుత్వంపై ప్రజల్లో విశ్వాసం కలిగేలా మనందరం కలిసి పని చేద్దాం అని సూచించారు. -
కలెక్టర్లు, ఎస్పీలు, జాయింట్ కలెక్టర్లతో సీఎం రేవంత్ సమావేశం
-
TS: కలెక్టర్లతో భేటీ.. సీఎం కీలక వ్యాఖ్యలు
సాక్షి,హైదరాబాద్: ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత సీఎం రేవంత్రెడ్డి తొలిసారి కలెక్టర్లతో సమావేశమయ్యారు. సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, ప్రభుత్వ పధాన కార్యదర్శి శాంతికుమారి, తదితర ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్లు ఎస్పీలు పాల్గొన్నారు. ఈ సమావేశంలో సీఎస్ శాంతికుమారి ప్రారంభోపన్యాసం చేశారు. కలెక్టర్ల సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ‘ఈనెల 28 నుంచి 6 వ తేదీ వరకు రాష్ట్రంలో ప్రజాపాలన నిర్వహిస్తున్నాం. రాష్ట్రంలోని అన్ని గ్రామాలు, మున్సిపల్ వార్డులలో గ్రామ సభలు నిర్వహిస్తాం. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం.2 గంట వరకు, తిరిగి మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సభలు నిర్వహిస్తాం’అని తెలిపారు. ప్రజా పాలనను అందించడంపైనే ఈ సమావేశంలో ప్రధానంగా సీఎం కలెక్టర్లతో చర్చిస్తున్నారు. జనవరి నెలాఖరు వరకు పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉన్నందున ఆరు గ్యారెంటీలను వీలైనంత త్వరగా అమలు చేసే విషయంలో సీఎం కలెక్టర్లకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఇదీచదవండి..ఆసక్తి రేపుతున్న బీఆర్ఎస్ ‘స్వేద పత్రం’.. కాసేపట్లో రిలీజ్ -
కాసేపట్లో కలెక్టర్లు, ఎస్పీలు, జాయింట్ కలెక్టర్లతో సీఎం రేవంత్ భేటీ
-
నేడు కలెక్టర్లు, ఎస్పీల సదస్సు
సాక్షి, హైదరాబాద్: అధికారంలోకి రాగానే ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని క్షేత్రస్థాయికి తీసుకెళ్లాలని నిర్ణ యించింది. ఇందులో భాగంగా తొలిసారిగా ఆదివా రం సచివాలయంలో కలెక్టర్లు, ఎస్పీలు, జాయింట్ కలెక్టర్ల సదస్సు నిర్వహించనుంది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతోపాటు మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొననున్నారు. ధరణి సహా ప్రభుత్వ ప్రాధాన్యతలు, ఆరు హామీల అమలుకు తీసుకోవాల్సిన చర్యలపై ఈ భేటీలో ప్రధానంగా సీఎం దిశానిర్దేశం చేయనున్నారు. ప్రజాసమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్య ల గురించి అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వ నున్నారు. ఇప్పటికే హైదరాబాద్లో ప్రారంభించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రతి మంగళ, శుక్రవా రాల్లో నిర్వహిస్తుండగా అదే విధానాన్ని జిల్లా, డివిజన్, మండల, గ్రామ స్థాయికి తీసుకెళ్లాలని ముఖ్యమంత్రి స్పష్టం చేయనున్నారు. కలెక్టర్ల నుంచి ఫీడ్బ్యాక్ సేకరణ.. వంద రోజుల్లో ఆరు గ్యారంటీల హామీని అమలు చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలతోపాటు పాలన ను ప్రజల ముంగిటకు ఎలా తీసుకెళ్లాలన్న అంశాన్ని కూడా ఈ సమావేశంలో సీఎం రేవంత్ వివరించనున్నారు. ఆరు గ్యారంటీల్లో భాగంగా మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, పేదలకు కల్పిస్తున్న ఆరోగ్యశ్రీ వైద్య సదుపాయాన్ని రూ. 5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచగా వాటికి సంబంధించి కలెక్టర్ల నుంచి ప్రభుత్వం ఫీడ్బ్యాక్ తీసుకొనే అవకాశం ఉంది. 28 నుంచి జనవరి 6 వరకు ప్రజాపాలన గ్రామ సభలు.. నిరుపేదలు, అట్టడుగు వర్గాలకు ప్రభుత్వ ఫలాలు దక్కేలా పాలనా యంత్రాంగాన్ని గ్రామస్థాయికి తీసుకెళ్లడంతోపాటు ప్రభుత్వ పనితీరును మరింత మెరుగుపరచడం, అధికార యంత్రాంగంలో జవా బుదారీతనాన్ని పెంపొందించేందుకు ప్రజాపాలన కార్యక్రమాన్ని చేపట్టనుండటంతో ఈ సమావేశానికి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లను కూడా ప్రభు త్వం ఆహ్వానించింది. హైదరాబాద్లోని ప్రజా భవ న్లో వారానికి రెండు రోజులపాటు నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమంలో ఇళ్లు, భూ సమస్యలు, ఉద్యోగాలు, ధరణి, పెన్షన్లకు సంబంధించి ఎక్కు వగా ఫిర్యాదులు వస్తున్నందున వాటిని క్షేత్రస్థాయి లో పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రజాపాలన పేరిట గ్రామ సభలకు మొగ్గు చూపిందని చెబుతున్నారు. ఈ నెల 28 నుంచి జనవరి 6 వరకు (ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు.. తిరిగి మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు) ప్రజాపాలన కార్యక్రమాన్ని ఎలా నిర్వహించాలి? ప్రజల నుంచి తీసుకోవాల్సిన దరఖాస్తులు, అర్హుల ఎంపిక.. అందుకు అనుసరించాల్సిన మార్గదర్శకాలను సీఎం రేవంత్రెడ్డి ఈ సందర్భంగా కలెక్టర్లకు వివరించనున్నట్లు సమాచారం. కాగా, ప్రజలు తమ సమస్యలను ఆన్లైన్ ద్వారా సైతం ఫిర్యాదు చేసేందుకు వీలుగా ఈ నెల 27న ప్రజావాణి వెబ్సైబ్ను అందుబాటులోకి తేవాలని సీఎం రేవంత్రెడ్డి అధికారులను ఆదేశించారు. అలాగే ప్రతి 4 నెలలకోసారి గ్రామ సభలను నిర్వహించాలన్నారు. ప్రజాప్రతినిధులంతా పాల్గొనేలా.. గ్రామ సభల్లో భాగంగా అన్ని గ్రామ పంచాయి తీలు, మున్సిపల్ వార్డులలో రోజుకు రెండు చోట్ల అధికార బృందాలు పర్యటిస్తాయి. ప్రజాపాలన కార్యక్రమానికి స్థానిక సర్పంచ్ / కార్పొరేటర్ / కౌన్సిలర్లను ఆహ్వానించడంతోపాటు సంబంధిత ప్రజాప్రతినిధులందరూ విధిగా పాల్గొనేలా ప్రభుత్వం చర్యలు తీసు కోనుంది. గ్రామ సభల్లో వచ్చిన ప్రతి దరఖా స్తును పరిశీలించడానికి ప్రత్యేకమైన నంబర్ ఇవ్వడంతోపాటు దరఖాస్తులను కంప్యూటరీ కరించనుంది. -
AP: రెండో రోజు జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సీఈసీ బృందం భేటీ
సాక్షి, విజయవాడ: జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో రెండో రోజు సీఈసీ బృందం సమావేశం కొనసాగుతోంది. సీనియర్ డిప్యూటీ ఎన్నికల కమిషనర్ ధర్మేంద్ర శర్మ ఆధ్వర్యంలో కేంద్ర ఎన్నికల బృందం సమీక్ష జరుపుతోంది. మొదటి రోజు ఎన్నికల సన్నద్దతపై 18 జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. నేడు సీఈసీ బృందానికి ఎన్నికల సన్నద్దతపై నంద్యాల, కర్నూలు, సత్యసాయి, అనంత, ఎన్టీఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. జిల్లాల వారీగా ఓటర్ల జాబితా, ఎన్నికల నిర్వహణ సన్నద్ధత, రీపోలింగ్ కేంద్రాల పరిస్ధితి, భద్రతా చర్యలు, బందోబస్తు తదితర వాటిపై సమీక్ష చేయనున్నారు. చెక్ పోస్టులు.. తనిఖీ కేంద్రాల ఏర్పాటుపై సీఈసీ బృందం ఆరా తీస్తోంది. సమస్యాత్మక.. సున్నిత ప్రాంతాల్లో భద్రతాపై సమీక్ష చేపట్టారు. ఓటర్ల జాబితాలో అవకతవకలు ఎక్కువగా ఉన్న జిల్లాలపై నిరంతరం పర్యవేక్షణ పెట్టాలని సీఈఓకు కేంద్ర బృందం సూచించింది. ఓటర్ల జాబితాలో అవకతవకలను చాలా సీరియస్గా తీసుకుంటామని తొలి రోజు సమావేశంలో సీఈసీ బృందం హెచ్చరించింది. రాజకీయ పార్టీల ఫిర్యాదులపైనా సమీక్షించిన కేంద్ర ఎన్నికల బృందం.. బోగస్ ఓట్లు, డబుల్ ఎంట్రీలపై ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారనే దానిపై వివరాలు తెలుసుకుంది. మధ్యాహ్నం సీఎస్, డీజీపీలతో పాటు ఎన్నికలతో సంబంధం ఉండే కేంద్ర, రాష్ట్ర ఉన్నతాధికారులతోనూ ఈసీ బృందం భేటీ కానుంది. -
పేదవాడికి ఖరీదైన వైద్యం అందిస్తున్నాం
-
అయిదుగురు కలెక్టర్లకు ఈడీ నోటీసులపై హైకోర్టు స్టే
చెన్నై: తమిళనాడులోని అయిదు జిల్లాల కలెక్టర్లకు మద్రాస్ హైకోర్టులో ఊరట లభించింది. తమ అధికార పరిధిలోని ఇసుక అక్రమ తవ్వకాల కేసులో అయిదు జిల్లాల కలెక్టర్లకు కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) జారీ చేసిన నోటీసులపై మద్రాస్ హైకోర్టు స్టే విధించింది. మూడు వారాలపాటు అయిదుగురు కలెక్టర్లపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని, విచారణకు పిలవవద్దని తెలిపింది. ఈ మేరకు జస్టిస్ ఎస్ఎస్ సుందర్, జస్టిస్ సుందర్ మోహన్తో కూడిన ద్విసభ్య ధర్మాసనం మంగళవారం తీర్పు వెల్లడించింది. అయితే రాష్ట్రంలో ఇసుక తవ్వకాలపై ఈడీ తన విచారణను కొనసాగించవచ్చని ధర్మాసనం పేర్కొంది. కాగా రాష్ట్రంలో ఇసుక తవ్వకాల ద్వారా రూ. 4,500 కోట్లు చేతులు మారినట్లు ఈడీ నిర్ధారించింది. హవాలా లావాదేవీలు, షెల్ కంపెనీలతో సహా పలు రహస్య మార్గాల ద్వారా అక్రమ నిధులు దారి మళ్లించినట్లు పేర్కొంది. ఈ కేసులో భాగంగా తమ అధికార పరిధిలో ఇసుక మైనింగ్ కార్యకలాపాలకు సంబంధించి అరియలూరు, వేలూరు, తంజావూరు, కరూర్, తిరుచిరాపల్లి జిల్లాల కలెక్టర్లకు ఈడీ నోటీసులు జారీ చేసింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కింద దర్యాప్తు సంస్థ ఈ సమన్లు జారీ చేసింది. చదవండి: Uttarakhand: రెస్క్యూ బృందాలకు 3 మీటర్ల దూరంలో కార్మికులు ఆయా జిల్లాల్లో ఇసుక తవ్వకాలకు సంబంధించిన వివరాలతో వివిధ తేదీల్లో వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. ఈడీ నోటీసులను సవాల్ చేస్తూ కలెక్టర్ల తరపున రాష్ట్ర ప్రభుత్వ శాఖ కార్యదర్శి కె. నంతకుమార్ మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈడీ సమన్లను రద్దు చేయాలని తన పిటిషన్లో కోరారు. దీనిపై తొలుత సోమవారం విచారించిన ధర్మాసనం.. ఈడీ సమన్లపై నేడు మధ్యంతర స్టే విధించింది. తదుపరి విచారణను డిసెంబర్ 21కి బెంచ్ వాయిదా వేసింది. కాగా ఈడీ నేరుగా జిల్లా కలెక్టర్లకు నోటీసులు ఇచ్చే అధికారం లేదని తమిళనాడు ప్రభుత్వం వాదిస్తోంది. ఈ విషయంలో సహయం కోసం రాష్ట్ర ప్రభుత్వాన్ని మాత్రమే ఈడీ అభ్యర్థించగలదని పేర్కొంది. ఈడీకి అపరిమిత అధికారం పార్లమెంట్ ఇవ్వలేదని చెబుతూ.. రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేకుండా ఇలాంటి నేరాలను దర్యాప్తు చేసే అధికారం ఈడీకి లేదని తెలిపింది. ఇదిఫెడరలిజానికి విరుద్దని పేర్కొంది. అయితే ఇసుక అక్రమ రవాణా కేసులో ప్రైవేట్ వ్యక్తులతో ప్రభుత్వ అధికారులను విచారణకు పిలిచినట్లు దర్యాప్తు సంస్థ చేబుతోంది. మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) విచారణకు సంబంధించి ఎవరికైనా సమన్లు ఇచ్చే అధికారం తమకు ఉందని పేర్కొంది. -
పేదల ఇళ్లకు పావలా వడ్డీకే రుణాలు
సాక్షి, అమరావతి: ప్రభుత్వం మంజూరు చేసిన ఇళ్లను సొంతంగా నిర్మించుకుంటున్న లబ్ధిదారులకు ఆర్థిక వెసులుబాటు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పావలా వడ్డీకే బ్యాంకుల ద్వారా రుణాలు మంజూరు చేయిస్తోంది. ఇప్పటికే ఇళ్ల లబ్ధిదారుల్లో 79 శాతం మందికి పావలా వడ్డీకే బ్యాంకుల ద్వారా రుణాలు మంజూరు చేయించింది. ఒక్కో ఇంటి నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.1.80 లక్షలు ఇస్తుండగా.. ఈ మొత్తానికి అదనంగా ఒక్కో లబ్ధిదారుకు రూ.35 వేల చొప్పున పావలా వడ్డీకి రుణాలు మంజూరు చేయిస్తోంది. లబ్ధిదారులకు ఉచితంగానే ఇసుక సరఫరా చేస్తున్న ప్రభుత్వం ఇంటికి అవసరమైన ఇతర సామగ్రిని తక్కువ ధరకే సరఫరా చేస్తోంది. రాష్ట్రంలో మొత్తం 16,06,301 మంది లబ్ధిదారులు సొంతంగా ఇళ్ల నిర్మాణాలు చేపట్టగా.. ఇందులో 12,61,203 మందికి పావలా వడ్డీకి రూ.4,443.13 కోట్ల రుణాన్ని బ్యాంకులు మంజూరు చేశాయి. ఇళ్ల స్థలాలతో పాటు ఇళ్లు మంజూరు మహిళల పేరుతో చేసినందున పావలా వడ్డీ రుణాలు మహిళల పేరుమీదే ఇస్తున్నారు. నిర్మాణాలపై సీఎస్ సమీక్ష ఇటీవల కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో పేదల ఇళ్ల నిర్మాణాల పురోగతిపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్రెడ్డి సమీక్షించారు. వర్షాకాలం ముగిసిన దృష్ట్యా ఇళ్ల నిర్మాణాలను మరింత వేగంగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశించారు. ప్రతి వారం ఎన్ని ఇళ్లు పూర్తి చేయాలనేది లక్ష్యంగా నిర్ణయించుకుని.. ఆ లక్ష్యాలను సాధించేలా చర్యలు తీసుకోవాలన్నారు. కలెక్టర్లు తరచూ ఇళ్ల నిర్మాణాల పురోగతిని సమీక్షించాలని సూచించారు. పావలా వడ్డీ రుణాలు మంజూరు చేయించడంపై శ్రీకాకుళం, ఎన్టీఆర్, చిత్తూరు, నెల్లూరు, విశాఖ జిల్లా కలెక్టర్లు మరింత దృష్టి సారించాలని సీఎస్ ఆదేశించారు. వెనుకబడిన జిల్లాల్లో మరింత దృష్టి లబ్ధిదారులకు మరింత ఆర్థిక వెసులుబాటు కల్పించేలా బ్యాంకుల ద్వారా పావలా వడ్డీకే రుణాలు మంజూరు చేస్తున్నామని గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక సీఎస్ అజయ్జైన్ చెప్పారు. ఇటీవల కలెక్టర్లతో నిర్వహించిన సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్రెడ్డి ప్రత్యేక సూచనలు ఇచ్చారన్నారు. పావలా వడ్డీ రుణాలు మంజూరులో నాలుగైదు జిల్లాలు వెనుకబడగా.. ఆయా కలెక్టర్లు ఈ అంశంపై ప్రత్యేక దృష్టి సారించాలని ప్రధాన కార్యదర్శి ఆదేశించారన్నారు. ఇప్పటికే ఐదు లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసినందున అదే స్ఫూర్తితో రెండో దశలో మరో ఐదు లక్షల ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసేందుకు వారం వారం లక్ష్యాలను నిర్థేశించుకోవాలని జైన్ పేర్కొన్నారు. -
కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు... దేవుళ్లం అనుకుంటున్నారు
అహ్మదాబాద్: కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు తమను తాము దేవుళ్లుగా భావించుకుంటున్నారంటూ అలహాబాద్ హైకోర్టు మండిపడింది. వాళ్లు సాధారణ ప్రజలకు అందుబాటులో లేకుండా పోతున్నారంటూ ఆవేదన వెలిబుచ్చింది. అహ్మదాబాద్లో రాత్రిపూట వెళ్తున్న ఓ జంట నుంచి ట్రాఫిక్ పోలీసులు బెదిరించి డబ్బుల వసూలు చేశారంటూ వచి్చన వార్తలను కోర్టు సుమోటోగా విచారణకు స్వీకరించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సునీతా అగర్వాల్, న్యాయమూర్తి జసిస్ అనిరుద్ధ పి.మాయీ ధర్మాసనం దీనిపై శుక్రవారం జరిపింది. ఈ సందర్భంగా తీవ్ర వ్యాఖ్యలు చేసింది. పోలీసులపై ఫిర్యాదు చేసేందుకు ఉద్దేశించిన హెల్ప్లైన్ను కలెక్టర్ కార్యాలయంలో మాత్రమే ఉంచడాన్ని తీవ్రంగా తప్పుబట్టింది. ‘‘పోలీసులపై ఫిర్యాదు చేయాలంటే సామాన్యులు మీ కార్యాలయాల ముందు వరుస కట్టాలా? వారిని లోపలికి అనుమతించేదెవరు? మామూలు జనానికి పోలీస్ స్టేషన్లో కాలు పెట్టడమే కష్టం. ఇక పోలీస్ కమిషనర్, కలెక్టర్ కార్యాలయాల్లోకి వెళ్లడమైతే దాదాపుగా అసాధ్యం! మీ కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు దేవుళ్లలా, రాజుల మాదిరిగా ప్రవర్తిస్తారు. ఇవన్నీ క్షేత్రస్థాయి వాస్తవాలు. ఇంతకుమించి మాట్లాడేలా మమ్మల్ని రెచ్చగొట్టొద్దు’’అని జస్టిస్ అగర్వాల్ అన్నారు. పోలీసులపై ఫిర్యాదులకు గ్రీవెన్స్ సెల్తో పాటు హెల్ప్లైన్ నంబర్ ఏర్పాటు చేయాలని, అందరికీ తెలిసేలా దాన్ని ప్రచారం చేయాలని గత విచారణ సందర్భంగా జారీ చేసిన ఆదేశాలు అమలు కాకపోవడంపై ధర్మాసనం అసంతృప్తి వెలిబుచ్చింది. -
వరద బాధిత ప్రాంతాల్లో పర్యటిస్తాను: సీఎం జగన్
సాక్షి, గుంటూరు: వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటన ఖరారు అయ్యింది. ఆగష్టు 7, 8 తేదీల్లో ఆయన పర్యటించనున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే ప్రకటించారు. వరద ప్రభావిత జిల్లాలైన అల్లూరిసీతారామరాజు, ఏలూరు, ప.గో, తూ.గో, అంబేద్కర్ కోనసీమ జిల్లాల కలెక్టర్లతో గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారాయన. ఈ సందర్భంగా.. సహాయ, పునరావాస కార్యక్రమాలు సమర్థవంతంగా జరగాలని కలెక్టర్లను ఆదేశించారాయన. ‘‘ఎక్కడా కూడా విమర్శలకు తావులేకుండా చూడాలి. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విపత్తుల సమయంలో కలెక్టర్లు సహా, అధికారులకు ముందస్తుగా నిధులు విడుదల చేస్తున్నాం. అవసరమైన వనరులను సమకూరుస్తూ మిమ్మల్ని ఎంపవర్ చేస్తున్నాం. టిఆర్-27 నిధులను సకాలంలో విడుదల చేస్తున్నాం. సహాయ, పునరావాస చర్యలు సమర్థవంతంగా చేపట్టేలా అన్నిరకాలుగా ప్రభుత్వం తోడుగా నిలిచింది. దీనితర్వాత, ఈ పనులు చేయడానికి కొంత సమయం ఇస్తున్నాం. ఆ తర్వాత నేను స్వయంగా వచ్చి ఆయా ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో మీరు సహాయ పునరావాస కార్యక్రమాలు ఏరకంగా చేపట్టారో స్వయంగా పరిశీలిస్తున్నాను. బాధితులను అడిగి వివరాలు తెలుసుకుంటున్నాను. ఈసారికూడా నేను వస్తాను, క్షేత్రస్థాయిలో మీరు చేపట్టిన చర్యలు, అందించిన సహాయంపై సమీక్ష చేస్తాను అని ఆయన అధికారులకు తెలిపారు. ఉదారంగా వ్యవహరించండి వరద సహాయ కార్యక్రమాల్లో ఉదారంగా వ్యవహరించండి. మనం ఆ పరిస్థితుల్లో ఉంటే ఎలాంటి సహాయం కోరుతామో అలాంటి సహాయమే అందించాలి. ఇంట్లోకి వరదనీరు వచ్చినా, అలాగే వరద కారణంగా సంబంధాలు తెగిపోయిన వారికి కచ్చితంగా నిర్ణయించిన రేషన్ అందించాలి. దీంతోపాటు తాగునీరు కూడా అందించాలి. ఈ సహాయం అదని వరద బాధిత కుటుంబం ఉండకూడదు. సహాయ శిబిరాల్లో ఉండి, వారు తిరిగి ఇళ్లకు వెళ్లేటప్పుడు ప్రతి కుటుంబానికి రూ.2000, వ్యక్తులైతే రూ.1000లు ఇచ్చి పంపించాలి. కలెక్టర్లు బాగా చూసుకున్నారనే మాట వినిపించాలి అని అధికారులతో సీఎం జగన్ అన్నారు. ► వరద కారణంగా కచ్చా ఇల్లు పాక్షికంగానైనా, పూర్తిగా నైనా ధ్వంసం అయితే ఎట్టిపరిస్థితుల్లోనూ వర్గీకరణ చేయొద్దు. వారందరికీ కూడా రూ.10 వేలు చొప్పున సహాయం అందించాలి. వరదనీరు తగ్గగానే పారిశుద్ధ్య కార్యక్రమాలు కొనసాగించండి. మిగిలిన ప్రాంతాలనుంచి వరద బాధిత ప్రాంతాలకు పారిశుద్ధ్య కార్మికులను తరలించండి. వైద్యశిబిరాలను కొనసాగించండి పీహెచ్సీల్లో, విలేజ్ క్లినిక్స్లో సరిపడా మందులు ఉండేలా చూసుకోండి. పాముకాట్లకు సంబంధించిన మందులను అందుబాటులో ఉంచేలా చూసుకోండి. పంట నష్టం, ఆస్తి నష్టంపై వెంటనే ఎన్యుమరేషన్చేసి గ్రామ, వార్డు సచివాలయాల్లో సోషల్ ఆడిట్కోసం జాబితాను ఉంచండి. అత్యంత పారదర్శకంగా పంటనష్టానికి, ఆస్తి నష్టానికి సంబంధించిన పరిహారం అందించండి. ► అవసరమైన చోట వెంటనే కొత్త ఇళ్లను మంజూరు చేయండి. ఏటిగట్లమీద ఉన్నవారికి పక్కా ఇళ్లను మంజూరు చేయండి. వరద వచ్చిన ప్రతిసారి వారు ఇబ్బందిపడకుండా… వారికోసం ఇళ్లను మంజూరుచేయాల్సిన బాధ్యత కలెక్టర్లది. అలాంటి ప్రమాదకర ప్రాంతాల్లో ఉండేవారికి రక్షిత ప్రాంతంలో ఇళ్లు ఇవ్వాలి. వారికి శాశ్వతంగా పరిష్కారం చూపాల్సిన బాధ్యత మనది. అవసరమైన స్థలాన్ని సేకరించి, వారికి ఇళ్ల పట్టాలు ఇచ్చి, ఇళ్లను మంజూరు చేయండి. పోలవరం ఎగువన తరచుగా ముంపునకు గురయ్యే ప్రాంతాలకు ఆర్ అండ్ ఆర్ కార్యక్రమాల్లో ప్రాధాన్యత ఇవ్వండి. పశువులకు గ్రాసం కొరతలేకుండా చూడండి. దెబ్బతిన్న రోడ్లు, కల్వర్టులు… తదితర నిర్మాణాల విషయంలో వెంటనే మరమ్మతులు చేపట్టాలి. వరద బాధిత ప్రాంతాల్లో రక్షిత తాగునీటి సరఫరాను కొనసాగించాలి. పరిస్థితి మెరుగుపడేంతవరకూ వారికి రక్షిత తాగునీటిని అందించాలి. ► సోమ, మంగళవారాల్లో నేను వరద బాధిత ప్రాంతాల్లో పర్యటిస్తాను. వరద బాధిత ప్రాంతాలకు నేను వచ్చినప్పుడు ఈ అంశాలకు సంబంధించి ఎవ్వరూ కూడా ఫిర్యాదులు చేయకూడదు. నేను ఎక్కడకు వచ్చేదీ కొన్ని ఆదివారం సాయంత్రం సీఎంవో అధికారులు మీకు వెల్లడిస్తారు. క్షేత్రస్థాయిలో వరద బాధితులకు అందిన సహాయ, పునరావాసం కార్యక్రమాలను స్వయంగా పరిశీలిస్తాను అని కలెక్టర్లతో పేర్కొన్నారాయన. -
కలెక్టర్ల నేతృత్వంలో వీఆర్ఏల విలీనం.. మార్గదర్శకాలు జారీ
సాక్షి, హైదరాబాద్: గ్రామ రెవెన్యూ సహాయకుల (వీఆర్ఏ)ను వివిధ ప్రభుత్వ శాఖల్లో విలీనం చేసుకునే ప్రక్రియకు సంబంధించిన మార్గదర్శకాలు విడుదలయ్యాయి. భూపరిపాలన ప్రధాన కమిషనర్ నవీన్ మిత్తల్ మంగళవారం ఈ మార్గదర్శకాలతో కూడిన ఉత్తర్వులు ఇచ్చారు. వీఆర్ఏల విలీన ప్రక్రియను జిల్లా కలెక్టర్లు నిర్వహించాల్సి ఉంటుంది. ఖాళీల గుర్తింపు ప్రకటన నుంచి కేటాయింపు వరకు కలెక్టర్లే బాధ్యతలు తీసుకోవాల్సి ఉంటుంది. 61 ఏళ్లు నిండితే కారుణ్య ఉద్యోగం 61 ఏళ్లు దాటిన వీఆర్ఏల కుమారుడు లేదా కుమార్తెకు కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇచ్చేందుకు అవసరమైన మార్గదర్శకాలను కూడా ఉత్తర్వుల్లో పొందుపరిచారు. కారుణ్య ఉద్యోగం కోసం ఈ ఏడాది జూలై 31 నాటికి వీఆర్ఏ వయస్సును పరిగణనలోకి తీసుకుంటారు. ఈ నియామకాల కోసం దరఖాస్తు ఫార్మాట్ను రూపొందించారు. దీని ప్రకారం దరఖాస్తు చేసుకోవడంతో పాటు సదరు వీఆర్ఏ కూడా అఫిడవిట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇతర కుటుంబసభ్యుల నుంచి నిరభ్యంతర పత్రం (ఎన్వోసీ) సమరి్పంచాల్సి ఉంటుంది. పుట్టిన తేదీ, విద్యార్హత, కుల, నివాస ధ్రువపత్రాలు, ఆధార్ వివరాలను జత పరచాల్సి ఉంటుంది. ఈ కారుణ్య నియామకాల ప్రక్రియను జిల్లా కలెక్టర్లు ఈనెల ఐదో తేదీలోపు పూర్తి చేయాల్సి ఉంటుంది. వీఆర్ఏల విలీనం మార్గదర్శకాలివే.. తెలంగాణ స్టేట్ అండ్ సబార్డినేట్ సర్విస్ రూల్స్లోని రూల్ 10(ఏ) ప్రకారం వీఆర్ఏలను ఇతర ప్రభుత్వ శాఖల్లో విలీనం చేసుకుంటారు. ఇదే నియమం ప్రకారం కారుణ్య నియామకాలు కూడా చేపడతారు. విద్యార్హతల ఆధారంగా ప్రభుత్వ శాఖల్లోని చివరి స్థాయి సర్విసు/రికార్డు అసిస్టెంట్/జూనియర్ అసిస్టెంట్ తత్సమాన హోదాల్లో వీఆర్ఏలను రెగ్యులర్ స్కేల్ ఉద్యోగులుగా తీసుకుంటారు. జిల్లాల వారీగా వివిధ ప్రభుత్వ శాఖల్లో ఆయా హోదాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలు, ఆ జిల్లాలో విలీనం చేసుకోవాల్సిన వీఆర్ఏల సంఖ్యను కలెక్టర్లు ప్రకటించాలి.వాటి ఆధారంగా వీఆర్ఏల విలీనం, కారుణ్య నియామకాల కోసం అవసరమైతే రెగ్యులర్ లేదా సూపర్ న్యూమరీ పోస్టులను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఆ జిల్లాలో ఉన్న ఖాళీలకు మించి వీఆర్ఏలను విలీనం చేసుకోవాల్సి వస్తే వారిని ఇతర జిల్లాలకు కూడా పంపవచ్చు. అలా పంపాల్సి వస్తే సదరు వీఆర్ఏల వివరాలను ప్రస్తుత జిల్లా కలెక్టర్ ప్రకటిస్తారు. అలా ప్రకటించిన తర్వాత సదరు వీఆర్ఏలు తమకు కేటాయించిన జిల్లా కలెక్టర్కు రిపోర్టు చేయాల్సి ఉంటుంది. ఆ జిల్లా కలెక్టర్ వీఆర్ఏను ఏదైనా శాఖలో విలీనం చేసుకుంటూ ఉత్తర్వులు జారీ చేస్తారు. అదే జిల్లాలో సర్దుబాటు చేసినా, ఇతర జిల్లాలకు పంపినా కలెక్టర్ కేటాయింపు ఉత్తర్వులు వెలువడిన వెంటనే తహసీల్దార్లు వీఆర్ఏలను రిలీవ్ చేయాల్సి ఉంటుంది. ఏ శాఖలకు పంపితే ఆయా శాఖల సర్వీసు రూల్స్ వీఆర్ఏలకు వర్తిస్తాయి. ఒక్కసారి కేటాయించిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ మార్పు ఉండదు. తమను మార్చాలంటూ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసుకునే అవకాశం కూడా ఉండదు. కేటాయింపు ఉత్తర్వులు వెలువడిన వెంటనే వీఆర్ఏలు సంబంధిత అధికారికి రిపోర్టు చేయాలి. ఆ అధికారి బేషరతుగా వారిని విధుల్లోకి తీసుకుని పోస్టింగు ఉత్తర్వులు ఇవ్వాల్సి ఉంటుంది. తహసీల్దార్లను వెంటనే రిలీవ్ చేయండి కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా మల్టిజోన్లలోని ఇతర జిల్లాలకు బదిలీ అయిన తహసీల్దార్లను వెంటనే రిలీవ్ చేయాలని సీసీఎల్ఏ నవీన్ మిత్తల్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇతర జిల్లాల నుంచి వచ్చే తహసీల్దార్లను విధుల్లోకి తీసుకోవాలని, ఈసీఐ నిబంధనలకు అనుగుణంగా డిక్లరేషన్లు కూడా పొందుపర్చాలని స్పష్టం చేశారు. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 410 మందికి పైగా తహసీల్దార్లు గత నెల 31న బదిలీ అయిన విషయం తెలిసిందే. ఇలావుండగా తహసీల్దార్ నుంచి డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతులు పొందిన మరో 9 మందికి మంగళవారం పోస్టింగులిస్తూ రెవెన్యూ ముఖ్య కార్యదర్శి హోదాలో నవీన్ మిత్తల్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. -
భారీ వర్షాలపై సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్.. కలెక్టర్లకు కీలక ఆదేశాలు
సాక్షి, అమరావతి: భారీ వర్షాలపై కలెక్టర్లతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష చేపట్టారు. అల్లూరి సీతారామరాజు, ఏలూరు, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, అంబేద్కర్ కోనసీమ జిల్లాలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రేపు భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 53.81 అడుగులకు చేరుకునే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ధవళేశ్వరం వద్ద కూడా వరద ప్రవాహం సుమారు 16 లక్షలకు చేరుకునే అవకాశాలు ఉన్నట్టుగా అంచనా వేస్తున్నారు. గత ఏడాది గోదావరిలో 26 లక్షల క్యూసెక్కులకుపైగా వరద ప్రవాహం చూశాం. కలెక్టర్లు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి’’ అని సీఎం ఆదేశించారు. వరద ప్రభావం ఉన్న ప్రాంతాల్లో సహాయ పునరావాసం కార్యక్రమాలు అత్యంత సమర్థవంతంగా సాగాలి. అధికారులు మానవీయ కోణంలో సహాయం అందించాలి. ఒక్క రూపాయి అదనంగా ఖర్చు చేసినా, బాధితులకు అండగా ఉండాలి. కలెక్టర్లు మాకు మంచి చేశారు అన్న మాటే వినిపించాలి. అధికారులు ఈ విషయాన్ని మనసులో పెట్టుకోవాలి. లోతట్టు ప్రాంతాల ప్రజలకు ఇప్పటికే ఖాళీలు చేశారు. అవసరం అనుకుంటే.. పరిస్థితిని అంచనా వేసుకుని మిగిలిన ప్రజలను కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించాలి. సహాయ శిబిరాల్లో మంచి సదుపాయాలు కల్పించాలి’’ అని సీఎం అన్నారు. ‘‘శిబిరాల్లో అధికారులు ఉంటే.. ఎలాంటి సదుపాయాలు కావాలనుకుంటారో అలాంటి సదుపాయాలన్నీ కూడా కల్పించాలి. సహాయ శిబిరాల నుంచి తిరిగి ఇళ్లకు పంపించేటప్పుడు ప్రతి కుటుంబానికి రూ.2 వేల రూపాయలు ఇవ్వండి. వ్యక్తులైతే వారికి రూ.1000లు ఇవ్వండి. కచ్చా ఇళ్ల విషయంలో కలెక్టర్లు మానవీయ దృక్పథంతో ఉండాలి. ఆయా ఇళ్ల నుంచి సహాయ శిబిరాలకు వచ్చిన వారిని వారిని తిరిగి పంపించేటప్పుడు వారికి రూ.10 వేల రూపాయలు ఇవ్వాలి. తిరిగి కచ్చా ఇంటిని నిర్మించుకోవడానికి వారికి ఉపయోగపడుతుంది. కచ్చా ఇంటి విషయంలో పాక్షికంగా దెబ్బతిందా? లేక పూర్తిగా దెబ్బతిందా? అన్న వర్గీకరణ వద్దు. వాళ్లు ఉండేదే కచ్చా ఇళ్లు అయినప్పుడు వర్గీకరణ అనవసరం’’ అని సీఎం స్పష్టం చేశారు. చదవండి: మొసలికన్నీరు.. ఈనాడుకు ఆ దమ్ముందా? అలాంటి వారికి రూ.10 వేల ఆర్థిక సహాయం ఇస్తే.. తిరిగి ఆ కచ్చా ఇంటిని మరమ్మతు చేసుకోవడానికి, తిరిగి కట్టుకోవడానికి ఉపయోగపడుతుంది. అలాంటి వారి జీవితాలపై మరింత భారం పడేలా వ్యవహరించకూడదు. అందుకే మానవీయ దృక్పథంతో వ్యవహరించాలని కలెక్టర్లను కోరుతున్నాను. ఇలాంటి సమయాల్లో వారికి బాసటగా నిలిచామనే మాట రావాలి. అలాగే ముంపునకు గురైన ఇళ్లు, అలాగే వరదనీరు ప్రవహించిన ఇళ్లు ఉన్న ప్రాంతాల్లో నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలి. ఉదారంగా నిత్యావసరాలను పంపిణీ చేయాలి. 25 కేజీల బియ్యం, కేజీ ఉల్లిపాయలు, కేజీ బంగాళా దుంపలు, కేజీ పామాయిల్, కేజీ కందిపప్పు ఇవ్వాలి’’ అని సీఎం పేర్కొన్నారు. ఈ నాలుగు సంవత్సరాల్లో ప్రతి ఏడాది కూడా ఇలాంటి పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొంటున్నాం. కంట్రోలు రూమ్స్ ఏర్పాటు చేయడం, జిల్లా స్థాయి నుంచి మండల స్థాయి వరకూ కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేయాలి. సచివాలయ స్థాయిలో కూడా కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేయండి. సచివాలయాల సిబ్బందిని, వాలంటీర్ల సేవలను పూర్తిగా వినియోగించుకోండి. ముంపు బాధిత గ్రామాల మీద, లంకల మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టండి. ఆయా ప్రాంతాల్లో నిత్యావసర వస్తువులు సరిపడా నిల్వ ఉండేలా చూసుకోవాలి. లంక గ్రామాలలో జనరేట్లర్లు లాంటి వాటిని సిద్ధం చేసుకోండి’’ అని సీఎం సూచించారు. చదవండి: ఇదో కార్పొరేట్ ఫ్రాడ్.. మార్గదర్శి మోసాలపై ఏపీ సీఐడీ కీలక ప్రెస్మీట్ తాగు నీటి కొరత లేకుండా, తాగునీటి సరఫరా వ్యవస్థలు నిలిచి పోకుండా తగిన చర్యలు తీసుకోండి. తాగునీటి ప్యాకెట్లను సిద్ధంచేసుకోండి. పారిశుద్ధ్య కార్యక్రమాలు ఆయా గ్రామాల్లో ముమ్మరంగా చేపట్టండి. అలాగే ఆరోగ్య శిబిరాలను కూడా ఏర్పాటు చేయండి. విలేజ్ క్లినిక్స్, పీహెచ్సీల్లో సరిపడా మందులను ఏర్పాటు చేసుకోండి. దీనిపై అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించుకోవాలి. వరదల కారణంగా పాముకాట్లు పెరుగుతాయి, వీటికి అవసరమైన మందులను అందుబాటులో చేసుకోండి. వరదనీరు తగ్గాక పంట నష్టం వివరాలను నమోదు చేసుకుని రైతులకు బాసటగా నిలిచేలా చర్యలు తీసుకోవాలి. అత్యంత పారదర్శకత పద్ధతిలో ఎన్యుమరేషన్ జరగాలి’’ అని సీఎం జగన్ ఆదేశించారు. -
విద్యార్థుల వివరాలు ఆన్లైన్లో నమోదు చేయాలి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో బడి బయట పిల్లలను పాఠశాలల్లో చేర్పించడంతోపాటు అన్ని యాజమాన్యాల్లోని విద్యార్థుల వివరాలను స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ పోర్టల్లో నమోదు చేసేలా కలెక్టర్లు, డీఈవోలు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ ఆదేశించారు. ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ పాఠశాలల యాజమాన్యాలు అందించిన విద్యార్థుల వివరాలను అధికారులు తనిఖీ చేసి ధ్రువీకరించాలన్నారు. ఇప్పటికే వలంటీర్లు చేసిన సర్వే ప్రకారం18 లక్షల మంది విద్యార్థుల పేర్లు ఇంకా స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ పోర్టల్లో అప్డేట్ కాలేదన్నారు. గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో ప్రారంభించి బుధవారానికి వంద రోజులు అవుతున్నందున అన్ని స్కూళ్ల హెచ్ఎంలు అప్లోడ్ చేసేలా కలెక్టర్లు తీసుకోవాలన్నారు. విద్యార్థుల వివరాలు అప్లోడ్ చేయకుంటే కఠిన చర్యలు తప్పవని మంగళవారం ఓ ప్రకటనలో హెచ్చరించారు. -
మహిళా అధికారులు.. వరదలకు ఎదురు నిలిచి ధీరత్వం ప్రదర్శించారు
పంజాబ్ నుంచి హిమాచల్ ప్రదేశ్ వరకు మహిళా ఆఫీసర్ల ధైర్యగాధలు మార్మోగుతున్నాయి. ఇటీవలి పెను వరదల్లో చిక్కుకున్నవారిని కాపాడటంలో మహిళా కలెక్టర్లు, ఎస్పిలు రేయింబవళ్లు కష్టపడి ధీరత్వాన్ని ప్రదర్శించారు. చంటి పిల్లల్ని ఇళ్లల్లో వదిలి ప్రజల కోసం రోజుల తరబడి పని చేసిన ఈ ఆఫీసర్ల పరిచయం... ఉత్తర భారతాన్ని వానలు, వరదలు చుట్టుముట్టాయి. పంజాబ్ నుంచి హిమాచల్ ప్రదేశ్ వరకూ కుంభవృష్టి ముంచెత్తింది. నదులు వెర్రెత్తి ఫ్రవహించాయి. కొండ చరియలు విరిగి పడ్డాయి. గిరి వృక్షాలు కూకటివేళ్లతో సహా పెకలించుకుని వరదనీటిలో అడ్డొచ్చినవాటిని ధ్వంసం చేసుకుంటూ ముందుకు సాగాయి. కార్లు అగ్గిపెట్టెల్లా చెల్లాచెదురయ్యాయి. ప్రాణాలకు ప్రమాదం వచ్చి ఏర్పడింది. ఇలాంటి సమయాల్లో బయటకు అడుగు పెట్టడమే కష్టం. కాని ఈ సందర్భాలను సమర్థంగా ఎదుర్కొని ప్రశంసలు పొందారు మహిళా అధికారులు. ప్రకృతి విసిరే సవాళ్లకు తాము జవాబు చెప్పగలమని నిరూపించారు. సహాయక బృందాలను సమాయత్త పరచడం, లోతట్టు ప్రాంతాలను ఖాళీ చేయించడం, వరదల్లో చిక్కుకున్నవారిని సురక్షితంగా తరలించడం ఈ పనుల్లో స్వయంగా పాల్గొంటూ రేయింబవళ్లు పని చేశారు. అందుకే వారిని జనం మెచ్చుకుంటున్నారు. కృతజ్ఞతలు చెబుతున్నారు. పాటియాలా కలెక్టర్ ఉత్తర భారతానికి పెను వర్షగండం ఉందని వార్తలొచ్చాక ఆ గండం పంజాబ్లో పాటియాలా జిల్లాకు కూడా వచ్చింది. జూలై 9, 10 తేదీల్లో పాటియాలా జిల్లా వరదల్లో చిక్కుకుంది. ఆ జిల్లా కలెక్టర్ సాక్షి సహానె వెంటనే రంగంలో దిగింది. ఆమెకు మూడేళ్ల కుమార్తె ఉంది. ఆ కుమార్తె బాగోగులు తన తల్లిదండ్రులకు అప్పజెప్పి దాదాపు 7 రోజులు ఇంటికే వెళ్లకుండా జిల్లా అంతటా తిరుగుతూ ప్రజలను కాపాడింది సాక్షి సహానె. ముఖ్యంగా ఎగువన ఉన్న మొహాలీ జిల్లా నుంచి వరద నీరు పాటియాలాలోని సట్లజ్ యమున లింక్ కెనాల్కి చేరడంతో ఒక్కసారిగా వరద చండీగడ్–పాటియాలా హైవేపై ఉన్న రాజ్పుర ప్రాంతానికి వచ్చేసింది. అక్కడే చిత్కారా యూనివర్సిటీ, నీలమ్ హాస్పిటల్ ఉన్నాయి. రెండూ వరదలో చిక్కుకున్నాయి. ‘నీలమ్ హాస్పిటల్లో ఉన్న అందరు పేషెంట్లను, 14 మంది ఐసియు పేషెంట్లను విజయవంతంగా తరలించ గలిగాం’ అని సహానె తెలిపింది. అలాగే చిత్కారా యూనివర్సిటీలో విద్యార్థులందరూ బయటకు రాలేనంతగా వరద నీటిలో చిక్కుకున్నారు. సహానె స్వయంగా యూనివర్సిటీ దగ్గరకు వెళ్లి ఆర్మీ, ఎన్డిఆర్ఎఫ్ దళాల సహాయంతో ఆ విద్యార్థులను బయటకు తరలించారు. ‘సులూర్ అనే గ్రామంలో వరద నీటిలో చిక్కుకుని ఆహారం కోసం జనం అల్లాడుతున్నారని నాకు అర్ధరాత్రి ఫోన్ వచ్చింది. వెంటనే ఆహారం తీసుకుని ఆ వానలో వరదలో బయలుదేరాను. కారులో కూచుని ఉంటే వరద నీరు నా అద్దాల వరకూ చేరుకుంది. భయమూ తెగింపు కలిగాయి. అలాగే ముందుకు వెళ్లి ఆహారం అందించగలిగాను’ అంది సాక్షి సహానె. 2014 ఐ.ఏ.ఎస్ బ్యాచ్కు చెందిన సహానె తన చొరవ, చురుకుదనంతో పాటియాలా జిల్లా ప్రజల అభిమానం గెలుచుకుంది. కుల్లు ఎస్.పి. హిమాచల్ ప్రదేశ్లోని కుల్లు జిల్లా ఎస్.పి 28 సంవత్సరాల సాక్షి వర్మను అందరూ ‘లేడీ సింగం’ అంటారు. సిమ్లా జిల్లాలో ఆమె పని చేసినప్పుడు బ్రౌన్షుగర్ సరఫరా చేసే ముఠాలను పట్టుకుంది. అలాగే పేరు మోసిన దొంగలను జైలు పాలు చేసింది. స్త్రీల రక్షణ కోసం ‘గుడియా హెల్ప్లైన్’, ‘శక్తి బటన్’, ‘హోషియార్ సింగ్’ అనే హెల్ప్లైన్లు ప్రారంభించింది. దాంతో జనం ఆదరణ పొందింది. కుల్లు ఎస్.పిగా చార్జ్ తీసుకున్నాక వచ్చిన తీవ్ర వరదలను సాక్షి వర్మ సమర్థంగా ఎదుర్కొంది. ‘ఈ వరదల్లో నాకు ఎదురైన పెద్ద సవాలు ఏమిటంటే మా జిల్లాలో ఉన్న పెద్ద టూరిస్ట్ అట్రాక్షన్స్ మనాలి కావచ్చు, తీర్థన్ కావచ్చు... వీటన్నింటితో కమ్యునికేషన్ కోల్పోవడం. మొబైల్స్ పని చేయలేదు. మా పోలీసు శాఖ వైర్లెస్ ఫోన్లు కొన్ని చోట్ల మాత్రమే పని చేశాయి. మిగిలిన ప్రాంతాలకు శాటిలైట్ ఫోన్లు పంపి అక్కడి నుంచి సమాచారం తెప్పించాను. కాని శాటిలైట్ ఫోన్లు చేర్చడం కూడా పెద్ద సవాలైంది. అలాగే రోడ్లు ధ్వంసం కావడం వల్ల సహాయక బృందాలు చేరలేకపోయాయి. అయినా సరే మేమందరం సమర్థంగా సహాయక చర్యలు చేపట్టాము. పని చేసేటప్పుడు నేను స్త్రీనా, పురుషుడినా అనేది నాకు గుర్తు ఉండదు. ఒక ఆఫీసర్గా ఏం చేయగలను అనేదే ఆలోచిస్తాను’ అని తెలిపింది సాక్షి వర్మ– 2014 ఐపిఎస్ బ్యాచ్ ఆఫీసర్. మండి ఎస్.పి. కుల్లు జిల్లా పక్కనే ఉంటుంది మండి జిల్లా. రెంటికీ రెండు గంటల దూరం. ఈ జిల్లా కూడా తీవ్రంగా వరద బారిన పడింది. వంతెనలు, ఇళ్లు, రోడ్లు పూర్తిగా మునిగిపోయాయి. చివరకు పోలీస్ స్టేషన్లకు బిఎస్ఎఫ్ దళాలకు కూడా కమ్యూనికేషన్ లేదు. ఇలాంటి సమయంలో గొప్ప సమర్థతతో పని చేసింది మండి ఎస్.పి సౌమ్య సాంబశివన్. 2010 ఐపిఎస్ బ్యాచ్కు చెందిన ఈ ఆఫీసర్ బియాస్ నది ఒడ్డున ఉన్న స్లమ్స్ చిక్కుకున్న 80 మందిని కాపాడగలగడంతో మొదటి ప్రశంస పొందింది. టూరిస్ట్ ప్రాంతం కాబట్టి కమ్యూనికేషన్ లేకపోవడం వల్ల అక్కడికి వచ్చిన టూరిస్ట్లు ఎలా ఉన్నారంటూ ఫోన్ల వరద మొదలైంది. టూరిస్ట్లను సురక్షితంగా ఉంచడం సౌమ్యకు ఎదురైన పెద్ద సవాలు. ‘వారందరిని వెతికి స్థానిక సత్రాల్లో, గురుద్వారాల్లో చేర్చడం చాలా వొత్తిడి కలిగించింది. అలాగే ఇళ్లు విడిచి రావడానికి చాలామంది ఇష్టపడలేదు. కష్టపడి సంపాదించుకున్న వస్తువులను వదిలి రావడం ఎవరికైనా బాధే. వారు అలాగే ఉంటే చనిపోతారు. ఎంతో ఒప్పించి వారిని ఖాళీ చేయించాను’ అందామె. సౌమ్య సాంబశివన్ కింద మొత్తం 1200 మంది సహాయక సిబ్బంది పని చేసి ఈ ఉత్పాతాన్ని ఎదుర్కొన్నారు. -
జూన్ 23 నుంచి జగనన్న సురక్షా కార్యక్రమం
సాక్షి, అమరావతి: జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం సమీక్ష చేపట్టారు. జగనన్నకు చెబుదాం కార్యక్రమంపై వర్చువల్గా 26 జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సమీక్ష జరిపారు. జగనన్నకు చెబుదాంతో పాటు గడపగడపకూ మన ప్రభుత్వం, ఉపాధిహామీ పనులు, హౌసింగ్, వ్యవసాయం- సాగునీరు విడుల, జగనన్న భూ హక్కు & భూ రక్ష కార్యక్రమాలపైనా ఆయన సమీక్ష చేపట్టారు. సీఎం జగన్ ఏమన్నారంటే.. జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో వచ్చే వినతుల పరిష్కారంలో క్వాలిటీ అన్నది చాలా ముఖ్యం. ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకు సేవలు అందించడంలో ఉన్నత ప్రమాణాలు నెలకొల్పుతున్నాం. ఒకవేళ గ్రీవెన్స్ను రిజెక్ట్ చేస్తే… సంబంధిత ఫిర్యాదుదారు ఇంటికి వెళ్లి.. ఎందుకు రిజెక్షన్కు గురైందో వారికి వివరించాలి. పరిశీలించని గ్రీవెన్సెస్ ఏమైనా ఉంటే.. 24 గంట్లోగా వాటిని పరిష్కరించాలి అని సీఎం జగన్ అధికారులతో అన్నారు. నెలపాటు జగనన్న సురక్షా జూన్ 23వ తేదీ నుంచి జులై 23వ తేదీ వరకూ జగనన్న సురక్షా కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనున్నారు. జగనన్నకు చెబుదాం కార్యక్రమానికి అనుబంధంగా ఈ కార్యక్రమం కొనసాగనుంది. ఏదైనా పత్రాలకు సంబంధించి, సర్టిఫికెట్లకు సంబంధించి, అలాగే ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఏమైనా సమస్యలు ఉన్నాయా? లేవా? అన్నదానిపై జల్లెడపడతారు. డాక్యుమెంటేషన్, సర్టిఫికెట్లు, ప్రభుత్వ పతకాలు, అర్హతలు తదితర వాటికి సంబంధించి మండలాధికారులు క్యాంపులు నిర్వహిస్తారు. సమస్యలు ఉన్నవారిని సచివాలయాల వద్దకు తీసుకువచ్చి.. వారి కావాల్సిన సర్టిఫికెట్లు, డాక్యుమెంట్లు అన్నీ కూడా అందిస్తారు. జగనన్న సురక్షలో వివిధ పథకాల కింద అర్హులుగా గుర్తించనవారికి ఆగస్టు 1న మంజూరుచేస్తారు. 👉 ఈ ఏడాదిలో 24 కోట్ల పనిదినాలు కల్పించాలి. ఇందులో 60శాతం పనిదినాలు.. ఈనెలాఖరులోగా పూర్తికావాలి. ప్రతిరోజూ ప్రతి జిల్లాలో కనీసం 75వేల పనిదినాలు కల్పించాలి. సచివాలయాలు, ఆర్బీకేలు, విజేజ్క్లినిక్స్, డిజిటల్ గ్రంథాలయాలను వెంటనే పూర్తిచేయాలి అని సీఎం జగన్ అధికార యంత్రాగాన్ని ఆదేశించారు. 👉 రాష్ట్రంలో లక్షల సంఖ్యలో ఇళ్లు కడుతున్నాం. ఇప్పటివరకూ సుమారు 3.9లక్షల వరకూ ఇళ్లు పూర్తయ్యాయి. రూఫ్ లెవల్, ఆపై ఉన్నవి సుమారు 5.27లక్షలు ఉన్నాయి. వీటిని త్వరతిగతిన పూర్తిచేసేలా చూడాలి. మిగతా ఇళ్లు వివిధ దశల్లో ఉన్నాయి.. వాటి వేగాన్ని పెంచేలా చూడగలరు. ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభం అయిన తర్వాత సుమారు రూ.147 కోట్లు ఇచ్చాం. 👉 సీఆర్డీయే ప్రాంతంలో ఇళ్లనిర్మాణానికి అన్ని ఏర్పాట్లూ చేయాలి. జులై 8 నుంచి పనులు ప్రారంభించాలి. ఆప్షన్ -3 ఎంపిక చేసుకున్న వారికి వెంటనే ప్రభుత్వం నుంచి ఇళ్లు కట్టే నిర్మాణం మొదలుకావాలి. 👉 ఖరీఫ్ పనులు ప్రారంభం అయ్యాయి. విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల కొరత రాకుండా చూడండి. ఎక్కడైనా కల్తీలు కనిపిస్తే.. కలెర్టర్లను, ఎస్పీలను బాధ్యుల్ని చేస్తాను. అక్రమాలకు పాల్పడే వారిపై కఠినంగా వ్యవహరించండి. జులై 1 నుంచి ఇ-క్రాప్ బుకింగ్స్ ప్రారంభించాలి. సెప్టెంబరు మొదటి వారానికి పూర్తిచేయాలి. సెప్టెంబరు నెలాఖరులోగా తుది జాబితాలను గ్రామ సచివాలయాల్లో ప్రదర్శించాలి. సీసీఆర్సీ కార్డులపై అవగాహన కల్పించి… కౌలు రైతులకు మేలు చేసేలా చర్యలు తీసుకోండి: 👉 మొదటి ఫేజ్లో 2వేల గ్రామాల్లో జగనన్న భూ హక్కు, భూ రక్ష కార్యక్రమం పూర్తయ్యింది. సచివాలయాల స్థాయిలోనే రిజిస్ట్రేషన్ సహా అన్నిరకాల సేవలు వీరికి అందేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలి. ఈ గ్రామాల నుంచి రైతులు ఎవ్వరూకూడా తహశీల్దార్, రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం రాకూడదు. ప్రతి పని కూడా గ్రామ సచివాలయాల స్థాయిలోనే జరగాలి. రెండో దశ కింద మరో 2వేల గ్రామాల్లో - సెప్టెంబర్ 30కల్లా భూపత్రాలు అందాలి. అక్టోబరు 15 నుంచి ఇక్కడ రిజిస్ట్రేషన్ కార్యక్రమాలు ప్రారంభం కావాలి. 👉 జగనన్న విద్యాకానుక కిట్ల పంపిణీపై కలెక్టర్లు సమీక్ష చేయాలి. ఎక్కడైనా సరిపడా లేకున్నా, ఇచ్చిన వస్తువుల బాగోలేకున్నా.. వెంటనే సమాచారం తెప్పించుకోండి.\ పాఠశాల ప్రదానోపాధ్యాయులనుంచి ఈ సమాచారాన్ని సేకరించి వెంటనే తగిన చర్యలు తీసుకోండి. నాడు – నేడు కింద పనులు పూర్తిచేసుకున్న పాఠశాలల్లోని తరగతి గదుల్లో ఆరో తరగతి, ఆపై పబడ్డ క్లాసులకు సంబంధించి తరగతి గదుల్లో జులై 12 కల్లా… ఐఎఫ్పీ ప్యానెల్స్ ఏర్పాటు కావాలి. వాటిని చక్కగా వినియోగించుకోవడంపై ఉపాధ్యాయులకు మంచి శిక్షణ ఇవ్వండి అని సీఎం జగన్ అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. ఇదీ చదవండి: వాళ్లు వదిలేసినా.. జగనన్న పూర్తి చేస్తున్నాడు! -
తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు..ఘనకీర్తిని చాటుదాం
సాక్షి, హైదరాబాద్: పోరాటాలు, త్యాగాలతో ప్రజాస్వామ్య పంథాలో సాధించుకున్న స్వరాష్ట్రం పదేళ్ల ప్రగతి ప్రస్థానాన్ని.. దశాబ్ది ఉత్సవాల సందర్భంగా అమరుల త్యాగాలను స్మరించుకుంటూ, ప్రజల అకాంక్షలకు అనుగుణంగా ఘనంగా జరపాలని సీఎం కె.చంద్రశేఖర్రావు ఆదేశించారు. జూన్ 2 నుంచి 3 వారాల పాటు తెలంగాణ ఘనకీర్తిని చాటిచెప్పేలా సంబురాలు జరపాలన్నారు. ఉత్సవాల నిర్వహణకు రూ.105 కోట్లను విడుదల చేయాలని ఆర్థిక శాఖను ఆదేశించారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలతో పాటు ఇతర అంశాలపై గురువారం రాష్ట్ర సచివాలయంలో జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు/పోలీసు కమిషనర్లతో సీఎం సమావేశం నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా రోజువారీగా నిర్వహించాల్సిన కార్యక్రమాలపై కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. గ్రామాలు, నియోజకవర్గాలు, జిల్లాల వారీగా చేపట్టాల్సిన కార్యక్రమాలను వివరించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులను సమన్వయం చేసుకుంటూ విజయవంతం చేయాలని కోరారు. శాఖలు సాధించిన అభివృద్ధి, అందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుసరించిన ప్రజా సంక్షేమ కోణాన్ని, తాతి్వక ధోరణిని, దాని వెనకున్న దార్శనికతను వివరించారు. వ్యవసాయం, విద్యుత్, సాగునీరు, రోడ్లు, భవనాలు తదితర శాఖల ప్రగతిని ప్రత్యేకంగా కొనియాడారు. మూడు విడతల్లో గృహలక్ష్మి సాయం ప్రతి శాసనసభ నియోజకవర్గంలో 3 వేల మంది చొప్పున అర్హులైన లబ్ధిదారులకు గృహలక్ష్మి పథకాన్ని వర్తింపచేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో గృహలక్ష్మి పథకం అమలవుతుందని స్పష్టం చేశారు. సొంత స్థలాల్లో ఇళ్ల నిర్మాణానికి రూ.3 లక్షలు ఆర్థిక సహాయం అందించడానికి గృహలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టిన విష యం తెలిసిందే. కాగా ఇళ్ల నిర్మాణానికి సంబంధించిన ఆయా దశలను ఫోటోలు, ఇతర మార్గాల ద్వా రా నిర్ధారించుకుని, నిర్మాణ పనులను పర్యవేక్షిస్తూ లబి్ధదారులకు దశలవారీగా గృహలక్ష్మి పథకాన్ని వర్తింపజేయాలని కేసీఆర్ సూచించారు. లబ్ధిదారులకు మొదటి దశ (బేస్మెంట్)లో రూ.లక్ష, స్లాబ్ దశలో మరో రూ.లక్ష, చివరి దశలో మిగిలిన రూ.లక్ష అందించాలని చెప్పారు. ఇందుకు సంబంధించిన విధివిధానాలను రూపొందించి జిల్లాల కలెక్టర్లకు పంపించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని ఆదేశించారు. అన్ని రాష్ట్రాలను దాటేసి ముందంజ.. ‘తెలంగాణ.. వ్యవసాయం, ఐటీ, పరిశ్రమలు, విద్యుత్ సహా అన్ని రంగాల్లోనూ దేశంలోనే ముందంజలో ఉంది. గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడు, పంజాబ్ హర్యానాలను దాటేసి దూసుకుపోతోంది. ఎరువుల వినియోగం 8 లక్షల టన్నుల నుంచి 28 లక్షల టన్నులకు పెరిగింది. గంజి కేంద్రాలు నడిచిన పాలమూరులో పచ్చని పంటలతో పారే వాగులతో పాలుగారే పరిస్థితి నెలకొన్నది. ధాన్యం ఉత్పత్తిలో మనం పంజాబ్ను దాటేసి పోతున్నాం. విద్యా, వైద్య రంగాల్లోనూ తెలంగాణ అత్యద్భుత ఫలితాలను అందుకుంటూ దేశానికే ఆదర్శంగా నిలిచింది. రాష్ట్ర విద్యార్థులు నీట్, సివిల్స్ పరీక్షల్లో దేశంలోనే ముందువరసలో ర్యాంకులు సాధిస్తూ తెలంగాణ కీర్తిని చాటుతున్నారు..’ అని సీఎం తెలిపారు. (నారాయణపేట ఎస్పీ వెంకటేశ్వర్లు కుమార్తె సివిల్స్లో మూడో ర్యాంకు సాధించినందుకు ఈ సందర్భంగా సమావేశం అభినందనలు తెలిపింది) రైతుల్ని చైతన్యపరచాలి.. ‘వ్యవసాయంలో రాష్ట్ర ప్రగతి దేశానికే ఆదర్శంగా నిలిచింది. రాష్ట్రంలో ధాన్యం దిగుబడి 3 కోట్ల మెట్రిక్ టన్నులు దాటింది. ప్రాజెక్టులతో పుష్కలంగా సాగునీరు, 24 గంటల ఉచిత కరెంటు, గ్రౌండ్ వాటర్ ఉంది. మొగులు మొకం చూడకుండా కాల్వల నీళ్లతో వరి నాట్లు పెట్టుకునే పరిస్థితి తుంగతుర్తి, సూర్యాపేట వంటి ప్రాంతాల్లో కూడా ఉంది. అయితే యాసంగి నాట్లు ఆలస్యం కావడంతో వేసవిలో అకాల వర్షాలు, వడగండ్లతో పంటలకు నష్టం వాటిల్లుతోంది. ఈ బాధలు తప్పాలంటే నవంబర్ 15, 20లోగా యాసంగి వరినాట్లు వేసుకోవాలి. యాసంగి నాట్లు ముందుగా పడాలంటే వానాకాలం వరినాటును కూడా ముందుకు జరుపుకోవాలి. రోహిణీ కార్తె ప్రారంభంలోనే వానాకాలం వరినాట్లు మొదలు కావాలి. మే 25 నుంచి జూన్ 25 జూన్ మధ్య వరినాట్లు పూర్తి కావాలి. యాసంగి వరినారు నవంబర్లో అలికితే తీవ్రమైన చలికి నారు పెరగదనే అపోహ రైతుల్లో ఉంది. అది వాస్తవం కా>దు. వరి తూకం పోసేటప్పుడు కాదు, వరి ఈనే సమయంలో చలి ఉండొద్దు. ఈనేటప్పడు చలి వుంటే తాలు ఎక్కువవుతుంది. ఎండలు ముదరకముందే వరి కోసుకుంటే గింజ గట్టిగ ఉండి తూకం కూడా బాగుంటుంది. యాసంగి వరిని ముందుగా నాటుకుంటే తాలు తక్కువ, తూకం ఎక్కువ అవుతుంది. కలెక్టర్లు, వ్యవసాయ శాఖ ఈ దిశగా రైతులను చైతన్యపరచాలి..’ అని కేసీఆర్ ఆదేశించారు. ఉత్సవాల వీడియో రికార్డింగ్.. ‘దశాబ్ది ఉత్సవాలను జిల్లాల వారీగా కలెక్టర్లు వీడియో రికార్డు చేసి భద్రపరచాలి. నియోజకవర్గాలు, జిల్లాల వారీగా జరిగిన అభివృద్ధిని తెలిపే పదేళ్ల ప్రగతి నివేదిక, పుస్తకాలను ముద్రించి పంపిణీ చేయాలి. ఆయా రంగాల అభివృద్ధిపై డాక్యుమెంటరీలు రూపొందుతున్నాయి. ఉత్సవాల సందర్భంగా వీటిని ప్రదర్శించాలి. ఆయా జిల్లాల అభివృద్ధికి సంబంధించిన పూర్తి వివరాలను మంత్రులు ఈ దశాబ్ది ఉత్సవాల్లో ప్రజలకు వివరించేలా సిద్ధం కావాలి..’ అని ముఖ్యమంత్రి సూచించారు. 4 లక్షల ఎకరాలకు పోడు పట్టాలు.. ‘జూన్ 24 నుంచి 30 వరకు రాష్ట్రంలో ఆదివాసీ, గిరిజనులు సాగుచేసుకుంటున్న అటవీ భూములకు పోడు పట్టాలను పంపిణీ చేయాలి. 2,845 గ్రామాలు, తండాలు, గూడాల పరిధిలో 4,01,405 ఎకరాల పోడు భూములకు పట్టాలు అందచేయనున్నాం. మొత్తం 1,50,224 మంది గిరిజనులకు లబ్ధి చేకూరుతుంది. పోడు భూముల లబ్ధిదారుల పేరుతో ప్రభుత్వమే బ్యాంకు ఖాతాను తెరిపించాలి. ఈ ఖాతాల ద్వారా వారికి ప్రభుత్వం రైతుబంధును అందజేస్తుంది. 3.08 లక్షల మంది ఆర్ఓఎఫ్ఆర్ పట్టాదారులకు కూడా రైతుబంధును వర్తింపజేస్తాం..’ అని ప్రకటించారు. గొర్రెల పంపిణీని కూడా ప్రారంభించాలి.. ‘బీసీ కుల వృత్తులను కాపాడడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం. కులవృత్తులతో జీవనం కొనసాగిస్తున్న విశ్వకర్మలు, ఇతర బీసీ, ఎంబీసీ కులాలను ఆదుకునేందుకు రూ.లక్ష ఉచిత ఆర్థిక సాయాన్ని అందించనున్నాం. జూన్ 9న జరుపుకొనే తెలంగాణ సంక్షేమ సంబురాల్లో.. సబ్ కమిటీ సిఫారసు చేసిన, ఇప్పటికీ ప్రభుత్వ పథకాలు అందుకోని బీసీ, ఎంబీసీ కులాలకు రూ.లక్ష ఆర్థిక సాయాన్ని అందిస్తాం. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 1,100 మంది లబి్ధదారులను ఎంపిక చేసి దళితబంధు పథకాన్ని అమలు చేయాలి. గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని కూడా దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ప్రారంభించి దశల వారీగా అమలు చేయాలి..’ అని ఆదేశించారు. సఫాయీ కార్మికులు భగవంతుడంతటివారు.. ‘గ్రామ, పట్టణ స్థాయిల్లో పారిశుధ్య కారి్మకుల సేవలు వెలకట్టలేనివి. దశాబ్ది వేడుకల సందర్భంగా ‘సఫాయన్నా.. నీకు సలామన్నా’ అనే నినాదంతో ఉత్తమ మహిళా, పురుష కార్మికులకు అవార్డులు అందించి గొప్పగా గౌరవించుకుంటాం. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుతూ తోటి మానవుల కోసం వారి జీవితాలను త్యాగం చేస్తున్న పారిశుధ్య కార్మికులు భగవంతుడంతటివారు. వారి సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. జీతాలు పెంచుతున్నది వారి మీద గౌరవంతోనే..’ అని కేసీఆర్ స్పష్టం చేశారు. -
కలెక్టర్లు, ఎస్పీలతో సమీక్ష.. సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయంలో సీఎం కె.చంద్రశేఖర్రావు గురువారం జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, పోలీసు కమిషనర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవాల కార్యాచరణపై కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. తెలంగాణ ఘన కీర్తిని చాటి చెప్పేలా రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవాలు నిర్వహించాలి దశాబ్ధి ఉత్సవాల నిర్వహణ కోసం కలెక్టర్లకు రూ.105 కోట్లు విడుదల చేయాలని కేసీఆర్ నిర్ణయించారు. హరితహారం, గిరిజనులకు పోడు పట్టాల పంపిణీ, గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ, దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న ధరణి సమస్యలకు పరిష్కారం, వానాకాలం పంటల సాగు, ఎరువులు, విత్తనాల పంపిణీ, నకిలీ విత్తనాలపై ఉక్కుపాదం, వానాకాలం పంటలకు ఇన్పుట్ సబ్సిడీగా రైతుబంధు పంపిణీ తదితర అంశాలపై చర్చించినట్లు సమాచారం. చదవండి: మరో బాంబు పేల్చిన సుకేశ్ చంద్రశేఖర్.. కవిత, కేజ్రీవాల్కు షాక్ -
వీడియో: పెళ్లిచేసుకోబోతున్న కలెక్టర్లు.. ఇద్దరికీ రెండో వివాహమే..
-
పెళ్లిచేసుకోబోతున్న కలెక్టర్లు.. ఇద్దరికీ రెండో వివాహమే..
కటక్: వారిద్దరూ కలెక్టర్లు. ఒకరినొకరు ఇష్టపడ్డారు. ఈ విషయం ఇంట్లో పెద్దలకు చెప్పడంతో వారు కూడా పెళ్లికి గ్రీన్సిగ్నల్ ఇచ్చారు. దీంతో, త్వరలో ఇద్దరు కలెక్టర్లు పెళ్లి బంధంతో ఒక్కటవబోతున్నారు. వారిద్దరూ ఎవరంటే.. పూరీ కలెక్టర్ సమర్థవర్మ, రాయగడ కలెక్టర్ స్వాధాదేవ్ సింగ్. వివరాల ప్రకారం.. వీరిద్దరూ ఈ నెల 15వ తేదీన పెళ్లి చేసుకోబోతున్నారు. ఈ పెళ్లికి పూరీకి చెందిన కొంతమంది సేవాయత్లను కూడా ఆహ్వానించినట్లు సమాచారం. అయితే, స్వాధాదేవ్ సింగ్ కొంతకాలం క్రితం బొలంగీర్ కలెక్టర్ చంచల రాణాను పెళ్లి చేసుకున్నారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో విడాకులు తీసుకున్నారు. మరోవైపు.. పూరీ కలెక్టర్ సమర్థవర్మ కూడా ఇటీవల రైల్వే అధికారిణి సుచిసింగ్ను పెళ్లి చేసుకున్నారు. వీరి మధ్య కూడా మనస్పర్థలు కారణంగా ఇటీవలే విడిపోయారు. ఇక, 2011 బ్యాచ్ ఐఎఎస్ అధికారి సమర్థ్ వర్మ గతంలో కేంద్రపారా జిల్లా మేజిస్ట్రేట్, బిఎంసి కమిషనర్, రాయగడ పిడిడిఐ మరియు సంబల్పూర్ జిల్లా మేజిస్ట్రేట్గా పనిచేశారు. అదేవిధంగా, రాయగడ జిల్లా కలెక్టర్ స్వధా దేవ్ సింగ్ గతంలో నువాపా జిల్లా కలెక్టర్గా మరియు రూర్కెలాలో అదనపు జిల్లా కలెక్టర్గా పనిచేశారు. ఇది కూడా చదవండి: తగ్గేదేలే.. బీజేపీ మంత్రి సాహాసం -
అకాల వర్షాలు..క్రియాశీలంగా స్పందిస్తున్న సీఎం జగన్ ప్రభుత్వం
-
అకాల వర్షాలపై కలెక్టర్లతో సీఎం జగన్ టెలి కాన్ఫరెన్స్
-
అకాల వర్షాలపై కలెక్టర్లతో సీఎం జగన్ టెలీ కాన్ఫరెన్స్
సాక్షి, తాడేపల్లి: అకాల వర్షాలపై కలెక్టర్లతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రంలో అకాల వర్షాలు, తదనంతర పరిస్థితులపై సీఎం సమీక్ష చేపట్టారు. విశాఖపట్నం పర్యటన నుంచి తిరిగి రాగానే ఆయన సీఎంఓ అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. అకాల వర్షాల కారణంగా తడిసిపోయిన ధాన్యం కొనుగోలుకు పౌర సరఫరాల శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. చదవండి: భగవంతుడి నిర్ణయమో తెలీదు కానీ.. సీఎం జగన్పై జీఎంఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు వర్షాల కారణంగా తడిసిన ధాన్యం ఉన్న రైతుల వద్ద నుంచి వెంటనే ఈ ధాన్యాన్ని తీసుకునేందుకు అన్నిరకాల చర్యలు తీసుకోవాలన్నారు. మరోవైపు హార్వెస్టింగ్ చేసి ఉన్న ధాన్యం ఎక్కడా ఉన్నా.. వర్షాల బారి నుంచి వాటిని కాపాడ్డానికి చేపడుతున్న చర్యలను మరింత ముమ్మరంగా ముందుకు తీసుకెళ్లాలన్నారు. కొనుగోలు కేంద్రాలు, ఆర్బీకేలు, రైతుల వద్ద కాని ఎక్కడ ధాన్యం నిల్వలున్నా వాటిని వెంటనే అందుబాటులోని గోడౌన్లకు, ఇతర ప్రభుత్వ భవనాల్లోకి తరలించాలన్నారు. ఎన్యుమరేషన్ ప్రక్రియను కూడా వీలైనంత త్వరగా పూర్తిచేయాలని సీఎం జగన్ ఆదేశించారు. చదవండి: బాలినేని నిర్ణయంపై స్పందించిన సజ్జల రామకృష్ణారెడ్డి -
ఆ నలుగురు కలెక్టర్లు ఎవరు?.. బండి సంజయ్ నివేదికలో ఏముంది?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలోని నలుగురు కలెక్టర్లపై డీవోపీటీకి బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ ఫిర్యాదు చేయనున్నట్లు తెలిసింది. నలుగురు కలెక్టర్లు ధరణి పేరుతో అక్రమాలకు పాల్పడ్డారని, అడ్డగోలుగా దోచుకుంటున్నారని బండి సంజయ్ సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ‘‘సీఎం కుటుంబానికి ఆస్తులు సంపాదించి పెడుతున్నారు. ఆధారాలు సేకరిస్తున్నాం త్వరలో బయటపెతాం. ఆ నలుగురు కలెక్టర్లకు వార్నింగ్ ఇస్తున్నాం. ఆ కలెక్టర్లకే అన్ని పదవుల్లో ప్రాధాన్యం ఇస్తున్నారు. ఆ నివేదిక బయటపడితే మిగతా కలెక్టర్లు తలదించుకుంటారు’ అంటూ బండి సంజయ్ వ్యాఖ్యానించారు. కాగా, కలెక్టర్లకు సంబంధించిన అక్రమాలపై ఆధారాలను బండి సంజయ్ ఢిల్లీ తీసుకెళ్లారు. ఆ నలుగురు కలెక్టరు ఎవరై ఉంటారని వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. చదవండి: మీరా మాకు నీతులు చెప్పేది? కేంద్రంపై హరీష్ రావు ఫైర్ -
వర్షాలపై జిల్లాల కలెక్టర్లతో జగన్ వీడియో కాన్ఫరెన్స్
-
కలెక్టర్లతో వర్షాలపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష
-
జేసీల పరిధిలోనూ ‘వెబ్ల్యాండ్’ సమస్యల పరిష్కారం
సాక్షి, అమరావతి: వెబ్ల్యాండ్లో భూములకు సంబంధించిన మార్పులు చేసే అవకాశాన్ని జిల్లా జాయింట్ కలెక్టర్లకు ప్రభుత్వం కల్పించింది. మొన్నటివరకు ప్రాథమిక స్థాయిలో కేవలం తహశీల్దార్లు మాత్రమే వెబ్ల్యాండ్లో మార్పులు చేసే అవకాశం ఉండేది. ఆ తర్వాత ఉన్నత స్థాయిలో మార్పులు చేయాలంటే చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ (సీసీఎల్ఏ) కార్యాలయంలోని కంప్యూటరైజేషన్ ఆఫ్ మండల రెవెన్యూ ఆఫీసెస్ (సీఎంఆర్వో) ప్రాజెక్ట్ డైరెక్టర్కే అవకాశం ఉండేది. అంటే తహశీల్దార్ స్థాయిలో మార్పును తిరస్కరిస్తే దాన్ని పైస్థాయిలో సీసీఎల్ఏ కార్యాలయంలోనే మార్చడానికి అవకాశం ఉండేది. దీనివల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చింది. స్పందన కార్యక్రమంలో దీనిపై ప్రజల నుంచి పెద్దఎత్తున విజ్ఞప్తులు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఈ అధికారాన్ని జాయింట్ కలెక్టర్లకు సైతం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. సర్వే నంబర్లు మిస్ అవడం, 22ఏ కేసుల్లో ప్రభుత్వ భూమి నుంచి ప్రైవేటు భూమిగా మార్పు చేయడం, సివిల్, రెవెన్యూ కోర్టులు ఇచ్చే ఆదేశాలకు అనుగుణంగా చేయాల్సిన మార్పులతోపాటు భూసమీకరణ, భూ యాజమాన్య మార్పు, భూముల కేటాయింపునకు సంబంధించి మార్పులను జాయింట్ కలెక్టర్ల లాగిన్ నుంచి చేసేందుకు తాజాగా అవకాశం కల్పించారు. ఇందుకు అనుగుణంగా వెబ్ల్యాండ్లో మార్పులు చేస్తున్నారు. జాయింట్ కలెక్టర్లు ఈ మార్పులు చేసేముందు నిబంధనల ప్రకారం అన్ని విషయాలు పరిశీలించాలని, ఎందుకు మార్పు జరుగుతుందో వెబ్ల్యాండ్లో నమోదు చేసిన తర్వాతే మార్పులు చేసేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు సీసీఎల్ఏ జి.సాయిప్రసాద్ ఇటీవల సర్క్యులర్ జారీ చేశారు. -
గ్రూప్–1 పరీక్షకు ఏర్పాట్లు చేయండి
సాక్షి, హైదరాబాద్: గ్రూప్–1 ప్రిలిమినరీ పరీక్షకు పక్కాగా ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్కుమార్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. పరీక్ష నిర్వహణపై మంగళవారం బీఆర్కేఆర్ భవన్ నుంచి జిల్లా కలెక్టర్లతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. కాన్ఫరెన్స్లో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ డాక్టర్ బి.జనార్దన్రెడ్డి, డీజీపీ మహేందర్రెడ్డి, జిల్లా కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలు పాల్గొన్నారు. ఈ నెల 16న రాష్ట్రవ్యాప్తంగా 1,019 కేంద్రాల్లో 3.8 లక్షల మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకానున్నట్లు సీఎస్ వివరించారు. స్ట్రాంగ్రూమ్లను గుర్తించి పోలీసు రక్షణ ఏర్పాటు చేయాలని సూచించారు. జిల్లా కలెక్టర్లు సంబంధిత శాఖల అధికారులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించి పరీక్షాకేంద్రాల వద్ద తాగునీరు, పారిశుధ్యం వంటి ఏర్పాట్లు చేయాలన్నారు. స్ట్రాంగ్రూమ్ ఇన్చార్జీలు, రూట్ ఆఫీసర్లు, లైజన్ ఆఫీసర్లు, అసిస్టెంట్ లైజన్ ఆఫీసర్లు, చీఫ్ సూపరింటెండెంట్లు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇచ్చిన చెక్ లిస్ట్ ప్రకారం సూచనలను పాటించాలని ఆదేశించారు. టీఎస్పీఎస్సీ కార్యాలయంలో ప్రత్యేకంగా కంట్రోల్రూం కూడా ఏర్పాటు చేయాలన్నారు. ప్రిలిమినరీ టెస్ట్ కోసం అభ్యర్థులు హాల్టికెట్లను టీఎస్పీఎస్సీ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. అభ్యర్థులు చివరి నిమిషంలో కాకుండా నిర్ణీత సమయం కంటే ముందుగానే పరీక్షాకేంద్రానికి చేరుకోవాలన్నారు. టెలికాన్ఫరెన్స్లో టీఎస్పీఎస్సీ కార్యదర్శి అనితారామచంద్రన్, జీఏడీ సెక్రటరీ శేషాద్రి, పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
Bapatla: వరి నాట్లు వేసిన కలెక్టర్లు
బాపట్ల: అది బాపట్ల జిల్లాలోని మురుకొండపాడు గ్రామం. శివారున జలయజ్ఞంలో తడిసిన పంట పొలం. మరో వైపు ఆకాశాన భగభగ మండుతున్న భానుడు.. ఇంతలో ఓ కూలీల బృందం ఆ పంట చేలో వడివడిగా అడుగులు వేసింది. అప్పటికే పరిచి ఉన్న వరి మొక్కలను చేత పట్టారు ఆ కూలీలు. ఎరట్రి ఎండలో నేలమ్మ ఒడిలో మట్టి గంధంలో తడిసిన ఆ కూలీలే కలెక్టర్ దంపతులు. ఒకరు ప్రకాశం జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్, మరొకరు బాపట్ల జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్. ఆదివారం మురుకొండపాడు వరి చేలోకి వీరు తమ కుటుంబంతో సహా వచ్చి వరినాట్లు వేశారు. గంటకు పైగా వరి మొక్కలు నాటారు. అక్కడికే క్యారేజీలు తెప్పించుకొని గట్టుపై కూర్చుని భోజనం చేశారు. -
CM YS Jagan: ఈ కార్యక్రమాలను నేనే నేరుగా పర్యవేక్షిస్తా
వృద్ధిరేటులో ఏపీ టాప్లో నిలవడం సంతోషకరం.. దేశం కంటే అధికంగా నమోదైంది. పారదర్శక విధానాలే మూల కారణం.. ఈ వృద్ధి నిలకడగా కొనసాగాలి. – ‘స్పందన’పై సమీక్షలో సీఎం జగన్ సాక్షి, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో ప్రాధాన్యత పనులకు రూ.3,000 కోట్లు కేటాయించామని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. ప్రాధాన్యత పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టడమే కాకుండా పూర్తి చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. ఈ పనులకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేశారు. స్పందన కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి జగన్ మంగళవారం తన క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టర్లు, ఎస్పీలు, జేసీలు, ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. గడప గడపకు మన ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు సూచించిన ప్రాధాన్యత పనులు, ఆర్బీకేలు, సచివాలయాలు, హెల్త్ క్లినిక్స్, ఉపాధి హామీ పనులు, స్పందన వినతుల పరిష్కారం తదితర అంశాలపై కలెక్టర్లకు మార్గనిర్దేశం చేశారు. ఈ సందర్భంగా సీఎం ఏమన్నారంటే.. కలెక్టర్లూ పాల్గొనాలి.. గడప గడపకు మన ప్రభుత్వం ద్వారా ఎమ్మెల్యేలు, సచివాలయాల సిబ్బంది, వలంటీర్లు నేరుగా ప్రజల వద్దకు వెళ్తున్నారు. ఒక్కో సచివాలయం పరిధిలో కనీసం రెండు రోజులు పర్యటించి ప్రజల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకుంటున్నారు. ప్రజల నుంచి అందే వినతుల ఆధారంగా ప్రాధాన్యత పనులను గుర్తించి వాటిపై సంబంధిత ఎమ్మెల్యే విజ్ఞాపనలు పంపుతున్నారు. ఈ ప్రాధాన్యత పనులను పూర్తి చేసేందుకు ఒక్కో సచివాలయానికి రూ.20 లక్షలు కేటాయించాం. వీటిని చేపట్టేలా, యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసేలా తగిన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత కలెక్టర్లపై ఉంది. వేగంగా పనులు చేపట్టడమే కాకుండా వాటిని అంతే వేగంతో పూర్తి చేయాలి. నిర్ణీత కాల వ్యవధిలో పనులు పూర్తి చేయాలి. అప్పుడే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. దాదాపు 15 వేల సచివాలయాల పరిధిలో ప్రాధాన్యతా పనుల కోసం రూ.3 వేల కోట్లు ఖర్చు చేయబోతున్నాం. గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో కలెక్టర్లు కూడా పాల్గొనాలి. దీనివల్ల అనుకున్న కార్యక్రమాలను సమర్థంగా అమలు చేయడానికి, సమన్వయ పరచడానికి ఆస్కారం కలుగుతుంది. కలెక్టర్లు విధిగా ప్రతి నెలా ఆరు సచివాలయాలను సందర్శించాలి. ఈ కార్యక్రమాలను నేనే నేరుగా పర్యవేక్షిస్తా. ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహిస్తున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉపాధి పనుల్లో మంచి ప్రగతి ఉపాధి హామీ పనుల్లో మంచి ప్రగతి కనిపించింది. పనితీరు బాగుంది. ఉపాధి హామీలో మనం దేశంలో 2వ స్థానంలో ఉన్నాం. ఈ వేగం కొనసాగాలి. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో సగటున 117 శాతం పనిదినాల కల్పన జరుగుతోంది. రాష్ట్ర సగటు కన్నా తక్కువగా ఉన్న అన్నమయ్య, విజయనగరం, అనంతపురం, అల్లూరి సీతారామరాజు జిల్లాలు ఉపాధి పనులపై దృష్టి పెట్టాలి. పనుల్లో నాణ్యత పెరగాలి. గ్రామాల రూపురేఖలను మార్చేస్తాయి.. సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, డిజిటల్ లైబ్రరీలు, హెల్త్ క్లినిక్స్ భవన నిర్మాణ పనులను వేగవంతం చేయాలి. ఇవి గ్రామాల స్వరూపాన్ని సమూలంగా మార్చేస్తాయి. ఈ పనులకు అత్యంత ప్రాధాన్యమిచ్చి వేగంగా, సకాలంలో పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలి. గ్రామ సచివాలయాల భవనాలు త్వరగా పూర్తి చేయడంపై కలెక్టర్లు శ్రద్ధ పెట్టాలి. ఆర్బీకేల భవన నిర్మాణ పనులను కూడా వేగవంతం చేయాలి. వైఎస్సార్ హెల్త్ క్లినిక్స్ పూర్తి చేయడంపైనా కలెక్టర్లు దృష్టి సారించాలి. వీటి నిర్మాణానికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలి. ఆర్బీకేలు, గ్రామ సచివాలయాలు, విలేజ్ క్లినిక్స్ భవన నిర్మాణ పనులను అక్టోబరు 31 నాటి కల్లా పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకోవాలి. డిసెంబరు నాటికి 4,500 గ్రామాలకు ఫైబర్ ఆప్టిక్ కేబుల్ చేరుతుంది. మంజూరు చేసిన 3,966 గ్రామాల్లో డిజిటల్ లైబ్రరీల నిర్మాణాన్ని డిసెంబర్ నెలాఖరునాటికి పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలి. వీటితోపాటు గ్రామాల్లో ఇంగ్లిషు మీడియం స్కూళ్లు ఉంటాయి. ఇవన్నీ గ్రామాల రూపురేఖలను సమూలంగా మారుస్తాయి. ప్రతి సచివాలయాన్నీ ఒక యూనిట్గా తీసుకుని పనులు పూర్తి చేయాలి. కలెక్టర్ల నుంచి మండల స్థాయి అధికారుల వరకూ కూడా వీటిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి. మొత్తం ఈ కార్యక్రమాలన్నింటినీ ప్రాధాన్యతా క్రమంలో చేపట్టాలి. రహదారులకు భూసేకరణపై దృష్టి రాష్ట్రంలో రహదారులకు సంబంధించి 99 ప్రాజెక్టులు పురోగతిలో ఉన్నాయి. 3,079 కిలోమీటర్ల మేర రూ.29,249 కోట్ల అంచనా వ్యయంతో పనులు సాగుతున్నాయి. అంతర్ రాష్ట్ర సరిహద్దుల అనుసంధానం కోసం మరో 7 ప్రాజెక్టులు కూడా చేపడుతున్నాం. డీపీఆర్ స్థాయిలో మరో 45 ప్రాజెక్టులు ఉన్నాయి. మొత్తంగా 151 ప్రాజెక్టుల కోసం దాదాపు రూ.92 వేల కోట్లకుపైగా ఖర్చు చేస్తున్నాం. ఈ ప్రాజెక్టులకు సంబంధించి భూ సేకరణపై కలెక్టర్లు దృష్టి పెట్టాలి. రాష్ట్ర ఆర్థికాభివృద్ధిలో ఈ ప్రాజెక్టులు కీలక పాత్ర పోషిస్తాయి. స్పందన.. ఎవరెవరు ఎప్పుడంటే..? స్పందన వినతుల పరిష్కారంలో నాణ్యత చాలా ముఖ్యం. ఎలా పరిష్కరిస్తున్నారన్న దానిపై కలెక్టర్లు నిరంతరం పర్యవేక్షించాలి. గ్రామ, వార్డు సచివాలయాల్లో రోజూ మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ స్పందన కార్యక్రమం కచ్చితంగా జరగాలి. సంబంధిత సిబ్బంది ఆ సమయంలో తప్పనిసరిగా అందుబాటులో ఉండాలి. ప్రతి సోమవారం జిల్లా, డివిజన్, సబ్ డివిజన్, మండల స్థాయిల్లో కచ్చితంగా స్పందన నిర్వహించాలి. సంబంధిత అధికారులంతా పాల్గొనాలి. కలెక్టర్లు దీన్ని కచ్చితంగా అమలు చేసేలా చూడాలి. ప్రతి బుధవారం స్పందన వినతులపై కలెక్టర్లు సమీక్ష చేయాలి. ప్రతి గురువారం చీఫ్ సెక్రటరీ కలెక్టర్లతో స్పందనపై సమీక్షించాలి. అదే సమయంలో సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధన (ఎస్డీజీ) పైనా సమీక్ష చేపట్టాలి. లక్ష్యాలను చేరుకునేలా నిరంతరం పర్యవేక్షించాలి. స్పందన కార్యక్రమాన్ని నేనే నేరుగా పర్యవేక్షిస్తా. ఈ వృద్ధి నిలకడగా కొనసాగాలి 2021–22లో ఏపీ స్థూల ఉత్పత్తి వృద్ధి రేటు 11.43 శాతంగా నమోదు కావడం సంతోషకరం. ఇది దేశ వృద్ధిరేటు కంటే అధికంగా ఉంది. కీలక రంగాలపై నిరంతర సమీక్ష, పర్యవేక్షణ ఉండాలి. పారదర్శక విధానాలే ఈ వృద్ధికి మూలకారణమని భావిస్తున్నా. కలెక్టర్లందరికీ అభినందనలు. మీ అందరి కృషి ఫలితమే దీనికి కారణం. కీలక రంగాలపై దృష్టి పెట్టడం వల్లే ఇది సాధ్యమైంది. ఈ వృద్ధి నిలకడగా కొనసాగాలి. ఎంఎస్ఎంఈ రంగానికి వెన్నుదన్నుగా నిలవాలి. ఆ రంగం నుంచి వచ్చిన ప్రతి విజ్ఞప్తిని సక్రమంగా పరిష్కరించాలి. ప్రతి పథకం ఎస్డీజీతో ముడిపడి ఉంటుంది. అర్హులైన ప్రతి ఒక్కరికీ అందాలి. వాటిని సక్రమంగా పర్యవేక్షిస్తే ఎస్డీజీ యధావిధిగా పెరుగుతుంది. ఈ స్పందన సమీక్షలో ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు అజేయ కల్లాం, సీఎస్ సమీర్ శర్మ, డీజీపీ కేవీ రాజేంద్రనాథ్రెడ్డి, పురపాలక పట్టణాభివృద్ధిశాఖ స్పెషల్ సీఎస్ వై.శ్రీలక్ష్మి, గృహ నిర్మాణం, సచివాలయాలశాఖ స్పెషల్ సీఎస్ అజయ్జైన్, పాఠశాల విద్యాశాఖ స్పెషల్ సీఎస్ బుడితి రాజశేఖర్, రవాణా, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, ప్లానింగ్ సెక్రటరీ విజయ్కుమార్, ఏపీ టిడ్కో ఎండీ సీహెచ్ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. -
జిల్లా కలెక్టర్లతో సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్
-
గోదావరి వరదలకు శాశ్వత పరిష్కారం
సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం: ఏటా గోదావరికి వచ్చే వరదలకు శాశ్వత పరిష్కారం కనుగొనే దిశగా ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉన్నతాధికారులను ఆదేశించారు. గోదావరి వరద ప్రభావిత జిల్లాల మంత్రులు, కలెక్టర్లు, అధికారులతో మంగళవారం రాత్రి సీఎం రాజమహేంద్రవరంలో సమీక్షించారు. 1986 వరదల తర్వాత ఆ స్థాయిలో గోదావరికి దాదాపుగా 28 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం ఈ ఏడాది వచ్చిందని.. భవిష్యత్తులో ఇందుకు అనుగుణంగా నియంత్రణ చర్యలు ఉండాలని సీఎం ఆదేశించారు. ఏటిగట్లు ఎక్కడెక్కడ బలహీనంగా ఉన్నాయో గుర్తించాలని, శాశ్వత చర్యలపై దృషిŠ?ట్పట్టి నవంబరుకల్లా టెండర్లు పూర్తిచేస్తే పనులు మొదలుపెడదామన్నారు. కరకట్టల ఆధునీకరణపై కూడా వెంటనే ప్రతిపాదనలు సిద్ధంచేయాలన్నారు. డెల్టా ఆధునీకరణ, గోదావరి వరదల నుంచి శాశ్వత పరిష్కారం కోసం అందజేసిన డీపీఆర్పై టెక్నికల్ ఎస్టిమేట్స్ తయారుచేసి వెంటనే నివేదించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. అలాగే, అన్ని లంక గ్రామాలలో కమ్యూనిటీ హాళ్ల నిర్మాణం చేస్తే విపత్తు సమయంలో వాటిని పునరావాస కేంద్రాలుగా వినియోగించుకోవచ్చునని సూచించారు. పారదర్శకంగా నష్టాల నమోదు ఇక నష్టాల నమోదు వెంటనే ప్రారంభించాలని.. ఈ విషయంలో అంతా పారదర్శకంగా ఉండాలని సీఎం ఆదేశించారు. ఈ ప్రక్రియ పూర్తిచేశాక సామాజిక తనిఖీ నిర్వహించాలని, దీనివల్ల అర్హత ఉండి సాయాన్ని అందుకోలేని వారికి తిరిగి దరఖాస్తు చేసుకునే అవకాశం లభిస్తుందన్నారు. రెండు వారాల్లో నష్టాల నమోదును పూర్తిచేద్దామన్నారు. పారదర్శకంగా ఉండడంలో దేశానికే రోల్మోడల్గా నిలుస్తున్నామన్నారు. ఏ సీజన్లో జరిగిన నష్టం ఆ సీజన్ ముగిసేలోగా ఇవ్వగలిగితే ప్రజలు మరింత సంతోషిస్తారని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు. మరోవైపు సచివాలయ సిబ్బంది, వలంటీర్లు నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండి ముంపు ప్రమాదం ఉన్నవారిని అప్రమత్తం చేశారంటూ సీఎం ప్రశంసించారు. వలంటీర్, సచివాలయం వ్యవస్థ ఫలితాలు ఇప్పుడు అందరికీ అందుతున్నాయన్నారు. అధికారులకు సీఎం అభినందనలు లంక గ్రామాల్లో నష్టతీవ్రత వివరాలను సీఎం అధికారులను అడిగి తీసుకున్నారు. గతంలో ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలప్పుడు కొంతమంది అధికారులను బాధ్యులుగా చేసి సస్పెండ్చేసి హడావిడి చేసేవారని ఆయన గుర్తుచేశారు. విపత్తుల సమయంలో అధికారులు నాయకుల చుట్టూ తిరుగుతుండడంవల్ల పునరావాస పనుల్లో జాప్యం జరుగుతుందన్నారు. కానీ, అన్నీ జరిగాక తాను రావడంవల్ల అవి సవ్యంగా జరిగాయా? లేదా? అని తెలుసుకుంటున్నానని.. తాను కూడా వరదల సమయంలో వచ్చి, మిమ్మల్ని నా చుట్టూ తిప్పుకుని నలుగురిని సస్పెండ్ చేస్తే ఏమవుతుంది? ఫైనల్గా ప్రజలకు మంచి జరగాలి, వారికి సాయం అందాలి కదా అని ముఖ్యమంత్రి అన్నారు. అధికారులంతా బ్రహ్మండంగా పనిచేశారు కాబట్టే ‘చాలా బాగా చూసుకున్నార’న్న మాట ఈరోజు ప్రజల నుంచి వినిపిస్తోందంటూ సీఎం జగన్ వారికి అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో ఈ మంచి పేరు నిలబెట్టుకునేలా ముందుకెళ్దామన్నారు. ఇందులో ప్రజాప్రతినిధులను కూడా మమేకం చేసినప్పుడే ప్రజలకు మరింత దగ్గరవుతారన్నారు. వరద ప్రాంతాల్లో శానిటేషన్, ప్రజారోగ్యంపై దృష్టిపెట్టాలని సీఎం సూచించారు. విద్యుత్పై దుష్ప్రచారాన్ని తిప్పికొట్టండి వరద ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్ పునరుద్ధరణపైనా అధికారులతో సీఎం జగన్ సమీక్షించారు. ఈ విషయంలో ఎక్కడైనా జాప్యం జరిగిందా అని అడిగి తెలుసుకున్నారు. ఒకవేళ తప్పులు జరిగితే సరిదిద్దుకోవాలని.. లేదంటే ఆ వ్యతిరేక ప్రచారాన్ని తిప్పికొట్టాలన్నారు. మనం యుద్ధం చేస్తున్నది టీడీపీ, చంద్రబాబుతో కాదని.. నెగిటివ్ మీడియాతో యుద్ధం చేస్తున్నామని వైఎస్ జగన్ వారికి గుర్తుచేశారు. ఆ మీడియా సంస్థలు కూడా చొక్కాలిప్పుకుని ఒక పార్టీ అధికారం కోసం పనిచేస్తున్నాయని, వాస్తవాలను ప్రజలకు వివరించి వాటి దుష్ప్రచారాలను తిప్పికొట్టాలన్నారు. రాజమహేంద్రవరంలోకి వరదనీరు రాకుండా.. ఇక రాజమహేంద్రవరం అవ డ్రెయిన్ ఏర్పాటుచేయడంపై నిపుణుల అభిప్రాయాలు తీసుకుని అంచనాలు సిద్ధంచేయాలని సీఎం జగన్ ఆదేశించారు. పట్టణంలోకి ఎలాంటి వరదనీరు రాకుండా తీసుకోవాల్సిన చర్యలపై సమగ్రమైన నివేదిక రాగానే చర్యలు ప్రారంభిస్తామన్నారు. నిపుణులతో కూడిన టెక్నికల్ కమిటీని నియమించి ప్రజాప్రతినిధుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంటామన్నారు. మీ తోడ్పాటుతోనే నాణ్యమైన సేవలు.. సహాయక కార్యక్రమాల కోసం నిధులను వెంటనే సమకూర్చడంతో నాణ్యమైన సేవలందించగలిగామని అధికారులు సీఎంకు వివరించారు. పశువులకు కూడా వెంటనే గ్రాసం అందజేశామన్నారు. వైద్య శిబిరాలు ముందుగా ఏర్పాటుచేయడంతో జ్వరాలు వంటి వాటిని నివారించగలిగామని, బాధితులకు సహాయం చేయడంలో ఉదారంగా ఉండాలన్న సీఎం సూచనలవల్లే ఎక్కువ సాయం చేయగలిగామన్నారు. గ్రామ సచివాలయ, వలంటీర్ వ్యవస్థ లేకుండా ఉంటే ఈ రకమైన సేవలు అందించలేకపోయే వాళ్లమన్నారు. ఇక పునరావాస కేంద్రాల్లో బాధితులకు నాణ్యమైన భోజనం అందజేశామన్నారు. గతంలో ఏ ప్రభుత్వాలు మీలా ముందస్తుగా పునరావాసాల కోసం సాయం అందించలేదన్నారు. సమీక్షా సమావేశంలో డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ, మంత్రులు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, తానేటి వనిత, కారుమూరి నాగేశ్వరరావు, దాడిశెట్టి రాజా, గుడివాడ అమర్నాథ్, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అనంతరం సీఎం జగన్ రాజమహేంద్రవరం ఆర్ అండ్ బి అతిథిగృహంలో రాత్రి బసచేశారు. -
వర్షాలు వరదలపై కాసేపట్లో సీఎం వైఎస్ జగన్ సమీక్ష
-
పొరపాట్లను స్పందనతో సరిదిద్దుకునే అవకాశం
సాక్షి, అమరావతి: విధి నిర్వహణలో దొర్లే పొరపాట్లను సరిదిద్దుకునే అవకాశాన్ని స్పందన కార్యక్రమం కల్పిస్తోందని, స్పందన అర్జీల పరిష్కారంపై అన్ని స్థాయిల్లో అధికార యంత్రాంగం ప్రత్యేకంగా దృష్టి సారించాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సూచించారు. బుధవారం ఉన్నతాధికారులతో స్పందన వీడియో కాన్ఫరెన్స్లో భాగంగా అర్జీల పరిష్కారం, సుస్థిర ప్రగతి లక్ష్యాల సాధనపై సీఎం దిశా నిర్దేశం చేశారు. స్పందనను మనమే స్వచ్ఛందంగా చేపడుతున్నామని గుర్తు చేస్తూ సమస్యలను పరిష్కరించాలన్న తపన ఉండాలని సూచించారు. దేశవ్యాప్తంగా ఐఏఎస్లు, ఇతర ఉన్నతాధికారులంతా మన ఎస్డీజీ సూచికల వైపే చూస్తున్నారని ప్రస్తావిస్తూ మన కలెక్టర్లు దేశంలోనే అత్యుత్తమమని గుర్తింపు పొందాలని ఆకాంక్షించారు. సీఎం సమీక్షలో ముఖ్యాంశాలు ఇవీ.. తనిఖీల ఫొటోల అప్లోడ్ రోజూ సచివాలయాల పరిధిలో మధ్యాహ్నం 3 నుంచి 5 గంటల వరకూ స్పందన కార్యక్రమాన్ని చేపట్టాలి. జిల్లా, డివిజన్, మండలాల స్థాయిలో స్పందన ప్రతి సోమవారం నిర్వహించాలి. ఈ సమయంలో సంబంధిత అధికారులు కచ్చితంగా ఉండాలి. సంబంధిత అధికారులు స్పందన సమయంలో ఉంటున్నారా? లేదా? అన్నదానిపై సమీక్ష చేస్తాం. స్పందన సమయంలో అధికారులు లేకుంటే అర్జీల పరిష్కారంలో నాణ్యత ఉండదు. స్పందన పోర్టల్లో దీనిపై మార్పులు చేర్పులు చేస్తున్నాం. అర్జీలపై క్షేత్రస్థాయిలో జరిపే విచారణలు, తనిఖీలకు సంబంధించిన ఫొటోలను పోర్టల్లో అప్లోడ్ చేయాలి. ఈ సమయంలో ఫిర్యాదుదారు కచ్చితంగా ఉండాలి. అర్జీపై అధికారులు ఫిర్యాదుదారుతో కలసి ఫీల్డ్ ఎంక్వైయిరీ చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. తన సమస్యను పట్టించుకున్నారన్న తృప్తి అర్జీదారుకి ఉంటుంది. పౌర సమస్యలకు సంబంధించి ఫీల్డ్ ఎంక్వైరీ ఫొటోలే కాకుండా సమస్య పరిష్కరించిన తర్వాత కూడా ఫొటోలు తీసి అప్లోడ్ చేయాలి. సమస్యల పరిష్కారంపై కలెక్టర్లు దృష్టి పెట్టాలి గడప గడపకూ.. కార్యక్రమం కింద ప్రతి ఎమ్మెల్యే నెలలో 10 సచివాలయాలను సందర్శిస్తున్నారు. ప్రతి ఎమ్మెల్యే ఇంటింటికీ వెళ్తున్నారు. ప్రభుత్వం చేసిన కార్యక్రమాలే కాకుండా ప్రజల సమస్యలనూ తెలుసుకుంటారు. సచివాలయ సిబ్బంది, వలంటీర్లతో కలిసి సమస్యలు తెలుసుకుంటారు. ఇది పూర్తిగా ప్రభుత్వ కార్యక్రమం. ప్రతి ఇంటికి చేకూరిన లబ్ధిని తెలియజేస్తారు. ఎమ్మెల్యేల వద్దకు వచ్చే సమస్యలను పరిష్కరించడంపై కలెక్టర్లు దృష్టిపెట్టాలి. మీ పనితీరే.. నా పనితీరు, మనందరి పనితీరు మహిళా, శిశు సంక్షేమాన్ని తీసుకుంటే గోరుముద్ద, సంపూర్ణ పోషణ కార్యక్రమంపై పెద్ద మొత్తంలో ఖర్చు పెడుతున్నాం. గతంలో రూ.500 – రూ.600 కోట్లు ఖర్చు పెడితే ఇప్పుడు మనం రూ.1800 – రూ.1900 కోట్లు వెచ్చిస్తున్నాం. దీన్ని సమర్ధంగా వివరించాల్సిన అవసరం ఉంది. విద్య, వైద్య రంగాల్లో చేపడుతున్న పనులను మరింత విస్తృతంగా ప్రచారం చేయాలి. మూడేళ్లలో నేరుగా నగదు బదిలీతో పారదర్శకంగా రూ.1.41 లక్షల కోట్లు లబ్ధిదారులకు అందించాం. ఈ స్థాయిలో డీబీటీ మరే రాష్ట్రంలోనూ లేదు. ఒక్క బటన్ నొక్కడం ద్వారా ఎలాంటి వివక్షకు తావులేకుండా అందించాం. జాతీయ స్థాయిలో ప్రత్యేక ముద్ర వేయగలిగాం. దేశవ్యాప్తంగా ఐఏఎస్లు, ఉన్నతాధికారులంతా మన ఎస్డీజీ సూచికల వైపే చూస్తున్నారు. వీటన్నింటితో మన కలెక్టర్లు దేశంలోనే ఉత్తమమని గుర్తింపు పొందాలి. మీరే నా కళ్లూ, చెవులు. మీ పనితీరే .. నా పనితీరు, మనందరి పనితీరు. మరింత సమర్థంగా.. స్పందన చాలా ప్రాధాన్యం కలిగిన కార్యక్రమం. దీన్ని మరింత సమర్థంగా, మెరుగ్గా తీర్చిదిద్దడానికి చర్యలు తీసుకుంటున్నాం. దీనికి సంబంధించి సీఎస్ ఇప్పటికే జీవో ద్వారా మార్గదర్శకాలు స్పష్టంగా తెలియజేశారు. ఈ కార్యక్రమాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి. సుస్థిర అభివృద్ధి లక్ష్యాల (ఎస్డీజీ) సాధన చాలా ముఖ్యమైన అంశం. స్పందన, ఎస్డీజీల ఆధారంగా మీ పనితీరు మదింపు ఉంటుంది. -
కనీస ‘ఉపాధి’ రూ.240
సాక్షి, అమరావతి: ఉపాధి హామీ కూలీలకు రోజువారీ వేతనం కనీసం రూ.240 వచ్చేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. ఉపాధిహామీ పనులకు సంబంధించి నిర్దేశించుకున్న లక్ష్యాలను దాదాపుగా అన్ని జిల్లాలు చేరుకున్నాయని చెప్పారు. జగనన్న శాశ్వత భూహక్కు భూరక్ష పథకం సమగ్ర సర్వే ప్రక్రియకు సంబంధించి నిర్దేశించుకున్న గడువులను గుర్తు చేస్తూ వీటిని ప్రతి కలెక్టర్ నోట్ చేసుకోవాలని సీఎం సూచించారు. స్పందనలో భాగంగా ముఖ్యమంత్రి జగన్ బుధవారం తన క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టర్లు, ఎస్పీలు, జేసీలు, ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఉపాధి హామీ, పేదల గృహ నిర్మాణాలు, సచివాలయాలు, ఆర్బీకేలు, విలేజ్ హెల్త్ క్లినిక్లపై ముఖ్యమంత్రి జగన్ మార్గనిర్దేశం చేశారు. ఆ వివరాలివీ.. తనిఖీలతో పనుల్లో నాణ్యత కలెక్టర్లు, జేసీలు, పీడీసీలు, ఎంపీడీవోలు ఉపాధిహామీ పనులను క్రమం తప్పకుండా పర్యవేక్షిస్తూ తనిఖీలు చేయాలి. దీనివల్ల పనుల్లో నాణ్యత కనిపిస్తుంది. రుతుపవనాలు ముందస్తుగా వచ్చే అవకాశాలున్నందున వ్యవసాయ పనులు ఊపందుకుంటాయి. అన్ని పరిస్థితులనూ సమన్వయం చేసుకుంటూ ఉపాధి పనులకు సంబంధించి ప్రత్యామ్నాయ ప్రణాళిక కూడా సిద్ధం చేసుకోవాలి. జాప్యాన్ని అనుమతించేది లేదు గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు, వైఎస్సార్ విలేజ్ క్లినిక్స్, బీఎంసీలు, ఏఎంసీలు.. వీటన్నింటినీ త్వరగా పూర్తిచేయాలి. కలెక్టర్లు వీటిపై పూర్తిగా ధ్యాస పెట్టాలి. అసంపూర్తి భవనాలను వెంటనే పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలి. ఇందులో జాప్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించేది లేదు. వీటి నిర్మాణాల విషయంలో వెనకబడ్డ జిల్లాల కలెక్టర్లు స్వయంగా పర్యవేక్షించి పనితీరు మెరుగుపరుచుకోవాలి. కోర్టు కేసులున్న స్థలాల్లో ప్రత్యామ్నాయాలు కోర్టు కేసుల కారణంగా పంపిణీ కాని ఇళ్లపట్టాల విషయంలో సీఎస్, సంబంధిత శాఖాధికారులు ఉన్నత స్థాయిలో సమీక్ష చేస్తారు. న్యాయపరంగా సంక్లిష్టంగా ఉన్న స్థలాలపై ప్రత్యామ్నాయ ప్రణాళిక సిద్ధం చేస్తారు. ఒక్కో కేసు వారీగా పరిశీలించి ప్రణాళిక రూపొందిస్తారు. 90 రోజుల్లోగా ఇళ్లపట్టాల పంపిణీకి సంబంధించి కొత్తగా అందిన 2,11,176 దరఖాస్తులను అర్హత కలిగినవిగా గుర్తించారు. ఇందులో 1,12,262 మందికి పట్టాలు పంపిణీ చేశాం. మరో 98,914 మందికి వీలైనంత త్వరగా పట్టాలు పంపిణీ చేసేలా భూములను గుర్తించాలి. టిడ్కో ఇళ్ల పనులు నాణ్యంగా ఉండాలి. మౌలిక సదుపాయాల కల్పనలో ఎలాంటి పొరపాట్లు ఉండకూడదు. ఈ నెలాఖరు నాటికి నిర్దేశించిన ఇళ్లను లబ్ధిదారులకు అప్పగించేలా చర్యలు తీసుకోవాలి. గడువులోగా సమగ్ర సర్వే జగనన్న శాశ్వత భూహక్కు భూరక్ష పథకం విప్లవాత్మకమైనది. 100 ఏళ్ల తర్వాత చేపడుతున్న సమగ్ర సర్వే ఇది. నిర్దేశించుకున్న గడువులోగా సర్వే పూర్తి చేయాలి. ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ లక్ష్యాలను కలెక్టర్లు సరి చూసుకోవాలి. రోజువారీ సర్వే పనుల ప్రగతిని నివేదిక రూపంలో తెప్పించుకోవాలి. నిరంతరం సమీక్షిస్తూ ముందుకు సాగితేనే సమగ్ర సర్వే లక్ష్యాలను చేరుకోగలం. ఇళ్ల పనులకు ఈ వారమే నిధులు పేదల ఇళ్లకు సంబంధించి కొన్ని లే అవుట్లకు పెండింగ్లో ఉన్న అప్రోచ్ రోడ్లను, ల్యాండ్ లెవలింగ్ పనులను వెంటనే పూర్తిచేయాలి. దీనికి కావాల్సిన నిధులను ఈ వారంలోనే అందుబాటులోకి తెస్తున్నాం. సుమారు రూ.700 కోట్లు అందుబాటులోకి వస్తాయి. ఇక్కడ ఇళ్ల నిర్మాణ పనులను మరింత వేగవంతం చేయాలి. నవరత్నాలు– పేదలందరికీ ఇళ్లు కింద ఏప్రిల్ 28న విశాఖపట్నంలో 1.24 లక్షల ఇళ్లు, రాష్ట్రవ్యాప్తంగా 1.79 లక్షల ఇళ్లను మంజూరుచేశాం. ఇక్కడ గృహ నిర్మాణాలు వేగం పుంజుకునేలా ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. ప్రతినెలా కనీసం 75 వేల ఇళ్లు పూర్తయ్యేలా ప్లాన్ చేసుకోవాలి. కరెంటు, తాగునీరు, డ్రైన్లు ఈ సదుపాయాలన్నీ కాలనీల్లో కల్పించేందుకు అత్యధిక ప్రాధాన్యతనివ్వాలి. -
హై అలర్ట్గా ఉండాలి.. సీఎం జగన్ అత్యవసర వీడియో కాన్ఫరెన్స్
సాక్షి, అమరావతి: తుపాను ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, అధికారులతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అత్యవసర వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సహాయక చర్యలపై సమీక్ష జరిపారు. ఇప్పటికే తొమ్మిది ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను జిల్లాలకు ప్రభుత్వం పంపింది. తుపాను నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై సీఎం ఆదేశాలు జారీ చేశారు. తుపాను నేపథ్యంలో హై అలర్ట్గా ఉండాలన్నారు. ఇప్పటికే మీకు నిధులు ఇచ్చామని, తుపాను తీరం వెంబడి ప్రయాణిస్తోంది కాబట్టి తీర ప్రాంతాల్లో మరింత అప్రమత్తం అవసరమని’’ కలెక్టర్లు, అధికారులకు సీఎం సూచించారు. చదవండి: అసని తుపాను ఎఫెక్ట్.. 37 రైళ్లు రద్దు.. వివరాలు ఇవే.. ‘‘కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తుపాను బలహీనపడటం ఊరటనిచ్చే అంశం. అయినా ఎక్కడా నిర్లక్ష్యానికి తావు ఉండకూడదు. ప్రజలకు ఎలాంటి ముప్పు రాకుండా చూడాలి. ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించండి. అవసరమైన చోట సహాయపునరావాస శిబిరాలను తెరవండి. సహాయ శిబిరాలకు తరలించిన ఒక వ్యక్తికి రూ.వెయ్యి, కుటుంబానికి రూ.2వేల చొప్పున ఇవ్వండి. సహాయ శిబిరాల్లో మంచి సౌకర్యాలు ఏర్పాటు చేయండి. జనరేటర్లు, జేసీబీలు.. ఇవన్నీకూడా సిద్ధంచేసుకోండి. కమ్యూనికేషన్ వ్యవస్థకు అంతరాయం ఏర్పడితే వెంటనే చర్యలు తీసుకోవాలని’’ సీఎం అన్నారు. ‘‘తుపాను బాధితుల పట్ల మానవతా దృక్పథంతో వ్యవహరించండి. వారికి ఎలాంటి కష్టం వచ్చినా వెంటనే ఆదుకోవాలి. పరిహారం ఇచ్చే విషయంలో ఎలాంటి సంకోచాలు పెట్టుకోవద్దు. సెంట్రల్ హెల్ప్ లైన్తో పాటు, జిల్లాల వారీగా హెల్ప్లైన్ నంబర్లు సమర్థవంతగా పనిచేసేలా చూడాలి. వచ్చే కాల్స్ పట్ల వెంటనే స్పందించండి. ఈ నంబర్లకు బాగా ప్రచారం కల్పించాలని’’ సీఎం పేర్కొన్నారు. ఆ జిల్లాల్లో భారీ వర్షాలు.. అసని తుపాను ప్రభావంతో విశాఖ, తుర్పుగోదావరి, పశ్చిమగోదావరి, గుంటూరు, కృష్ణా జిల్లాలలో భారీ వర్షాలు పడనున్నాయి. విశాఖపై అసని తుపాన్ ప్రభావం ఎక్కువగా ఉంది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. ఏపీ తీర ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్ బృందాలను మొహరించారు. తీర ప్రాంత మండలాల్లో ప్రత్యేక కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేశారు. మత్స్యకారులను వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు. మరోవైపు పలువురు మంత్రులు అసని తుపాను ప్రభారంపై ఎప్పటికప్పుడు వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. సహాయక చర్యల కోసం సిద్ధంగా ఉండాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. చదవండి: ‘అసని’ తుపాను తెచ్చిన ‘బంగారు’ మందిరం కంట్రోల్ రూమ్ నంబర్లు కాకినాడ కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ నంబర్: 18004253077 కాకినాడ ఆర్డీవో ఆఫీస్ కంట్రోల్ రూమ్ నంబర్: 0884-2368100 శ్రీకాకుళం: 08942-240557 తూర్పు గోదావరి: 8885425365 ఏలూరు కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ నంబర్: 18002331077 విజయనగరం: 08922-236947 పార్వతీపురం మన్యం: 7286881293 మచిలీపట్నం కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ నంబర్: 08672 252572 మచిలీపట్నంం ఆర్డీవో ఆఫీస్ కంట్రోల్ రూమ్ నంబర్: 08672 252486 బాపట్ల కంట్రోల్ రూమ్ నంబర్: 8712655878, 8712655881 ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ నంబర్: 90103 13920 విశాఖ: 0891-2590100,102 అనకాపల్లి: 7730939383 -
కలెక్టర్ ప్రొసీడింగ్స్లో జోక్యం చేసుకోలేం
సాక్షి, అమరావతి: కాకినాడ జిల్లాలోని ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం, ఎంఎస్ నాయకర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ సెంటర్కు చెందిన 4.41 ఎకరాల భూమిని వైఎస్సార్సీపీ కార్యాలయ నిర్మాణం నిమిత్తం కేటాయించేందుకు కలెక్టర్ జారీచేసిన ప్రొసీడింగ్స్లో జోక్యానికి హైకోర్టు నిరాకరించింది. ఈ 4.41 ఎకరాల భూమిలో చేపట్టే నిర్మాణాలు ఈ వ్యాజ్యంలో తమ తుది తీర్పునకు లోబడి ఉంటాయని స్పష్టం చేసింది. ఈ కేటాయింపుపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి, జిల్లా కలెక్టర్ తదితరులకు నోటీసులు జారీచేసింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తి ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. కలెక్టర్ జారీచేసిన ప్రొసీడింగ్స్ను చట్టవిరుద్ధంగా ప్రకటించి వాటిని కొట్టేయాలని కోరుతూ జనసేన పార్టీ కార్యకర్త బాతుల గణేష్ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై సోమవారం సీజే ధర్మాసనం విచారణ జరిపింది. పిటిషనర్ న్యాయవాది కె.శ్రీనివాసమూర్తి వాదనలు వినిపిస్తూ.. రెవెన్యూ రికార్డుల్లో ఆ 4.41 ఎకరాల భూమి బండి బాటగా ఉందని చెప్పారు. అలాంటి భూమిలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టడానికి వీల్లేదని తెలిపారు. ఆ భూమిలో నిర్మాణాలు చేపట్టేందుకు వీలుగా చెట్లు కొట్టేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారని, అందువల్ల ఇందులో జోక్యం చేసుకోవాలని కోరారు. ప్రస్తుత దశలో నిర్మాణాలను నిలువరిస్తూ ఎలాంటిæ మధ్యంతర ఉత్తర్వులు జారీచేయలేమన్న ధర్మాసనం, ఆ భూమిలో చేపట్టే నిర్మాణాలు తమ తుది తీర్పునకు లోబడి ఉంటాయని తెలిపింది. అది ప్రభుత్వ భూమి అని తేలితే ఆ నిర్మాణాల కూల్చివేతకు ఆదేశాలిస్తామని పేర్కొంది. -
యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు: సీఎస్ సోమేశ్ కుమార్
సాక్షి, హైదరాబాద్: యాసంగి ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ప్రకటించిన నేపథ్యంలో అధికార యంత్రాంగం ఈ మేరకు సన్నాహాలు ప్రారంభించింది. రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ బుధవారం జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, వ్యవసాయ, మార్కెటింగ్, పౌరసరఫరాల అధికారులతో టెలీ కాన్ఫరెన్స్న్ నిర్వహించారు. జిల్లాల వారీగా యాసంగిలో సాగు విస్తీర్ణం, పంట దిగుబడి అంచనాలపై చర్చించారు. కొనుగోలు కేంద్రాలు తగ్గించొద్దు: ‘సీఎం సూచనల మేరకు ప్రతి జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను యుద్ధ ప్రాతిపదికన ఏర్పా టు చేయాలి. మొత్తం జిల్లా పాలనా యంత్రాంగాన్ని ధాన్యం కొనుగోలులో నిమగ్నం చేయాలి. సంబంధిత మంత్రులు, ప్రజా ప్రతినిధులతో కలిసి ధాన్యం కొనుగోలు ఏర్పాట్లపై ఆయా జిల్లాల అధికారులతో వెంటనే సమీక్ష సమావేశం నిర్వహించాలి. కొనుగోళ్లకు సంబంధించిన సమగ్ర ప్రణాళిక రూపొందించుకోండి. ధాన్యం కొనుగోలు కేంద్రాలను మంత్రులు, ప్రజా ప్రతినిధులతో వెంటనే ప్రారంభించేందుకు చర్యలు చేపట్టాలి. ఎక్కడెక్కడ ధాన్యం కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారో నివేదిక రూపొందించుకోవాలి..’అని సీఎస్ సూచించారు. రోజుకు నాలుగైదు కేంద్రాల తనిఖీ: ‘జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్, ఇతర జిల్లా అధికారులు రోజుకు కనీసం నాలుగైదు కొనుగోలు కేంద్రాలను సందర్శించేలా ప్రణాళిక తయారు చేసుకోవాలి. గత సంవత్సరం యాసంగి సీజన్లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల సంఖ్యకు తగ్గకుండా ఈసారి కూడా ఏర్పాటు చేయాలి. ప్రతి కేంద్రానికి ఓ అధికారిని నియమించి కొనుగోళ్ల ప్రక్రియ సజావుగా సాగేలా చూడాలి. ముఖ్యంగా గన్ని బ్యాగుల సేకరణపై దష్టి పెట్టాలి. ఇందుకోసం ప్రత్యేకంగా ఓ అధికారిని నియమించి తగు పర్యవేక్షణ జరపాలి. రైతుకు కనీస మద్దతు ధర రూ.1,960 లభిం చేలా చర్యలు చేపట్టాలి. వ్యవసాయ విస్తరణాధికారుల సేవలను వినియోగించుకోవాలి. జిల్లాల్లో ఎక్కడైనా ధాన్యం కొనుగోలులో సమస్యలు తలెత్తితే వెంటనే పరిష్కరించాలి..’అని ఆదేశించారు. ఏరోజుకారోజు నివేదికలు:‘కొనుగోలు కేంద్రా ల్లో సేకరించిన ధాన్యాన్ని వెం టనే రవాణా చేసేందుకు అవసరమైన వాహనాలు ఏర్పాటు చేసుకోవాలి. ధాన్యం సేకరణపై ఏరోజు కారోజు నివేదికలు పంపించాలి. జిల్లాల్లో వ్యవసాయ అధికారుల వద్ద ఉన్న వరి కోతల వివరాల ఆధారంగా తగు ప్రణాళిక రూపొందించుకోవాలి. పొరుగు రాష్ట్రాల నుండి ధాన్యం రాకుండా చర్యలు చేపట్టాలి. అందు కోసం పోలీసు, రవాణా తదితర శాఖల అధికారుల సహకారం తీసుకోవాలి..’అని సీఎస్ చెప్పారు. హైదరాబాద్, కలెక్టరేట్లలో కంట్రోల్ రూమ్లు రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు ప్రక్రియను ఎప్పటికప్పుడు సమీక్షించేందుకు అన్ని జిల్లా కలెక్టరేట్లలో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేయా లని సోమేశ్కుమార్ ఆదేశించారు. రాష్ట్రస్థాయిలో హైదరాబాద్లో కూడా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. టెలీ కాన్ఫరెన్స్లో వ్యవసా య శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, పంచా యి తీ రాజ్ శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తాని యా, పౌర సరఫరాల శాఖ కమిషనర్ అనిల్ కుమార్, మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ లక్ష్మీబాయి తదితరులు పాల్గొన్నారు. -
కలెక్టర్లతో సీఎస్ సోమేష్ కుమార్ టెలీకాన్ఫరెన్స్
-
ఔను.. వాళ్లిద్దరూ కలెక్టర్లయ్యారు
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: కష్టపడి చదివారు. కుటుంబాలకు అండగా నిలిచారు. ఒక్కో మెట్టు పైకి ఎక్కుతూ కలెక్టర్ స్థాయికి చేరుకున్నారు. సిక్కోలు కీర్తి పతాకాన్ని సగర్వంగా ఎగురవేశారు. జిల్లాకు చెందిన ఢిల్లీరావు, ప్రశాంతి దంపతులు కలెక్టర్లుగా నియమితులయ్యారు. ఎన్టీఆర్ జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లాలకు కలెక్టర్లుగా వీరిని నియమించడంతో స్థానికంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. జీవితంలో ఒక్కో దశను దాటుకుంటూ ఉన్నత స్థానాలకు చేరిన వీరి ప్రయాణం అందరికీ ఆదర్శప్రాయం. విజయనగరంలోనే ప్రేమ గ్రూప్ 1కు ఎంపిౖకైన తర్వాత హెచ్ఆర్డీఏలో శిక్షణ పొందుతున్న సమయంలో వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. విజయనగరంలో ఉన్నప్పుడే 2008లో వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. ఒక కుమారుడు, ఒక కుమార్తె. ప్రస్తుతం ప్రశాంతి తల్లిదండ్రులతో పాటు ఢిల్లీరావు తల్లి కూడా వారి వద్దే ఉంటున్నారు. మధ్య తరగతి కుటుంబం నుంచి.. కలెక్టర్ ప్రశాంతి తండ్రి తొలుత తెలుగు లెక్చరర్గా పనిచేశారు. తల్లి గృహిణి. ప్రశాంతి సోదరుడు నేపాల్లో ఉన్న ఐక్యరాజ్యసమితి ఆర్గనైజేషన్లో సైంటిస్టుగా పనిచేస్తున్నారు. వీరి స్వస్థలం జలుమూరే అయినా సింహాచలంలో స్థిరపడ్డారు. ఆమె నరసన్నపేట, మాడుగుల, విశాఖ బీవీకే కళాశాల, కృష్ణా కళాశాల, ఆంధ్రా యూనివర్సిటీలో చదువుకున్నారు. ఎంఏ ఇంగ్లిష్ లిటరేచర్ చేసిన ఆమె కృష్ణా కళాశాలలో తొలుత లెక్చరర్గా పనిచేశారు. సివిల్స్ సర్వీసు కోసం చదువుతూ 2007లో గ్రూప్ 1కు ఎంపికయ్యారు. పార్వతీపురం ఆర్డీఓగా తొలి పోస్టు సాధించారు. ఆ తర్వాత విజయనగరంలో కేఆర్సీ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్గా, హౌసింగ్ స్పెషల్ ఆఫీసర్గా పనిచేశారు. అక్కడి నుంచి బదిలీపై పులిచింతల ఎస్డీసీగా, అనంతపురం, గుంటూరు, విజయనగరం జిల్లా డీఆర్డీఏ, డ్వామా పీడీగా పనిచేశారు. తర్వాత నెల్లూరు స్పెషల్ కలెక్టర్గా, అనంతపురం, కర్నూలు మున్సిపల్ కమిషనర్గా పనిచేశారు. 2014లో ఐఏఎస్ పదోన్నతి సాధించారు. గుంటూరు జేసీ గా, చీఫ్ సెక్రటరీ కార్యాలయంలో ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ టూ సీఎస్ బాధ్య తలు చేపట్టారు. ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్గా నియమితులయ్యారు. నిరుపేద కుటుంబంలో పుట్టి.. కలెక్టర్ ఢిల్లీరావుది మందస మండలం పిడి మందస గ్రామం. ఆయన ఒకటి నుంచి ఐదో తరగతి వరకు స్వగ్రామంలోనే చదువుకున్నారు. ఐదు నుంచి 10వ తరగతి వరకు సింహాచలం ఏపీ రెసిడెన్షియల్ స్కూల్లో చదివారు. ఇంటర్ శ్రీకాకుళం ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో చదవగా, అగ్రికల్చర్ డిగ్రీ శ్రీకాకుళం నైరాలో, బాపట్లలో పీజీ చేశారు. ఆయన ఇంటర్ చదువుతున్న ఏడాదిలోనే తండ్రి చనిపోయారు. దీంతో తల్లి ఆ కుటుంబాన్ని తన రెక్కల కష్టంతో నెట్టుకువచ్చారు. అలాగే ఢిల్లీరావుకు తన చిన్ననాటి స్నేహితుడు మాధవరావు ఎంతో సాయం చేశా రు. ఢిల్లీరావుకు అక్క, తమ్ముడు ఉన్నారు. కష్టపడి చదువుకున్న ఢిల్లీరావు తొలుత ఐకార్లో సైంటిస్టుగా ఎంపికయ్యారు. 2003 నుంచి 2007 వరకు షిల్లాంగ్, కోహిమలో పనిచేశారు. సివిల్ సర్వీసుకు ఎంపికవ్వాలన్న లక్ష్యంతో అక్కడితో ఆగిపోకుండా ప్రిపేర య్యారు. 2007లో గ్రూప్ 1కు ఎంపికయ్యారు. విజయనగరంలోనే శిక్షణ పొందిన ఢిల్లీరావు తొ లుత విజయనగరం ఆర్డీఓగా, తర్వాత గుంటూ రు ఆర్డీఓగా, అనంతపురం, గుంటూరు, విజయనగరంలో డ్వామా, డీఆర్డీఎ ప్రాజెక్టు డైరెక్టర్గా పనిచేశారు. ఈ క్రమంలో 2013లో ఐఏఎస్ పదోన్నతి సాధించారు. నెల్లూరు మున్సిపల్ క మిషనర్గా, అనంతపురం జాయింట్ కలెక్టర్గా పనిచేసిన ఢిల్లీరావు తర్వాత సివిల్ సప్లయిస్ డైరెక్టర్గా బదిలీ అయ్యారు. ఈ పోస్టులో ఉండగా తాజా జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఏర్పడి ఎన్టీఆర్ విజయవాడ జిల్లాకు కలెక్టర్గా నియమితులయ్యారు. చదవండి: టీచర్ నుంచి పోలీస్ వరకు.. ఆమె ప్రయాణం వింటే హ్యాట్సాఫ్ అనాల్సిందే! -
కొత్త జిల్లాలకు కలెక్టర్లు, జేసీల నియామకం
సాక్షి, అమరావతి: పరిపాలనా సౌలభ్యంలో భాగంగా కొత్తగా ఏర్పాటు చేస్తున్న 13 జిల్లాలతో కలిపి మొత్తం 26 జిల్లాలకు కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ నెల 4వ తేదీ నుంచి ఆయా జిల్లాల్లో వారు బాధ్యతలు నిర్వర్తిస్తారు. -
ప్రభుత్వ ఉద్యోగుల బదిలీపై స్పందించిన సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: నూతన జోనల్ వ్యవస్థ నిబంధనల ప్రకారమే ఉద్యోగుల విభజన చేపట్టాలని సీఎం కేసీఆర్ అన్నారు. అన్ని జిల్లాల కలెక్టర్లతో నిర్వహించిన సమావేశంలో సీఎం మాట్లాడుతూ, నాలుగైదు రోజుల్లో ఉద్యోగుల విభజన ప్రక్రియ పూర్తి చేసి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. బదిలీల్లో భార్యభర్తలకు ఒకే చోట పోస్టింగ్లు ఇవ్వాలన్నారు. వెనుకబడిన మారుమూల ప్రాంతాల్లో కూడా ప్రభుత్వ ఉద్యోగులు పనిచేయాలన్నారు. స్థానిక యువతకు ఉద్యోగ కల్పనే లక్ష్యమని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. చదవండి: మధ్యవర్తిత్వంలో ఐఏఎంసీ కీలకపాత్ర: సీజేఐ ఎన్వీ రమణ యాసంగిలో ఒక కిలో వడ్లను కూడా కొనం.. ‘‘యాసంగిలో ఒక కిలో వడ్లను కూడా కొనం. యాసంగిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయం. కేంద్రం అనుసరిస్తున్న ప్రమాదకరమైన విధానాలు వివరించాలి. వానకాలం పంటలపై ముందస్తుగా ప్రణాళికలు రూపొందించాలని’’ సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. -
Andhra Pradesh: పింఛన్ రూ.2,500
స్పందన అర్జీల పరిష్కారంలో నాణ్యత కీలకం. ఒకే సమస్యపై తిరిగి రెండోసారి అర్జీ వస్తే గతంలో ఆ దరఖాస్తును పరిశీలించిన వారే మళ్లీ వెరిఫికేషన్ చేయకూడదు. ఆ అర్జీని పై అధికారి కచ్చితంగా పరిశీలించాలి. ఈ కీలక అంశాలు నిర్దిష్ట నిర్వహణ ప్రణాళిక (ఎస్వోపీ)లో ప్రధానం కావాలి. సమస్యలు చెప్పుకునేందుకు వచ్చిన ప్రజల పట్ల మానవతా థృక్పథంతో ఉండాలి. స్పందనపై కలెక్టర్లు పూర్తిగా మనసు పెట్టాలి. కార్యక్రమం మరింత మెరుగుపడాలి. – సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: రాష్ట్రంలో లక్షల మంది అవ్వాతాతల మోముల్లో చిరునవ్వులు విరబూసేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కొత్త ఏడాది కానుక ప్రకటించారు. వైఎస్సార్ పెన్షన్ కానుక కింద పెద్ద వయసువారు ప్రస్తుతం అందుకుంటున్న మొత్తాన్ని మాట ప్రకారం ముఖ్యమంత్రి మరింత పెంచారు. ప్రస్తుతం ప్రతినెలా మొదటి రోజే రూ.2,250 చొప్పున ఇస్తున్న వైఎస్సార్ పెన్షన్ కానుకను జనవరి 1వతేదీన రూ.2,500కు పెంచి అవ్వా తాతల చేతిలో పెడతామని తెలిపారు. ‘స్పందన’లో భాగంగా కలెక్టర్లు, ఎస్పీలు, జేసీలు, ఉన్నతాధికారులతో మంగళవారం తన క్యాంపు కార్యాలయం నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో సీఎం జగన్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఇచ్చిన హామీ మేరకు పెన్షన్ కానుకను పెంచుతున్నామని, ఇది చాలా పెద్ద కార్యక్రమం అని తెలిపారు. ఈ సందర్భంగా డిసెంబర్, జనవరిలో అమలు చేసే పలు పథకాలు, కార్యక్రమాల వివరాలను సీఎం ప్రకటించారు. సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధన, స్పందన సమస్యల పరిష్కారంపై ఉన్నతాధికారులకు మార్గనిర్దేశం చేశారు. ఆ వివరాలివీ... మనస్ఫూర్తిగా ‘స్పందన’ స్పందన కార్యక్రమంలో కలెక్టర్లు మనస్ఫూర్తిగా నిమగ్నం కావాలి. స్పందన అమలు యంత్రాంగాన్ని మరోసారి పరిశీలించాలి. రోజూ మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రతి సచివాలయంలో స్పందన ద్వారా అర్జీలు స్వీకరిస్తున్నాం. దీంతోపాటు వారానికి ఒక రోజు అర్జీలు తీసుకుంటున్నాం. ఒక సచివాలయం స్థాయిలో ప్రతి రోజూ వస్తున్న అర్జీలను ఎలా పరిష్కరిస్తున్నారనే అంశంపై అధికారుల సమీక్ష అవసరం. మండల స్థాయిలో కూడా అధికారులు పరిశీలించాలి. వారంలో ఒకరోజు మండల అధికారులతో కలెక్టర్ సమీక్ష చేయాలి. మరింత మెరుగ్గా మన లక్ష్యాలు ఏ ఒక్కరినీ విడిచిపెట్టకుండా అర్హులందరికీ సంతృప్త స్థాయిలో, పారదర్శక పద్ధతిలో ప్రయోజనాలను అందించడం ఎస్డీజీ లక్ష్యాల వెనుక ప్రధాన ఉద్దేశం. నవరత్నాల ద్వారా అందరినీ మ్యాపింగ్ చేశాం. ఆశించిన లక్ష్యాలను సాధించాలి. దేశంతో పోలిస్తే మన లక్ష్యాలు మెరుగ్గా ఉండాలి. ఎస్డీజీ లక్ష్యాల సాధనపై కలెక్టర్లు దృష్టిపెట్టి పర్యవేక్షణ యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ప్రతి జిల్లా ఎస్డీజీ లక్ష్యాల సాధనలో ముందుకు సాగాలి. ఉగాది నాటికి పూర్తి కావాలి సచివాలయాలు, ఆర్బీకేలు, హెల్త్ క్లినిక్ల భవన నిర్మాణాలన్నీ ఉగాది నాటికి పూర్తి చేసేలా అధికారులు చర్యలు చేపట్టాలి. డిజిటల్ లైబ్రరీలు కూడా త్వరలో అందుబాటులోకి రావాలి. నాడు –నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలలు పునరుజ్జీవం పొందాయి. మరోవైపు విలేజ్ క్లినిక్లు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తున్నాయి. వీటన్నింటి ద్వారా మొత్తం గ్రామాల ముఖచిత్రం మారిపోతోంది. డిసెంబర్, జనవరిలో కార్యక్రమాలు ఇవీ.. పేదలకు ఎంతో మేలు చేకూర్చే జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకాన్ని డిసెంబర్ 21న ప్రారంభించనున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. ఇందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ► ఈ ఏడాది ఏప్రిల్ తర్వాత చేపట్టిన వివిధ పథకాలు, కార్యక్రమాలకు సంబంధించి వివిధ కారణాల వల్ల మిగిలిపోయిన అర్హులకు డిసెంబర్ 28న ప్రయోజనాలను అందచేస్తామని తెలిపారు. గతంలో చెప్పిన మాట ప్రకారం ప్రభుత్వం అందిస్తున్న పథకాలకు ఇంకా అర్హులెవరైనా మిగిలిపోతే దరఖాస్తు చేసుకునేందుకు సమయం ఇచ్చామని, ఇప్పుడు వారికి ప్రయోజనాలు పంపిణీ చేస్తామన్నారు. సామాజిక తనిఖీ కోసం లబ్ధిదారుల జాబితాను ప్రదర్శించాలని అధికారులకు సీఎం సూచించారు. జనవరి 9న ఈబీసీ నేస్తం... అగ్రవర్ణ నిరుపేద మహిళలకు (45 – 60 ఏళ్లు) ఏడాదికి రూ.15 వేలు చొప్పున మూడేళ్లలో రూ.45 వేలు చొప్పున ఆర్థిక సాయం అందచేసే ఈబీసీ నేస్తం పథకాన్ని జనవరి 9వతేదీన ప్రారంభించనున్నారు. ► జనవరిలోనే వైఎస్సార్ రైతు భరోసా మూడో విడత చెల్లింపులు చేస్తామని, త్వరలోనే తేదీని ప్రకటిస్తామని సీఎం తెలిపారు. అర్హులందరికీ పథకాలు అందాలి.. అనర్హులకు అందకూడదన్నదే ప్రభుత్వ ఉద్దేశమని స్పష్టం చేశారు. ► ఈ కార్యక్రమంలో సీఎస్ సమీర్ శర్మ, వ్యవసాయశాఖ స్పెషల్ సీఎస్ పూనం మాలకొండయ్య, గృహ నిర్మాణశాఖ స్పెషల్ సీఎస్ అజయ్జైన్, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ స్పెషల్ సీఎస్ వై.శ్రీలక్ష్మి, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్, వ్యవసాయ మార్కెటింగ్, సహకార శాఖ ముఖ్య కార్యదర్శి వై. మధుసూదన్రెడ్డి, రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి వి.ఉషారాణి, మహిళా శిశు సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి ఏఆర్ అనురాధ తదితరులు పాల్గొన్నారు. -
15లోగా 100% మొదటి డోసు పూర్తవ్వాలి
సాక్షి, అమరావతి: కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు అప్రమత్తత చర్యలు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా రాష్ట్రంలో 18 ఏళ్లు పైబడిన వారందరికీ డిసెంబరు 15వ తేదీ లోపు మొదటి డోసు టీకా వేయడం 100 శాతం పూర్తి చేయాలని వైద్య శాఖ అధికారులను ఆదేశిస్తూ వైద్య, ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అనీల్కుమార్ సింఘాల్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆ వివరాలు.. టీకా బృందాలు ప్రత్యేక డ్రైవ్లు చేపట్టి ప్రతి ఇంటికీ వెళ్లి టీకా వేసుకోని వారిని గుర్తించి టీకాలు వేయాలి. జిల్లా కలెక్టర్లు కరోనా నిబంధనలపై ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టాలి. ప్రజలంతా మాస్క్ ధరించడం తప్పనిసరి చేయాలి. ఎవరైనా మాస్క్ ధరించకపోయినా, వ్యాపార, వాణిజ్య, ఇతర సంస్థలు కరోనా నిబంధనలు పాటించకపోయినా జరిమానా విధించాలి. కరోనా నిబంధనలు పాటిస్తూ పరిమిత సంఖ్యలో వ్యక్తులతోనే పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలు నిర్వహించేలా అధికార యంత్రాంగం దృష్టి సారించాలి. ► ఒమిక్రాన్ కేసులు నమోదైన యూకే, యూరప్, సౌత్ ఆఫ్రికా, బ్రెజిల్, బంగ్లాదేశ్, బోట్స్వానా, చైనా, మారిషస్, న్యూజిలాండ్, జింబాబ్వే, సింగపూర్, హాంకాంగ్, ఇజ్రాయేల్ దేశాల నుంచి వచ్చిన ప్రయాణికులతో పాటు, వీరి సన్నిహితులపై ప్రత్యేక నిఘా ఉంచాలి. ► చెన్నై, బెంగళూరు, హైదరాబాద్లలోని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుల్లో నెల్లూరు, అనంతపురం, గుంటూరు జిల్లాల కలెక్టర్లు హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలి. -
వరదబాధిత జిల్లాల కలెక్టర్లతో సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్
అమరావతి: వరద బాధిత ప్రాంతాల్లో సహాయ కార్యక్రమాల పురోగతిపై కలెక్టర్లతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వరద బాధిత ప్రాంతాలైన కడప, చిత్తూరు, నెల్లూరు, అనంతపురం జిల్లాల కలెక్టర్లు, ఇతర అధికారులు సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమీక్షలో.. పాక్షికంగా దెబ్బతిన్న, పూర్తిగా దెబ్బతిన్న ఇళ్లకు పరిహారం, 104 కాల్ సెంటర్కు వచ్చిన కాల్స్, వాటి పరిష్కారానికి తీసుకున్న చర్యలు, రూ.2వేల రూపాయల అదనపు సహాయం పంపిణీ, నిత్యావసరాల పంపిణీ, అధికారుల క్షేత్రస్థాయి పర్యటన, రోడ్ల తాత్కాలిక పునరుద్ధరణ, చెరువుల భద్రత, గండ్లు పూడ్చివేత, తాగునీటి సరఫరా, గల్లంతైన వారికి నష్టపరిహారం, మరణించిన పశువులకు పరిహారం సహా పలు అంశాలను సీఎం జగన్ సమీక్షించారు. అంశాలవారీగా ప్రగతిని అడిగి తెలుసుకున్నారు సీఎం జగన్. సమావేశంలో కలెక్టర్లు వరద సహాయక చర్యల వివరాల సీఎం జగన్కు అందించారు. ప్రస్తుతం ఆయా జిల్లాల్లో కురుస్తున్న వర్షాలపైనా కూడా సమాచారం అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. ఆ వివరాలు.. ►పంట నష్టంపై ఎన్యుమరేషన్ పూర్తయిన... వెంటనే సోషల్ఆడిట్ కూడా నిర్వహించాలి. ►పూర్తిగా ధ్వసంమైన ఇళ్ల స్థానే కొత్త ఇళ్లను మంజూరు చేసి.. వెంటనే పనులుకూడా మొదలుపెట్టేలా చర్యలు తీసుకోవాలి. ►ఇళ్లులేని కారణంగా వారికి తాత్కాలిక వసతి ఏర్పాటు చేయాలి. వాటిలో కనీస సదుపాయాలను ఏర్పాటు చేయాలి. ►మళ్లీ నివాస వసతి ఏర్పడేంతవరకూ కూడా వారిని జాగ్రత్తగా తీసుకోవాలి. ►చెరవులు గండ్లు పడకుండా జాగ్రత్త తీసుకోవాలి. చెరువుకు, చెరువుకు మధ్య అనుసంధానం ఉండాలి. ►చెరువులు నిండగానే అదనంగా వచ్చే నీటిని నేరుగా కాల్వలకు పంపించే వ్యవస్థ ఉండాలి, భవిష్యత్తులో దీనిపై దృష్టిపెట్టండి. ►తాగునీటి వసతుల పునరుద్ధరణపై దృష్టిపెట్టండి. ►అన్నమయ్య ప్రాజెక్టు తెగిపోవడంతో నీటిని నిల్వచేయలేని పరిస్థితి. అలాగే చాలాచోట్ల తాగునీటి సరఫరాకు ఆధారమైన చెరువులుకూడా గండ్లు పడ్డాయి. ►వీటిమీద ఆధారపడ్డ పట్టణాల్లో, గ్రామాల్లో తాగునీటికి కొరత రాకుండా తగిన చర్యలు తీసుకోవాలి. ►వచ్చే వేసవిని కూడా దృష్టిలో ఉంచుకుని బలమైన ప్రత్యామ్నాయాలు ఏర్పాటు చేయాలి. ►నిత్యావసరాలు అందించిన ప్రతి కుటుంబానికి కూడా అదనపు సహాయం రూ.2వేలు అందాలి. ►అధికారులు క్షేత్రస్థాయి పర్యటనలకు వెళ్లినప్పుడు వచ్చే విజ్ఞప్తులపై ఉదారంగా స్పందించండి. ►ఆర్బీకేల ద్వారా విత్తనాలను పంపిణీకి అన్ని ఏర్పాట్లూ చేశాం. ఆర్బీకేల్లో విత్తనాలు ఉంచాం. ఆ పెద్ద మునిషివి బురద రాజకీయాలు: సీఎం ►వరద బాధిత ప్రాంతాల్లో బాధితులను ఆదుకునేందుకు ఇంతటి శరవేంగా చర్యలను తీసుకోవడం అన్నది గతంలో ఎన్నడూ జరగలేదు. గతంలో కనీసం నెల పట్టేది. ►ఇప్పుడు వారంరోజుల్లోనే బాధితులకు సహాయాన్ని అందించగలిగారు. ► బాధిత కుటుంబాలకు అన్నిరకాలుగా నష్టపరిహారాన్ని అందించాం. ►గతంలో ఇల్లు ధ్వంసమైతే పరిహారం అందడానికి నెలరోజులు పట్టేది. ►దురదృష్టవశాత్తూ ఎవరైనా మరణిస్తే వారి కుటుంబానికి పరిహారం ఇవ్వాలంటే నెలరోజులు పట్టేది. ►గల్లైంతైన వారికి ఎలాంటి పరిహారం ఇచ్చేవారు కాదు. ►అలాంటిది ఇవాళ వారంరోజుల్లో ఆయా కుటుంబాలకు పరిహారం ఇచ్చి వారిని అదుకున్నారు. ►గతంలో రేషన్, నిత్యావసరాలు ఇస్తే చాలు అనుకునేవాళ్లు. ►మనం వీటిని ఇవ్వడమే కాకుండా రూ.2వేల రూపాయలు అదనపు సహాయం కూడా ఇచ్చాం. ►గతంలో ఎప్పుడూ కూడా ఇలా చేయలేదు. ►సీజన్ ముగిసేలోగా నష్టపోయిన రైతులకు సహాయం చేసిన దాఖలాలు లేవు. ►ఇప్పుడు నష్టపోయిన రైతులకు యుద్ధప్రాతిపదికన ఎన్యుమరేషన్ పూర్తిచేసి.. సీజన్లోగా వారికి సహాయం అందిస్తున్నాం. ►గతంలో ఇన్పుట్సబ్సిడీ అందాలంటే కనీసం సంవత్సరం పట్టేది. ఆతర్వాత కూడా ఇచ్చిన దాఖలాలు లేవు. ►ఇవాళ పంట నష్టపోయిన సీజన్ ముగిసేలోగానే మనం అందిస్తున్నాం. ►రూ.6వేల కోట్లు నష్టం జరిగితే ... ఇచ్చింది రూ.34 కోట్లే అని విమర్శలు చేస్తున్నారు. ►జరిగిన నష్టంలో 40శాతం రోడ్లు రూపేణా, 30శాతానికిపైగా పంటరూపేణా, సుమారు 18శాతం ప్రాజెక్టులకు జరిగిన నష్టం రూపేణా జరిగింది. ►హుద్హుద్లో రూ.22వేల కోట్ల నష్టం జరిగిందని చెప్పారు.. ఇచ్చింది రూ.550 కోట్లు. ►అదంతా కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చింది. ►రూ.22వేల కోట్లు నష్టం వచ్చిందని చెప్పిన పెద్ద మనిషి ఇచ్చింది రూ.550 కోట్లు. ►కలెక్టర్లు, అధికారులు బాగా పనిచేసి పరిహారాన్ని ఇంతవేగంగా అందిస్తే.. దానిపైన కూడా బురద జల్లుతున్నారు. చదవండి: సీఎం జగన్ను కలిసిన కేంద్ర బృందం, పనితీరుపై ప్రశంసలు ఆ దిశగా మరో ముందడుగు.. సీఎం జగన్ ట్వీట్ -
వర్షాల కారణంగా మృతి చెందిన వారికి రూ.5 లక్షలు: సీఎం జగన్
సాక్షి, అమరావతి: భారీ వర్షాల కారణంగా ఏపీలోని పలు జిల్లాలు అతాలకుతలం అవుతోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వర్షాలపై ఐదు జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, అనంతపురం, వైఎస్ఆర్ జిల్లాల కలెక్టర్లతో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. భారీ వర్షాల నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై సీఎం అధికారులతో చర్చించారు. (చదవండి: ఎక్కడా రాజీపడొద్దు.. నిరంతరం అందుబాటులో ఉంటా: సీఎం జగన్) వరద సహాయక చర్యలను పర్యవేక్షించడానికి మూడు జిల్లాలకు ప్రత్యేక అధికారులను నియమించారు సీఎం జగన్. నెల్లూరు, చిత్తూరు, వైఎస్ఆర్ జిల్లాలకు ప్రత్యేక అధికారులను నియమించినట్లు తెలిపారు. వీరు జిల్లాలో నెలకొన్న పరిస్థితిని ఎప్పటికప్పుడు సీఎం జగన్కు నివేదిస్తారు. (చదవండి: రేణిగుంట ఎయిర్పోర్ట్లో భారీగా వరద.. విమానాల ల్యాండింగ్ నిలిపివేత) వరద సహాయక చర్యలను పర్యవేక్షించడానికిగాను నెల్లూరు జిల్లాకు విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి బుడితి రాజేశేఖర్.. చిత్తూరు జిల్లాకు మార్కెటింగ్ కమిషనర్ ప్రద్యుమ్న.. వైఎస్ఆర్ జిల్లాకు సీనియర్ అధికారి శశిభూషణ్ కుమార్ను నియమించారు. వారు ఇప్పటికే చేరుకున్నారని అధికారులు సీఎం జగన్కు తెలిపారు. ‘‘ముంపు బాధితులను కూడా వెంటనే సహాయక కేంద్రాలకు తరలించాం. వరదలో చిక్కుకుపోయిన వారిని హెలికాప్టర్ల ద్వారా తరలించే చర్యలు కూడా చేపట్టాం. సహాయక కార్యక్రమాల్లో ఎక్కడా రాజీలేకుండా అన్ని చర్యలూ తీసుకుంటున్నాం. ఆయా జిల్లాలకు అదనంగా నిధులు కూడా ఇచ్చాం’’ అని అధికారులు సీఎం జగన్కు తెలిపారు. తర్వాత జిల్లాల కలెక్టర్లతో మాట్లాడారు సీఎం జగన్. ఈ క్రమంలో చిత్తూరు జిల్లా కలెక్టర్ హరినారాయణ్, స్పెషల్ ఆఫీసర్ ప్రద్యుమ్న జిల్లాలోని పరిస్థితులను వివరించారు. ఈ సదర్భంగా సీఎం జగన్.. తిరుపతిలో వరదనీరు నిల్వ ఉండిపోవడానికి కారణాలపై అధ్యయనం చేయాలని ఆదేశించారు. చెరువుల పూడ్చివేత వల్ల ఇది జరిగిందని అధికారులు తెలపడంతో.. దీనిపై తగిన కార్యచరణసిద్ధం చేయాలని.. బాధితులను ఆదుకోవడంలో ఉదారంగా ఉండాలని సీఎం జగన్ ఆదేశించారు. ముంపునకు గురైన ప్రతి కుటుంబానికి రూ.2వేల రూపాయలు ఇవ్వాలని సీఎం జగన్ ఆదేశించారు. ఇళ్లను శుభ్రం చేసుకోవడానికి ఈ డబ్బు ఉపయోగపడుతుందని తెలిపారు. బాధితులకు నాణ్యమైన సేవలు అందించాలని.. మంచి భోజనం, తాగునీరు అందించాలని.. వర్షాల తర్వాత కూడా వ్యాధులు ప్రబలకుండా తగిన చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. తిరుమల దర్శనానికి వచ్చిన భక్తులకు సహాయంగా నిలవాలని సీఎం జగన్ తెలిపారు. రైళ్లు, విమానాలు రద్దైన నేపథ్యంలో వారికి అన్నిరకాలుగా తోడుగా ఉండాలన్నారు. ప్రమాదకర పరిస్థితుల నేపథ్యంలో భక్తులు కిందకు రాకుండా పైనే ఉంచాలని ఆదేశాలు జారీ చేశారు. కనీసం ఒకటి, రెండు రోజులు వారికి తగిన వసతులు సమకూర్చాలని తెలిపారు. టీటీడీ అధికారులను సమన్వయం చేసుకుని యాత్రికులకు సహాయంగా నిలవాలన్నారు. తిరుపతినగరంలో మున్సిపాల్టీ సహా, ఇతర సిబ్బందిని కూడా వినియోగించి పారిశుధ్యం పనులు చేపట్టాలని.. అవసరమైతే ఇతర మున్సిపాల్టీలనుంచి సిబ్బందిని తీసుకు వచ్చి ఆపరేషన్ చేపట్టాలని సీఎం జగన్ ఆదేశించారు. వైఎస్సార్ జిల్లాలో.. వైఎస్సార్ జిల్లాలో పరిస్థితులను వివరించారు కలెక్టర్ విజయరామరాజు. ఈ క్రమంలో గండ్లుపడ్డ చెరువుల్లో యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలన్నారు సీఎం జగన్. రోడ్లకు గండ్లు కారణంగా ఎక్కడ రవాణా స్తంభించినా... నీరు తగ్గగానే వెంటనే పునరుద్ధరణ చర్యలు చేపట్టాలన్నారు. విద్యుత్ పునరుద్ధరణపైనా అధికారులు ప్రత్యేక దృష్టిపెట్టాలన్నారు. వరదనీరు తగ్గగానే పంట నష్టంపై అధికారులు ఎన్యుమరేషన్ ప్రారంభించాలని సీఎం జగన్ సూచించారు. నెల్లూరు జిల్లాలో.. నెల్లూరు జిల్లాలో పరిస్థితులను వివరించారు కలెక్టర్ చక్రధర్. సోమశిలకు భారీగా వరద నీరు వస్తోందని తెలిపారు. ఈ క్రమంలో సమగ్ర వ్యూహంతో ముందుకు వెళ్లాలని సీఎం జగన్ ఆదేశించారు. పైనుంచి వరదను, డ్యాంలో ప్రస్తుతం ఉన్ననీటిని అంచనా వేసుకుని ఆమేరకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. నీటిపారుదల శాఖ అధికారులను సమన్వయం చేసుకుని వరదనీటి విడుదలలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని.. ఎక్కడెక్కడ ముంపు ఉండే అవకాశాలు ఉన్నాయో.. ఆయా ప్రాంతాల్లో సహాయక కేంద్రాలను తెరవాలని సీఎం జగన్ ఆదేశించారు. అనంతపురంలో.. అనంతపురంలో భారీ వర్షాల పరిస్థితిని వివరించారు కలెక్టర్ నాగలక్ష్మి. అలానే బాధిత జిల్లాల్లో దెబ్బతిన్న రోడ్లపై వివరాలను ప్రిన్సిపల్ సెక్రటరీలు కృష్ణబాబు, ద్వివేది అందించారు. సీఎం జగన్ మాట్లాడుతూ.. ఈ ప్రాంతాల్లో రోడ్ల పునరుద్ధరణకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే తాగునీటి వనరులు కలుషితం కాకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఎప్పటికప్పుడు పరీక్షలు చేసి... తాగునీటి నాణ్యతను తెలుసుకోవాలని, వ్యాధులు రాకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పారిశుధ్యంపైనకూడా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ ఆదేశించారు. ‘‘ఎక్కడెక్కడ పంట నష్టపోయిందీ వివరాలు తయారు చేయాలి. వీలైనంత త్వరగా వారికి పరిహారం అందించేలా అధికారులు చర్యలు తీసుకోవాలి. నష్టాన్ని నమోదు చేసినప్పుడు కాస్త ఉదారతతో ఉండాలి. మళ్లీ పంటవేసుకునేందుకు రైతులకు విత్తనాలు సరఫరా చేయాలి. వర్షాల కారణంగా దురదృష్టవశాత్తూ ప్రాణాలు కోల్పోయిన వారికి రూ.5 లక్షల పరిహారం వీలైనంత త్వరగా అందించాలి. జిల్లాల్లో కాల్సెంటర్లను ఏర్పాటు చేసుకోవాలి. వచ్చే వినతులపై తక్షణమే అధికారులు చర్యలు తీసుకోవాలి. ఎలాంటి సహాయం కావాలన్న యుద్ధప్రాతిపదికన సమకూరుస్తాం’’ అని సీఎం జగన్ తెలిపారు. నెల్లూరులో సహాయక చర్యల పర్యవేక్షణకు నీటి పారుదల శాఖ మంత్రి అనిల్ను పంపిస్తున్నామని.. కడపజిల్లాల్లో డిప్యూటీ సీఎం అంజాద్ బాషా ఇప్పటికే సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారని సీఎం జగన్ తెలిపారు. చదవండి: తిరుపతి విల విల -
ప్రభుత్వ వైద్యంపై భరోసా.. ఆచరణలో చూపుతున్న ఐఏఎస్, ఐపీఎస్లు
సాక్షి, భద్రాచలం(ఖమ్మం): నాటి ఐటీడీఏ పీఓ, నేటి ఖమ్మం జిల్లా కలెక్టర్ వీ.పీ.గౌతమ్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ సునీల్దత్, భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ దురిశెట్టి అనుదీప్ తదితర ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ప్రభుత్వ వైద్యంపై ప్రజల్లో భరోసా పెంచేలా చర్యలు తీసుకుంటున్నారు. చిన్నపాటి జ్వరమొస్తేనే కార్పొరేట్ ఆస్పత్రులకు పరుగులు తీస్తున్న ప్రజలకు ప్రభుత్వ ఆస్పత్రుల్లోనూ మెరుగైన వైద్యం అందుతుందని మాటల్లో చెప్పడమే కాదు చేతల్లోనూ నిరూపిస్తున్నారు. తమ సతీమణులకు వారు ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవం చేయించడంపై అభినందలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ దవాఖానాల్లో ప్రసవాలు ప్రభుత్వ ఆస్పత్రి అంటేనే ఇప్పటికీ చాలా మందిలో తెలియని అపనమ్మకం, రిస్క్ చేస్తున్నామా అనే ఆందోళన వెంటాడుతుంటాయి. అందుకే అప్పు చేసైనా సరే ప్రైవేట్ ఆస్పత్రుల్లో వైద్యానికే ఎక్కువ మంది మొగ్గుచూపుతున్నారు. ఇదే సమయాన ప్రభుత్వ దవాఖానాల్లో ప్రసవాలు జరిగేలా అధికారులు ప్రోత్సహిస్తున్నారు. ఇందులో భాగంగా ప్రభుత్వ వైద్యంపై చిన్నచూపు చూస్తున్న ప్రజల్లో అపోహలు తొలగించేలా ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు కృషి చేస్తుండడం విశేషం. గతంలో భద్రాచలం ఐటీడీఏ పీఓగా పనిచేసి ప్రస్తుతం ఖమ్మం కలెక్టర్గా వీ.పీ. గౌతమ్ 2019 అక్టోబర్ 28న భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో తన సతీమణికి ప్రసవం చేయించారు. అలాగే, 2020 ఆగస్టు 27న ఎస్పీ సునీ ల్దత్ కొత్తగూడెం ప్రభుత్వ ఆస్పత్రిలో తన భార్యకు ప్రసవం చేయించారు. తాజాగా భద్రాద్రి కలెక్టర్ అనుదీప్ సైతం తన సతీమణి మాధవికి బుధవారం భద్రాచలం ఏరియా ఆస్పత్రిలో ప్రస వం చేయించి అందరికీ ఆదర్శంగా నిలిచారు. ప్రభు త్వ ఆస్పత్రుల్లో వైద్య సేవలు పొందాలంటూ చెబు తున్న మాటలను ఆచరణలో చూపించిన యువ అధికారులు ‘భేష్’ అనిపించుకున్నారు. ఖమ్మం అదనపు కలెక్టర్ కూడా.. ఖమ్మం అదనపు కలెక్టర్గా ఐఏఎస్ అధికారి స్నేహలత మొగిలి విధులు నిర్వర్తిస్తుండగా, ఆమె భర్త, ఐపీఎస్ అధికారి శబరీష్ భద్రాద్రి జిల్లా మణుగూరు ఏఎస్పీగా ఉన్నారు. ఈమేరకు స్నేహలత గతనెల 22న ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవించారు. ఆ మరుసటి రోజు మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ఆస్పత్రికి వెళ్లి స్నేహలత శబరీష్ దంపతులను అభినందించారు. భద్రాచలం ఏరియా ఆస్పత్రి ప్రత్యేకం ఏజెన్సీలో నిత్యం వందలాది మంది రోగులకు వైద్య సేవలను అందించే ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి జిల్లాకే తలమానికంగా ఉంది. భద్రాచలం చుట్టు పక్కల ఉన్న ఛత్తీస్గఢ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజలకు సేవలందించటంలో ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో ముందంజలోనే నిలుస్తోంది. అత్యధికంగా సాధారణ ప్రసవాలు చేస్తుండడంతో పాటు నవజాత శిశువులు, ఇతరత్రా సేవలను అందించడానికి ఇక్కడ అన్ని వసతులు ఉన్నాయి. అదేవిధంగా నాలుగు మార్లు కాయకల్ప అవార్డు సొంతం చేసుకున్న ఘనత ఈ ఆస్పత్రి సొంతం. అలాంటి ఏరియా ఆస్పత్రిలో తమ కుటుంబీకులకు వైద్యం చేయించి ప్రభుత్వ వైద్యంపై ప్రజల్లో భరోసా కల్పించటానికి యువ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు కృషి చేస్తున్నారు. గతంలో భద్రాచలం ఐటీడీఏ పీఓగా పనిచేసిన వీరపాండియన్ తల్లిదండ్రులు ఇదే ఆస్పత్రిలో వైద్య సేవలను పొందేవారు. ఇవన్నీ పక్కన పెడితే భద్రాద్రి రామయ్య సన్నిధిలో కుమార్తె లేదా కుమారుడు పుట్టాలనే ఆకాంక్ష కూడా పలువురు తల్లిదండ్రులను ఈ ఆస్పత్రికి నడిపిస్తోందని చెబుతారు. కార్పొరేట్ సౌకర్యాలు ఉన్నాయ్..వినియోగించుకోండి ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని భద్రా ద్రి జిల్లా కలెక్టర్ అనుదీప్ సూచించారు. తన సతీమణికి మంగళవారం అర్ధరాత్రి 12 గంటలకు పురిటి నొప్పులు రాగా, భద్రాచలం ఆస్పత్రికి తీసుకెళ్లామని చెప్పారు. అక్కడ జిల్లా ఆస్పత్రుల సమన్వయ అధికారి ముక్కంటేశ్వరరావు, ఆస్పత్రి పర్యవేక్షకులు రామకృష్ణ పర్యవేక్షణలో వైద్యులు భార్గవి, దేవిక, నర్సులు కళ్యాణి, రాజ్యలక్ష్మి ప్రసవం చేశారని తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రిలో కార్పొరేట్ స్థాయిలో వసతులు, నిపుణులైన వైద్య సిబ్బంది ఉన్నారని పేర్కొన్నారు. దీంతో తన సతీమణికి భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో ప్రసవం చేయించినట్లు కలెక్టర్ బుధవారం సాయంత్రం ఓ ప్రకటనలో వెల్లడించారు. -
కలెక్టర్లు, ఎస్పీలు, డీపీవోలతో సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ వీడియో కాన్ఫరెన్స్
-
‘ఐఏఎస్, ఐపీఎస్లను కించపరిచేలా చంద్రబాబు మాట్లాడారు’
సాక్షి, చిత్తూరు: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో కలెక్టర్లు, ఎస్పీలు స్వేచ్ఛగా పని చేస్తున్నారని డిప్యూటీ సీఎం నారాయణస్వామి తెలిపారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. ఐఏఎస్, ఐపీఎస్లను కించపరిచేలా చంద్రబాబు మాట్లాడారని అన్నారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల తీరును చంద్రబాబు తప్పుబట్టడం సిగ్గు చేటన్నారు. అధికారులను కించపరిచేలా చంద్రబాబు మాట్లాడారని, ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఎలా వ్యవహరించారో అందరికీ తెలుసన్నారు. కలెక్టర్లు, ఎస్పీలను అవమానపరిచే విధంగా చంద్రబాబు తీరు ఉందని వారికి ఆయన వెంటనే క్షమాపణ చెప్పాలని మంత్రి నారాయణస్వామి డిమాండ్ చేశారు. -
గ్రేటర్ హైదరాబాద్.. కలెక్టరే కింగ్!
లే అవుట్లకు అనుమతివ్వడం, అక్రమ లే అవుట్లను గుర్తించడం వంటి కీలక అధికారాలను ప్రభుత్వం కలెక్టర్లకు అప్పగించింది. ఇప్పటి వరకు ఈ అధికారాలు హెచ్ఎండీఏ, డీటీసీపీ(డైరెక్టర్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్)ల పరిధిలో ఉండేవి. రాజధానితో సహా చుట్టూరా ఏడు జిల్లాల్లో విస్తరించిన మహానగరాభివృద్ధి సంస్థ పరిధిలో పట్టణ ప్రణాళికను పటిష్టం చేయాలని భావించిన ప్రభుత్వం..మాస్టర్ప్లాన్ను పకడ్బందీగా అమలు చేసే దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు నూతన లే అవుట్లకు అనుమతుల మంజూరు, అక్రమ లే అవుట్లను తొలగించే విషయంలో నియంత్రణ అధికారాలు చెలాయించిన హెచ్ఎండీఏ, డీటీసీపీలు..ఇక నుంచి మాస్టర్ప్లాన్ల తయారీ, పట్టణాల సమగ్ర సమాచార నిర్వహణ, డిజిటల్ డోర్ నెంబర్లను రూపొందించడం, జీఐఎస్ బేస్ మ్యాపుల తయారీ తదితర విధులను చేపట్టాలని పురపాలకశాఖ ముఖ్యకార్యదర్శి తాజాగా జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ పరిధిలో ప్రధాన విధులను హెచ్ఎండీఏ, డీటీసీపీల పరిధి నుంచి మినహాయిస్తూ.. ఇక నుంచి లే అవుట్ల అనుమతుల మంజూరు, అక్రమ లే అవుట్లను తొలగించే అధికారాలను టీఎస్బీపాస్ చట్టం ప్రకారం జిల్లా కలెక్టర్లకు అప్పగిస్తూ ప్రత్యేక ఉత్తర్వుల్లో స్పష్టంచేశారు. ఇక రియల్ బూమ్కు రెక్కలే? రాజధాని గ్రేటర్ హైదరాబాద్ నుంచి ఎటువైపు చూ సినా వంద కిలోమీటర్ల పరిధి వరకు రియల్బూమ్ అధికంగా ఉంది. ఆయా ప్రాంతాల్లో రియల్ రంగం ఏటేటా శరవేగంగా ముందుకు దూసుకెళుతోంది. అయితే నూతన లే అవుట్ల ఏర్పాటుకు సంబంధించి హెచ్ఎండీఏ, డీటీసీపీ విభాగాల నుంచి అనుమతులు సాధించడం రియల్టర్లకు, నిర్మాణ రంగ సంస్థలకు కత్తిమీద సాములానే పరిణమించింది. నెలలపాటు ఆయా విభాగాల చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా అనుమతుల మంజూరు ఆలస్యమయ్యేది. ఆయా విభాగాల అధికారులు సవాలక్ష కొర్రీలు పెడుతూ దరఖాస్తు దారుల సహనాన్ని పరీక్షించేవారు. ప్రభుత్వం నిర్దేశించిన ఫీజులతోపాటు..అధికారులకు లక్షల రూపాయలు ముడుపులు సమర్పించుకున్నా అనుమతులు పొందడం సాధ్యపడడం లేదని పలువురి నుంచి ప్రభుత్వ దృష్టికి భారీగా ఫిర్యాదులు అందాయి. దీంతో ఇక నుంచి కలెక్టర్లకు ఈ అధికారాలను అప్పజెప్పడంతో లే అవుట్ల ఏర్పాటుకు మార్గం సుగమం కానుందని, దీంతో రియల్బూమ్కు మళ్లీ రెక్కలొచ్చే అవకాశాలుంటాయని రియల్టర్లు అభిప్రాయపడుతుండడం విశేషం. హెచ్ఎండీఏ, డీటీసీపీ విభాగాల నూతన విధులు ఇలా.. ► మాస్టర్ప్లాన్ల తయారీ ► పట్టణ సమగ్ర సమాచార నిర్వహణ, డిజిటల్ డోర్ నెంబర్ల విధానాన్ని రూపొందించడం. ► ల్యాండ్ యూజ్ ప్రణాళికలను మండలాలు, స్థానిక సంస్థల వారీగా రూపొందించడం. ► ప్రజోపయోగ భవనాల డిజైన్లకు అనుమతుల మంజూరు, పార్కులు, ప్లే గ్రౌండ్స్, శ్మశానాలు, వెజ్, నాన్ వెజ్ మార్కెట్ల ఏర్పాటుకు సంబంధించి పట్టణ స్థానిక సంస్థలకు అనుమతుల మంజూరు. ► ప్రాంతీయ ప్రణాళికలను రూపొందించడం. ► డైరెక్టర్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ ఇక నుంచి హెచ్ఎండీఏకు ఆవల ల్యాండ్పూలింగ్ అంశానికి సంబంధించి సాంకేతిక అథారిటీగా వ్యవహరించనుంది. హెచ్ఎండీఏ పరిధిలో ఈ సంస్థనే ల్యాండ్పూలింగ్ అంశాన్ని పర్యవేక్షిస్తుంది. ► ప్రాంతీయ అభివృద్ధి ప్రణాళికల రూపకల్పన, టౌన్ప్లానింగ్ ప్రణాళికలను రూపొందించాలి. ► రహదారుల అభివృద్ధి ప్రణాళికల రూపకల్పన,పట్టణ స్థానిక సంస్థల పరిధిలో రహదారుల విస్తరణ ప్రణాళికలు రూపొందించడం. ► తమ పరిధిలోని వారసత్వ కట్టడాలు, పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిలను రూపొందించడం. ► టీఎస్బీపాస్ అమలుపై ఆయా జిల్లాల కలెక్టర్లకు దిశానిర్దేశం, సలహాలు అందజేయడం. -
భారీ వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలి: సీఎం జగన్
సాక్షి, అమరావతి: భారీ వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్లను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. వర్షాల పరిస్థితులపై ఎప్పటికప్పుడు సమీక్షించాలని కలెక్టర్లను సీఎం ఆదేశించారు. వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఈ అల్పపీడనం ప్రభావంతో కోస్తాంధ్రలో వర్షాలు కురిసే అవకాశాలున్నాయని అమరావతి వాతావారణ కేంద్రం హెచ్చరించింది. రాయలసీమలో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయని పేర్కొంది. కోస్తాంధ్రలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడనున్నాయని తెలిపింది. తీరం వెంబడి గంటకు 50-60 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీస్తాయని, మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. -
అరుదైన కుటుంబం; ఇంట్లో అందరూ కలెక్టర్లే
జైపూర్: తండ్రి శ్రీ సహదేవ్ సహరన్ మధ్యతరగతి కుటుంబానికి చెందిన ఒక రైతు. పెళ్లి చేసుకున్న తర్వాత ఆయనకు ఐదుగురు ఆడపిల్లలే పుట్టారు. కొడుకులు లేరని కుంగిపోకుండా తన కూతుళ్లనే కొడుకులుగా భావించాడు. '' ఐఏఎస్ కావాలన్న తన కల నెరవేర్చుకోలేకపోయానని.. మీరు నా కోరికను నెరవేర్చాలంటూ'' కూతుళ్లకు వివరించాడు. అలాగే వారందరిని కష్టపడి చదివించాడు. ఈరోజు అతని కష్టం ఊరికే పోలేదు.. ఆ ఐదుగురు సరస్వతి బిడ్డలయ్యారు. ఒక ఇంట్లోనుంచి ఒకరు కలెక్టర్గా ఎంపికవడయే గొప్ప అనుకుంటే సహరన్ కుటుంబం నుంచి ఏకంగా ఐదుగురు అక్కాచెల్లెళ్లు కలెక్టర్లుగా ఎంపికయ్యారు. ఇప్పుడు తండ్రి సహరన్తో పాటు అతని ఐదుగురు బిడ్డలు యువతకు ఆదర్శంగా నిలిచారు. ఈ అరుదైన ఘటన రాజస్తాన్లోని హనుమాఘర్లో చోటుచేసుకుంది.. 2018లో నిర్వహించిన రాజస్తాన్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ పరీక్ష ఫలితాలు మంగళవారం ప్రకటించారు. హనుమఘర్కు చెందిన అన్షు, రీతు, సుమన్లు రాజస్థాన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్కు(ఆర్ఏఎస్) ఏకకాలంలో ఎంపికై అందరి దృష్టిని ఆకర్షించారు. ఇప్పటికే ఆ ఇంట్లో నుంచి రోమా, మంజులు కలెక్టర్లుగా పనిచేస్తున్నారు. తాజాగా ఈ ముగ్గురు కూడా ఆర్ఏఎస్కు ఎంపికవడంతో ఆ ఇంట్లో ఇప్పుడు అందరూ కలెక్టర్లుగా ఉండడం విశేషం. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి పర్వీన్ కష్వాన్ ఆర్ఏఎస్కు ఎంపికైన ముగ్గురు అక్కచెల్లెళ్ల ఫోటోను షేర్ చేస్తూ ట్విటర్లో స్పందించారు. ఇది నిజంగా గర్వించదగిన విషయం. అన్షు, రీతు, సుమన్లు ఏకకాలంలో అడ్మినిస్టేటివ్ సర్వీస్కు ఎంపికవడం గొప్ప విషయం. ఈ విజయంతో వారి తండ్రికి , కుటుంబానికి అరుదైన గౌరవం దక్కింది. అంటూ కామెంట్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. Such a good news. Anshu, Reetu and Suman are three sisters from Hanumangarh, Rajasthan. Today all three got selected in RAS together. Making father & family proud. pic.twitter.com/n9XldKizy9 — Parveen Kaswan, IFS (@ParveenKaswan) July 14, 2021 -
104 కాల్ సెంటర్.. వన్ స్టాప్ సొల్యూషన్ కావాలి: సీఎం జగన్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఫీవర్ సర్వే నిరంతరాయంగా జరగాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. జ్వరం లక్షణాలుంటే వెంటనే పరీక్షలు చేసి, వైద్య సేవలందించాలని కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. నోటిఫై చేసిన ఆస్పత్రులను పర్యవేక్షించాలని, ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా స్పందన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ.. 104 కాల్ సెంటర్.. వన్ స్టాప్ సొల్యూషన్ కావాలని, థర్డ్వేవ్ వస్తే ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని సీఎం జగన్ పేర్కొన్నారు. వ్యాక్సినేషన్ సెకండ్ డోస్కు ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. నకిలీ విత్తనాలను అడ్డుకోవడానికి గట్టి చర్యలు జులై 9 నుంచి 23 వరకు రైతు భరోసా చైతన్య యాత్రలు చేపట్టాలని సీఎం వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. ఆర్బీకేల విధివిధానాలు, సీఎం యాప్ పనితీరు, ఈ-క్రాపింగ్, వ్యవసాయ సంబంధిత అంశాలపై రైతులకు అవగాహన కల్పించాలని సీఎం జగన్ తెలిపారు. విత్తనాల నాణ్యత విషయంలో ఎప్పటికప్పుడు పరిశీలనలు చేయాలని, నకిలీ విత్తనాలను అడ్డుకోవడానికి గట్టి చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. విరివిగా మొక్కలు నాటే కార్యక్రమం జగనన్న పచ్చతోరణం కార్యక్రమంపై దృష్టి పెట్టాలని, విరివిగా మొక్కలు నాటే కార్యక్రమం చురుగ్గా సాగాలని సీఎం జగన్ పేర్కొన్నారు. డిసెంబర్కల్లా 4,024 గ్రామాలకు ఫైబర్ కనెక్షన్ అందుతుందని, ఆ సమయానికల్లా ఆయా పంచాయతీల్లో డిజిటల్ లైబ్రరీలు సిద్ధం కావాలన్నారు. పట్టణాల్లో మధ్యతరగతి ప్రజలకు ఇళ్ల స్థలాలు ఇచ్చే కార్యక్రమంపై దృష్టి పెట్టాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. అర్హులైన వారికి 90 రోజుల్లోగా ఇంటి పట్టాలు ఇవ్వాలని సూచించారు. ఈనెల 8న రైతు దినోత్సవం నిర్వహిస్తున్నాం ఆర్వోఎఫ్ఆర్ కింద పంపిణీ చేసిన భూముల అభివృద్ధిపై దృష్టి పెట్టాలని, హార్టికల్చర్, సెరికల్చర్లు ఆయా భూముల్లో సాగయ్యేలా చేయాలని సీఎం వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. ఈనెల 8న రైతు దినోత్సవం నిర్వహిస్తున్నామని, 22న వైఎస్ఆర్ కాపునేస్తం, 29న జగనన్న విద్యాదీవెన అమలు చేస్తామని సీఎం జగన్ తెలిపారు. -
డాక్టర్లు, వైద్య సిబ్బంది సేవలు అసమానం: సీఎం జగన్
సాక్షి, అమరావతి: ‘వైద్యులు, వైద్య సిబ్బంది అందిస్తున్న సేవలు అసమానం.. ఒక తల్లి మాదిరి సేవలు చేస్తున్న మీకు ధన్యవాదాలు’ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. ప్రాణాంతకం అని తెలిసినా రోగులకు సేవలు అందిస్తున్నారని వైద్యులు, వైద్య సిబ్బంది సేవలను కొనియాడారు. ఎలాంటి సహాయ, సహకారం కావాలన్నా అందించేందుకు సిద్దమని ప్రకటించారు. వైద్యులు, వైద్య సిబ్బందితో పాటు అన్ని జిల్లాల కలెక్టర్లతో బుధవారం సీఎం జగన్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన వైద్యులు, వైద్య సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం కలెక్టర్లతో జరిగిన సమావేశంలో వైఎస్సార్ జలకళ, ఇళ్ల పట్టాల పంపిణీ, గృహ నిర్మాణాల ప్రగతిని సీఎం జగన్ తెలుసుకున్నారు. సమావేశంలో సీఎం వైఎస్ జగన్ ఈ విధంగా మాట్లాడారు. ‘కోవిడ్పై పోరాటంలో నిమగ్నమైన సిబ్బందికి అభినందనలు. మన రాష్ట్రానికి మహా నగరాలు లేవు, అంత పెద్ద మౌలిక సదుపాయాల్లేవు కానీ.. గట్టి కృషి ద్వారా కోవిడ్పై పోరాటం చేస్తున్నారు. వైద్యులు, నర్సులు, వలంటీర్లు, ఆశా కార్యకర్తలు, పారిశుద్ధ సిబ్బందితో పాటు.. ప్రతి ఒక్కరూ అద్భుతంగా పనిచేస్తున్నారు. కొద్ది రోజులుగా జిల్లాల్లో కేసులు తగ్గుతున్నాయి. ఇది సానుకూల పరిస్థితి. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల కలెక్టర్లు ఎక్కువగా సారించాలి. కేసులు ఎక్కువగా నమోదవుతున్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలి. కరోనా సోకినవారిలో 70 శాతానికి పైగా ఆరోగ్యశ్రీ కింద చికిత్స అందిస్తున్నాం. 50 శాతం బెడ్లు కచ్చితంగా ఆరోగ్యశ్రీ పేషెంట్లు ఇవ్వాలి. ప్రైవేట్ ఆస్పత్రుల్లో నిబంధనలు కచ్చితంగా అమలు కావాలి. ఆరోగ్యమిత్రలు, సీసీ కెమెరాలు సమర్థవంతంగా పనిచేయాలి’ అని వైద్యులు, వైద్య సిబ్బందికి సీఎం వైఎస్ జగన్ దిశానిర్దేశం చేశారు. అధిక చార్జీలు వసూలు చేసే ఆస్పత్రులపై కఠిన చర్యలు అధిక చార్జీలు వసూలు చేసే ఆస్పత్రులపై కఠిన చర్యలు‘అధిక ఛార్జీలు వసూలు చేస్తున్న ఆస్పత్రులపై 24 గంటల్లో చర్యలు తీసుకోవాలి. ఇది మహమ్మారి సమయం, ప్రతి పేదవాడికి సేవలు చేయాల్సిన సమయం. 104 కాల్సెంటర్ వన్ స్టాప్ సొల్యూషన్గా పెట్టాం. మన బంధువులే మనకు ఫోన్ చేస్తే ఎలా స్పందిస్తామో.. 104కు ఎవరైనా ఫోన్ చేస్తే అలాగే స్పందించాలి. జర్మన్ హేంగర్లపై కలెక్టర్లు, జేసీలు దృష్టి పెట్టాలి. ఆక్సిజన్ ఎయిర్ కండిషన్ పెట్టాలి, శానిటేషన్ బాగుండాలి. రోగులకు మంచి ఆహారం అందించాలి. ఆక్సిజన్ సరఫరా 330 టన్నుల నుంచి 600 టన్నుల సామర్థ్యానికి పెంచాం. కనీసం రెండ్రోజులకు సరిపడా నిల్వలను అందుబాటులో ఉంచాం. ఆక్సిజన్ వినియోగంపై ఎప్పటికప్పుడు ఆడిటింగ్ జరగాలి. ప్రతి ఆస్పత్రిలో ఆక్సిజన్ నిల్వలు సక్రమంగా ఉండేలా చూసుకోవాలి. రెమ్డెసివిర్ ఇంజక్షన్లు బ్లాక్మార్కెట్కు తరలిస్తే కఠిన చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులకు రెమ్డెసివిర్ ఇంజక్షన్లు ఇస్తున్నాం’ అని సీఎం వైఎస్ జగన్ వివరించారు. అనంతరం వైఎస్సార్ అర్బన్, రూరల్ హెల్త్ క్లినిక్స్, గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు, అంగన్వాడీ కేంద్రాల నిర్మాణాలపై సీఎం వైఎస్ జగన్ సమీక్షించారు. అనంతరం ఖరీఫ్ సన్నద్ధత, ఎరువులు, విత్తనాల అందుబాటుపై అధికారులతో సీఎం జగన్ చర్చించారు. ఖరీఫ్లో వ్యవసాయ రుణాలపై సమీక్షించారు. వీటితో రాష్ట్రంలో కోవిడ్ నివారణ చర్యలపై అధికారులకు సీఎం జగన్ దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో మంత్రులు ఆళ్లనాని, బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, డీజీపీ గౌతమ్ సవాంగ్, కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. జులై 8న వైఎస్ఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఆర్బీకేలు ప్రారంభం జులై 8న వైఎస్ఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఆర్బీకేలు ప్రారంభిస్తామని సీఎం వెల్లడించారు. కొత్తగా నిర్మాణం చేపట్టనున్న మెడికల్ కాలేజీలకు 30న శంకుస్థాపన చేస్తామన్నారు. వచ్చే ఉగాది నాటికి పట్టణాలు, నగరాల్లో మధ్యతరగతి ప్రజలకు అందుబాటు ధరలకే ప్లాట్లు అందిస్తామన్నారు. దాదాపు 17 వేల ఎకరాలు అవసరం అవుతుందని అంచనా వేస్తున్నామన్నారు. రకరకాల కేటగిరిల్లో ప్రభుత్వ, ప్రైవేట్ భూముల సేకరణ జరుగుతుందన్నారు. దాదాపు 3 లక్షల మందికి ప్లాట్లు అందిస్తామన్నారు. వివాదాల్లేని ప్లాట్లు రిజిస్ట్రేషన్, లాభాపేక్ష లేకుండా అర్హులకు ప్లాట్లు పంపిణీ చేస్తామన్నారు. లే అవుట్ను కూడా అభివృద్ధి చేస్తామని సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు. జూన్లో అమలు కానున్న పథకాలు.. జూన్లో అమలు కానున్న పథకాలను సీఎం వైఎస్ జగన్ ప్రకటించారు. జూన్ 8న జగనన్న తోడు పథకం, జూన్ 15న వైఎస్ఆర్ వాహన మిత్ర పథకం, జూన్ 22న వైఎస్ఆర్ చేయూత పథకం అమలు చేస్తామని సీఎం తెలిపారు. గ్రామ సచివాలయాల్లో జాబితాలను డిస్ప్లే చేసి.. సోషల్ ఆడిట్ తర్వాత మార్పులు, చేర్పులు చేయాలన్నారు. జూన్ 31న ప.గో జిల్లాలో అమూల్-ఏపీ పాల ప్రాజెక్ట్ ప్రారంభిస్తామని సీఎం వైఎస్ జగన్ తెలిపారు. -
YS Jagan: అప్రమత్తతతో ఎదుర్కొందాం
సాక్షి, అమరావతి: యాస్ తుపాన్ను ఎదుర్కొనేందుకు సర్వసన్నద్ధంగా ఉండాలని కలెక్టర్లు, అధికార యంత్రాంగాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. వాతావరణ శాఖ నివేదికలను పరిశీలిస్తూ ఎప్పటికప్పుడు తగిన నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. తుపాను కదలికలకు అనుగుణంగా అవసరమైన చర్యలను చేపట్టాలని, ఈ విషయంలో అధికారులు, కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. యాస్ తుపాను నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మంగళవారం ఆయన తన క్యాంపు కార్యాలయం నుంచి విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ శ్రీకాకుళం నుంచి వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు. పెద్దగా ప్రభావం కనిపించడం లేదు శ్రీకాకుళం జిల్లాలో అక్కడక్కడా జల్లులు తప్ప ప్రస్తుతానికి పెద్దగా ప్రభావం కనిపించడం లేదని చెప్పారు. ఉన్నతాధికారులంతా ఇక్కడే ఉన్నారని, తాత్కాలిక నిర్మాణాల్లో కోవిడ్ రోగులు లేకుండా అన్ని చర్యలు తీసుకున్నామని సీఎంకు తెలిపారు. ఆక్సిజన్ కొరత రాకుండా, విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడకుండా ఏర్పాట్లు చేశామని చెప్పారు. ఈ సమీక్షలో ఆయా జిల్లాల కలెక్టర్లు సీఎంకు నివేదించిన వివరాలు ఇలా ఉన్నాయి. సర్వసన్నద్ధంగా ఉన్నాం ► ఒడిశా అధికారులతో సమన్వయం చేసుకుంటున్నామని శ్రీకాకుళం కలెక్టర్ జె. శ్రీనివాస్ తెలిపారు. ఆక్సిజన్ ట్యాంకర్ల రవాణాలో ఇబ్బందులు వచ్చిన పక్షంలో వెంటనే ఆ సమస్యను తీర్చడానికి ఇచ్ఛాపురం వద్ద ప్రత్యేక బృందాలను పెట్టామన్నారు. ► విజయనగరం జిల్లాలో ఇప్పటి వరకు తుపాను ప్రభావం ఏమీ కనిపించలేదని, అయినా అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నామని జిల్లా కలెక్టర్ హరి జవహర్లాల్ తెలిపారు. కోవిడ్ రోగులు ఉన్న 28 ఆస్పత్రుల్లో జనరేటర్లు ఏర్పాటు చేశామన్నారు. ముందస్తుగా డీజిల్, మందులు, ఆక్సిజన్ను నిల్వ ఉంచామని చెప్పారు. ► విశాఖలో పరిస్థితులు సాధారణంగానే ఉన్నాయని కలెక్టర్ వినయ్ చంద్ తెలిపారు. అయినా సరే.. అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నామని.. ఆక్సిజన్ తయారీ ప్లాంట్లకు, సిలిండర్ ఫిల్లింగ్ ప్లాంట్లకు కరెంటు సరఫరాలో ఎలాంటి ఇబ్బంది రాకుండా చర్యలు తీసుకున్నామని వెల్లడించారు. 80 ఆస్పత్రుల్లో ముందస్తు ఏర్పాట్లు చేశామని చెప్పారు. ► ఈ సమీక్షలో పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు, అగ్రికల్చర్ మిషన్ వైస్ చైర్మన్ ఎంవీయస్ నాగిరెడ్డి, వ్యవసాయ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ పూనం మాలకొండయ్య, వ్యవసాయ శాఖ కమిషనర్ హెచ్.అరుణ్కుమార్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
రుయా ఘటనపై సీఎం జగన్ తీవ్ర దిగ్భ్రాంతి
-
తిరుపతి రుయా ఘటన తీవ్రంగా కలచివేసింది: సీఎం జగన్
సాక్షి, అమరావతి: స్పందనలో భాగంగా జిల్లా కలెక్టర్లతో తన క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కరోనా కట్టడి చర్యలపై కలెక్టర్లకు సీఎం దిశానిర్దేశం చేశారు. కోవిడ్, ఉపాధి హామీ పనులు, వైఎస్సార్ జలకళ, వైఎస్సార్ అర్బన్ క్లినిక్స్, హౌసింగ్, స్పందనకు వచ్చిన వినతులు, ఖరీఫ్కు సన్నద్ధతపై సీఎం సమీక్షించారు. కోవిడ్తో కలిసి జీవించాల్సిన పరిస్థితుల్లో ఉన్నామని సీఎం వైఎస్ జగన్ అన్నారు. బాధాకరమైన ఘటనలు కూడా జరుగుతున్నాయని.. నిన్న రుయా ఆస్పత్రిలో జరిగిన ఘటన తీవ్రంగా కలచి వేసిందన్నారు. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున పరిహారాన్ని సీఎం ప్రకటించారు. మనం ఎంత కష్టపడుతున్నా, ప్రయత్నాలు చేస్తున్నా కూడా కొన్ని కొన్ని మన చేతుల్లో లేని అంశాలకు కూడా మనం బాధ్యత వహించాల్సి వస్తోందన్నారు. ‘‘తమిళనాడు నుంచి రావాల్సిన ఆక్సిజన్ ట్యాంకర్ సరైన సమయానికి రాలేకపోయినందున, ఆక్సిజన్ కొరత ఏర్పడిందని.. 11 మంది చనిపోయారని అధికారులు చెప్పారు. ఆక్సిజన్ పరిస్థితి ఏ స్థాయిలో ఉందంటే నిన్నకూడా ఆరు ట్యాంకర్లను గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి ఒడిశాకు విమానంలో పంపాం. రవాణా సమయాన్ని ఆదా చేయడానికి ఎయిర్ లిఫ్ట్ చేశాం. అక్కడ నింపి... రోడ్డు మార్గంలో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. విదేశాల్లో కూడా ఆక్సిజన్ కొనుగోలు చేసి షిప్స్ ద్వారా తెప్పిస్తున్నాం. ఇన్నిరకాలుగా ఆక్సిజన్ కొరత రాకుండా ప్రయత్నాలు చేస్తున్నాం. ఇన్ని ప్రయత్నాలు చేస్తున్న కూడా కొన్ని కొన్ని మన చేతుల్లో లేకపోవడంవల్ల నష్టాలు జరుగుతున్నాయి. కలెక్టర్లందరికీ కూడా చెప్తున్నా... చాలా అప్రమత్తతతో వ్యవహరించాలి. ఇంకా మానవత్వం చూపించాల్సిన అవసరం ఉంది. కోవిడ్ కారణంగా నెలకొన్న సమస్యలను మానవత్వంతో ఎదుర్కోవాల్సి ఉందని’’ సీఎం అన్నారు. ‘‘18 ఏళ్లకు పైబడ్డ వారికి వ్యాక్సిన్ ఇవ్వడానికి 172 కోట్ల డోసులు దేశానికి అవసరమైతే ఇప్పటి వరకూ కేవలం 17 కోట్లు డోసులు మాత్రమే ఉత్పత్తి అయిన పరిస్థితి కనిపిస్తోంది. 45 సంవత్సరాలు పైచిలుకు ఉన్నవారు రాష్ట్రంలో 1.48 కోట్ల మంది ఉన్నారు. వీరికి 2 డోసులు చొప్పున దాదాపు 3 కోట్లు డోసులు ఇవ్వాలి. 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉన్న వారు రాష్ట్రంలో 2 కోట్ల మంది జనాభా సుమారుగా ఉన్నారు. వీరికి దాదాపు 4 కోట్ల డోసులు అవసరం. అంటే 18 ఏళ్ల పైబడి రాష్ట్రంలో ఉన్నవారికి వ్యాక్సిన్లు ఇవ్వాలంటే దాదాపు 7 కోట్ల డోసులు ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పటివరకూ 73 లక్షల డోసులు మాత్రమే కేంద్రం నుంచి మనకు అందాయి. ఈ పరిస్థితి ఉందని అందరికీ తెలుసు. డబ్బులు తీసుకుని మాకు సప్లైచేయండని కోరినా సరే కంపెనీలు తీసుకోవడం లేదు. వ్యాక్సిన్ల పంపిణీ అన్నది కేంద్రం నియంత్రణలో ఉంది. ఈ మేరకు సుప్రీంకోర్టులో కేంద్రం కూడా అఫిడవిట్లో దాఖలు చేసింది. జనాభా ప్రాతిపదికన కోటాను నిర్దారిస్తామని అఫిడవిట్లో పేర్కొంది. ఇలాంటి పరిస్థితి ఉండి కూడా చంద్రబాబు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ–5 లాంటి వాళ్లు చేస్తున్న ప్రచారాలు ఒక్కసారి చూడండి. వ్యాక్సిన్లకు కేవలం రూ.45 కోట్లు మాత్రమే ఇచ్చారు. రూ.1600 కోట్లు ఇవ్వలేరా? కమీషన్లు కోసం చూస్తున్నారు? అని ప్రచారం చేస్తున్నారు. ప్రతిపక్షం మాట్లాడుతున్న ఈ మాటలను పతాక శీర్షికల్లో ఈనాడు లాంటివి వేస్తున్నాయి. ప్రజల్లో అలజడిని రేకెత్తించడానికి, భయాందోళనలు సృష్టించడానికి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని’’ సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘టియర్ –1 సిటీస్, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై లాంటి నగరాలు లేకపోయినా దేశంలో ఎక్కడా లేని విధంగా వైద్య సేవలు అదించగలుగుతున్నాం. మరణాల రేటు పరిశీలిస్తే చాలా రాష్ట్రాలతో పోలిస్తే చాలా మెరుగ్గా ఉన్నాం. కలెక్టర్ల స్థాయి నుంచి ఆశా వర్కర్, వాలంటీర్ స్థాయి వరకూ ఎంతో కమిట్మెంట్గా చిత్త శుద్ధితో పనిచేస్తున్నాం. అయినా సరే కొన్ని కొన్ని ఘటనలు జరుగుతున్నాయి. అయినా సరే.. మరింత సమర్థవంతంగా, మానవత్వంగా, సానుభూతి చూపించి పనిచేద్దాం. జీర్ణించుకోలేని పరిస్థితుల్లో కొందరు రాజకీయ నాయకులు, ఎల్లోమీడియా ఉంది. మన తప్పు కాకపోయినా, పక్కరాష్ట్రం నుంచి రావాల్సిన ట్యాంకర్ సకాలానికి రాకపోయినా సరే ... బాధ్యత తీసుకుని నిన్నటి రుయా ఘటనలో మరణించిన కుటుంబాలకు రూ. 10 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని కలెక్టర్ను ఆదేశిస్తున్నాం. వారి కుటుంబాల దగ్గరకు వెళ్లి పరిహారం ఇవ్వండి, వారి బాసటగా ఉండండి. తప్పులు మళ్లీ జరక్కుండా... భవిష్యత్తులో, ఇంకా ఎలా చేయగలుగుతాం అన్నదానిపై దృష్టిపెట్టాలి. తప్పును ఒప్పుకోవడం అన్నది చిన్నతనం కాదు. కోవిడ్ విషయంలో మనం అత్యంత పారదర్శకంగా ప్రతి అడుగులోనూ వ్యవహరించాం. ఈ 22 నెలల కాలంలోనే ఒక్క బటన్ నొక్కితే ఎలాంటి అవినీతికి, వివక్షకు తావులేకుండా రూ. 87వేల కోట్ల రూపాయలు పేదలకు నేరుగా వారి బ్యాంకు ఖాతాల ద్వారానే ఇవ్వగలిగాం. ఇలాంటి ప్రభుత్వం వ్యాక్సిన్లకు రూ.1600 కోట్లు ఖర్చు చేయడానికి వెనకాడుతుందా?’’ అని సీఎం అన్నారు. సమీక్షలో సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. ►104 వ్యవస్థను ప్రతి ఒక్కరూ ఓన్చేసుకోవాలి ►104కు అనుసంధానంగా ప్రతి జిల్లా స్థాయిలో కూడా వ్యవస్థ ఉండాలి ►104కు కాల్చేస్తే రెస్పాన్స్ లేదనే మాట రాకూడదు ►సంబంధిత జేసీలు దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని ముందుకు సాగాలి ►104కు కాల్చేస్తే మంచి సేవలు అందుతున్నాయనే ప్రజలు భావించాలి ►మందులు ఇవ్వడం, క్వారంటైన్ సెంటర్లో చేర్పించడం, ఆస్పత్రుల్లో బెడ్లు ఇవ్వడం ఇవన్నీకూడా మన బాధ్యత ►మొదటసారి దేశంలో ఆరోగ్యశ్రీ కింద కోవిడ్ చికిత్సను పూర్తి ఉచితంగా ఇస్తున్నాం: ►104కు కాల్చేస్తే ఉచితంగా వైద్యం అందించే రాష్ట్రాల్లో మన రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది: ►104 ద్వారా 16 నుంచి 17వేల కాల్స్ వస్తున్నాయి ►కాల్స్ రిసీవ్చేసుకునే కెపాసిటీని కూడా పెంచాం ►దీనికి అనుగుణంగా జిల్లాల్లో అనుసంధాన వ్యవస్థల్లో వనరులను పెంచుకోవాల్సి ఉంటుంది ►మన ఇంట్లో మనకు కావాల్సిన వ్యక్తి ఫోన్ చేస్తే ఎలాంటి స్పందన ఆశిస్తామో... అలాంటి స్పందనే యంత్రాంగం నుంచి ఉండాలి ►టెస్టింగ్, మెడికల్ కన్సల్టేషన్, ట్రాన్స్పోర్టేషన్.. .ఇవన్నీకూడా అందుబాటులోకి వచ్చేలా చూడాలి ►3 గంటల్లోకి వారికి సేవలందించే బాధ్యతలను తీసుకోవాలి ►ఏపీలో 648 ఆస్పత్రులను ఎంపానెల్ చేశాం ►47,947 బెడ్లను అందుబాటులోకి తీసుకు వచ్చాం, 41,315 బెడ్లు భర్తీలో ఉన్నాయి ►ఆస్పత్రి ఆవరణ లో టెంపరరీ జర్మన్ హాంగర్స్ను ఏర్పాటు చేయాలి ►దీని వల్ల ఆస్పత్రిలో వేచిచూసే పరిస్థితులు ఉండవు, డాక్టర్లు కూడా వెంటనే వచ్చి వైద్యం చేసే అవకాశం ఉంటుంది: ►దీంతో పాటు కోవిడ్ కేర్ సెంటర్లపై దృష్టిపెట్టాలని కోరుతున్నాం ►కోవిడ్ కేర్ సెంటర్లలో కూడా ఆక్సిజన్ సప్లై అవసరమైనంత మేరకు ఏర్పాటుచేసే ఆలోచనలు అధికారులు చేయాలి ►ఇప్పటికే వైద్య ఆరోగ్యశాఖ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ల కొనుగోలుపై దృష్టిపెట్టింది. త్వరలోనే ఇవి అందుబాటులోకి వస్తాయి ►ఆస్పత్రుల్లో ఉండే ఆక్సిజన్ పైపులైన్లను పర్యవేక్షణ చేయండి ►టెక్నికల్ స్టాఫ్ను కచ్చితంగా నియమించండి ►నిర్దేశిత ప్రమాణాల ప్రకారం సరైన ఒత్తిడితో ఆక్సిజన్ వెళ్లేలా చేయాలి ►అలాగే ఐసీయూలోకూడా ప్రెజర్ బూస్టర్స్కూడా ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలన చేయండి ►కర్ణాటక, తమిళనాడు, ఒడిశాలనుంచి మనకు ఆక్సిజన్ వస్తోంది ►మూడు రాష్ట్రాలకు ముగ్గురు అధికారులను ఆయా రాష్ట్రాలకు పంపిస్తున్నాం ►ఆక్సిజన్ సప్లై పెంచడానికి వీరు దృష్టిపెడతారు ►తమిళనాడుకు కరికాలవలవన్, కర్ణాటకకు అనంతరాములు, ఒడిశాకు పరీడాలను పంపిస్తున్నాం ►రేపటి నుంచి ఈ వ్యవస్థ పనిచేస్తుంది ►అలాగే జిల్లాల్లో ఆక్సిజన్వార్ రూమ్స్ ఏర్పాటు చేయాలి: ►ఎస్ఓఎస్ ... ఎమర్జెన్సీ మెసేజ్ రాగానే వెంటనే చర్యలు తీసుకోవాలి ►ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు వెంటనే తెలియజేయాలి ►కలెక్టర్లు జాగ్రత్తగా పర్యవేక్షణ చేయగలిగితే.. సమర్థవంతంగా ముందుకు సాగే అకాశం ఉంటుంది ►అలాగే జిల్లాల్లో స్టోరేజీ కెపాసిటీలు కూడా ఎక్కడైనా ఉన్నాయా? లేదా? అన్నదానిపై దృష్టిపెట్టాలి ►ఎక్కడైనా పరిశ్రమలు ఉన్నాయా? వాటికి సదుపాయాలు ఉన్నాయా? అన్నదానిపై దృష్టిపెట్టాలి ►ఇప్పటికే నేవీ బృందాలు రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు వెళ్తున్నాయి ►ఈ సమయంలో వారు చాలా ముందుకు వచ్చి సహాయం చేస్తున్నారు ►నేవీకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాను ►నేవీ బృందాల సేవలను బాగా వినియోగించుకోండి ►కోవిడ్ వైద్యం కోసం కొన్ని ప్రైవేటు ఆస్పత్రులను కూడా తీసుకున్నాం ►మంచి ఆహారం అందుతున్నాయా? లేవా? పారిశుద్ధ్యం బాగుందా? లేదా? మందులు సక్రమంగా అందుతున్నాయా? రెమిడెసివర్ ఇంజక్షన్లు అందుబాటులో ఉన్నాయా? లేవా?అలాగే సిబ్బంది తగినంత సంఖ్యలో ఉన్నారా? లేదా? చూడండి ►ఈ ఆస్పత్రుల్లో తప్పనిసరిగా ఆరోగ్య మిత్ర ఉండేలా చూసుకోండి ►సమస్యలు ఏమైనా ఉంటే ఫిర్యాదు చేయడానికి నంబర్ను ఉంచండి ►అన్ని ప్రైవేటు ఆస్పత్రుల్లోకూడా 50శాతం బెడ్లు ఆరోగ్యశ్రీ లబ్ధిదారులకు అందుబాటులో ఉంచాలని కోరాం. దీన్ని కూడా పర్యవేక్షణ చేయాలి ►ఇక్కడకూడా అన్ని రకాలుగా మౌలిక సదుపాయాలు ఉన్నాయా? లేవా? చూడాలి ►వారికి కావాల్సిన మందులు, ఆక్సిజన్ తదితర వాటి సరఫరా సక్రమంగా ఉండేలా చూడాలి ►ప్రతి 2–3 ఆస్పత్రులకు ఒక నోడల్ ఆఫీసర్ కచ్చితంగా ఉండాలి ►648 ఆస్పతులకూ కచ్చితంగా నోడల్ అధికారులను నియమించాలి ►ఆరోగ్య శ్రీ, ఆక్సిజన్ సప్లై, ఆస్పత్రుల పనితీరు, శానిటేషన్, ఫుడ్క్వాలిటీ దీనిమీద నోడల్ అధికారులు దృష్టిపెట్టాలి. మనకు నివేదికలు కూడా అందిస్తారు ►ఫ్లయింగ్ స్కాడ్లు నిరంతరం తనిఖీలు చేపట్టాలి ►వైద్యులను కూడా వెంటనే నియమించాలి ►దీని కోసం వాక్ ఇన్ ఇంటర్వ్యూలను వెంటనే నిర్వహించండి ►మనం కర్ఫ్యూ కూడా విధించాం ►అదే సమయంలో జాగ్రత్తలు కూడా తీసుకోవాలి ►భౌతిక దూరం పాటించాలి, మాస్కులు వేసుకోవాలి ►12 గంటలు దాటిన తర్వాత మినహాయింపులు ఉన్నవారు తప్ప మిగిలిన వారు కచ్చితంగా కర్ఫ్యూ పాటించాలి ►12 గంటలు దాటిన తర్వాత నూటికి నూరుశాతం కర్ఫ్యూ పాటించాలి ►వ్యాక్సినేషన్కు సంబంధించిన దుష్ప్రచారాన్నికూడా ప్రతి సందర్భంలోకూడా తప్పికొట్టాలి ►ప్రజలను రెచ్చగొట్టి, వారి భావోద్వేగాలతో ఆడుకుంటూ... ప్రజలు వాక్సినేషన్ వద్ద గుమిగూడే పరిస్థితిని సృష్టిస్తున్నారు ►అందరికీ ఉచితంగా టీకా అందుతుంది ►వ్యాక్సిన్ల కొరత ఉంది కాబట్టి, కేంద్రం ప్రభుత్వం ఇచ్చిన కేటాయింపులు ప్రకారం వ్యాక్సిన్ల పంపిణీ జరుగుతుంది కాబట్టి, మీ వంతు వచ్చేంతవరకూ ఓపిగ్గా ఉండాలని ప్రజలకు చెప్పాలి ►45 ఏళ్లకు పైబడి రెండో డోసు ఇవ్వాల్సిన అవసరం ఉంది ►33లక్షలకుపైగా వీరు ఉన్నారు.. వీరికి మొదట ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది ►లేకపోతే మొదటి డోసు వేసుకున్నా ప్రయోజనం ఉండదు ►వీళ్లకి మొదటి వేశాక, 45 ఏళ్ల పైబడి ఉన్నవారు ఇంకా ఎవరైనా ఉంటే వారికీ కంప్లీట్ చేస్తాం ►వ్యాక్సిన్ల కోసం ప్రభుత్వం కూడా విస్తృతంగా ప్రయత్నాలు చేస్తోంది ► వచ్చే సరఫరాను బట్టి.. ప్రజలకు ప్రాధాన్యత క్రమంలో అందిస్తామనే విషయాన్ని ప్రజలకు చెప్పాలి చదవండి: తిరుపతి రుయా ఆస్పత్రిలో అదనపు ఆక్సిజన్ ప్లాంట్ ఏపీలో కరోనా నిబంధనలు మరింత కఠినతరం -
వారికి తక్షణమే పరిష్కారం చూపాలి: సీఎం జగన్
సాక్షి, అమరావతి: 104 కాల్ సెంటర్ సమర్ధవంతంగా పనిచేసేలా కలెక్టర్లు దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. జిల్లా కలెక్టర్లతో మంగళవారం ఆయన స్పందన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కోవిడ్ నివారణ చర్యలు, వ్యాక్సినేషన్పై సీఎం వైఎస్ జగన్ దిశానిర్దేశం చేస్తూ.. 104కు ఫోన్ చేసిన వారికి తక్షణమే పరిష్కారం చూపాలన్నారు. కోవిడ్ సమస్యలకు 104 నంబర్ వన్స్టాప్గా ఉండాలని పేర్కొన్నారు. ‘‘104కు ఫోన్ చేసిన మూడు గంటల్లో బెడ్ కేటాయించాలి. 104 కాల్ సెంటర్కు వైద్యులు అందుబాటులో ఉండాలి. జాయింట్ కలెక్టర్లు ఇక నుంచి కోవిడ్పైనే దృష్టి పెట్టాలి. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి. జిల్లా స్థాయిలో కోవిడ్ ఆస్పత్రులను క్లస్టర్లుగా విభజించాలి. జిల్లా స్థాయి ఫ్లయింగ్ స్క్వాడ్ ఏర్పాటు చేయాలి. ఆస్పత్రుల్లో వైద్య సిబ్బంది, పారామెడికల్ సిబ్బంది పూర్తిస్థాయిలో ఉండాలి. ఆస్పత్రుల్లో ఖాళీల భర్తీకి వాక్ ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహించాలని’’ సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. చదవండి: ఉత్పత్తికి ఊపిరి: రెండు ఆక్సిజన్ ప్లాంట్లకు జవసత్వాలు కోవిడ్ కట్టడికి త్రిముఖ వ్యూహం -
కరోనా నియంత్రణలో కలెక్టర్లదే కీలక పాత్ర: సీఎం జగన్
సాక్షి, అమరావతి: కరోనా వైరస్ నియంత్రణలో కలెక్టర్లదే కీలక పాత్ర అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. కలెక్టర్లు వ్యక్తిగతంగా కోవిడ్ ఆసుపత్రులను ఎప్పటికప్పుడు పరిశీలించాలన్నారు. జిల్లాలో శానిటైజేషన్ చేయడం, మాస్క్లు ధరించడం సహా భౌతికదూరం పాటించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశించారు. 104కు కాల్ చేసే ప్రతి ఒక్కరూ సంతృప్తి చెందే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. కోవిడ్ సంక్షోభంలో కలెక్టర్లు అత్యుత్తమ పనితీరు కనబర్చాలని తెలిపారు. చదవండి: వ్యాక్సిన్కు అర్హులు 3.48 కోట్ల మంది -
కలెక్టర్లు, ఎస్పీలతో ఎస్ఈసీ వీడియో కాన్ఫరెన్స్
సాక్షి, అమరావతి: కలెక్టర్లు, ఎస్పీలతో ఎస్ఈసీ నీలం సాహ్ని వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కొనసాగింపుపై ఎస్ఈసీ కసరత్తు చేస్తున్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో సీఎస్ ఆదిత్యనాథ్ దాస్, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనీల్ కుమార్ సింఘాల్, వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్ కాటమనేని భాస్కర్, పంచాయతీ రాజ్ శాఖ కమిషనర్ గిరిజా శంకర్, అదనపు డీజీలు డాక్టర్ రవిశంకర్ అయ్యన్నార్, సంజయ్, ఎన్నికల కమిషన్ కార్యదర్శి కన్నబాబు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్గా గురువారం ఉదయం బాధ్యతలు స్వీకరించిన నీలం సాహ్ని.. అనంతరం గవర్నర్ బిశ్వభూషణ్ను కలిశారు. రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియపై గవర్నర్తో చర్చించారు. ఎస్ఈసీ నీలం సాహ్నిని చీఫ్ సెక్రటరీ ఆదిత్యనాథ్ దాస్ కలిశారు. మిగిలిన ఎన్నికల నిర్వహణపై ఎస్ఈసీతో సీఎస్ చర్చలు జరిపారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల షెడ్యూల్పై ఎస్ఈసీ, సీఎస్ చర్చించారు. ఎన్నికల ప్రక్రియను సత్వరం పూర్తిచేయాలని ఎస్ఈసీని సీఎస్ కోరారు. రేపు(శుక్రవారం) రాజకీయ పార్టీల నేతలతో ఎస్ఈసీ సమావేశం నిర్వహించనున్నారు. -
కోవిడ్ సమస్యకు పరిష్కారం వ్యాక్సినేషనే: సీఎం జగన్
సాక్షి, అమరావతి: కలెక్టర్లు, జిల్లా ఎస్పీలతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఉపాధిహామీ పనులు, గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు, వైఎస్సార్ హెల్త్ క్లినిక్స్, 90 రోజుల్లో ఇంటిపట్టా, నాడు –నేడు, స్పందన, చేయూత, అర్బన్ ప్రాంతాల్లో మధ్యతరగతికి లాభాపేక్షలేకుండా సరసమైన ధరలకు ఇంటి స్థలాలు, కరోనా నివారణ తదితర అంశాలపై సీఎం సమీక్ష జరిపారు. ఏప్రిల్, మే నెలల్లో అమలు చేయనున్న స్కీంలు, కార్యక్రమాలపైనా సీఎం సమీక్ష నిర్వహించారు. ఆ తర్వాత దృష్టి అంతా వ్యాక్సినేషన్ పైనే.. కోవిడ్ నివారణపై అధికారులు చర్యలు తీసుకోవాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. ఎల్లుండి తాను కూడా వ్యాక్సిన్ తీసుకుంటున్నానని తెలిపారు. కోవిడ్ సమస్యకు వ్యాక్సినేషనే పరిష్కారమన్నారు. వ్యాక్సినేషన్ను ముమ్మరంగా చేపట్టాలన్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో కేవలం 6 రోజుల ప్రక్రియే మిలిగి ఉందని.. ఇది కూడా పూర్తయితే ఇక ఎన్నికలు ముగిసినట్టేనన్నారు. ఆ తర్వాత దృష్టి అంతా వ్యాక్సినేషన్ పైనేనని సీఎం జగన్ పేర్కొన్నారు. ఉపాధిహామీ పనులను రికార్డు స్థాయిలో చేపట్టారని సీఎం వైఎస్ జగన్ అన్నారు. ఈ సందర్భంగా అభినందనలు తెలిపారు. ‘‘25.50 కోట్ల పని దినాలను కల్పించారు. రాష్ట్రంలో ఎప్పుడూ ఇలా జరగలేదు. కోవిడ్ సమయంలో కూలీలను ఆదుకున్నారు. దేశంలోనే మూడో స్థానంలో ఉన్నాం. చిన్నరాష్ట్రమైనా మనం మూడో స్థానంలో ఉండడం గర్వకారణం. రూ. 5,818 కోట్లు నేరుగా కూలీలకు ఇవ్వగలిగాం. ఏప్రిల్, మే, జూన్ నెలలో కొన్నిరోజుల వరకూ పనులు ముమ్మరంగా చేసుకునేందుకు అవకాశం ఉన్న సమయం ఇది. ఇదే వేగంతో ఉపాధిహామీ పనులు ముమ్మరంగా జరగాలి. ఉపాధి హామీ పథకాన్ని కలెక్టర్లు ఓన్ చేసుకోవాలి. ప్రతి 4-5 రోజులకు ఒకసారి క్రమం తప్పకుండా రివ్యూ చేయాలి. జాయింట్ కలెక్టర్లు కూడా ఉపాధిహామీ పథకంపై దృష్టిపెట్టాలని’’ సీఎం జగన్ అన్నారు. సీఎం వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే.. ►గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు, విలేజ్ క్లినిక్కులు తదితరవాటి భవన నిర్మాణాలు వేగంగా జరగాలి ►కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం అవుతుంది కాబట్టి, ఈ భవనాల నిర్మాణంపై పూర్తి దృష్టిపెట్టాలి ►గ్రామ సచివాలయాల నిర్మాణంలో నెల్లూరు, అనంతపురం, కర్నూలు జిల్లాల కలెక్టర్లు దృష్టిపెట్టాలి: ►మిగతా జిల్లాలతో పోలిస్తే వెనకబడి ఉన్నాయి ►బేస్మెంట్ లెవల్, గ్రౌండ్ ఫ్లోర్, శ్లాబ్ లెవల్ స్థాయిలో కృష్ణా, నెల్లూరు, తూర్పుగోదావరి జిల్లాలు పెండింగులో పనులు ఉన్నాయి. ఈ జిల్లాల కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ వహించాలి ►మే నాటికల్లా గ్రామ సచివాలయాల నిర్మాణం పూర్తి కావాలి ►రైతు భరోసా కేంద్రాల నిర్మాణంలో నెల్లూరు, అనంతపూర్, కృష్ణా జిల్లాలు మెరుగుపడాల్సి ఉంది ►అలాగే బేస్మెంట్ లెవల్, గ్రౌండ్ లెవల్, నెల్లూరు, కృష్ణా, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో పనులు పెండింగులో ఉన్నాయి ►జులై 8న వైఎస్సార్ పుట్టినరోజు సందర్భంగా ప్రారంభిస్తున్నాం ►ఖరీఫ్ ప్రారంభం సందర్భంగా ఆర్బీకేల ద్వారా రైతులకు తోడుగా నిలవాల్సిన అవసరం ఉంది ►అందుకే పనులను చాలా ముమ్మరంగా పనులు చేయాల్సి ఉంది ►కోవిడ్ లాంటి మహమ్మారిని ఎదుర్కోవడానికి విలేజ్ క్లినిక్కులు ఆవశ్యకత ఉంది ►వీలైనంత త్వరగా వీటి పనులను పూర్తిచేయాల్సి ఉంది ►యుద్ద ప్రాతిపదికిన క్లినిక్స్ నిర్మాణం జరగాలి ►ఆగస్టు 15న వీటిని ప్రారంభించాలి ►అందుకే వేగంగా పనులు పూర్తిచేయాలి ►గ్రామస్థాయిలో ఆరోగ్యశ్రీ రిఫరెల్ పాయింట్గా విలేజ్ కినిక్స్ ఉంటాయి ►9899 చోట్ల బల్క్మిల్క్ కూలింగ్ సెంటర్లను ఏర్పాటు చేయాల్సి ఉంది ►3841 చోట్ల పనులు మొదలయ్యాయి ►మిగిలిన చోట్ల కూడా వెంటనే పనులు మొదలుకావాలి ►సెప్టెంబరులో ఈ బీఎంసీలను ప్రారంభించబోతున్నాం ►ఆగస్టు 31 నాటికి బీఎంసీల పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలి ►25 ఫుడ్ ప్రాససింగ్ యూనిట్లను పెట్టబోతున్నాం ►ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో ఒక యూనిట్ఉంటుంది ►దీనికోసం భూములను గుర్తించి.. అక్కడ యూనిట్లను పెట్టించాలి ►కనీసం 10 నుంచి 15 ఎకరాల భూమిని గుర్తించాల్సి ఉంది ►ప్రభుత్వం కొనుగోలు చేసిన వాటిని ప్రాసెస్ చేయడానికి ఈ యూనిట్లు ఉపయోగపడతాయి ►గత ఏడాది కాలంలో రైతులను ఆదుకునేందుకు గత ఏడాది రూ.4300 కోట్లు ధరల స్థిరీకరణకు ఖర్చు చేశాం ఇళ్లపట్టాలు: ♦దరఖాస్తు చేసుకున్నవారు అర్హులని తేలితే 90 రోజుల్లోగా వారికి ఇంటిపట్టా ఇవ్వాలి ♦94శాతం ఇళ్లపట్టాల పంపిణీ పూర్తయ్యింది ♦మిగిలిపోయిన 1,69,558 ఇళ్ల పట్టాలను వెంటనే పంపిణీచేయాలి ♦జిల్లాకలెక్టర్లు దృష్టిపెట్టి వెంటనే పంపిణీ చేయాలి ♦అలాగే టిడ్కోలో పంపిణీచేయాల్సి ఉన్న సుమారు 47వేల ఇళ్లపట్టాలను వెంటనే పూర్తిచేయాలి ♦అర్హులైన వారికి కచ్చితంగా ఇళ్లపట్టాలు ఇవ్వాలి ♦పెండింగులో ఉన్న అప్లికేషన్లను వెంటనే వెరిఫికేషన్ చేసి... అర్హులకు పట్టాలు ఇవ్వడానికి చర్యలు తీసుకోవాలి ♦కొత్తగా వచ్చిన దరఖాస్తులకు సంబంధించి అవసమైన చోట వెంటనే భూమిని సేకరించాలి ♦ఇళ్లపట్టాల దరఖాస్తులను తిరస్కరించేటప్పుడు ఎందుకు తిరస్కరిస్తున్నామో చెప్పగలగాలి ♦కారణాలు లేకుండా దరఖాస్తులను తిరస్కరించరాదు ♦ఒకవేళ దరఖాస్తును తిరస్కరించిన తర్వాత కూడా, తగిన కారణాలతో మళ్లీ దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంది ♦అలాంటి దరఖాస్తులను మళ్లీ రీ వెరిఫికేషన్ చేయాలి: ♦నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు కింద తొలివిడతలో 15.6 లక్షల ఇళ్లు కడుతున్నాం ♦ఇళ్లనిర్మాణం జరగడానికి వీలుగా లే అవుట్లో బోరు, కరెంటు సౌకర్యం ఉండాలి ♦తొలివిడతలో 8682 కాలనీల్లో ఇళ్ల నిర్మాణం ప్రారంభం అవుతుంది ♦ప్రతిచోటా బోరు, కరెంటు సౌకర్యం కచ్చితంగా ఉండాలి ♦ఏప్రిల్ 15 నుంచి ఇళ్ల నిర్మాణం ప్రారంభం అవుతుంది ♦అలోగా బోరు, కరెంటు సౌకర్యం ఏర్పాటు చేయడంపట్ల అధికారులు చర్యలు తీసుకోవాలి ♦ఇళ్ల నిర్మాణానికి సన్నాహకంగా మ్యాపింగ్, జియో ట్యాగింగ్, ఏపీ హౌసింగ్ వెబ్సైట్లో లబ్ధిదారుని రిజిస్ట్రేషన్, ఉపాధి హామీ కింద జాబ్కార్డుల జారీ ఈ పనులన్నీకూడా ఏప్రిల్ 10లోగా పూర్తికావాలి ♦హౌసింగ్ కార్యర్రమాన్ని పర్యవేక్షించడానికి జిల్లాస్థాయి, డివిజన్ స్థాయి అధికారులను ప్రతి మండలానికీ, ప్రతి మున్సిపాల్టీకి నోడల్ అధికారులుగా నియమించాలి ♦ప్రతి లే అవుట్లో కచ్చితంగా ఒక మోడల్ హౌస్ను నిర్మించాలి దీనివల్ల ఇళ్లనిర్మాణంలో వస్తున్న ఇబ్బందులు, నిర్మాణఖర్చు ఎంత అవుతుంది అన్నదానిపై అవగాహన వస్తుంది, అంతేకాకుండా కట్టి ఇల్లు ఎలా ఉందో లబ్ధిదారులకు తెలుస్తుంది ♦ఏప్రిల్ 15 నాటికి మోడల్ ఇళ్ల నిర్మాణాలు పూర్తికావాలి ♦ఇంజినీరింగ్ అసిస్టెంట్లు, డిజిటిల్ అసిస్టెంట్లు, వెల్ఫేర్ అసిస్టెంట్ల సేవలను ఇళ్లనిర్మాణంలో వినియోగించుకోండి ♦లబ్ధిదారుల ఎంచుకున్న ఆప్షన్ ప్రకారం సిమెంటు, స్టీల్, ఇసుక, మెటల్, ఇటుకలు అందించడానికి సిద్ధం చేసుకోవాలి ఏప్రిల్, మే నెలలో ప్రారంభించే పథకాలు, కార్యక్రమాలు ►ఏప్రిల్ 13న వాలంటీర్లకు సత్కారం ►ఏప్రిల్ 16న జగనన్న విద్యాదీవెన ప్రారంభం ►విద్యాదీవెన కింద నేరుగా తల్లుల అకౌంట్లలోకే నగదు ►ఏప్రిల్ 20న వైఎస్ఆర్ సున్నావడ్డీ పథకం ప్రారంభం ►రబీకి సంబంధించి రైతుల అకౌంట్లలోకి నేరుగా నగదు ►ఏప్రిల్ 23న వైఎస్ఆర్ సున్నావడ్డీ కింద డ్వాక్రా అక్కాచెల్లెమ్మల అకౌంట్లలోకి నగదు ►ఏప్రిల్ 28న జగనన్న వసతి దీవెన ►ఏడాదిలో మూడుసార్లు జగనన్న వసతి దీవెన ►మే 13న వైఎస్సాఆర్ రైతు భరోసా, 18న మత్స్యకార భరోసా, 25న ఖరీఫ్ బీమా చదవండి: టీడీపీ అధికారంలోకి వచ్చేది ఒక కల మాత్రమే: అంబటి బాబు బాటలోనే అచ్చెన్న.. నీకు తగునా? -
అమ్మాయిలే అధికారులు
అనంతపురం జిల్లాలో హటాత్తుగా ఆఫీసర్లు మారిపోయారు.ఏ ముఖ్యమైన సీట్లో చూసినా అమ్మాయిలే. వారే చురుగ్గా పర్యవేక్షణ చేస్తున్నారు. నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఫైళ్ల మీద సంతకాలు చేస్తున్నారు. కలెక్టర్గా, జాయింట్ కలెక్టర్గా, ఆర్డీఓగా పదిహేను పదహారేళ్లలోపు అమ్మాయిలు పని చేయడం చూసేవారికి వారి సమర్థతను చాటి చెప్పింది. అక్టోబర్ 11 అంతర్జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా బాలికల వికాసాన్ని కాంక్షిస్తూ ఆ జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు చేపట్టిన కార్యక్రమం ఇది. ‘ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో బాధిత బాలికకు రూ.25 వేల నష్టపరిహారం వెంటనే చెల్లించండి’ ‘రాత్రి 8 గంటల తర్వాత, ఉదయం 8 గంటలకు ముందు మహిళా ఉద్యోగులకు అధికారిక పనుల గురించి ఫోన్లు చేసి ఆటంకం కలిగించకండి’... ఇవి ఆదివారం ఒకరోజు అనంతపురం జిల్లా కలెక్టర్గా వ్యవహరించిన ఇంటర్మిడియెట్ విద్యార్థిని శ్రావణి ఇచ్చిన ఆదేశాలు. ఆ మేరకు ఆమె ఆ ఫైళ్ల మీద సంతకాలు చేసింది. అధికారులు ఆ నిర్ణయాల అమలును మొదలెట్టారు కూడా. జాయింట్ కలెక్టర్గా పని చేసిన తొమ్మిదవ తరగతి విద్యార్థి మధుశ్రీ పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేయనున్న లేఔట్ను తనిఖీ చేసింది. అంతే కాదు వర్షాలకు పాడైన ఆ లేఔట్ రోడ్లను వెంటనే రిపేరు చేయమని ఆదేశించింది. వీరిద్దరే కాదు అనంతపురం జిల్లా వ్యాప్తంగా పదుల సంఖ్యలో విద్యార్థినులు ఆర్డీఓలు, ఎమ్మార్వోలు, వివిధ శాఖల పీడీలుగా వ్యవహరించారు. అనంతపురం జిల్లాలోని 63 మండలాలకు తాసీల్దార్లుగా పని చేశారు. అక్టోబరు 11వ తేదీ అంతర్జాతీయ బాలికా దినోత్సవ సందర్భంగా ఆ జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు ‘బాలికే భవిష్యత్తు’ కార్యక్రమాన్ని చేపట్టి బాలికలకు ఒక అరుదైన గౌరవం దక్కేలా చేశారు. ఇంటర్మీడియెట్ అమ్మాయి అనంతపురం జిల్లా రాప్తాడు కేజీబీవీ (కస్తూర్బా గాంధీ విద్యాలయ) లో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్న ఎం. శ్రావణి జిల్లా కలెక్టర్గా వ్యవహరించింది. ఉదయం 11 నుంచి సాయంత్రం 6 వరకు ఆమె ఈ బాధ్యతలు నిర్వర్తించింది. కలెక్టర్ చంద్రుడు ఆమెను తన సీట్లో కూచోబెట్టి పక్కన నిలబడి చప్పట్లతో ప్రోత్సహించారు. అంతేకాదు శ్రావణి తీసుకునే నిర్ణయాలు అమలు చేయాలని ఆదేశించారు. కలెక్టర్గా బాధ్యత తీసుకున్న శ్రావణì నగరంలోని ఒకటవ రోడ్డులో ఉన్న శారదా మున్సిపల్ గర్ల్స్ హైస్కూల్ను కాలినడకన తనిఖీ చేసి జగనన్న విద్యాకానుక పథకం అమలు తీరును పరిశీలించింది. ఆ స్కూలులో జరుగుతున్న నాడు–నేడు పనులను కూడా పరిశీలించింది. ‘ఇదంతా తనకు మధుర జ్ఞాపకంగా ఉందని’ శ్రావణి అంది. ‘మాది గార్లదిన్నె మండలంలోని కనంపల్లి గ్రామం. మా నాన్న పేరు పాములేటి. తల్లి రత్నమ్మ. మాది వ్యవసాయ కుటుంబం. కలెక్టర్ సీట్లో కూచున్నాక కలెక్టర్గా ప్రజలకు ఎంత మంచి చేయవచ్చో అర్థమైంది. ప్రజలకు వేగంగా సేవలందినప్పుడే వ్యవస్థలపై విశ్వాసం కలుగుతుందని నేను అర్థం చేసుకున్నాను. బాలికలకు రక్షణ కల్పించాలని అన్నదాతలను ఆదుకోవాలని వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందించాలని గ్రామాల్లో పారిశుద్ధ్యం మెరుగుపడాలని నేను ఆదేశాలిచ్చాను. కలెక్టర్ బాధ్యత గొప్పదే అయినా నాకు మాత్రం పిల్లలను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే ఉపాధ్యాయ వృత్తే ఎక్కువ ఇష్టం. అందుకే టీచర్ కావాలనేది నా కోరిక. ఒక్కరోజు కలెక్టరుగా అవకాశం కల్పించిన కలెక్టర్ సార్కు ధన్యవాదాలు.’ అంది శ్రావణి. టీచర్స్ డే స్ఫూర్తితో...! అంతర్జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా బాలికలను ఒక రోజు అధికారులుగా జిల్లావ్యాప్తంగా నియమించాలని కలెక్టర్ గంధం చంద్రుడు ముందురోజే నిర్ణయించారు. ఎవరు ఏ అధికారిగా ఉండాలనే విషయాన్ని లాటరీ ద్వారా ఎంపిక చేశారు. ‘‘మొదట కేవలం కలెక్టరుగా మాత్రమే ఒక అమ్మాయిని ఒక రోజు నియమిద్దామని అనుకున్నాం. కానీ జిల్లా అంతటా వివిధ విద్యార్థినులకు ఈ బాధ్యత ఇస్తే వారికి స్ఫూర్తి కలుగుతుందని బాగా చదువుకుని మంచి ఉద్యోగాలు చేయాలని వారికి అనిపిస్తుందని తల్లిదండ్రులకు అమ్మాయిలను చదివించాలనే స్ఫూర్తి కలుగుతుందని అనిపించింది. నాకు ఈ విధంగా చేయాలని టీచర్స్ డే స్ఫూర్తిని ఇచ్చింది. టీచర్స్ డే సందర్భంగా టీచర్లుగా చేసిన పిల్లలు ఎంతో సంతోషంగా ఫీలవుతారు. తాము కూడా ఒక హోదాలో ఉండాలనే భావన వారిలో కలుగుతుంది. అందుకే బాలిక దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమం చేపడితే బాగుంటుందని భావించాం. వారు తీసుకునే నిర్ణయాలను కూడా అమలు చేయాలని స్పష్టంగా చెప్పాం’’ అని కలెక్టర్ గంధం చంద్రుడు ‘సాక్షి’కి వివరించారు. కలెక్టరేట్లో కలెక్టరుగా, జేసీ–1,2,3గా, డీఆర్ఓగా, ఏఓగా వ్యవహరించిన మొత్తం 6 మంది విద్యార్థినులకు మెంటర్గా ఉంటానని... వారి ఉన్నత చదువులకు అండగా ఉంటానని హామీనిచ్చారు. – కె.జి.రాఘవేంద్రరెడ్డి, సాక్షి ప్రతినిధి, అనంతపురం -
వారానికి రూ.10 కోట్ల విలువైన పనులు
ఉపాధి హామీ పథకంలో మెటీరియల్ కాంపోనెంట్కు సంబంధించి రూ.1,124 కోట్లు ఉన్నాయి. శ్రీకాకుళం, విజయనగరం, అనంతపురంలో ఆ నిధులు ఎక్కువ ఖర్చు కావాల్సి ఉంది. ఉపాధి హామీ పనులకు సంబంధించి అన్ని బిల్లులను అక్టోబర్ మొదటి వారంలో క్లియర్ చేస్తాం. సాక్షి, అమరావతి: ఉపాధి హామీ కింద ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో వారానికి రూ.10 కోట్ల విలువైన పనులు చేయాలని సీఎం వైఎస్ జగన్ జిల్లా అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. అందుకోసం సచివాలయాలు, ఆర్బీకేలు, వైఎస్సార్ హెల్త్ క్లినిక్లు, అంగన్వాడీ కేంద్రాలు, బల్క్ మిల్క్ యూనిట్లు, ప్రహరీల నిర్మాణం చేపట్టాలని సూచించారు. ఇవన్నీ విజయవంతంగా చేపడితే, అదనంగా మరో రూ.5 కోట్ల విలువైన పనులకు అనుమతి ఇస్తామని చెప్పారు. స్పందనలో భాగంగా మంగళవారం ఆయన తన క్యాంపు కార్యాలయం నుంచి ఉపాధి హామీ పనులపై కలెక్టర్లు, ఎస్పీలు, జేసీలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మార్గనిర్దేశం చేశారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ► రాష్ట్రంలో 7,529 బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్లు సకాలంలో ఏర్పాటు చేయాలి. లక్ష్యం ప్రకారం పనులు పూర్తి చేయాలి. ► వచ్చే ఏడాది మార్చి 31 నాటికి సచివాలయాల భవనాలు పూర్తి కావాలన్నది లక్ష్యం. తూర్పు గోదావరి, కృష్ణా, ప్రకాశం జిల్లాలలో పనులు మందకొడిగా సాగుతున్నాయి. ► మొత్తం 10,408 ఆర్బీకే భవనాలు మంజూరు కాగా, వాటిలో 10,383 భవనాలు ఏర్పాటయ్యాయి. ఇంకా 25 పెండింగ్లో ఉన్నాయి. వైఎస్సార్ హెల్త్ క్లినిక్స్కు సంబం«ధించి 1,269 భవనాలు బేస్మెంట్ లెవెల్ (బీఎల్) దాటలేదు. తూర్పు గోదావరి, నెల్లూరు, చిత్తూరు జిల్లాలు ఈ పనిలో వెనకబడి ఉన్నాయి. ► వీటన్నింటినీ వెంటనే ఉపాధి పథకం కింద పూర్తి చేయండి. గ్రామ ఇంజనీరింగ్ సహాయకులను పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవాలి. మెజర్మెంట్స్ రికార్డింగ్ కోసం వారి సేవలు ఉపయోగించుకోవచ్చు. కాబట్టి ఏఈఈలు, డీఈలు చొరవ చూపాలి. పంచాయతీ రాజ్, గ్రామీణ నీటి సరఫరా, గిరిజన సంక్షేమ ఇంజనీరింగ్ విభాగాలు.. వారికి పని కల్పించాలి. -
17 రోజుల్లో నవశకం వెరిఫికేషన్ పూర్తి చేయాలి
సాక్షి, అమరావతి: ప్రభుత్వం ఉన్నతస్థాయిలో తీసుకున్న నిర్ణయాలు గ్రామ సచివాలయాల్లో అమలు జరిగినప్పుడే ప్రజలకు ప్రభుత్వ పథకాలు సక్రమంగా అందుతాయన్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి. పక్కాగా తనిఖీలు చేసి రిపేర్ చేసినప్పుడే వ్యవస్థ సక్రమంగా పని చేస్తుందన్నారు. స్పందన కార్యక్రమంపై సీఎం జగన్ మంగళవారం అధికారులతో వీడియో కాన్పరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘విలేజ్, వార్డ్ సెక్రటేరియట్లకు సంబంధించి అందరు కలెక్టర్లు, జేసీలు, డిపార్ట్మెంట్స్ హెడ్స్ విధిగా తనిఖీలు చేయాలి. ఇప్పటికే గైడ్లైన్స్ ఇచ్చాం, కలెక్టర్లు తనిఖీలు చేశారు కానీ జేసీలు మరింత ధ్యాస పెట్టలి. అక్కడి సమస్యలు పరిష్కరించగలిగితే అట్టడుగు స్ధాయి ప్రజలకు మేలు జరుగుతుంది. కొన్ని జిల్లాల జేసీలు సరిగా తనిఖీలు చేయలేదు, వెంటనే ఫోకస్ పెట్టండి. డెలివరీ మెకానిజంపై ధ్యాసపెట్టాలి.ప్రతీ జేసీ, కలెక్టర్ ప్రతీ వారం ఖచ్చితంగా తనిఖీ చేయాలి, రిపోర్ట్ ఇక్కడికి పంపాలి, మేం మీ పనితీరును మానిటర్ చేస్తాం, దీనిపై యాప్ కూడా సిద్దంగా ఉంది, ఆన్లైన్లో రిపోర్ట్ చేయాలి అని తెలిపారు. (చదవండి: చీఫ్ మినిస్టర్ ఈజ్ విత్ యూ) ‘ప్రభుత్వ పథకాలు, సేవలు అన్నీ కూడా డిస్ప్లే జరగాలి.. సంక్షేమ పధకాల క్యాలెండర్ కూడా డిస్ప్లే చేయాలి, కోవిడ్ హాస్పిటల్స్ లిస్ట్, ఆరోగ్యశ్రీ ఎంప్యానల్ హాస్పిటల్స్ లిస్ట్ డిస్ప్లే ఉండాలి. బయోమెట్రిక్ ఖచ్చితంగా ఉండాలి. వలంటీర్ల అటెండెన్స్ కూడా చెక్చేయాలి. అనుకున్న టైంలైన్ లోపు సేవలు అందుతున్నాయా లేదా చెక్ చేయాలి. రైస్ కార్డ్, పెన్షన్ కార్డ్, ఆరోగ్యశ్రీ కార్డ్, హౌస్సైట్ ఈ నాలుగు కూడా టైంలైన్ లోపు అందాలి. అర్హులకు కొన్ని జిల్లాల్లో రైస్ కార్డులు వెంటనే ఇస్తున్నారని న్యూస్లో చూస్తున్నాం.. మంచి పరిణామం. మిగిలిన చోట్ల కూడా ధ్యాస పెట్టండి. రైస్ కార్డ్, పెన్షన్ కార్డు జారీ విలేజ్, వార్డు సెక్రటేరియట్ లెవల్లో జరగాలి. కొన్ని జిల్లాలు, శాఖలు ఈ విషయంలో వెనకబడి ఉన్నాయి, వీటిపై ప్రత్యేక దృష్టిపెట్టాలి’ అని ముఖ్యమంత్రి సూచించారు. (చదవండి: వారితో కూడా యుద్ధం చేస్తున్నాం: సీఎం జగన్) ‘నవశకం కింద 6 పాయింట్ వెరిఫికేషన్లో అనర్హులు అంటున్నాం. కానీ ఎవరైనా లబ్ధిదారుడు నేను అర్హుడిని అని మళ్ళీ దరఖాస్తు చేస్తే దానికి సంబంధించి వెంటనే దానిపై డిజిటల్ అసిస్టెంట్ ఒక్క రోజులో వెరిఫై చేసి వెల్ఫేర్ సెక్రటరీకి పంపాలి. అక్కడి నుంచి 3 రోజుల్లో ఫీల్డ్ వెరిఫికేషన్ చేయాలి. ఆ తర్వాత సెకండరీ ఫీల్డ్ వెరిఫికేషన్ 3 రోజుల్లో పూర్తిచేసి రిపోర్ట్ ఎంపీడీవో లేదా మునిసిపల్ కమీషనర్కు పంపాలి. అక్కడి నుంచి జేసీకి పంపాలి. జేసీలు వెంటనే స్పందించి సరిచేయాలి. అవసరాన్ని బట్టి డేటా సరిచేయాలి. ఎవరైనా నేను అర్హుడిని అని దరఖాస్తు చేస్తే వెంటనే స్పందించాలి.17 రోజుల్లో మొత్తం పూర్తిచేసి కార్డు అందించాలి. ఈ విధంగా మార్పు చేస్తే ప్రభుత్వంపై నమ్మకం పెరుగుతుంది. అందరూ నిర్ణీత టైంలైన్లో సేవలు అందించాలి. ప్రతీ లెవల్లోనూ వెరిఫికేషన్ తప్పకుండా చేయాలి. ఇలా చేస్తే తప్పులు జరగవు’ అన్నారు సీఎం జగన్. (చదవండి: ఉచిత బోర్లు.. పేద రైతులకు మోటార్లు) గ్రామ, వార్డు సచివాలయం పరీక్షలకు సంబంధించి అందరూ కూడా బాగా పనిచేశారని ముఖ్యమంత్రి ప్రశంసించారు. అక్టోబర్ 2 న ఆర్వోఎఫ్ఆర్ పట్టాలు ఇచ్చే కార్యక్రమం జరగనుందని తెలిపారు. అక్టోబర్ 5న విద్యాకానుక స్కూల్కిట్స్ కార్యక్రమం. అక్టోబర్ నెలాఖరున తోపుడు బండ్లతో రోడ్లపై చిన్న చిన్న వ్యాపారాలు చేసేవారికి వడ్డీ లేకుండా రుణాలు.. జగనన్న తోడు పేరుతో కార్యక్రమం ప్రారంభం కానున్నాయి అని సీఎం జగన్ తెలిపారు. -
వారితో కూడా యుద్ధం చేస్తున్నాం: సీఎం జగన్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడం మంచి పరిణామం అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. పాజిటివిటీ రేట్ 12.0 నుంచి 8.3కి తగ్గిందని తెలిపారు. టెస్టులు పెరిగాయని, కేసులు కూడా తగ్గుతున్నాయని సీఎం పేర్కొన్నారు. మంగళవారం ఆయన కరోనా నివారణ చర్యలపై సమీక్ష నిర్వహించారు. స్పందన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లు, ఎస్పీలతో మాట్లాడారు. కోవిడ్ తగ్గుతుందనడానికి ఇది నిదర్శనమని, కోవిడ్తో సహజీవనం చేస్తూనే, అప్రమత్తంగా ఉండాలని సీఎం వైఎస్ జగన్ సూచించారు. జనవరికల్లా వ్యాక్సిన్ వచ్చే అవకాశం కనిపిస్తుందన్నారు. ‘‘104 నంబర్కు ఫోన్ కొడితే టెస్ట్లు, హాస్పిటల్స్ వివరాలు అందాలి. ఈ నంబర్కు మాక్ కాల్స్ చేసి నెంబర్ పనిచేస్తుందా లేదా పీరియాడికల్గా చెక్ చేయండి. ఎక్కడైనా లోటుపాట్లుంటే వెంటనే సరి చేసుకోవాలి. ప్రతీ రోజూ మానిటర్ చేయండి. ఈ నంబర్కు ఫోన్ చేయగానే అరగంటలోనే బెడ్ అందుబాటులో ఉందో లేదో చెప్పాలి. కాబట్టి ఈ నంబర్ పక్కాగా పనిచేయాలని’’ అధికారులకు సీఎం ఆదేశించారు. (చదవండి: ప్రభుత్వ సేవలు.. హెల్ప్లైన్ నంబర్లు) కోవిడ్ను ఆరోగ్యశ్రీ కింద ఫ్రీగా ట్రీట్ చేస్తున్న రాష్ట్రం మనదేనని, కోవిడ్ హాస్పిటల్స్ లిస్ట్ గ్రామ సచివాలయాల్లో ఉండాలన్నారు. ఎంప్యానల్ హస్పిటల్స్ లిస్ట్ కూడా అందుబాటులో ఉండాలని తెలిపారు. 104కు ఎవరు ఫోన్ చేసినా కోవిడ్ ట్రీట్మెంట్కు సంబంధించిన అన్ని వివరాలు అందాలని చెప్పారు. రిక్రూట్ చేసిన వారంతా కూడా కరెక్ట్గా డ్యూటీకి వెళుతున్నారా లేదా తనిఖీ చేయాలని సీఎం పేర్కొన్నారు. (చదవండి: ఉచిత బోర్లు.. పేద రైతులకు మోటార్లు) ‘‘పీరియాడికల్లీ చెకప్ ఉండాలి. దాదాపు 30 వేల మందిని కొత్తగా తీసుకొస్తున్నాం. వీరందరినీ మానిటర్ చేయాలి. 37000 వేల బెడ్స్, 240 హాస్పిటల్స్లో ఫుడ్, శానిటేషన్, ఇన్ఫ్రా, స్టాఫ్ వీటిపై మానిటరింగ్ పక్కాగా ఉండాలి. ప్రతీ రోజూ కలెక్టర్లు, జేసీలు మానిటర్ చేయాలి. ఈ నాలుగు కరెక్ట్గా ఉంటే చికిత్స కరెక్ట్గా అందుతుంది. కోవిడ్ కేర్ సెంటర్లలో కూడా ఫుడ్, శానిటేషన్, మెడికేషన్ కచ్చితంగా జరగాలి. అక్కడ కూడా హెల్ప్ డెస్క్ ఉండాలి. హోం ఐసొలేషన్లో ఉన్న వారికి కిట్లు ఇస్తున్నామా లేదా ప్రతీ ఒక్కరూ దృష్టి పెట్టాలి. కిట్లు రాలేదంటే ఖచ్చితంగా కలెక్టర్లు, జేసీలు బాధ్యత వహించాలి. ఏఎన్ఎంలు, లోకల్ డాక్లర్లు మ్యాపింగ్ చేయాలి. డాక్టర్ కూడా ఆ ఇంటికి వెళ్ళి చూడాలి, ఆశా వర్కర్లు, ఏఎన్ఎం, పిహెచ్సీ డాక్టర్ ముగ్గురూ కచ్చితంగా వారితో మాట్లాడాలి. 104 నంబర్ పబ్లిసిటీ కూడా బాగా జరగాలి. దానితో పాటు లోకల్ కంట్రోల్రూమ్ నంబర్ కూడా పబ్లిసిటీ చేయాలని’’ సీఎం సూచించారు. కోవిడ్ బాధితులను త్వరగా గుర్తించడం వలనే మరణాల సంఖ్య తగ్గుతుందని తెలిపారు. ‘‘మనం చంద్రబాబు అనే వ్యక్తితో కాదు, నెగిటివ్ మైండ్సెట్తో ఉన్న ఎల్లో మీడియాతో కూడా యుద్దం చేస్తున్నామని సీఎం పేర్కొన్నారు. మనం ఎంత మంచి చేస్తున్నా వేలెత్తి చూపే దుర్భుద్దితో పనిచేస్తున్నారు. అత్యంత జాగ్రత్తగా ఉండడం అవసరం, నెగిటివ్ వార్తలు చదువుదాం. మనం కరెక్ట్ చేయాల్సినవి ఏమైనా ఉంటే చేసుకుందాం, వారు అతిగా రాసినవి కూడా ఎత్తిచూపుదాం’’ అని సీఎం వైఎస్ జగన్ అన్నారు. వ్యవసాయ ఉత్పత్తుల సేకరణ – సన్నద్దత, రబీ పంటల సాగుపై ప్రణాళిక, వ్యవసాయ సలహా కమిటీల సమావేశాల నిర్వహణపై సీఎం సమీక్ష నిర్వహించారు. ఖరీఫ్ పంట చేతికొస్తుంది కాబట్టి, అక్టోబర్ 15 నుంచి ధ్యాస పెట్టాలని సీఎం వైఎస్ జగన్ తెలిపారు. ఆర్బీకేల ద్వారా మన ప్రొక్యూర్మెంట్ మరింత ఎఫెక్టివ్గా పనిచేయాలని, ఈ క్రాపింగ్ ప్రతీ పంటకు కంప్లీట్ కావాలన్నారు. ఈ క్రాపింగ్ ఎక్కడా కూడా పెండింగ్ ఉండకూడదని, దీనిపై కలెక్టర్లు, జేసీలు దృష్టి పెట్టాలని సీఎం సూచించారు. సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. ►ఈ క్రాపింగ్ తర్వాత రైతుల రిజిస్ట్రేషన్ జరగాలి, తర్వాత లిస్ట్ ఆర్బీకేలలో పెట్టాలి ►ప్రతీ రైతు వివరాలు ఈ క్రాపింగ్లో పక్కాగా ఉండాలి. సోషల్ ఆడిట్ చేయాలి. మిస్ అయితే వెంటనే నమోదుచేయాలి ►ఫామ్గేట్ అనేది ప్రతీ పంటకూ చేయాలి ►కూపన్లు ఇచ్చి ఫలానా రోజు ప్రొక్యూర్ చేస్తామని చెప్పాలి ►ఎక్కడా కూడా మ్యాన్యువల్ సర్టిఫికెట్ ఉండకూడదు, ఈ క్రాపింగ్ తప్పనిసరిగా జరగాలి ►సీఎం యాప్ ద్వారా మానిటరింగ్ జరగాలి ►అగ్రికల్చర్ అసిస్టెంట్ వెంటనే అలర్ట్ చేయాలి ►జేసీలు వెంటనే రైతుకు మార్కెటింగ్ సౌకర్యం చూపాలి ►ఏ పంటకు ఎంత గిట్టుబాటు ధర అనేది అక్టోబర్ 1 న రిలీజ్ చేస్తాం.. అక్టోబర్ 5 కల్లా అన్ని ఆర్బికేలలో డిస్ప్లే చేయాలి ►కనీస గిట్టుబాటు ధర కన్నా ఎక్కువ రేట్కు మనం అమ్మించగలగాలి ►రైతుకు పూర్తిగా తోడు నిలబడే విధంగా అన్ని చర్యలు తీసుకుంటున్నాం. కలెక్టర్లు, జేసీలు పూర్తిగా ధ్యాస పెట్టండి ►స్టేట్లెవల్ అడ్వైజరీ కమిటీ, జిల్లా, మండల, ఆర్బీకేల స్ధాయి కమిటీలు వెంటనే ఏర్పాటుచేయాలి ►ఏ పంట గ్రామంలో వేయాలి, ఏ పంట వేయద్దు అనే అంశాలు కూడా కమిటీలు చర్చించాలి ►కలెక్టర్లు అందరూ గుర్తుపెట్టుకోవాలి, రైతు అనే వ్యక్తి నష్టపోతే అందరూ నష్టపోతారు. ఫార్మర్స్ ఈజ్ హయ్యెస్ట్ ప్రయారిటీ. వరద పరిస్థితిపై సమీక్ష.. భారీ వర్షాలు, పంట, ఆస్తినష్టం అంచనాపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమీక్ష నిర్వహించారు. కృష్ణా, గుంటూరు, నెల్లూరు కలెక్టర్లతో వరదల పరిస్థితిని సీఎం సమీక్షించారు. పంట, ఆస్తినష్టంపై త్వరగా అంచనాలు పంపించాలని సీఎం ఆదేశించారు. ఆర్బీకే లెవల్లో ఎన్యూమరేషన్ ఆఫ్ ఫార్మర్స్ డిస్ప్లే చేయాలన్నారు. ఇప్పటివరకు వరదల్లో 8 మంది చనిపోయినట్లు సమాచారం వచ్చిందని.. వారి కుటుంబాలకు వెంటనే రూ.5లక్షల చొప్పున పరిహారం అందజేయాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. -
మరింత అప్రమత్తంగా ఉండాలి: మంత్రి అనిల్
సాక్షి, అమరావతి: కృష్ణా నదికి భారీగా వరద నీరు పోటెత్తడంతో అప్రమత్తంగా ఉండాలని అధికారులకు ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్కుమార్ యాదవ్ సూచించారు. ఆయన ఆదివారం కృష్ణా,గుంటూరు జిల్లాల కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లతో ఫోన్లో మాట్లాడారు. రాత్రికి ప్రకాశం బ్యారేజీకి వరద 6 లక్షల క్యూసెక్కులు దాకా వచ్చే అవకాశం ఉండటంతో మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. లోతట్టు,దిగువ ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసి అవసరమైన పునరావాస చర్యలు తీసుకోవాలని మంత్రి అనిల్ ఆదేశించారు. కడప, కర్నూలు, అనంతపురం జిల్లాలలో భారీగా వర్షాలు కురుస్తుండటంతో ఆయా జిల్లాలో ఇరిగేషన్ సీఈలతో మంత్రి అనిల్ ఫోన్లో మాట్లాడారు. మూడు జిల్లాల్లోని లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేవిధంగా చర్యలు చేపట్టాలని మంత్రి అనిల్కుమార్ యాదవ్ ఆదేశించారు. -
కోవిడ్పై నిర్లక్ష్యం వద్దు..
-
అప్రమత్తంగా ఉండాలి: సీఎం జగన్
సాక్షి, అమరావతి: కోవిడ్పై నిర్లక్ష్యం వద్దని.. నిరంతరం అప్రమత్తంగానే ఉండాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సూచించారు. మంగళవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో కలెక్టర్లు,ఎస్పీలతో స్పందన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. డిప్యూటీ సీఎం ఆళ్లనాని, మంత్రులు బొత్స, ఆదిమూలపు సురేష్ హాజరయ్యారు. కోవిడ్ నివారణ చర్యలు, స్కూళ్లు, అంగన్వాడీ, ఆస్పత్రుల్లో నాడు-నేడు, గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థ, గిరిజన ప్రాంతాల్లో ఆర్వోఎఫ్ఆర్ పట్టాలపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు.(చదవండి: ఆ శక్తి కేవలం విద్యకే ఉంది: సీఎం జగన్) ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ కోవిడ్తో కలిసి జీవించాల్సిన పరిస్థితులున్నాయని.. ఈ నేపథ్యంలో ఉదాసీనత లేకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో కోవిడ్–19 పరీక్షలు తప్పనిసరిగా జరగాలని, పీహెచ్సీలు, యుహెచ్పీలు, ఏరియా ఆసుపత్రులు, టీచింగ్ ఆసుపత్రలు, జీజీహెచ్లలో పరీక్షల నిర్వహణ తప్పనిసరి ఉండాలన్నారు. ‘‘కోవిడ్ పరీక్షల కోసం ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాని పరిస్థితి. రాష్ట్రంలో ఎవరికీ రాకూడదు. కోవిడ్ పరీక్షలు, ప్రజల నుంచి వచ్చే విజ్ఞప్తులు, ఆసుపత్రుల్లో అడ్మిషన్లు తదితర అన్ని అవసరాలకు 104 కాల్ సెంటర్ను ఉపయోగించుకోవాలి. ఈ నంబర్ను ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయాలి. ఈ కాల్ సెంటర్ నుంచి జిల్లా కలెక్టర్లకు రిక్వెస్ట్లు వస్తే వెంటనే దానిపై స్పందించాలి. ఆ ఫోన్ కాల్స్పై ఎలా రెస్పాండ్ అవుతున్నామనేదే పని తీరుకు అద్దం పడుతుంది. కాల్ సెంటర్కు ఫోన్ చేసిన వ్యక్తి పట్ల మనం ఎలా రెస్పాండ్ అవుతున్నామో జిల్లా కలెక్టర్లు నిరంతరం పర్యవేక్షించాలి. జిల్లా కలెక్టర్లు, జేసీలు ప్రతి రోజూ 104 కాల్ సెంటర్లకు, జిల్లా కోవిడ్ సెంటర్లకు మాక్ కాల్స్ చేసి, వ్యవస్థలో ఎక్కడైనా ఉదాసీనత వుందా లేదా అనే దానిని పరీక్షించాలని’’ సీఎం పేర్కొన్నారు. ఆర్టీపీసీఆర్, ట్రూనాట్ పరీక్షల్లో నమూనాలు తీసుకున్న 24 గంటలు, రాపిడ్ పరీక్షలో 30 నిమిషాల్లో ఫలితం అందించే విధంగా జిల్లా కలెక్టర్లు దృష్టిపెట్టాలన్నారు. జిల్లాల్లోని అన్ని ల్యాబ్లకు అవసరమైన పరికరాలను అందించామని, ఎక్కడా కిట్లు లేవనే పేరుతో పరీక్షలు నిరాకరించకూడదని సీఎం స్పష్టం చేశారు. పాజిటివ్ కేసుల్లో ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్లు వున్న వారిని కచ్చితంగా హోం క్వారంటైన్లో వుంచేలా చర్యలు తీసుకోవాలన్నారు. ‘‘కోవిడ్ నేపథ్యంలో అదనంగా 17 వేల మంది వైద్యులు, ఇతర సిబ్బందిని ఆరు నెలల కాలానికి కాంట్రాక్ట్ విధానంలో నియమించేందుకు అనుమతి ఇచ్చాం. మరో 11 వేల మంది ట్రైనీ నర్స్లను తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నాం. దీనికి సంబంధించి ఇంకా కొన్నిచోట్ల నియామకాలు పూర్తి కాలేదు, వాటిని వెంటనే పూర్తి చేయాలి. మరో వారం రోజుల్లో రెగ్యులర్ పోస్టులు భర్తీ ప్రక్రియ పూర్తి చేయాలి. నియామకం పొందిన అభ్యర్ధులు వెంటనే వారికి నిర్ధేశించిన కోవిడ్ విధుల్లో చేరాలి. దానిని కూడా కలెక్టర్లు, జేసీలు పర్యవేక్షించాలని సీఎం ఆదేశించారు. హోం ఐసోలేషన్లో వున్న వారికి అవసరమైన మందులతో కూడిన మెడికల్ కిట్లను పంపిణీ చేశామని, మెడికల్ ఆఫీసర్ ఫోన్లో 14 రోజుల పాటు పేషంట్కు అందుబాటులో వుండాలన్నారు. జాయింట్ కలెక్టర్లు ఈ హోం కిట్లలో అన్ని మందులు వున్నాయో లేదో పర్యవేక్షించాలని’’ సీఎం సూచించారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో బయోమెట్రిక్ అటెండెన్స్లు ప్రవేశపెట్టాలి. ప్రతి సచివాలయ ఉద్యోగి సచివాలయంలోనే కూర్చుని విధులు నిర్వహించాలి. వాలంటీర్లు వారంలో కనీసం మూడు రోజులు సచివాలయంలో అటెండెన్స్ ఇవ్వాలి. ఖాళీగా ఉన్న వాలంటీర్ పోస్టులను భర్తీ చేయాలి. ప్రజలకు అందించే సేవలకు సంబంధించి ఇచ్చిన టైం లైన్లోనే పని చేయాలి. వారానికి రెండుసార్లు కలెక్టర్లు.. నాలుగుసార్లు జేసీలు గ్రామ సచివాలయాలను సందర్శించాలి. నెలకు రెండుసార్లు హెచ్వోడీలు, సెక్రటరీలు గ్రామ సచివాలయాలకు వెళ్లాలి. 200 మందితో ఇప్పటికే కాల్ సెంటర్ ఏర్పాటు చేశాం. ఎప్పటికప్పుడు గ్రామ సచివాలయాల్లో సేవలను ఈ కాల్సెంటర్ పర్యవేక్షిస్తుందని’’ సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు. ఉపాధి హామీపై సీఎం వైఎస్ జగన్ నరేగాకు సంబంధించి రాష్ట్రానికి 4.25 కోట్ల పనిదినాలు అదనంగా వచ్చాయి. దీనితో పాటు అదనంగా మెటీరియల్ కాంపోనెంట్ కూడా పెరుగుతుంది. రూ.4వేల కోట్లకు సంబంధించిన మెటీరియల్ కాంపోనెంట్కు అవకాశం వుంది. ప్రతి జిల్లాలో రూ.పదికోట్లు ప్రతి వారంలో మెటీరియల్ కాంపోనెంట్ను వినియోగించుకోవాలని లక్ష్యంగా పెట్టుకుని పనులు చేపట్టాలి. పేమెంట్లు కూడా ఈ నెలలో పెండింగ్ లేకుండా చెల్లించేందుకు చర్యలు తీసుకుంటాం. గ్రామ సచివాలయాలు, రైతుభరోసా కేంద్రాలు, వైఎస్ఆర్ హెల్త్క్లినిక్స్ను పూర్తి చేయడం, అంగన్ వాడీ కేంద్రాల నిర్మాణాలు, స్కూల్ కాంపొండ్ లను పూర్తి చేయడంపై దృష్టిపెట్టాలి. ఈ నెలాఖరు నాటికి ఈ నిర్మాణాలు పూర్తి చేయాలనే లక్ష్యంతో పనిచేయాలి. అక్టోబర్ నుంచి డ్రైన్స్, గతంలో ఒకశాతం పనులు జరిగి, నిలిపివేసిన వాటికి కూడా అనుమతి ఇవ్వాలి. రూ.2వేల కోట్ల పనులు ఒకశాతం కన్నా ఎక్కువ ఖర్చు చేసినవి వున్నాయి. వాటికికూడా అనుమతులు ఇస్తాం. -
నాగుపాము విషం తాగి బతికావా?: ఎమ్మెల్యే
సాక్షి, తాడేపల్లి: ఐఏఎస్లపై వచ్చిన హనీ ట్రాప్ కథనాలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జోగి రమేష్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆంధ్రజ్యోతి అధిపతి రాధాకృష్ణ బతుకంతా కుట్రలేనని విమర్శించారు. అమ్మ పాలు తాగుతూ బతికావా? నాగు పాము విషం తాగి బతికావా? అని ప్రశ్నించారు. విషసర్పంలా వెంటాడుతున్న ఆయన ప్రభుత్వాన్ని ఏ విధంగా అస్థిరపర్చలేరని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రజా మద్దతు ఉందని తెలిపారు. కాగా "హనీ ట్రాప్.. ఇద్దరు కలెక్టర్ల కహానీ" పేరుతో కలెక్టర్లపై ఆంధ్రజ్యోతి పత్రికలో తప్పుడు కథనం ప్రచురితమైంది. దీనిపై ఆగ్రహంతో పాటు ఆవేదనకు గురైన జిల్లా కలెక్టర్లందరూ ఆంధ్రజ్యోతి యాజమాన్యంపై న్యాయపరమైన చర్యలకు ఉపక్రమించారు. తాజాగా వీరికి జోగి రమేష్ మద్దతు తెలిపారు. (తప్పుడు కథనంపై కలెక్టర్ల లీగల్ నోటీసు) ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. "బ్రోకర్ వ్యవస్థకు ఆద్యుడు ఎవరు? అంటే.. నారా చంద్రబాబు నాయుడు అని ఆనాడే ఎన్టీఆర్ చెప్పారు. ఒకప్పుడు సైకిల్పై తిరిగే రాధాకృష్ణ ఇప్పుడు ఎక్కడ తిరుగుతున్నాడు? ఈయన వ్యవస్థపై, బాధ్యతయుతమైన పదవుల్లో ఉన్న వారిపై విషం చిమ్ముతున్నారు. ఆనాడు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి, వైస్రాయ్ హోటల్ హానీ ట్రాప్ చేయలేదా? రాధాకృష్ణ ఒక బ్రోకర్.. అతనిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలి. కరోనా కష్టకాలంలోనూ జిల్లా కలెక్టర్లు వారి ప్రాణాలు సైతం పణంగా పెట్టి 24 గంటలు కష్టపడుతున్నారు. అలాంటి వారిపై మీరు విషం చిమ్ముతున్నారు. వ్యవస్థల్ని భ్రష్టు పట్టిస్తున్నారు, శిఖండిల్లా అడ్డు పడుతున్నారు. 25 ఏళ్ళ పాటు వైస్సార్ సీపీ అధికారంలో ఉంటుంది, రాధాకృష్ణ నీ కోరలు పీకుతాం. ఈరోజు ఐఏఎస్ అధికారులు, సివిల్ సర్వెంట్స్పై వెనకుండి విషపు రాతలు రాయిస్తున్న రాధాకృష్ణ, చంద్రబాబుపై చర్యలు తీసుకోవాలి. సివిల్ సర్వెంట్లకు మేము అండగా ఉంటాము" అని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. (గుండెల నిండా జనం అజెండా) -
‘ఆంధ్రజ్యోతి’కి కలెక్టర్ల అల్టిమేటం
బాధాతప్త.. బరువైన హృదయాలతో స్పందిస్తున్నాం. కలెక్టర్ల వ్యవస్థ ప్రతిష్టను దిగజార్చాలన్న లక్ష్యంతోనే మీరు ఈ కథనాన్ని ప్రచురించారు. తుపాన్లు, వరదలు వంటి ప్రకృతి విపత్తులు, అగ్ని, రోడ్డు ప్రమాదాల వంటి ఘటనలు జరిగిన సమయాల్లో దేశం మొత్తాన్ని ఏకతాటిపైకి తెచ్చి, ప్రజలకు ఉపశమనం కలిగించడంలో కలెక్టర్లు కీలక పాత్ర పోషిస్తూ వస్తున్నారు. – కలెక్టర్లు సాక్షి, అమరావతి: తమ నైతిక, ఆత్మస్థెర్యాన్ని దెబ్బతీసే విధంగా ‘హనీ ట్రాప్.. ఇద్దరు కలెక్టర్ల కహానీ’ పేరుతో తప్పుడు కథనం ప్రచురించిన ఆంధ్రజ్యోతి యాజమాన్యంపై రాష్ట్రంలోని జిల్లా కలెక్టర్లందరూ న్యాయపరమైన చర్యలకు ఉపక్రమించారు. అందులో భాగంగా రాష్ట్ర పబ్లిక్ ప్రాసిక్యూటర్ కె.శ్రీనివాసరెడ్డి ద్వారా ఆ పత్రిక యాజమాన్యానికి లీగల్ నోటీసు పంపారు. కలెక్టర్ల పరువు ప్రతిష్టలను దెబ్బతీసే విధంగా కథనం ప్రచురించినందుకు బేషరతుగా క్షమాణలు చెబుతూ.. దానిని ప్రచురించాలని ఆంధ్రజ్యోతి యాజమాన్యానికి అల్టిమేటం జారీ చేశారు. వారం లోపు స్పందించకుంటే, తదుపరి చర్యలకు సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు. ఆ నోటీసులోని వివరాలు ఇలా ఉన్నాయి. ► స్వాతంత్య్రం సిద్ధించిన రోజుల నుంచి కలెక్టర్లను ఓ వ్యవస్థగా ఎంతో గౌరవ ప్రదంగా చూస్తున్నారు. అలాంటి కలెక్టర్ల వ్యవస్థపై అభాండాలు మోపుతూ బురదజల్లే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. క్లిష్ట పరిస్థితుల్లో పని చేస్తూ ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను చేరువ చేయడమే కాకుండా, ప్రజలతో విడదీయరాని బంధాన్ని కొనసాగిస్తూ పాలనను ముందుకు తీసుకెళుతున్నాం. ► సమతా వాదం.. లౌకిక వాదం.. మానవతా వాదం వంటి ఉత్కృష్ట సిద్ధాంతాలను నిలబెడుతున్నాం. నిస్వార్థంగా ప్రజలకు సేవలందిస్తూ, ప్రజల మద్దతును ఆస్వాదిస్తూ సంపాదించుకున్న కలెక్టర్ల వ్యవస్థ ప్రతిష్టను ఒక కలం పోటుతో దిగజార్చేశారు. ► ఇలాంటి ప్రయత్నాలు జర్నలిజం నైతిక పతనాన్ని నిరూపిస్తున్నాయి. మీ రాజకీయ బాసులను సంతృప్తి పరిచేందుకు అబద్ధపు రాతలతో గోబెల్స్ ప్రచారం చేస్తున్నందుకు మీపై మేం జాలి చూపిస్తున్నాం. మీరు నైతిక విలువలను పూర్తిగా గాలి కొదిలేసి, అబద్ధాల చుట్టూ తిరుగుతున్నారు. రాజకీయ లబ్ధి కోసమే.. ► మీ కథనం పాత్రికేయ విలువలను ఉల్లంఘించేదిగా ఉంది. అంతేకాక దురుద్దేశంతో కూడుకున్నది కూడా. కొందరు అనైతిక విలువలు లేని వ్యక్తుల దుష్ప్రవర్తనను సాకుగా తీసుకుని, మొత్తం ఐఏఎస్ వ్యవస్థపైనే విషం చిమ్ముతూ మీరు కథనం రాశారు. ► కేవలం రాజకీయ లబ్ధి కోసమే మీరు ఇలా చేశారు. మీ బురదజల్లుడు, తప్పుడు నిందారోపణల వల్ల ప్రజలకు నిబద్ధతతో సేవ చేస్తున్న దేశంలోని కలెక్టర్లందరి నైతిక స్థెరాన్ని దెబ్బతీశారు. వాస్తవాలను తెలుసుకోకుండా, తటస్థంగా ఉండాలన్న జర్నలిజం విలువలకుపాతరవేస్తూ కథనం ప్రచురించారు. ► ఇలాంటి రాతలు రాసిన మీ మీడియా హౌస్పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. మౌనాన్ని పిరికితనంగా భావిస్తారని, సందర్భం వచ్చినప్పుడు వాస్తవాలు తెలియచేసి, తదనుగుణంగా స్పందించాలని మహాత్మా గాంధీ చెప్పారు. అందుకే రాజకీయ ప్రయోజనాలను ఆశించి రాసిన ఈ దురుద్దేశ పూర్వక కథనాన్ని ఖండిస్తున్నాం. మీరు రాసిన కథనం వల్ల మా కుటుంబాలు చెప్పలేనంత తీవ్ర మనోవేదనకు గురయ్యాయి. మీరు కథనం రాసిన విధానం కలెక్టర్ల వ్యవస్థ పనికిరాదన్న తప్పుడు భావన సామాన్యుడికి కలిగించేలా ఉంది. మీ కథనంలో కూర్చినదంతా తీవ్ర అభ్యంతరకరం.. గర్హనీయం. -
ఆంధ్రజ్యోతి పత్రికకు లీగల్ నోటీసులు
సాక్షి, అమరావతి: ఆంధ్రజ్యోతి పత్రికకు రాష్ట్రంలోని 13 జిల్లాల కలెక్టర్లు లీగల్ నోటీసులు ఇచ్చారు. ఆ పత్రిక ఎండీ రాధాకృష్ణ సహా మరో ముగ్గురు బాధ్యులకు శనివారం ఈ నోటీసులను పంపారు. ఈ మేరకు స్టేట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ శ్రీనివాస్రెడ్డి లీగల్ నోటీసులు పంపారు. హనీ ట్రాప్ను ఆపాదిస్తూ ఇద్దరు కలెక్టర్ల కహానీ పేరుతో నిరాధార వార్తా కథనం పచురణపై జిల్లా కలెక్టర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కథనం కలెక్టర్ల వ్యవస్థపై ఉద్దేశపూర్వక దాడి అని కలెక్టర్లు మండిపడ్డారు. కలెక్టర్లు అందరూ కలిసి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నామని తెలిపారు. కరోనా లాంటి విపత్కర సమయంలో సంక్షేమ పథకాల ద్వారా అనేక వర్గాలను ఆదుకున్నామని పేర్కొన్నారు. (‘హనీ ట్రాప్’ కథనంపై కలెక్టర్ల ఆగ్రహం) అర్హులకు వాటిని అందించడంలో, అవినీతి లేకుండా పారదర్శకంగా పథకాలను అమలు చేయడంలో కలెక్టర్లు కీలక పాత్ర పోషిస్తున్నారని చెప్పారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలతో, వినూత్న నిర్ణయాలతో ప్రజలకు అత్యంత చేరువగా పాలన అందించడం ద్వారా దేశంలోనే ఏపీలో కలెక్టర్ల వ్యవస్థకు మంచి పేరు వచ్చిందని గుర్తు చేశారు. దేశానికి ఆదర్శంగా ఏపీ కలెక్టర్ల వ్యవస్థ తయారైందని పేర్కొన్నారు. అలాంటి కలెక్టర్ల వ్యవస్థపై కుట్రపూరిత ఆలోచనతోనే ఆంధ్రజ్యోతి తప్పుడు కథనాలతో దాడి చేస్తోందని మండిపడ్డారు. తమ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేందుకే నిరాధార కథనాలని దురుద్దేశపూర్వకంగా వండి వారుస్తున్నారని కలెక్టర్లు తెలిపారు. తమ కుటుంబాల్లో కూడా ఈ కథనాలపై విస్తృతమైన చర్చ సాగుతోందని వివరించారు. తమ కుటుంబ సభ్యులు తీవ్రంగా బాధపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కష్టపడి పని చేస్తున్న తమపై ఆధారాలు లేకుండా, అనైతిక ఆలోచనలతో మసాలా వార్తలు ప్రచురిస్తున్నారని అన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇలాంటి తీరు గర్హనీయం. పరిధులు దాటి, విశృంఖల కోణంలో ఈ కథనాలున్నాయని మండిపడ్డారు. కలెక్టర్లను మానసికంగా దెబ్బతీసి కొందరికి ఇతోధిక ప్రయోజనాలు కల్పించాలన్న కుట్రకోణం ఇందులో కనిపిస్తోందన్నారు. వీటిని చూస్తూ ఊరుకుంటే కలెక్టర్లు స్వేచ్ఛగా పని చేయలేరని అన్నారు. అందుకే చట్ట ప్రకారం ముందుకు వెళ్తామని కలెక్టర్లు తెలియజేశారు. -
‘హనీ ట్రాప్’ కథనంపై కలెక్టర్ల ఆగ్రహం
-
‘హనీ ట్రాప్’ కథనంపై కలెక్టర్ల ఆగ్రహం
సాక్షి, అమరావతి: ‘‘హనీ ట్రాప్.. ఇద్దరు కలెక్టర్ల కహానీ’’ పేరుతో ఓ దినపత్రిక ప్రచురించిన నిరాధార వార్తా కథనంపై జిల్లా కలెక్టర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కలెక్టర్ల వ్యవస్థపై జరిగిన ఉద్దేశపూర్వక దాడిగా దీనిని అభివర్ణిస్తున్నారు. ఈ నేపథ్యంలో కలెక్టర్లంతా కలిసి చట్టప్రకారం చర్యలు తీసుకోవడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. వార్తా కథనం ప్రచురించిన వారిని కోర్టుకు ఈడ్చాలని, పరువు నష్టం దావా వేయాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కాగా ప్రభుత్వ సంక్షేమ పథకాలతో, వినూత్న నిర్ణయాలతో ప్రజలకు అత్యంత చేరువగా పాలన అందించడం ద్వారా ఏపీలో ఏపీ కలెక్టర్ల వ్యవస్థ దేశానికి ఆదర్శంగా తయారైంది. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నారు. ప్రజలను ఆదుకునేలా ప్రభుత్వం తీసుకున్న చర్యలను సమర్థవంతంగా అమలు చేస్తున్నారు. అంతేగాక కరోనా లాంటి విపత్కర సమయంలో ఈ పథకాల ద్వారా అనేక వర్గాలను ఆదుకున్నారు. అర్హులకు వీటిని అందించడంలో, అవినీతిలేకుండా పారదర్శకంగా పథకాలను అమలు చేయడంలో కలెక్టర్లు కీలక పాత్ర పోషిస్తున్నారు. దీంతో కలెక్టర్లందరికీ కూడా ప్రజల్లో మంచి పేరు వచ్చింది. అలాంటి వ్యవస్థపై కుట్రపూరిత ఆలోచనతో, కలెక్టర్ల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేందుకే ఇలాంటి కథనాలను వండివారస్తున్నారని కలెక్టర్లు మండిపడుతున్నారు. తమ కుటుంబాల్లో కూడా ఈ కథనాలపై విస్తృతమైన చర్చ నడుస్తోందని, దీని వల్ల తమ కుటుంబ సభ్యులు కూడా తీవ్రంగా బాధపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి అసత్య కథనాలపై ఎందుకు మౌనంగా ఉన్నారని పిల్లలు నిలదీస్తున్నారని పేర్కొన్నారు. రోజుకు ఇన్ని గంటలు కష్టించి పనిచేస్తున్నా.. తమపై ఈ రాతపూర్వక దాడి ప్రేరేపిత చర్య అని, ఆధారాలు లేకుండా, అనైతిక ఆలోచనలతో మసాలా వార్తలు వండి ప్రచురిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇలాంటి తీరు గర్హనీయమన్నారు. పరిధులు దాటి, విశృంఖల కోణంలో ఈ కథనాలున్నాయి. కలెక్టర్లను మానసికంగా దెబ్బతీసి కొందరికి ఇతోధిక ప్రయోజనాలు కల్పించాలన్న కోణం ఇందులో కనిపిస్తోంది. వీటిని చూస్తూ ఊరుకుంటే... కలెక్టర్లు స్వేచ్ఛగా పనిచేయలేరు. అందుకే చట్టప్రకారం ముందుకు వెళ్లాలని కలెక్టర్లు నిర్ణయించుకున్నట్లు సమాచారం. -
గోదావరి వరద పరిస్థితులపై సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్
-
వరద పరిస్థితులపై సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్
సాక్షి, అమరావతి: గోదావరి వరద పరిస్థితులపై ఉభయగోదావరి జిల్లాల కలెక్టర్లతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వరద పరిస్థితులపై కలెక్టర్లను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ‘‘అధికారులంతా సహాయ పునరావాస కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. నేను ఏరియల్ సర్వేకు వెళ్తున్నాను. నేను వెళ్తున్నాను కాబట్టి మీరు సహాయ పునరావాస కార్యక్రమాలను వదిలిరావాల్సిన అవసరంలేదు. అందుకే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షిస్తున్నానని’ సీఎం జగన్ తెలిపారు. ముంపు బాధితుల కుటుంబాలకు ఒక్కొంటికి రూ.2 వేల చొప్పున సహాయం అందించాలని సీఎం ఆదేశించారు. ముంపు బాధితుల పట్ల మానవత్వంతో, ఉదారంగా వ్యవహరించాలని ఆయన కోరారు. మన ఇంట్లో సమస్యగానే భావించి వారికి అండగా నిలవాలని పేర్కొన్నారు. ఖర్చు విషయంలో వెనుకాడ వద్దని సీఎం స్పష్టం చేశారు. ‘‘వరద సహాయ కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులను భాగస్వామ్యం చేయండి. వారు ఇస్తున్న క్షేత్రస్థాయి సమాచారంపై వెంటనే చర్యలు తీసుకోవాలి. వారు ఇచ్చే సమాచారం తీసుకోవడంపై ఒక అధికారిని కూడా పెట్టండి. క్షేత్రస్థాయిలో వారు గమనించిన అంశాలను వెంటనే పరిష్కరించండి. ఈ రాత్రికి 17 లక్షల క్యూసెక్కులకు, రేపు ఉదయానికి 12 లక్షల క్యూసెక్కులకు, ఎల్లుండికి 8 లక్షల క్యూసెక్కులకు వరద తగ్గుతుందన్న సమాచారం వస్తోంది. వరద తగ్గుముఖం పట్టగానే 10 రోజుల్లో పంట నష్టం అంచనాలు పంపించాలి. ఎన్యుమరేషన్ 10 రోజుల్లోగా చేయాలి. విద్యుత్, కమ్యూనికేషన్ వ్యవస్థలను వీలైనంత త్వరగా పునరుద్ధరించాలని’’ సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. -
వరదల పట్ల అప్రమత్తంగా ఉండండి
అమరావతి: గోదావరి వరద పరిస్థితులపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆరా తీశారు. సీఎం కార్యాలయ అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ముంపు ప్రాంతాల నుంచి ఇప్పటికే చాలా మంది ప్రజలను తరలించామని, వచ్చే వరదను దృష్టిలో పెట్టుకుని భారీ ఎత్తున సహాయ చర్యలు చేపట్టడానికి ఏర్పాట్లు చేశామని అధికారులు ఆయనకు వివరించారు. ఉభయగోదావరి జిల్లాల కలెక్టర్లకు ఈ మేరకు ఆదేశాలు ఇచ్చినట్టు తెలిపారు. ► వరదల పట్ల అప్రమత్తంగా ఉండాలని సీఎం ఆదేశించారు. ► ముంపునకు గురయ్యే ప్రాంతాలపై దృష్టిపెట్టాలని, ఎలాంటి ప్రాణనష్టం లేకుండా.. బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. ► దీనికోసం ప్రత్యేకంగా సహాయ పునరావాస శిబిరాలు తెరిచి, బాధితులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలన్నారు. ► ఉభయగోదావరి జిల్లాల కలెక్టర్లు సహాయ చర్యలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఆదేశించారు. ► రక్షణ చర్యలు, సహాయ పునరావాస కార్యక్రమాల కోసం రాష్ట్ర విపత్తు దళం (ఎస్డీఆర్ఎఫ్), జాతీయ విపత్తు దళం (ఎన్డీఆర్ఎఫ్) సహా సంబంధిత సిబ్బందిని సిద్ధం చేసుకోవాలన్నారు. ► రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుని తదనుగుణంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ► గోదావరి వరద ఉధృతి, ముంపు పరిస్థితులపై ఎప్పటికప్పుడు తనకు నివేదించాలన్నారు. ► కృష్ణా జిల్లాలోనూ భారీ వర్షాలు, అనంతర పరిస్థితులపై సీఎం వైఎస్ జగన్ ఆరా తీశారు. వరదల పట్ల అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తూ బాధితులను ఆదుకోవాలని ఆదేశించారు. -
వరద పరిస్థితిపై సీఎం వైఎస్ జగన్ ఆరా..
సాక్షి, అమరావతి: గోదావరి వరద పరిస్థితులపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆరా తీశారు. సీఎం కార్యాలయ అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ముంపు ప్రాంతాల నుంచి ఇప్పటికే చాలా మందిని తరలించారని, వచ్చే వరదను దృష్టిలో ఉంచుకుని మరిన్ని చర్యలు తీసుకుంటున్నట్టుగా సీఎంవో అధికారులు సీఎంకు వివరించారు. ఉభయ గోదావరి జిల్లాల కలెక్టర్లకు ఈ మేరకు ఆదేశాలు ఇచ్చినట్టుగా కూడా ఆయనకు తెలిపారు. వరదల పట్ల అప్రమత్తంగా ఉండాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. (పవన్ అభిమానికి సీఎం జగన్ ఆర్థిక సాయం) ముంపునకు గురయ్యే ప్రాంతాలపై దృష్టి పెట్టాలని, ఎలాంటి ప్రాణ నష్టం లేకుండా వారిని రక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. దీని కోసం ప్రత్యేకంగా సహాయ పునరావాస శిబిరాలు తెరిచి వారికి అన్నిరకాల సౌకర్యాలు అందించాలన్నారు. ఉభయగోదావరి జిల్లాలకు చెందిన ఇద్దరు కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సీఎం స్పష్టం చేశారు. రక్షణ చర్యలు, సహాయ పునరావాస కార్యక్రమాల కోసం ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ సహా సంబంధిత సిబ్బందిని సిద్ధం చేసుకోవాలన్నారు. రాష్ట్ర విపత్తు నిర్వహణా శాఖతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుని తదనుగుణంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశించారు. గోదావరి వరద ఉధృతి, ముంపు పరిస్థితులపై ఎప్పటికప్పుడు తనకు నివేదించాలన్నారు. ఇటు కృష్ణా జిల్లాలో కూడా భారీ వర్షాలు, అనంతర పరిస్థితులపై సీఎం ఆరా తీశారు. అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తూ బాధితులను ఆదుకోవాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. -
నివారణ చర్యలు చేపట్టండి
సాక్షి, హైదరాబాద్: మంత్రుల సూచనలు, సలహాలతో జిల్లాల్లో కరోనా నివారణచర్యలు చేపట్టాలని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ కలెక్టర్లను ఆదేశించారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ఆదేశాల మేరకు మంత్రి ఈటల, రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్ కుమార్ జిల్లాల్లో కోవిడ్ మేనేజ్మెంట్పై కలెక్టర్లు, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు, జిల్లా ఆస్పత్రుల సూపరింటెండెంట్లతో గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మం త్రి మాట్లాడుతూ హోం ఐసోలేషన్లో ఉన్న రోగుల ఆరోగ్యపరిస్థితిని క్రమం తప్పకుండా పర్యవేక్షించాలని, వారి కి డాక్టర్లతో కౌన్సెలింగ్ ఇప్పించాలని కలెక్టర్లను ఆదేశించారు. కోవి డ్ బాధితులందరికీ అవసరమైన చికిత్స అందిం చి వారిలో భరోసా కల్పించాలని సూచించారు. కరోనా వైరస్ కట్టడికి అందరూ కలసికట్టుగా కృషి చేయాలని పేర్కొన్నారు. కొత్త టెస్టింగ్ సెంటర్ల ఏర్పాటుకు సిద్ధం కరోనా టెస్ట్ల కోసం వచ్చిన ప్రతిఒక్కరికీ పరీక్ష చేయాలని, వారి వివరాలను యాప్లో తప్పనిసరిగా నమోదు చేయాలని సోమేశ్కుమార్ సూచించారు. పేషెంట్లకు కౌన్సెలింగ్తోపాటు మెడికల్ కిట్ను అందజేయాలన్నారు. కొత్త టెస్టింగ్ సెంటర్ల ఏర్పాటు, వైద్యులు, మెడికల్ సిబ్బంది తాత్కాలిక నియామకానికి ప్రతిపాదనలు పంపితే అనుమతులు ఇస్తామని చెప్పారు. జిల్లా, ఏరియా ఆస్పత్రులు, ప్రభుత్వ మెడికల్ కాలేజీల అనుబంధ ఆస్పత్రుల్లో ఉన్న అన్ని బెడ్లకు ఆక్సిజన్ సదుపాయం కల్పించడానికిగాను ప్రతిపాదనలు సమర్పించాలని ఆదేశించారు. సమావేశంలో వైద్య, ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీ, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ కరుణ, కాలుష్య నియంత్రణ మండలి(పీసీబీ) మెంబర్ సెక్రటరీ నీతూ ప్రసాద్, పంచాయతీ రాజ్ కమిషనర్ రఘునందన్రావు, ఆర్థిక శాఖ స్పెషల్ సెక్రటరీ రోనాల్డ్ రోస్ పాల్గొన్నారు. -
17 మంది అదనపు కలెక్టర్ల నియామకం
సాక్షి, హైదరాబాద్: పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం 17 జిల్లాలకు కొత్త అదనపు కలెక్టర్లను (స్థానిక సంస్థలు) నియమించింది. ఇందులో 8 మంది ఐఏఎస్, 9 మంది నాన్ ఐఏఎస్ అధికారులున్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఈ నియామకాలు జరుపుతూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఇప్పటివరకు మొత్తం 29 జిల్లాలకు అదనపు కలెక్టర్లను (స్థానిక సంస్థ) నియమించినట్టు అయింది. ఐఏఎస్ అధికారులు అనుదీప్ దురుశెట్టి (భద్రాద్రి కొత్తగూడెం), కోయ శ్రీహర్ష (జోగుళాంబ గద్వాల), అభిలాష అభినవ్ (మహబూబాబాద్), బి.సత్యప్రసాద్ (రాజన్న– సిరిసిల్ల), కుమార్ దీపక్ (పెద్దపల్లి), ఆదర్శ్ సౌరభి (ములుగు), భోర్ఖాడే హేమంత్ సహదేవ్రావు (నిర్మల్), తేజస్ నంద్లాల్ పవార్ (మహబూబ్నగర్) అదనపు కలెక్టర్లుగా నియమితులయ్యారు. నాన్ ఐఏఎస్ అధికారులైన స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లు కోట శ్రీవాత్సవ (వనపర్తి), జాల్దా అరుణశ్రీ (జగిత్యాల), అనుగు నర్సింహారెడ్డి (కరీంనగర్), కందూరి చంద్రారెడ్డి (నారాయణపేట), ఎన్.నటరాజ్ (కుమ్రంభీం–ఆసిఫాబాద్), వైవీ గణేష్ (జయశంకర్ భూపాలపల్లి), బి.వెంకటేశ్వర్లు (మెదక్), జి.పద్మజారాణి (సూర్యాపేట), డి.శ్రీనివాస్రెడ్డి (యాదాద్రి–భువనగిరి)లను అదనపు కలెక్టర్లుగా నియమించారు. యాదాద్రి–భువనగిరి అదనపు కలెక్టర్ జి.రమేశ్ను అక్కడి నుంచి బదిలీ చేస్తూ రెవెన్యూ శాఖకు రిపోర్టు చేయాలని ఆదేశించారు. -
16న కలెక్టర్లతో కేసీఆర్ భేటీ
సాక్షి, హైదరాబాద్: వానాకాలం సాగు ఏర్పాట్లతో పాటు గ్రామీణ ఉపాధి హామీ పథకం, హరితహారం అమలుపై సమీక్షించేందుకు సీఎం కేసీఆర్ ఈ నెల 16న ఉదయం 11.30 గంటలకు ప్రగతి భవన్లో జిల్లా కలెక్టర్లతో సదస్సు నిర్వహించనున్నారు. ఈ సదస్సుకు అదనపు కలెక్టర్లు(స్థానిక సంస్థలు), జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారి, జిల్లా పరిషత్ సీఈఓ, జిల్లా పంచాయతీ అధికారి తదితరులు పాల్గొననున్నారు. వ్యవసాయం తదితర అంశాలపై సీఎం దిశానిర్దేశం చేయనున్నారు. -
'గ్రామాల రూపు రేఖలు మార్చబోతున్నాం'
సాక్షి, అమరావతి: చరిత్రలో ఎప్పుడూ లేనంతగా గ్రామాలపై శ్రద్ధ పెట్టామని, రాబోయే రోజుల్లో గ్రామాల రూపురేఖలు మొత్తం మార్చబోతున్నట్లు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. స్పందన కార్యక్రమంలో భాగంగా మంగళవారం రోజున సీఎం జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలపై సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ.. పేదలందరికీ జూలై 8న ఇళ్ల స్థలాల పట్టాలు ఇవ్వాలని నిర్ణయించాం. అర్హులైన 27 లక్షల మంది పేదలకు ఇళ్ల స్థలాల పట్టాలు ఇవ్వబోతున్నామని స్పష్టం చేశారు. అందులో భాగంగా భూసేకరణకు సంబంధించిన పనులను మే 31లోగా సిద్ధం చేయడంతోపాటు అన్ని పనులను పూర్తి చేయాలి. ఇల్లు లేని నిరుపేద ఉండకూడదు. అర్హత ఉండి ఇంటి స్థలం ఇవ్వలేదనే మాట రాకూడదని' వైఎస్ జగన్ పేర్కొన్నారు. మే 21వరకు దరఖాస్తులకు అవకాశం ఇంటి పట్టాలకు సంబంధించి ఎవరైనా ఇంకా మిగిలి ఉంటే వారి కోసం మే 21వరకు దరఖాస్తుకు అవకాశం కల్పించాం. మే 30 కల్లా వీటికి సంబంధించిన వెరిఫికేషన్ పూర్తి కావాలి. ఇళ్ల పట్టాలకు సంబంధించి తుది జాబితా జూన్ 7న ప్రకటించాలి. ఇప్పటికే ఇళ్ల పట్టాల కోసం రూ.4,436.47 కోట్లు విడుదల చేశాం. జిల్లా ముగ్గురు జాయింట్ కలెక్టర్లను నియమించాం. ఒక జేసీ రైతు భరోసా, రెవిన్యూ.. రెండో జేసీ గ్రామ, వార్డు సచివాలయాలు, అభివృద్ధి కార్యక్రమాలు.. మూడో జేసీ ఆసరా, వెల్ఫేర్ కార్యక్రమాలు పనులను అప్పగించాం. గతంలో ప్రభుత్వ కార్యక్రమాలపై ఎప్పూడూ పెట్టనంత దృష్టి పెట్టాం. గ్రామాల రూపు రేఖలు మార్చబోతున్నాం. గ్రామాలలో ఏర్పాటుచేసే విలేజ్ క్లినిక్స్లో 24 గంటలూ ఏఎన్ఎం అందుబాటులో ఉంటారు. చదవండి: కలెక్టర్లు, ఎస్పీలే నా బలం: సీఎం జగన్ మద్యం వినియోగాన్ని బాగా తగ్గించే కార్యక్రమాలు చేపడుతున్నాం. అందులో భాగంగానే అధికారంలోకి వచ్చిన వెంటనే లిక్కర్ రేట్లు పెంచాం. మద్యం దుకాణాల సంఖ్యను తగ్గించాం. బెల్టుషాపులు తొలగించాం. పర్మిట్ రూంలను ఎత్తివేశాం. జేసీల పనితీరుపై నిరంతరం పర్యవేక్షణ చేస్తాం. పార్టీలకతీతంగా ప్రజలకు ప్రభుత్వ పథకాలు అందాలి. ఉపాధి హామీకి కేంద్రం అదనంగా రూ.40వేల కోట్లు కేటాయించింది. చాలామంది కూలీలు ఇతర రాష్ట్రాల నుంచి వెనక్కి వచ్చారు. వలస కూలీలందరికీ జాబ్ కార్డులు ఇవ్వాలి. వారందరికీ తప్పనిసరిగా పనులు కల్పించాలని' కలెక్టర్లను వైఎస్ జగన్ ఆదేశించారు. ఇసుక, మద్యం అక్రమాలకు చెక్ మద్యం అక్రమాలకు చెక్ పెట్టడానికి యువ ఐపీఎస్ అధికారులను పెట్టాం. తొలిసారి ఈ బాధ్యతలను పోలీస్ విభాగానికి అప్పగించాం. ఇసుక, మద్యం అక్రమ రవాణాలను అడ్డుకోవడానికి మనం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశాం. దీనికి సంబంధించి ప్రత్యేక జేసీని పెట్టాం. వర్షాకాలం వచ్చేలోగా కావాల్సిన ఇసుకను అందుబాటులో ఉంచాలి. అందుకు తగిన విధంగా ఏర్పాట్లు చేసుకొని ఇసుక నిల్వలు పెంచేలా చూడాలని సూచించారు. తాగునీటి సమస్యలపై ప్రత్యేక దృష్టి తాగునీరు దొరకలేదనే మాట ఎక్కడా రాకూడదు. చిత్తూరు, అనంతపురం, ప్రకాశం జిల్లాల్లో పశువులకు తాగునీరు అందిస్తున్నాం. పట్టణ ప్రాంతాల్లో తాగునీటి కొరతను తీర్చేందుకు అన్ని చర్యలు తీసుకోవాలి. ఈ పనులన్నింటినీ కూడా కలెక్టర్లు పర్యవేక్షించాలని సీఎం వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. చదవండి: 'ఢిల్లీలో చక్రాలు, బొంగరాలు తిప్పిన రోజులెక్కడ' -
సదుపాయాలపై కలెక్టర్లదే బాధ్యత: సీఎం జగన్
సాక్షి, అమరావతి: కరోనా (కోవిడ్-19) నిర్ధారణ టెస్టులపరంగా చూస్తే మనం దేశంలోనే మొదటిస్థానంలో ఉన్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. మంగళవారం సీఎం క్యాంప్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఖరీఫ్ సీజన్లో వ్యవసాయం, తాగునీరు, నాడు-నేడు కార్యక్రమాలు, హౌసింగ్, ఉపాధి హామీ, కోవిడ్-19 నివారణా చర్యలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సమీక్షలో సీఎం జగన్ మాట్లాడుతూ.. ప్రతి పదిలక్షల జనాభాకు 2500కిపైగా కరోనా టెస్టులు చేస్తున్నామని ఇది ఒక రికార్డు అని అన్నారు. సుమారుగా 35 రోజుల కింద మనకు స్విమ్స్ తప్ప మరో చోట టెస్టింగ్ సౌకర్యం లేదని, అది కూడా రెండు రోజుల తర్వాత ఫలితాలు వచ్చేవని సీఎం జగన్ వివరించారు. ప్రస్తుతం 11 జిల్లాల్లో టెస్టింగ్ సౌకర్యాలు, ట్రూనాట్ కిట్లు కూడా అన్ని ఆస్పత్రుల్లో ఉన్నాయని ఆయన తెలిపారు. అందరం కలిసి ఈ మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసుకున్నామని సీఎం జగన్ చెప్పారు. గ్రామ వాలంటీర్లు, ఆశావర్కర్ల రూపంలో మనకు బలమైన నెట్వర్క్ ఉందన్నారు. కోవిడ్ను ఎదుర్కొనే విషయంలో మనం ఇతర రాష్ట్రాల కన్నా భిన్నంగా పని చేయగలిగామని సీఎం తెలిపారు. కలెక్టర్లు, ఎస్పీలు చక్కటి పని తీరును చూపారని పేర్కొన్నారు. ఎంత చేయాలనుకున్నా కోవిడ్ అనేది ఎక్కడో చోట కనిపిస్తుందని, కోవిడ్తో కలిసి జీవించాలన్నది వాస్తవమైన విషయమని సీఎం జగన్ తెలిపారు. దేశంలోనో, రాష్ట్రంలోనో ఎక్కడో ఓ చోట ఇది కనిపిస్తుందని, దగ్గడమో, తుమ్మడమో చేస్తే అది పక్కవాళ్లకు వ్యాపిస్తుందని ఆయన వివరించారు. కరోనా వైరస్ కారణంగా మరణాల రేటు కేవలం 2శాతంలోపే ఉందని, అధిక వయస్సు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారిపైనే ఎక్కువ ప్రభావం చూపుతోందని చెప్పారు. మన ఇంట్లో ఉన్న పెద్దవారిని రక్షించుకోవాల్సిన అవసరం ఉందని సీఎం జగన్ తెలిపారు. ప్రతి గ్రామంలో పది మందికి.. ఇతర రాష్ట్రాల్లో ఉన్న వలస కార్మికులు తిరిగి వస్తున్నారని అదేవిధంగా ఇక్కడ నుంచి కూడా కొంత మంది వెళ్లడం ప్రారంభమైందని సీఎం జగన్ తెలిపారు. లక్షకు మందికిపైగా రాష్ట్రానికి వలస కూలీలు వస్తారని, మరో లక్షమంది కూడా ఇతరులు ఉంటారని అంచనా వేస్తున్నామని ఆయన చెప్పారు. వివిధ దేశాల నుంచి కూడా మన రాష్ట్రానికి చెందిన వారిని ఆయా దేశాలు పంపుతున్నాయని వెల్లడించారు. వీటన్నింటినీ మనం సమన్వయం చేయాల్సి ఉంటుందని, అందుకనే స్థిరంగా మనం జాగ్రత్తలు పాటించాలని ఆయన సూచించారు. ప్రతి గ్రామంలో 10 మందికైనా సరిపడే సదుపాయాల్ని కల్పించాల్సి ఉంటుందని, క్వారంటైన్లో మంచి బెడ్లు, బెడ్ షీట్లు, దిండ్లు, టాయిలెట్లు, మంచి భోజనం కూడా పెట్టాలన్నారు. క్వారంటైన్ వద్ద శానిటేషన్ వర్కర్లను కూడా పెట్టాలన్నారు. ప్రతి గ్రామంలోనూ ఈ సదుపాయాలు ఉండాలని సీఎం జగన్ అధికారులకు ఆదేశించారు. దాదాపు 11వేలకుపైగా ఉన్న గ్రామసచివాలయాల్లో కనీసం లక్షమందికి క్వారంటైన్ సదుపాయాలను ఏర్పాటు చేయాల్సి ఉంటుందని సీఎం తెలిపారు. కలెక్టర్లపైనే బాధ్యత: ప్రస్తుతం నియోజకవర్గ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకూ క్వారంటైన్ సదుపాయాలు ఉన్నాయని సీఎం జగన్ తెలిపారు. 25 వేల సింగిల్ రూమ్స్, 7500 డబుల్ రూమ్స్ ఉన్నాయని, ఇందులో 40 వేల మంది వరకూ ఉండవచ్చుని సీఎం జగన్ వెల్లడించారు. ఇవి కాకుండా డార్మిటరీస్ కూడా ఉన్నాయని సదుపాయాలు బాగున్నాయా? లేదా? అన్న విషయాన్ని అధికారులు ఎప్పటికప్పుడు సమీక్ష, పర్యవేక్షణ చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ ప్రక్రియ అంతా మన జీవితంలో కొన్ని నెలలపాటు నిరంతరంగా కొనసాగుతుందని అందుకనే జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సీఎం జగన్ సూచించారు. సదుపాయాలు బాగుంటేనే ప్రజలు అక్కడకు వెళ్లగలుగుతారని అందుకే సదుపాయాలు బాగుండేలా చూడాల్సిన బాధ్యత కలెక్టర్లపైనే ఉంటుందని సీఎం జగన్ తెలియజేశారు. సదుపాయాలు లేకపోతే కలెక్టర్ మీద మచ్చ పడుతుందని, సిబ్బందిని పెట్టుకుని క్వారంటైన్ సదుపాయాలపై దృష్టిపెట్టి ప్రతిరోజూ సమీక్ష చేయాలని సీఎం జగన్ కలెక్టర్లకు సూచనలు ఇచ్చారు. టెలిమెడిసిన్: టెలి మెడిసిన్ కోసం ఒక నంబర్ కేటాయించామని, అలాగే ప్రతి సచివాలయంలో కూడా ముఖ్యమైన నంబర్లు ఉంచుతామని సీఎం జగన్ తెలిపారు. ఈ నంబర్లు ప్రతి గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉండాలని ఆయన సూచించారు. టెలి మెడిసిన్కు సానుకూలమైన స్పదన వస్తుందని అధికారులు చెబుతున్నట్లు తెలిపారు. కాల్ చేసిన వారికి ప్రిస్కిప్షన్ ఇచ్చిన తర్వాత ఆ వివరాలు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారితోపాటు, కలెక్టర్కూ వస్తాయని సీఎం వివరించారు. ఇక్కడ కలెక్టర్లు కీలక పాత్ర పోషించాలన్నారు. పీహెచ్సీ పరిధిలోకి ఒక ద్విచక్ర వాహనాన్ని, థర్మల్ బాక్సును అందుబాటులోకి తీసుకురావాలని సీఎం జగన్ చెప్పారు. 24 గంటల్లోగా ప్రిస్కిప్షన్ ప్రకారం మందులు వెళ్లాలని, త్వరలో విలేజ్ క్లినిక్ ప్రారంభం అవుతుందని సీఎం జగన్ వెల్లడించారు. టెలీమెడిసిన్ మరింత బలోపేతం అవుతుందని, ఈ వ్యవస్థను కలెక్టర్లు తమదిగా భావించి బాగా పని చేయించాలని సూచించారు. అలాగే అధికారులు రాష్ట్రంలోని అన్ని కుటుంబాలపై సమగ్రంగా సర్వే చేశారని, ఇంకా 5,281 మందికి పరీక్షలు చేయాల్సి ఉందని సీఎం జగన్ తెలిపారు. వీలైనంత త్వరగా వీరికి పరీక్షలు పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం నిర్దేశించుకున్న కంటైన్మెంట్ క్లస్టర్లపై దానిచుట్టూ ఉన్న బఫర్ జోన్పై పూర్తి దృష్టిపెట్టాలని సీఎం జగన్ కలెక్టర్లు, ఎస్పీలను ఆదేశించారు. కేసులన్నీ కూడా క్లస్టర్ జోన్ల నుంచే అధిక శాతం వస్తున్నాయని సీఎం జగన్మోహన్రెడ్డి తెలిపారు. -
కరోనా వైరస్: త్రిముఖ వ్యూహం..
సాక్షి, శ్రీకాకుళం: కరోనా కల్లోలం సృష్టిస్తుంటే జిల్లా వాసులకు ఆ త్రిమూర్తులు అభయమిచ్చారు. ప్రభుత్వం అప్పగించిన బాధ్యతలను సమర్థంగా నిర్వహించి సిక్కోలును కరోనా బారి నుంచి కాపాడడానికి శతథా ప్రయత్నిస్తున్నారు. ము ఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు నిత్యం అందుబాటులో ఉంటూ, వారి మధ్యనే గడు పుతూ ప్రజలకు ధైర్యం చెబుతున్నా రు. లాక్డౌన్లో జనాలకు ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసుకుంటున్నారు. లాక్డౌన్ నిర్వహణలో జిల్లా అధికార యంత్రాంగం అంతా చక్క గా పనిచేసినా వారిని సమన్వయపరచుకుని ముందుకెళ్లడంలో కలెక్టర్ జె.నివాస్, ఎస్పీ ఆర్.ఎన్.అమ్మిరెడ్డి, జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు విజయవంతమయ్యారు. ఈ ము గ్గురు అధికారుల వ్యూహాత్మక నిర్ణయాలతో ప్రజలకు ఇప్పటివరకు పెద్దగా ఇబ్బందులు ఎదురుకాలేదు. కలెక్టర్ చొరవ ప్రశంసనీయం కరోనా ప్రభావం దేశంలో మొదలైన దగ్గరి నుంచే కలెక్టర్ జె.నివాస్ అప్రమత్తమయ్యారు. విదేశాల నుంచి వచ్చిన వారిపై కన్నేసి ఉంచారు. అధికారుల దగ్గరి నుంచి వలంటీర్లు, ఆశ కార్యకర్తల వరకు అప్రమత్తం చేశారు. విదేశాల నుంచి వచ్చిన వారంతా హోమ్ క్వారంటైన్లో ఉండేలా చర్యలు తీసుకున్నారు. వారి కదలికలపై నిఘా పెట్టారు. లాక్డౌన్ అమల్లోకి వచ్చాక, వైరస్ వ్యాప్తి జోరుగా జరుగుతున్న వేళ స్వయంగా జనంలోకి వచ్చి అప్రమత్తం చేశారు. లాక్డౌన్తో ప్రజలు ఇబ్బంది పడకూడదని ని త్యావసర సరుకులు, మందులు, కూరగాయలు అందుబాటులోకి తెచ్చారు. నిర్దేశిత ధరలకు ప్రజల దరి చేర్చా రు. లాక్డౌన్కు ముందు ఒక్కసారిగా విదేశాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి ఎక్కువ మంది రావడంతో వారిని ఊళ్లలోకి పంపించకుండా ప్రత్యేకంగా క్వారంటైన్ సెంటర్లు పెట్టారు. జిల్లాకు 1,445 మంది విదేశాల నుంచి రాగా వారిలో 562 మందిని ప్రత్యేక క్వారంటైన్ సెంటర్లలో పెట్టి భోజన, వసతి సదుపాయాలు కల్పించారు. హోమ్ క్వారంటైన్లో ఉన్న వారి బాగోగులు కూడా చూసుకున్నారు. 819 మందికి ఉచితంగా సరుకులు డోర్ డెలివరీ చేయించారు. వలస కూలీల కోసం ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేశారు. వారికి రోజుకో రకం భోజనం పెడుతున్నారు. అనాథలు, నిరాశ్రయులకు కూడా రెడ్క్రాస్ సాయంతో రోజూ భోజనం పెడుతున్నారు. ప్రభు త్వ ఆదేశాలను క్రమం తప్పకుండా పాటిస్తూ.. సొంత వ్యూహంతో ముందుకువెళ్లారు. ఢిల్లీ ఘటన తర్వాత మరింత అప్రమత్తమయ్యారు. ఇక్కడి ముస్లిం పెద్దలతో సమావేశమై సమస్త వివరాలు తెలుసుకున్నారు. ఆ సమయంలో ఢిల్లీ నుంచి రాకపోకలు సాగించిన వారి వివరాలు తెలుసుకుని పరీక్షలు నిర్వహించారు. అంతేకాదు లాక్డౌన్ కారణంగా గుజరాత్ రాష్ట్రంలో చిక్కుకున్న మత్స్యకారులకు అండగా ఓ బృందాన్నే అక్కడకు పంపారు. ఎస్పీ అవిశ్రాంత యోధుడు జనతా కర్ఫ్యూ దగ్గర నుంచి ఎస్పీ ఆర్ఎన్ అమ్మిరెడ్డి అవిశ్రాంతంగా శ్రమిస్తున్నారు. లాక్డౌన్ అమల్లోకి వచ్చాక మరింత వేగం పెంచి, రోడ్లపైనే ఎక్కువగా ఉంటున్నారు. కరోనాపై స్వయంగా అవగాహన కలి్ప స్తున్నారు. ప్రధాన కూడళ్లల్లో ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తున్నారు. నిత్యావసర సరుకుల కొనుగోళ్ల సమయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. విధుల్లో ఉన్న పోలీసులకు తగు జాగ్రత్తలు సూచిస్తూ, వారిలో మానసిక స్థైర్యం నింపుతున్నారు. ప్రతి రోజూ పోలీసు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని పోలీసు స్టేషన్ల ఎస్హెచ్ఓలకు ముఖ్యమైన ఆదేశాలిస్తూ వస్తున్నారు. రాష్ట్ర సరిహద్దుల వద్ద ఏర్పాటు చేసిన చెక్పోస్టులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. విదేశాల నుంచి వచ్చిన వ్యక్తులను ముందుగా గుర్తించి క్వారంటైన్లో ఉంచడమే కాకుండా వారు బయటికి రాకుండా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. లాక్డౌన్లో రాష్ట్రంలో ప్రతి చోట పోలీసుల తీరుపై కొన్ని విమర్శలు వచ్చినా ఇక్కడా పరిస్థితి ఎక్కడా కనిపించలేదు. దూసుకుపోతున్న జేసీ లాక్డౌన్ అమల్లోకి రాగానే తిండికి ఇబ్బంది వస్తుందేమోనన్న భయం ప్రతి ఒక్కరికీ పట్టుకుంది. వైరస్ వస్తే ఎలా ఉంటుందో తెలీదు గాని తినడానికి తిండి దొరకకపోతే ఇలాగే చనిపోతేమోనన్న ఆందోళన మొదట్లో ఉండేది. కానీ వాటిన్నింటినీ జాయింట్ కలెక్టర్ శ్రీని వాసులు పటాపంచలు చేశారు. నిత్యావసర సరుకులు, కూరగాయలు, మందుల సరఫరాపై ప్రత్యేక దృష్టి సారించారు. ఎక్కడా అసౌకర్యం కలగకుండా, నిత్యావసర సరుకులు, కూరగాయలు, మందులు దొరకలేదన్న విమర్శలు రాకుండా చూసుకోగలిగారు. సామాజిక దూరాన్ని పాటించేలా షాపుల వద్ద చర్య లు తీసుకుంటూనే కూరగాయలు, మొబైల్ రైతు బజా ర్లు, కూరగాయలు డోర్ డెలివరీ, నిత్యావసర సరుకు లు, మందులు డోర్ డెలివరీ ఇలా ప్రతీది ప్రజల వద్దకే తీసుకొచ్చారు. కరోనా లాక్డౌన్ నేపథ్యంలో నిత్యావసర సరుకులు, కూరగాయలు, కోడిగుడ్లు, మాంసం ధరలు పెంచకుండా చర్యలు తీసుకున్నారు. ఎప్పటికప్పుడు ట్రేడర్స్, పౌల్ట్రీ యజమానుల సమావేశమై ధరలపై దిశా నిర్దేశం చేశారు. రబీ ధాన్యం కొనుగోలుకు ఏర్పాట్లు కూడా చేశారు. వ్యవసాయానికి ఇబ్బందుల్లేకుండా చూడగలిగారు. జిల్లా యంత్రాంగం పనితీరు భేష్: రోడ్లు, భవనాల శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్ శ్రీకాకుళం (పీఎన్కాలనీ): జిల్లాలో కరోనా కేసులు నమోదు కాకపోవడం మన అదృష్టమని రోడ్లు, భవనాల శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. శ్రీకాకుళంలోని ఆర్అండ్బీ అతిథి గృహంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. సీఎం జగన్మోహన్రెడ్డి ఏర్పాటు చేసిన వలంటీర్ల వ్యవస్థ వల్ల ఆంధ్రప్రదేశ్లో వ్యాధి నియంత్రణలో ఉందని అన్నారు. శ్రీకాకుళంలో రోడ్డుపై వాహనచోదకులను ఆపి జాగ్రత్తలు చెబుతున్న దాసన్న కరోనా నియంత్రణకు జిల్లా యంత్రాంగం, పోలీస్, వైద్య, రెవెన్యూ శాఖలు స మన్వయంతో చక్కగా పనిచేశాయని ప్రశంసించారు. కరోనాపై ప్రజలకు అవగాహన కల్పించడంతో మీడియా చురుకైన పాత్ర పోషిస్తోందన్నారు. సీఎం జగన్మోహన్రెడ్డి అహరి్నశలు ప్రజా సంక్షేమం తపిస్తోందన్నారు. కరోనా కట్టడిలో ఇది కీలక సమయమని, ఇక ముందు కూడా పూర్తి నిబద్ధత పాటించాలని సూచించారు. ఈ సందర్భంగా ప్రింట్ అండ్ ఎల్రక్టానిక్ మీడియా ప్రతినిధులకు బియ్యంతో పాటు నిత్యవసరాల కిట్లను పంపిణీ చేశారు. అలాగే సోమవారం శ్రీకాకుళం నగరంలోని పలు ప్రధాన కూడళ్ల వద్ద రోడ్లపై తిరుగుతున్న వారిని మంత్రి ఆపి కరోనా నియంత్రణకు సహకరించాలని కోరారు. సామాజిక దూరం, వ్యక్తిగత పరిశుభ్రతనే కరోనా నియంత్రణ సాధ్యపడుతుందన్నారు. జిల్లాలో ఒక్క పాటిజివ్ కేసు కూడా నమోదు కాలేదని ఇకపై కూడా రాకుండా మనమంతా కలిసికట్టుగా నిబంధనలు పాటించాలని సూచించారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు స్వచ్ఛందంగా తమ వివరాలు తెలియజేసి జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. -
కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్
సాక్షి, తాడేపల్లి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కరోనా వైరస్ నేపథ్యంలో దేశవ్యాప్తంగా 21 రోజుల పాటు లాక్డౌన్ అమలు, నిత్యావసర సరుకులు అందుబాటు, రేషన్ సరఫరా తదితర కీలక అంశాలపై ముఖ్యమంత్రి ఈ సందర్భంగా అధికారులకు దిశానిర్దేశం చేశారు. (లాక్డౌన్ వేళ.. ప్రజలకు ఇబ్బంది లేకుండా) అలాగే కరోనా వైరస్ వ్యాప్తి, నివారణ చర్యలపై సమీక్ష జరిపారు. ఇక లాక్డౌన్ వెలుసుబాటు సమయాన్ని తగ్గించిన నేపథ్యంలో అమలు అవుతున్న తీరుపై సీఎం జగన్ సమీక్షించారు. అంతరాష్ట్ర సరిహద్దులు ఉన్న జిల్లాల్లో తీసుకుంటున్న చర్యలపై ముఖ్యమంత్రి చర్చించారు. కాగా ఆంధ్రప్రదేశ్లో ఇప్పటివరకూ 23 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. (ఏపీ బాటలో కేరళ ) చదవండి: సీఎంఆర్ఎఫ్కు విరాళాలు ఇవ్వండి -
ఏపీ: కరోనా నియంత్రణకు మరిన్ని చర్యలు
సాక్షి, విజయవాడ: కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఏపీ ప్రభుత్వం మరింత కట్టుదిట్టమైన భద్రత చర్యలు చేపట్టింది. విదేశాల నుంచి వచ్చిన వారిని పూర్తి పర్యవేక్షణలో ఉంచే విధంగా అధికార యంత్రాంగం మరింత అప్రమత్తమైంది. విదేశాల నుంచి వచ్చిన వారిని పర్యవేక్షించడానికి ప్రతి 10 మందికీ ఒక అధికారి చొప్పున కేటాయించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు యూనివర్శిటీలో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. కరోనా వ్యాప్తి నియంత్రణకు నియమించిన అధికారులతో ఉన్నత స్థాయి అధికారులు భేటీ అయ్యారు. ప్రస్తుత పరిస్థితులు, తీసుకోవాల్సిన చర్యలపై సమీక్ష జరిపారు. కలెక్టర్లకు మార్గ దర్శకాలను జారీ చేశారు. మండల స్థాయిలో కొంతమంది అధికారులను కొవిడ్-19 ప్రత్యేక అధికారులుగా నియమించారు. విదేశాల నుంచి వచ్చిన వారి ఆరోగ్య పరిస్థితులపై ప్రతి రోజు వివరాల నమోదు, డేటా ఆధారంగా వైద్య శాఖ చర్యలు తీసుకోనుంది. (లాక్డౌన్: ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు) కరోనావైరస్ నియంత్రణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన ప్రత్యేక చర్యల్లో భాగంగా వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్ సీఎస్ ఆధ్వర్యంలో నలుగురు ఏఏఎస్ల బృందం ఏర్పాటు చేసింది. ఐఏఎస్ అధికారులు ప్రద్యుమ్న, గిరిజా శంకర్, కార్తికేయ మిశ్రా, కన్నబాబులను వైద్య ఆరోగ్య శాఖకు అటాచ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జవహర్రెడ్డి నేతృత్వంలో ఈ బృందం పనిచేయనుంది. (కరోనా: కొత్తగూడెం డీఎస్పీపై కేసు నమోదు) -
పల్లె ప్రగతిలో ‘వీడియో షూట్’
సాక్షి, హైదరాబాద్: పల్లె ప్రగతి కార్యక్రమ అమలు, పర్యవేక్షణ విషయంలో ఉన్నతాధికారులు, పంచాయతీ సిబ్బంది మధ్య పొసగడంలేదు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు కొందరు జిల్లా కలెక్టర్లు తీసుకుంటున్న నిర్ణయాలు ఇబ్బందిగా మారాయని పంచాయతీరాజ్ ఉద్యోగ సంఘాలంటున్నాయి. ఉదయం 6 గంటలకే గ్రామాల్లో పర్యటించాలని, విధిగా వాట్సాప్ కాల్ చేయాలని, ప్రతి 2 గంటలకు వీడియో ఫుటేజీని పోస్ట్ చేయా లనే షరతులు విధించడం పట్ల ఉద్యోగ సంఘాలు మండిపడుతున్నాయి. వర్క్ టు రూల్ నిబంధనకు విరుద్ధంగా ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు పనిచేయాలని ఒత్తిడి చేయడం సరికాదని ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. కామారెడ్డి మొదలు భూపాలపల్లి వరకు.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి 3 నెలలకోసారి పల్లె ప్రగతి కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించింది. ఇప్పటికే రెండు విడతల్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణ, మురుగు కాల్వల్లో పూడిక తీత, పాత బావులు, బోరుబావుల పూడ్చివేత తదితర చర్యలు తీసుకోవాల ని ప్రభుత్వం నిర్దేశించింది. ఆ పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని గ్రామ కార్యదర్శులు, మండల పంచాయతీ అధికారులను ఆదేశించింది. పల్లె ప్రగతి పనుల్లో వేగం పెంచేందుకు కలెక్టర్లు/అదనపు కలెక్టర్లు కొందరు.. గ్రామ కార్యదర్శులు ప్రభాతవేళ పంచాయతీల్లో సందర్శించాలని ఆదేశించారు. ఉదయం 8 గంటలకు వాట్సాప్ వీడియో కాల్ ద్వారా ఏ వీధిలో పర్యటిస్తున్నారో తెలపాలని కామారెడ్డి కలెక్టర్ ఆదేశించారు. పారిశుద్ధ్య పనుల నిర్వహణ తీరును 30 సెకన్ల నిడివి గల వీడియో చిత్రీకరించి.. ప్రతి 2 గంటల కోసారి పోస్టు చేయాలని భూపాలపల్లి కలెక్టర్ నిర్దేశించారు. ఉదయం 6 మొదలు సాయంత్రం 6 గంటలకు చివరిసారిగా ఈ వీడియో పోస్టు చేయాలన్నారు. పల్లె నిద్రలు చేయాలని, గ్రామస్తులతో మమేకం కావాలని మహబూబ్నగర్ జిల్లా యంత్రాంగం ఆదేశించింది. అయితే, ఈ నిర్ణయం పట్ల ఉద్యోగసంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. అవమానించేలా చర్యలు పంచాయతీ కార్యదర్శుల పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు సమర్థనీయం కాదు. 12 గంటలపాటు విధులు నిర్వర్తించాలనే ఆదేశాలు ఉపసంహరించుకోవాలి. అత్యవసరవేళల్లో పనులు చేసేందుకు అభ్యంతరంలేదు. పారిశుద్ధ్య నిర్వహణ, పల్లె ప్రగతి పనులను నిరంతరం పర్యవేక్షిస్తున్నాం. కానీ, తమను అవమాన పరిచేలా వీడియో కాల్, ఫుటేజీ పంపాలనడం సరికాదు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే వర్క్ టు రూల్ పాటిస్తామని ఆయన హెచ్చరించారు. – మధుసూదన్రెడ్డి, పంచాయతీ కార్యదర్శుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు -
ఇక కలెక్టర్.. ‘పవర్ఫుల్’
సాక్షి, హైదరాబాద్: పురపాలనలో కలెక్టర్లకు సంపూర్ణ అధికారాలు ఇక సంక్రమిస్తున్నాయి. ఇప్పటికే మున్సిపల్ చట్టంలో వారి అధికారాలను ప్రభుత్వం స్పష్టం చేయగా, ఏ అంశంలో ఎలాంటి అధికారాలున్నాయనే దానిపై మున్సిపల్ శాఖ చట్టంలోని అంశాలను ఉటంకిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. మొన్నటివరకు మున్సిపల్ వ్యవహారాల్లో కలెక్టర్ల పాత్ర, జోక్యం నామమాత్రంగానే ఉండగా, ఇక నుంచి పట్టణ పాలనలో వారే కీలకం కానున్నారు. వీరి కనుసన్నల్లోనే బడ్జెట్ తయారీ నుంచి ప్రభుత్వ పథకాల అమలు, విధాన నిర్ణయాలు జరగనున్నాయి. ముఖ్యంగా పట్టణ స్థానిక సంస్థలను తమ నియంత్రణలో ఉంచుకోవడంతో పాటు పట్టణాభివృద్ధికి చెందిన అన్ని కీలకాంశాల్లోనూ కలెకర్లే సూపర్బాస్లుగా వ్యవహరించనున్నారు. భవన నిర్మాణ అనుమతుల నుంచి... పట్టణ ప్రాంతాల్లో ముఖ్య సమస్యలైన భవన నిర్మాణం, లేఅవుట్ల ఏర్పాటు, అనధికార భవనాల గుర్తింపు, ట్రాఫిక్ నిర్వహణ లాంటి అంశాల్లో టౌన్ప్లానింగ్ విభాగం ఇప్పటివరకు కీలకంగా వ్యవహరిస్తోంది. ఇక నుంచి వీటన్నింటిలో కలెక్టర్లు స్వతంత్రంగా నిర్ణయం తీసుకోనున్నారు. భవన నిర్మాణ అనుమతులకు గాను వారే స్వీయ నిర్ధారిత అఫిడవిట్ ద్వారా నిర్ణయం తీసుకుని, ఆ తర్వాత టాస్క్ఫోర్స్ను ఏర్పాటు చేసి సంబంధించిన ధ్రువపత్రాల పరిశీలన జరపనున్నారు. గతంలో 500 చదరపు మీటర్ల వైశాల్యం, 10 చదరపు మీటర్ల కన్నా ఎక్కువ ఎత్తు ఉండే భవన నిర్మాణాల కోసం మున్సిపాలిటీతో పాటు ఇరిగేషన్, రెవెన్యూ, అగ్నిమాపక శాఖలకు కూడా దరఖాస్తు చేసుకోవాల్సి ఉండగా, ఇప్పుడు సింగిల్విండో విధానంలో 21 రోజుల్లో అనుమతులిచ్చే అధికారం కలెక్టర్లకు దఖలు పడుతోంది. కలెక్టర్లు చైర్మన్లుగా ఉండే కమిటీ ఈ అనుమతుల విధానాన్ని టీఎస్ఐపాస్ తరహాలో పరిశీలించనుంది. ఇక, అనధికార భవన నిర్మాణాలపై కలెక్టర్లకు గతంలో స్పష్టమైన అధికారాలు లేకపోగా, ఇక నుంచి వాటిని గుర్తించి కూల్చివేయడం, సదరు యజమానికి పెట్టుబడిలో 25 శాతం జరిమానా విధించే అధికారాన్ని సెక్షన్ 180 ద్వారా కలెక్టర్లకు ఇచ్చారు. వారి నేతృత్వంలో ఏర్పాటయ్యే జిల్లా స్థాయి టాస్క్ఫోర్స్ ఈ అంశాలను పర్యవేక్షించనుంది. పుర పౌరుల నుంచి ఫిర్యాదులు వచ్చిన ఏడు రోజుల్లోపు అనధికార భవన నిర్మాణాలపై చర్యలు తీసుకునే అధికారం సెక్షన్ 174(5) ద్వారా కలెక్టర్లకు దఖలు పరిచారు. కమిషనర్ల విధులన్నీ పర్యవేక్షించాల్సిందే పురపాలనకు సంబంధించి మున్సిపల్ కమిషనర్లు నిర్వహించే విధులన్నింటినీ పర్యవేక్షించడంతో పాటు వాటినీ సంపూర్ణంగా కలెక్టర్లే నియంత్రించనున్నారు. మున్సిపాలిటీలు, ఇతర పట్టణ స్థానిక సంస్థల అన్ని విధులను కూడా పర్యవేక్షించడంతోపాటు ప్రతి పట్టణాన్ని మోడల్ టౌన్గా తీర్చిదిద్దే బాధ్యత కలెక్టర్లదే. పాలకవర్గాలు చేసే ప్రతి తీర్మానాన్ని పరిశీలించడం, పాలకవర్గ సభ్యుల ప్రవర్తనను బట్టి వారిని సస్పెండ్ చేయడం, మున్సిపాలిటీల చైర్పర్సన్లకు సూచనలు, సలహాలివ్వడం, మున్సిపల్ సిబ్బందిపై చర్యలు తీసుకోవడం, గతంలో పాలకవర్గాలు చేసిన ఏదైనా చర్యను పునఃసమీక్షించడం, చైర్పర్సన్లు, కమిషనర్లను వివరణలు కోరడం, మున్సిపాలిటీలిచ్చిన లైసెన్సులను రద్దు చేయడం. స్క్వాడ్ల ఏర్పాటు లాంటి అన్ని అంశాల్లో కలెక్టర్లకు విశేష అధికారాలిచ్చారు. వీటన్నిటినీ మున్సిపల్ చట్టంలోనే పేర్కొన్నప్పటికీ ప్రస్తుత చట్టం ద్వారా ఎలాంటి అధికారాలు సంక్రమించాయనే దానిపై అంశాల వారీ నివేదికను తాజాగా తయారు చేసింది. ఆ అంశాలనే ఇటీవల పురచట్టం–పట్టణ ప్రగతిపై ఎంసీఆర్హెచ్ఆర్డీలో కలెక్టర్లు, అదనపు కలెక్టర్లకు నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో పురపాలక శాఖ డైరెక్టర్ సత్యనారాయణ కూడా వివరించారు. -
‘స్థానిక’ పగ్గాలు అదనపు కలెక్టర్లకే..
సాక్షి, హైదరాబాద్: కొత్తగా సృష్టించిన అదనపు కలెక్టర్ల (స్థానిక సంస్థలు) విధుల నిర్వహణపై ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. స్థానిక సంస్థల నిర్వహణ బాధ్యతను పూర్తిగా వీరికి కట్టబెట్టింది. మండల, జిల్లా పరిషత్ మినహా గ్రామ పంచాయతీలు, పురపాలికలపై పూర్తిస్థాయి అజమాయిషీ అప్పగించిన ప్రభుత్వం.. విధానపరమైన నిర్ణయాలు, సిబ్బంది, పాలకవర్గాలపై చర్యలు తీసుకునే అధికారం మాత్రం కలెక్టర్లకు సంక్రమింపజేసింది. మండల, జిల్లా పరిషత్లు ప్రస్తుతం ఉన్న తరహాలోనే జిల్లా పరిషత్ సీఈవో పర్యవేక్షణలో పనిచేస్తాయి. పంచాయతీరాజ్, పురపాలక చట్టాలను పకడ్బందీగా అమలు చేసేందుకు ప్రతి రోజూ గ్రామాలు, మున్సిపాలిటీల్లో పర్యటించాలని జాబ్ చార్ట్ లో పొందుపరిచింది. దీనిపై అధికారికంగా ఇప్పటివరకు ఉత్తర్వులు రానప్పటికీ, మంగళవారం జరిగిన కలెక్టర్ల సమావేశంలో కేసీఆర్ ఈ మేరకు వెల్లడించినట్లు తెలిసింది. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాల నిర్వహణ, పారిశుద్ధ్యం, హరితహారం, నర్సరీల నిర్వహణ, మొక్కల సంరక్షణ బాధ్యతలను వీరికి అప్పగించారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, ఉద్యోగులపై వచ్చే ఫిర్యాదులపై విచారణ జరపడం వరకే పరిమితం చేసిన ప్రభుత్వం.. చర్యలు తీసుకునే అధికారం కలెక్టర్లకు కట్టబెట్టింది. ఇకపై పంచాయతీ కార్యదర్శి మొదలు డీపీవో, మున్సిపల్ కమిషనర్లు కూడా అదనపు కలెక్టర్ పరిధిలో పనిచేయాల్సి ఉంటుంది. కలెక్టరంటే రాజమణిలా ఉండాలి... పంచాయతీరాజ్, పురపాలక చట్టాలను ఆకళింపు చేసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అదనపు కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో పర్యటించడం ద్వారా ప్రజలతో మమేకం కావాలని పిలుపునిచ్చారు. ‘నా చిన్నతనంలో రాజమణి అనే కలెక్టర్ ఉండేవారు. ఆయనకు ప్రజలు దండం పెట్టేవారు. ఆయన సేవలను ఇప్పటికీ గుర్తు చేసుకుంటారు. మీరు కూడా వినూత్నంగా పనిచేసి గొప్ప అధికారిగా రాణించాలి’అని సీఎం సూచించారు. -
కలెక్టర్లకు సీఎం దిశానిర్దేశం
సాక్షి, నల్గొండ: హైదరాబాద్లోని ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన మంగళవారం కలెక్టర్ల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో నల్లగొండ, యాదాద్రి, సూర్యాపేట జిల్లాల కలెక్టర్లు ప్రశాంత్జీవన్ పాటిల్, అనితారామచంద్రన్, వినయ్కృష్ణారెడ్డి, అదనపు కలెక్టర్లు వనమాల చంద్రశేఖర్, రాహుల్శర్మ, జి.రమేష్, సంజీవరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ పల్లెప్రగతి, హరితహారం, అక్షరాస్యతతోపాటు వివిధ సంక్షేమ పథకాల అమలు, కలెక్టర్ల బాధ్యతలపై దిశా నిర్దేశం చేశారు. అడవుల పెంపకంపై సలహాలు ఇచ్చారు. -
అధికారులతో కలెక్టర్ శ్రీదేవసేన సమీక్ష!
సాక్షి, ఆదిలాబాద్: ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల అమలు, పథకాలను ప్రజల దరికి చేర్చే విషయంలో అధికారులు అవినీతికి పాల్పడితే ఉపేక్షించేది లేదని కలెక్టర్ శ్రీదేవసేన అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లో జిల్లా అధికారులతో వివిధ శాఖల ద్వారా అమలవుతున్న అంశాలపై సమీక్ష నిర్వహించారు. కలెక్టర్గా బాధ్యతలు చేపట్టి మొదటి సారి అధికారులతో సమావేశమయ్యారు. మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమైన సమావేశం రాత్రి 7 గంటల వరకు కొనసాగింది. కాగా, సీఎం కేసీఆర్ త్వరలో కలెక్టర్ల సదస్సు నిర్వహించనున్నందున అందులో ప్రస్తావించే అంశాలపై లోతుగా చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తాను రెండు విధానాలను పాటిస్తానని, ఒకటి అవినీతి అక్రమాలకు పాల్పడితే సహించేది లేదని, అధికారులు వివిధ అంశాలపై తప్పుడు సమాచారం ఇస్తే ఉపేక్షించేది లేదన్నారు. అనంతరం శాఖల వారీగా సమీక్ష నిర్వహించారు. ముందుగా ఫారెస్ట్, గ్రామీణాభివృద్ధి, జిల్లాపరిషత్, పంచాయతీలలో ప్రభుత్వ ప్రాధాన్యత అంశాలపై చర్చించారు. ఎంపీడీవోలు, ఎమ్మార్వోలు మాకు ఒక సైన్యం అన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలను క్షేత్రస్థాయికి తీసుకెళ్లి అమలు చేసే బాధ్యత ఉన్న ఎంపీడీవోలను, ఎమ్మార్వోలను సైన్యం లాగా పరిగణిస్తామన్నారు. గ్రామాల్లో నర్సరీ పనులను పూర్తి చేసి మొక్కలు పెంపకానికి చర్యలు తీసుకోవాలన్నారు. ఎక్కడెక్కడ పనులు ప్రారంభించలేదో పరిశీలించి చర్యలు తీసుకోవాలని ఎంపీడీవోలను ఆదేశించారు. వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలు ఈనెల 10లోగా పూర్తి చేయాలన్నారు. డంపింగ్ యార్డు నిర్మాణాలు, శ్మశాన వాటికల నిర్మాణాలు పూర్తి చేయాలని, ఎక్కడెక్కడ ప్రారంభించలేదో అధికారులను అడిగి తెలుసుకున్నారు. కాగా, కొన్ని నిర్మాణాలకు స్థలం సమస్య ఉండగా, మరికొని్నంటికీ ఫారెస్ట్ క్లియరెన్స్ సమస్య ఉందని అధికారులు కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. అన్ని గ్రామాల్లో మీ మార్కు ఉండాలని, ఇంకుడుగుంతలు నిర్మించాలని, 12వేల మరుగుదొడ్లను మూడు రోజుల్లో పూర్తి చేయాలన్నారు. ఇందులో ప్రజాప్రతినిధులను భాగస్వాములు చేయాలని, మండల ప్రత్యేక అధికారులు ఇన్వాల్వ్ కావాలన్నారు. ప్రతీ శుక్రవారం స్వచ్ఛశుక్రవారం నిర్వహించేలా నిర్ణయం తీసుకుంటామని, దీంతో కొత్త విషయాలు తెలుస్తాయన్నారు. అంతకు ముందు కలెక్టరేట్లోని వివిధ విభాగాలను పరిశీలించారు. కార్యక్రమంలో డీఆర్వో నటరాజ్, ఆర్డీవో సూర్యనారాయణ, జెడ్పీసీఈవో కిషన్, డీఆర్డీవో రాజేశ్వర్, డీఎఫ్వో ప్రభాకర్, డీఎంహెచ్వో చందు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
విద్య, వైద్యానికే తొలి ప్రాధాన్యం
సాక్షి,సిటీబ్యూరో: విద్య,వైద్య రంగాలకు తొలి ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు హైదరాబాద్ జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి వెల్లడించారు. రెండు రోజుల క్రితం నూతనంగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా బుధవారం ‘సాక్షి’తో మాట్లాడారు. ప్రజలకు పారదర్శకమైన, అవినీతి రహిత పాలనా అందించడమే ప్రధాన లక్ష్యమన్నారు. ప్రభుత్వ పాఠశాల్లో ప్రాథమిక స్థాయి నుంచి విద్యార్థులకు నాణ్యమైన విద్య బోధన, వసతుల కల్పనకు చర్యలు చేపడుతామన్నారు. అంగన్వాడీలను సైతం మరింత బలోపేతం చేస్తామని పేర్కొన్నారు. పదవ తరగతిలో ఉత్తమ ఫలితాల సాధనకు కృషి చేస్తాన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పేదలకు మెరుగైన సేవలు అందేవిధంగా చర్య తీసుకుంటామని వెల్లడించారు. ప్రభుత్వం పేదల కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ప్రత్యేక దృష్టి సారిస్తానని, అర్హులైన పేద కుటుంబాలకు సంక్షేమ ఫలాలు పారదర్శకంగా అందేవిధంగా చర్యలు తీసుకుంటానన్నారు. ప్రభుత్వం అమలు చేస్తే ప్రతి కార్యక్రమంలో ప్రజలను భాగస్వామ్యులు చేసేవిధంగా చర్యలు చేపడుతామన్నారు. హైదరాబాద్ జిల్లాలో ప్రభుత్వ భూములు కీలకమని, వాటి పరిరక్షణకు కట్టుబడి ఉన్నామన్నారు. కోర్టు వివాదాల్లో గల ప్రభుత్వ భూములను సైతం దక్కించుకునేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించి, ప్రభుత్వ భూమి గజం కూడా చేజారకుండా పకడ్బందీ చర్యలు చేపట్టనున్నట్లు శ్వేతా మహంతి వివరించారు. -
కొత్త సంతకాలు
పరిపాలన ప్రక్షాళనలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం ఎనిమిది మంది మహిళా అధికారులకు కలెక్టర్లుగా బాధ్యతలు అప్పగించింది. రాష్ట్ర ఆవిర్భావం తరువాత ఇంత పెద్ద స్థాయిలో మహిళా కలెక్టర్లను నియమించడం ఇదే తొలిసారి. హైదరాబాద్ వంటి మెట్రో పాలిటన్ నగరానికి యువ ఐఏఎస్ అధికారి శ్వేతా మహంతిని, కొత్తగా ఏర్పడిన పెద్దపల్లికి మరో యువ అధికారి సిక్తా పట్నాయక్ను కలెక్టర్లుగా నియమించారు. తక్కిన ఆరుగురు కూడా ఇప్పటికే పాలనలో తమ ప్రత్యేకతను నిలుపుకుంటూ, సామర్థ్యాన్ని నిరూపించుకుంటూ వస్తున్న ఆధికారులే. వీరంతా గత సోమవారమే కలెక్టర్లుగా బాధ్యతలు స్వీకరించారు. ఆ సందర్భంగా ‘సాక్షి’ ఈ ఎనిమిది మహిళా కలెక్టర్లతో మాట్లాడి, వారి ప్రాధాన్యాలను అడిగి తెలుసుకుంది -తెలంగాణ నెట్వర్క్, సాక్షి ఫిర్యాదులకు ప్రాముఖ్యం వెనుకబడిన నారాయణపేట జిల్లా ప్రాంతాన్ని ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజల భాగస్వామ్యంతో అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపించేందుకు కృషి చేస్తాను. ప్రభుత్వం చేపడుతున్న ప్రజాసంక్షేమ పథకాలను అర్హులైన వారందరికి చేరేలా చూస్తాను. ఈ ప్రాంతంలో విద్య, వైద్యంతో పాటు గ్రామీణ, పట్టణాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తాను. ప్రధానంగా భూ సమస్యలు, ప్రజావాణిలో వచ్చే ఫిర్యాదులు, పచ్చదనం, పరిశుభ్రత, హరితహారంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటాను. – హరిచందన దాసరి, నారాయణపేట జిల్లా కలెక్టర్ విద్య, వైద్యం, భూ పరిరక్షణ సమాజంలో మానవుడి మనుగడకు విద్య, వైద్యం ఎంతో అవసరం. అక్షరాస్యులైతే భవిష్యత్తును చక్కగా తీర్చిదిద్దుకోవచ్చు. వైద్య సేవలు అందుబాటులో ఉంటే సంపూర్ణ ఆరోగ్యంతో ఉండొచ్చు. అందుకే ఈ రెండు రంగాలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తాను. అంగన్వాడీలను సైతం బలోపేతం చేస్తాను. జిల్లాలో ప్రభుత్వ భూముల పరిరక్షణ కూడా మా లక్ష్యాలలో ఉంది. – శ్వేత మహంతి, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అవినీతి రహిత పాలన ప్రజా సమస్యల పరిష్కారం నా తొలి ప్రాధాన్యం. ప్రభుత్వ శాఖల వారీగా.. క్రమం తప్పకుండా సమీక్షలు నిర్వహిస్తాం. సంక్షేమ పథకాల ఫలాలు ప్రజలకు సక్రమంగా అందేలా చూస్తాం. అవినీతి రహిత పాలన అందిస్తాం. అభివృద్ధిలో జిల్లాను ప్రథమశ్రేణిలో నిలిపేందుకు ఆయా ప్రభుత్వ శాఖల అధికారులతో కలిసి సమష్టిగా పని చేస్తాం. – షేక్ యాస్మిన్ బాషా, వనపర్తి జిల్లా కలెక్టర్ పల్లె ప్రగతికి ప్రాధాన్యం ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయడమే నా ప్రాధాన్యత. ప్రస్తుతం పల్లె ప్రగతికి తొలి ప్రాముఖ్యం. మెరుగైన పాలనను అందిస్తా. కొత్త జిల్లాలతో పరిపాలన ప్రజలకు చేరువైంది. ప్రభుత్వ పథకాలు అర్హులైన లబ్దిదారులకు చేరేలా చూస్తాం. అవినీతి అనే దానికి ఆస్కారమే లేదు. సీఎం కేసీఆర్ తరహాలోనే ఒక విజన్ తో పనిచేస్తాం. అధికారులపై వేధింపులుండవు. అలాగని విధుల్లో రాజీ పడేది లేదు. – సిక్తా పట్నాయక్, పెద్దపల్లి జిల్లా కలెక్టర్ బాలికలకు మార్షల్ ఆర్ట్స్ నేను సివిల్ సర్వీసులోకి రావడానికి మా నాన్న కారణం. అమెరికాలో ఉంటే ఇక్కడకు తీసుకువచ్చారు. 2009లో గ్రూప్ –1 రాసి తొలి ప్రయత్నంలోనే సెలెక్ట్ అయ్యాను. కలెక్టర్ గా జనగామ నాకు మొదటి పోస్టింగ్. మన రాష్ట్ర ప్రభుత్వం చాలా పథకాలను అమలు చేస్తోంది. మిషన్ భగీరథ, డబుల్ బెడ్ రూం ఇళ్లు, పల్లె ప్రగతి, హరితహారం, వైద్యం, విద్య వంటి అనేక కార్యక్రమాలు చేపడుతోంది. ప్రభుత్వం చేపట్టే సంక్షేమ పథకాలను ప్రజల దగ్గరికి తీసుకుపోవడమే నా ముందున్న ప్రధాన లక్ష్యం. విద్యలో జిల్లాను మొదటి వరుసలో నిలిపేందుకు ప్రయత్నిస్తాం. బాలికలకు మార్షల్ ఆర్ట్స్ నేర్పించడంపై దృష్టి పెడతాం. జిల్లా అక్షరాస్యత ను పెంచడానికి కృషి చేస్తాను. – కె. నిఖిల, జనగామ జిల్లా కలెక్టర్ అన్ని రంగాల్లో జిల్లా ప్రగతి ప్రజల జీవితాల్లో మార్పు వచ్చేలా అంకిత భావంతో, నిబద్ధతతో పని చేస్తాను. జిల్లాను అన్ని రంగాల్లో ప్రథమస్థానంలో నిలబెట్టేలా చూస్తాను. ప్రజలు, అధికారులతో మమేకం అయి పని చేస్తాను. ప్రభుత్వ పథకాలను సఫలీకృతం చేసేందుకు పని చేస్తాను. అందరూ ఉత్సాహంగా పని చేస్తే ఆదర్శవంతమైన జిల్లాగా మనకు పేరొస్తుంది. – శ్రీదేవసేన, అదిలాబాద్ జిల్లా కలెక్టర్ మౌలిక సదుపాయాల కల్పన జిల్లా సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తాను. పరిపాలన యంత్రాంగంతో పారదర్శకంగా, నిబద్ధతతో కలిసి ముందుకు సాగుతాను. జిల్లాలో మౌలిక సదుపాయాల కల్పన కు కృషి చేస్తాను. పారిశుధ్యం, హరితహారంపై ప్రత్యేక శ్రద్ధ ఉంటుంది. సంక్షేమ పథకాలు అర్హులైన వారికి అందేలా చర్యలు తీసుకుంటాం. పల్లెప్రగతిలో చేపట్టిన పనులు పూర్తి చేసేందుకు ప్రాధాన్యమిస్తాం. – శృతి ఓఝా, గద్వాల జిల్లా కలెక్టర్ పంటలకు ప్రోత్సాహం వ్యవసాయ, ఉపాధి రంగాలకు తొలి ప్రాధాన్యం. అలాగే గ్రామీణాభివృద్ధి, పర్యాటక రంగం అభివృద్ధిపై దృష్టి పెడతాం. వికారాబాద్ హైదరాబాద్ కు సమీపంగా ఉన్నందున ఉద్యానవన పంటలైన కూరగాయలు, పూలకు ఎక్కువగా మార్కెటింగ్ అవకాశాలు వుంటాయి కనుక రైతులు ఉద్యానవన పంటలు సాగుచేసేలా ప్రోత్సహిస్తాం. – పౌసమి బసు, వికారాబాద్ జిల్లా కలెక్టర్ -
కరోనాపై కలెక్టర్లకు బాధ్యతలు
సాక్షి, హైదరాబాద్: కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా వైద్య, ఆరోగ్యశాఖ జిల్లాలను అప్రమత్తం చేసింది. జిల్లాల్లో కరోనా వైరస్ నియంత్రణ బాధ్యతలను కలెక్టర్లకు అప్పగిస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. జిల్లాల్లో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేయాలని కలెక్టర్లకు విజ్ఞప్తి చేస్తూ వైద్య, ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతికుమారి లేఖ రాశారు. ఎవరైనా చైనా సహా సమీప దేశాల నుంచి వచ్చిన వారుంటే గుర్తించాలని, కరోనా రాకుం డా పెద్ద ఎత్తున చర్యలు తీసుకోవాలని తెలిపారు. కేరళలో 3 కరోనా కేసులు నమోదు కావడం, అక్కడి ప్రభుత్వం కలెక్టర్లకు బాధ్యతలు ఇచ్చిన నేపథ్యంలో అదే పద్ధతిలో తెలంగాణలోనూ నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి అనేక మార్గదర్శకాలు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చే కరోనా అనుమానిత కేసులకు కూడా ఇకనుంచి హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలోనే నిర్ధారణ పరీక్షలు చేయిం చాలని కేంద్రం ఆదేశించింది. దీంతో ఇక అక్కడి నుంచి వచ్చే కేసులకు గాంధీ ఆసుపత్రిలోనే నిర్ధారణ పరీక్షలు చేస్తామని ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాసరావు వెల్లడించారు. ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్స్ను జిల్లాల్లో ఏర్పాటు చేయాలని కేంద్రం ఆదేశించింది. కరోనా, ఎబోలా వంటివి అనుకోకుండా వ్యాపిస్తే పరిస్థితిని నియంత్రించేలా ఇవి పనిచేస్తాయి. ఈ మేరకు ఆ టీమ్స్కు ప్రత్యేక శిక్షణ ఇస్తారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో చేర్చుకోవద్దు.. కరోనా అనుమానిత లక్షణా లతో వచ్చే వారిని ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రులు ఏ మాత్రం అడ్మిట్ చేసుకోవద్దని వైద్య, ఆరోగ్యశాఖ స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. అటువంటివారు ఎవరైనా వస్తే తక్షణమే తమకు సమాచారం ఇవ్వాలని, అవసరమైతే ప్రత్యే కశ్రద్ధతో గాంధీ లేదా ఫీవర్ ఆసుపత్రికి పంపించాలని స్పష్టం చేసింది. ముక్కు కార డం, తలనొప్పి, దగ్గు వంటి లక్షణాలతో ఎవరు వచ్చినా వారి వివరాలు తెలుసుకోవా లని ప్రైవేటు ఆసుపత్రులకు సూచించింది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 777 విమానాల ద్వారా వచ్చిన 89,500 మందిని విమానాశ్రయాల్లో స్క్రీనింగ్ చేశారని, అందు లో 3,935 మందిని ఎటూ వెళ్లకుండా ఇళ్లలోనే ఉండిపోవాలని కేంద్రం ఆదేశించింది. 454 మంది కరోనా అనుమానితులను పరీక్షించగా, ముగ్గురికి కరోనా సోకినట్లు కేంద్రం ప్రకటించిందని డాక్టర్ శ్రీనివాసరావు వెల్లడించారు. మన రాష్ట్రానికి ఇప్పటివరకు 42 మంది చైనా నుంచి వచ్చారన్నారు. వుహాన్ నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికీ నిర్ధారణ పరీక్షలు చేయాలని, ఇతర ప్రాంతాల నుంచి వచ్చినవారిలో ఎవరికైనా లక్షణాలుంటే మాత్రమే పరీక్షలు చేయాలని, ఇతరులకు వద్దని నిర్ణయించామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం చైనాకు పంపిన విమానాల ద్వారా మన దేశానికి 600 మంది రాగా, అందులో రాష్ట్రానికి చెందినవారు ఐదుగురు ఉన్నారని అధికారులు వెల్లడించారు. జనవరి 15 తర్వాత చైనా నుంచి వచ్చిన వారి వివరాలు మాత్రమే సేకరించామని, ఇకనుంచి అంతకుముందు వచ్చిన వారి వివరాలు కూడా తీసుకోవాలని సూచించామన్నారు. వారిలోనూ ఏమైనా లక్షణాలుంటే సమాచారం ఇవ్వాలని జిల్లా వైద్యాధికారులకు సూచిం చారు. కరోనా నిర్ధారణ పరీక్ష మూడు శాంపిళ్లను సేకరించడం ద్వారా చేస్తారన్నారు. గొంతు, ముక్కు, రక్త నమూనాలను సేకరించి పరీక్షలు చేస్తారని తెలి పారు. ప్రస్తుత పరిస్థితుల్లో చైనా, హాంకాంగ్, థాయ్లాండ్, సింగపూర్, మలేసియా దేశాలకు వెళ్లొద్దని వైద్య, ఆరోగ్యశాఖ ప్రజలకు సూచించింది. -
మహిళా ఐఏఎస్లకు కేసీఆర్ పెద్దపీట
సాక్షి, హైదరాబాద్ : గత ప్రభుత్వ మంత్రివర్గంలో కనీసం ఒక్క మహిళకు కూడా అవకాశం ఇవ్వని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. రెండోసారి అధికారంలోకి వచ్చిన తరువాత మహిళలకు పెద్దపీట వేస్తున్నారు. తెలంగాణకు తొలి మహిళా గవర్నర్ బాధ్యతలు చేపట్టడంతో పాటు ఇద్దరు మహిళా మంత్రులకు కూడా ఈసారి కేసీఆర్ అవకాశం కల్పించారు. దీనిలో భాగంగానే రాష్ట్రంలో మహిళా అధికారులకూ ముఖ్య బాధ్యతలను అప్పగిస్తున్నారు. పరిపాలన ప్రక్షాళనలో భాగంగా రాష్ట్రంలో భారీ ఎత్తున ఒకేసారి 50 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే గతంలో ఎన్నడూ లేని విధంగా మహిళా అధికారులకు పెద్దపీఠ వేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 21 జిల్లాలకు కొత్త పాలానాధికారులను నియమించగా.. వాటిల్లో 8 జిల్లాలకు మహిళా అధికారులను కలెక్టర్లుగా బాధ్యతలు అప్పగించడం విశేషం. (50 మంది ఐఏఎస్ల బదిలీ) పెద్దపల్లి జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన సిక్తా పట్నాయక్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ఇంత పెద్ద మొత్తంలో మహిళా కలెక్టర్లను నియమించడం ఇదే తొలిసారి. హైదరాబాద్ లాంటి మెట్రోపాలిటన్ నగరానికి యువ ఐఏఎస్ అధికారిని శ్వేతా మహంతికి కలెక్టర్గా బాధ్యతలు అప్పగించారు. మరో యువ అధికారిని సిక్తా పట్నాయక్ను నూతనంగా ఏర్పడిన పెద్దపల్లి కలెక్టర్గా నియమించారు. కేవలం కలెక్టర్లనే కాకుండా ప్రభుత్వ ముఖ్య శాఖల్లో కూడా మహిళా అధికారులకే సీఎం కేసీఆర్ ప్రాధాన్యత కల్పించారు. యువ అధికారులు కావడం.. గతంలో ముఖ్యశాఖలకు విధులు నిర్వర్తించిన అనుభవం ఉండటంతో పాలనాపరంగా కలిసోస్తుందని ప్రభుత్వం ఆశిస్తోంది. ఇటీవల ముగిసిన పల్లెప్రగతి తొలి విడత కార్యక్రమంలో సాధించిన ఫలితాలు, త్వరలో అమల్లోకి తేనున్న పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని పరిగణనలోకి తీసుకుని సర్కారు జిల్లా కల్లెక్టర్ల బదిలీలు జరిపినట్లు తెలుస్తోంది. నారాయణ పేట జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన హరిచందన జనగామ జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన కె.నిఖిల కొత్తగా బాధ్యతలు చేపట్టిన మహిళా అధికారులు 1. పాసమి బసు, కలెక్టర్ (వికారాబాద్) 2. దేవసేన (ఆదిలాబాద్) 3. హరిచందన (నారాయణ్పేట) 4. శ్వేతా మహంతి (హైదరాబాద్) 5. శృతి ఓఝూ (జోగులాంబ గద్వాల) 6. సిక్తా పట్నయక్ (పెద్దపల్లి) 7. కె. నిఖిల (జనగామ) 8. షేక్ యాస్మిన్ బాషా (వనపర్తి) -
సూర్యాపేట జిల్లా కలెక్టర్ బదిలీ
సాక్షి, సూర్యాపేట: సూర్యాపేట జిల్లా కలెక్టర్ అమేయ కుమార్పై బదిలీ వేటు పడింది. రంగారెడ్డి జిల్లా కలెక్టర్గా ఆయనను ప్రభుత్వం సోమవారం బదిలీ చేసింది. యాదాద్రి జిల్లా కలెక్టర్ అనితా రామచంద్రన్కి సూర్యాపేట జిల్లా ఇన్చార్జి కలెక్టర్గా అదనపు బాధ్యతలు అప్పగించారు. కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు ఓటు వివాదం నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల్లో ఎక్స్ అఫిషియో సభ్యుడిగా ఓటు వేసేందుకు అవకాశం కల్పించి, తర్వాత నిరాకరించడంతో వివాదం మొదలైంది. దీనిపై కాంగ్రెస్ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆందోళన కూడా చేసింది. అంతేకాకుండా ఈరోజు కాంగ్రెస్ నేతలు రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కలిసి తమ అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో స్పందించిన ఎన్నికల సంఘం సూర్యాపేట జిల్లా కలెక్టర్ ఇచ్చిన ఉత్తర్వులను నిలిపివేసి, కేవీపీకి ఓటు వేసే అవకాశం కల్పించింది. అమేయ కుమార్పై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. అలాగే ప్రభుత్వం నేరేడుచర్ల మున్సిపాలిటీ ఇన్చార్జ్ కమిషనర్ మహేందర్రెడ్డిని సస్పెండ్ చేసింది. కాగా అమయ్కుమార్ సూర్యాపేట జిల్లా కలెక్టర్గా 2018 డిసెంబర్ 29న బాధ్యతలు స్వీకరించారు. ఆయన స్థానిక సంస్థలు, ఎంపీ, హుజూర్నగర్ ఉప ఎన్నిక, మున్సిపల్ ఎన్నికలను నిర్వహించారు. కేవీపీ ఓటు వివాదం నేపథ్యంలో నేరేడుచర్ల మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక మంగళవారానికి వాయిదా పడింది. (చదవండి: నేరేడుచర్లలో ఉత్కంఠ) -
బుల్లెట్పై వెళ్లి పత్తి ఏరిన కలెక్టర్..
భూపాలపల్లి రూరల్ : పల్లె ప్రగతి పనుల చివరి రోజు సందర్భంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు ఆదివారం పలు గ్రామాలను సందర్శించారు. ఆముదాలపల్లికి బుల్లెట్ వాహనంపై వెళ్లారు. మార్గమధ్యలో పత్తి చేలల్లో కూలీలతో మాట్లాడారు. ఈ సందర్భంగా కూలీలతో కలసి పత్తి ఏరుతూ వారి కష్టసుఖాలు తెలుసుకున్నారు. సంక్రాంతి సెలవులకు ఇంటికి వచ్చి పత్తి ఏరుతున్న ఇంటర్ విద్యార్థిని ఝాన్సీతో కాసేపు మాట్లాడారు. వ్యవసాయ పనుల్లో కుటుంబానికి ఆసరాగా నిలిచిన ఝాన్సీని అభినందించిన కలెక్టర్, బాగా చదువుకోవాలని అన్నారు. -
మున్సిపల్లో ర్యాండమైజేషన్ సిబ్బంది: కలెక్టర్
సాక్షి, కరీంనగర్ : మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు ర్యాండమైజేషన్ ద్వారా ఎన్నికల సిబ్బందిని కేటాయించినట్లు కలెక్టర్ శశాంక తెలిపారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశం మందిరంలో ఎన్నికల అబ్జర్వర్తో కలిసి మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు ర్యాండమైజేషన్ ద్వారా సిబ్బందిని కేటాయించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పోలింగ్స్టేషన్కు ఒక ప్రిసైడిండ్ అధికారి, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారి, ముగ్గురు పోలింగ్ అధికారులను మొత్తం ఐదుగురిని ఒక బృందంగా ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. మున్సిపల్ పరిధిలో పని చేయని, ఇతర మండలాల్లో పని చేస్తున్న సిబ్బందిని, ఒకే స్కూల్, ఒకే కార్యాలయం నుంచి ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు ఉండకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నామని, అన్ని పోలింగ్ టీంలలో ఒక మహిళ ఉద్యోగి ఉండేలా కేటాయింపులు చేశామని, పోలింగ్ విధుల్లో మున్సిపల్ ఉద్యోగులను ఎవరినీ నియమించలేదని పేర్కొన్నారు. కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలో 348 మంది ప్రిసైడింగ్ అధికారులు(పీవో), 348 మంది అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు(ఏపీవో), 1,044 మంది ఇతర పోలింగ్ అధికారులు, మొత్తం 1,710 మంది సిబ్బందిని కేటాయించినట్లు వివరించారు. హుజూరాబాద్ మున్సిపాలిటీ పరిధిలో 46 మంది పీవోలు, 46 మంది ఏపీవోలు, 138 మంది ఇతర పోలింగ్ సిబ్బంది మొత్తం 230 మంది, జమ్మికుంట మున్సిపాలిటీకి 60 మంది పీవోలు, 60 మంది ఏపీవోలు, 180 మంది ఇతర పోలింగ్ అధికారులు, మొత్తం 300 మంది సిబ్బందిని కేటామయించినట్లు తెలిపారు. చొప్పదండి మున్సిపాలిటీకి 24 మంది పీవోలు, 24 మంది ఏపీవోలు, 72 మంది ఇతర సిబ్బంది మొత్తం 120 మంది, కొత్తపల్లి మున్సిపాలిటీకి 15 మంది పీవోలు, 15 మంది ఏపీవోలు, 45 మంది ఇతర సిబ్బంది, మొత్తం 75 మందిని కేటాయించినట్లు తెలిపారు. అన్ని మున్సిపాలిటీల్లో 20 శాతం పోలింగ్ సిబ్బందిని రిజర్వ్గా ఉంచుటకు గుర్తించినట్లు పేర్కొన్నారు. సమావేశంలో ఎన్నికల పరిశీలకులు అద్వైత్సింగ్, జేసీ శ్యాంప్రసాద్లాల్, జిల్లా రెవెన్యూ అధికారి ప్రావీణ్య, కరీంనగర్ కార్పొరేషన్ కమిషనర్ వేణుగోపాల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
శభాష్ కలెక్టర్..!
కారులో వెళ్తుండగా ప్రమాద ఘటనపై స్పందించిన కలెక్టరు విజయ్అమృత కులంగా తన వాహనంలో క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించి, వైద్యసేవలు అందించిన వైనంకలెక్టరు తీరు పట్ల హర్షం వ్యక్తం చేస్తున్న ప్రజలు బరంపురం: అధికారులు ఎప్పుడూ తమ అధికారిక కార్యక్రమాలతో బిజీగా గడుపుతుంటారు. సామాన్యుడి కష్టాలు ప్రత్యక్షంగా చూసిన సందర్భాల్లో కూడా తమ పనుల నిమిత్తం వెళ్లిపోయిన సందర్భాలు కోకొల్లలుగా కనిపిస్తుంటాయి. చాలా తక్కువ మంది మాత్రమే తామెంత అర్జంట్ పనిలో ఉన్నా ఎదురుగా ఉన్న మనిషి పడుతున్న కష్టం చూసి కారు ఆపుతారు. వెంటనే తమకు తోచిన సహాయం చేసి మానవత్వం చాటుకుంటారు. ఇప్పుడు అచ్చం అలాంటి ఘటనే గంజాం జిల్లాలోని సరగడా సమితిలో ఆదివారం చోటుచేసుకుంది. అదే దారిలో ఓ కారులో ప్రభుత్వ కార్యక్రమానికి వెళ్తున్న కలెక్టరు విజయ్అమృత కులంగా అక్కడ జరిగిన రోడ్డు ప్రమాద ఘటనను చూసి కారు ఆపి, దిగారు. అనంతరం జరిగిన సంఘటనపై అక్కడి వారిని అడిగి తెలుసుకున్నారు. కారు–బైక్ ఢీకొన్న ఘటనలో శివరామ్ పాత్రో తీవ్రగాయాలపాలవ్వగా, అతడిని ఆస్పత్రికి తరలించేందుకు రెండు గంటల నుంచి అంబులెన్స్ కోసం ఎదురుచూస్తున్నారు. అయినా అంబులెన్స్ రాలేదు.. ఈ క్రమంలో క్షతగాత్రుడి పరిస్థితి రానురాను తీవ్రతరమవుతోంది. ఈ నేపథ్యంలో ఇదే విషయం పట్ల స్పందించిన కలెక్టరు తన ప్రభుత్వ వాహనంలో క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించేందుకు అధికారులను ఆదేశించారు. ఆ తర్వాత హింజిలికాట్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి వైద్యసేవలు అందజేసేలా చేశారు. ఇదే విషయంపై కలెక్టరు తీరు పట్ల అక్కడి ప్రజలంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. మహోన్నతమైన స్థానంలో ఉన్న వ్యక్తులు ఇటువంటి గొప్ప కార్యాలు చేస్తే సమాజం ఆదర్శంగా తీసుకుంటుందని అంటున్నారు. వివరాలిలా ఉన్నాయి.. ఛత్రపూర్ నుంచి కలెక్టర్ విజయ్అమృత కులంగా సరగడా సమితిలోని ఉచిత ఆరోగ్య వైద్య శిబిరం ప్రారంభ కార్యక్రమానికి కారులో వెళ్తున్నారు. అదే సమయంలో సరగడా దగ్గర మారుతి గ్రామం జంక్షన్ వద్ద సంభవించిన రోడ్డు ప్రమాద ఘటనలో శివరామ్ పాత్రో తీవ్రగాయాలతో పడి ఉన్నాడు.ఇదే సంఘటన చూసిన కలెక్టరు కారును ఆపి, క్షతగాత్రుడిని తన కారులో ఎక్కించుకుని, హింజిలికాట్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత అక్కడి వైద్యులతో మాట్లాడి క్షతగాత్రుడికి వైద్యసేవలు అందజేశారు. -
కలెక్టర్లు, ఎస్పీలకు 17న సీఎం జగన్ విందు
సాక్షి, అమరావతి: అసెంబ్లీ సమావేశాలు ముగింపు సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ నెల 17వ తేదీన విందు ఏర్పాటు చేయనున్నారు. మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, అధికారపార్టీ ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్లను ఈ విందుకు ఆహ్వానించనున్నారు. విజయవాడలోని బరం పార్క్లో 17వ తేదీ సాయంత్రం 6.30కి ఈ విందు ప్రారంభమవుతుందని ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు తెలిపాయి. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలపై అవగాహన, వివిధ జిల్లాల సమస్యలు, గ్రామ సచివాలయాలు, స్పందన, మహిళల భద్రత తదితర అంశాల మీద విందు భేటీలో చర్చించనున్నట్లు వెల్లడించాయి. -
కలెక్టర్ కదిలిపోయాడు
మూడో మనిషికి తెలియకుండా కష్టం సుఖం చెప్పుకున్నట్లే.. డబ్బు దాచుకున్న రహస్యం ఇద్దరు అక్కచెల్లెళ్లు తమ మధ్యే ఉంచుకున్నారు. ఆ దాచుకున్న డబ్బు కూడా బతకడానికి కాదు. చనిపోతే అంత్యక్రియల కోసం! తంగమ్మాళ్, రంగమ్మాల్ అక్కాచెల్లెళ్లు. తంగమ్మాల్ వయసు 78. రంగమ్మాళ్ వయసు 75. ఇద్దరూ ఒకే ఇంట్లో ఉంటారు. ఇంట్లో ఆ ఇద్దరే ఉంటారు. పిల్లలు వెళ్లిపోయారు. పిల్లల పిల్లలు రావడం మానేశారు. వాళ్లుండేది చిన్న ఊరు. తమిళనాడులోని పల్లాడం దగ్గరి పూమలూర్. తిరుప్పూర్ జిల్లా. వీళ్లను చూసేవాళ్లు లేరు. చేసేవాళ్లూ లేరు. ఎవరికి ఎవరూ ఉండరని ఒంట్లో కాస్త ఓపిక ఉన్నప్పుడే వీళ్లు గ్రహించినట్లున్నారు. పొలానికి కూలి పనికి వెళ్లినప్పుడు వచ్చే నూరూ నూటాయాభై రూపాయల్లోనే ఇద్దరూ తమ కోసం కొంత దాచుకున్నారు. దాచుకున్నది బ్యాంకులో కాదు. బొడ్లో దోపుకునే చిన్న సంచిలో కొంత, అల్యూమినియం డబ్బాలో కొంత, బియ్యం బస్తాల్లో కొంత! కొడుకులు తాగుబోతులు. డబ్బుందంటే లాగేసుకుంటారు. అందుకే మూడో మనిషికి తెలీకుండా.. కష్టం సుఖం చెప్పుకున్నట్లే.. డబ్బు దాచుకున్న రహస్యం ఇద్దరు అక్కచెల్లెళ్లు తమ మధ్యే ఉంచుకున్నారు. ఆ దాచుకున్న డబ్బు కూడా బతకడానికి కాదు. చనిపోతే అంత్యక్రియల కోసం! ఈ మధ్య తంగమ్మాళ్కి జబ్బు చేసింది. వైద్యానికి డబ్బు లేదు. ‘అంత్యక్రియల డబ్బు’ను బయటికి తీయక తప్పలేదు. ఇద్దరి దగ్గరా కలిపి 46 వేల రూపాయల వరకు జమ అయ్యాయి. ఇరవై ఏళ్లుగా తినీ తినకా దాచిన మొత్తం అది. అక్కవి 22 వేలు, చెల్లెలివి 24 వేలు. ‘‘నా డబ్బు కూడా తీసేస్కో అక్కా. నీ ఆరోగ్యం కంటే ఎక్కువా’’ అని చెల్లి అంది. అక్కకు కన్నీళ్లు ఆగలేదు. చెల్లిని ఆప్యాయంగా హత్తుకుంది. ఇద్దరూ కలిసి ఆసుపత్రికి వెళ్లారు. ఓ మోస్తరు ఆసుపత్రిలోనైనా ముందే డబ్బు కట్టించుకుంటున్నారుగా ఇప్పుడు. అడ్వాన్సుగా కొంత కట్టబోయారు. ఆ నోట్లను చూసి ఆసుపత్రివాళ్లు ‘ఇవి చెల్లవు’ అనేశారు. పాత వెయ్యినోట్లు, ఐదొందల నోట్లు అవి! మూడేళ్ల క్రితం ప్రభుత్వం రద్దు చేసిన పెద్ద నోట్లు!! అచేతనంగా నిలబడిపోయారు తంగమ్మాళ్, రంగమ్మాళ్. వాళ్లకా రద్దు సంగతి తెలీదు. పాత నోట్లు తప్ప చిల్లిగవ్వ లేదు వాళ్ల దగ్గర. ఉన్నా, ఆ చిల్లి గవ్వయినా ఈ కాలంలో ఎందుకు చెల్లుతుంది! విషయం కలెక్టర్ వరకు వెళ్లింది. చెల్లని నోట్లను చెల్లుబాటు చేయడం నేరం కదా, అందుకు వెళ్లింది. ఇక ఇక్కడి నుంచి ఈ స్టోరీ మీకు కొంత సంతోషాన్నిస్తుంది. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అనుకునేలానూ చేస్తుంది. తిరుప్పూరు జిల్లా కలెక్టర్ కె.విజయ్ కార్తికేయన్. వాళ్ల కథ విని ఆ యువ కలెక్టర్ కదిలిపోయాడు. పాత నోట్ల మాట తర్వాత అని, వెంటనే ఆ అక్కాచెల్లెళ్లకు ఆర్థిక సహాయం చేశాడు. వృద్ధాప్యపు పెన్షన్ మంజూరుకు తక్షణం ఒక లెటర్ తయారు చేయించి పైకి పంపాడు. పెరుందురై మెడికల్ కాలేజీకీ ఒక లేఖ రాస్తూ.. వీళ్లద్దరికీ ఉచిత వైద్యం అందజేయాలని విజ్ఞప్తి చేశాడు. ఆ తర్వాతే.. వీళ్ల దగ్గరున్న పాత నోట్లు తీసుకుని కొత్త నోట్లు ఇవ్వండని జిల్లా బ్యాంకుకు సిఫారసు చేశాడు. అమాయకులున్న చోట మంచివాళ్లూ ఉంటారు. అమాయకులు, మంచివాళ్ల వల్లే ఈ ప్రపంచంపై మనకింకా నమ్మకం మిగిలి ఉంటోంది. -
సమాధానం చెప్పేందుకు తత్తరపాటు
సాక్షి,ఆదిలాబాద్: పాఠశాలల్లో తరగతి గదులు సరిపోవడం లేదని, విద్యార్థులకు సరిపడా టాయిలెట్స్ లేవని, అభివృద్ధి పనులపై అధికారుల పర్యవేక్షణ కొరవడిందని, పనులు నాసిరకంగా జరుగుతున్నాయని, గ్రామాల్లో రహదారులు అస్తవ్యస్తంగా తయారయ్యాయని, అనేక గ్రామాలకు రహదారి సంబంధాలు లేక జనాలు ఇబ్బందులు పడుతున్నారని, సరైన వైద్యసేవలు అందడం లేదని, వైద్యులు ఆస్పత్రులకు రావడం లేదని, సరిపడా మందులు లేవని, రైతుబంధు, రైతుబీమా, పీఎంకిసాన్ యోజన డబ్బులు రాలేదని, ఇలా అనేక సమస్యలపై సభ్యులు సందించారు. గుక్కవీడకుండా సభ్యులు అడిగిన సమస్యలకు అధికారులు సమాధానం చెప్పేందుకు తత్తరపడ్డారు. జెడ్పీ సర్వసభ్య సమావేశంలో సభ్యులు తమ మండలంలోని సమస్యలపై గళం వినిపించారు. శనివారం జెడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్ధన్ అధ్యక్షతన సర్వసభ్య సమావేశం జరిగింది. జిల్లా కలెక్టర్ దివ్యదేవరాజన్, ఆదిలాబాద్, బోథ్, ఆసిఫాబాద్ ఎమ్మెల్యేలు జోగు రామన్న, బాపురావు, ఆత్రం సక్కు, జెడ్పీ సీఈఓ కిషన్, వైస్ చైర్మన్ ఆరె రాజన్న, సభ్యులు పాల్గొన్నారు. మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, ఎమ్మెల్సీలు జీవన్రెడ్డి, రఘోత్తంరెడ్డి, పురాణం సతీశ్ గైర్హాజరయ్యారు. లోక్సభ సమావేశాలు ఢిల్లీలో ఉండడంతో ఎంపీ సోయం బాపురావు రాలేకపోయారు. ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ కూతురు వివాహం ఆదివారం హైదరాబాద్లో ఉండడంతో ఆమె సమావేశానికి రాలేదు. ఉదయం 11గంటలకు సమావేశం ప్రారంభమైంది. మొత్తం 42 అంశాలకుగానూ విద్యాశాఖ అంశంతో మొదలైన సమావేశంలో వ్యవసాయం, మార్కెటింగ్, ఆర్అండ్బి, విద్య, వై ద్యం, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్, పరిశ్రమలు, అటవీశాఖ అంశాలపై ఉదయం సెషన్లో చర్చ జరిగింది. మధ్యాహ్న భోజనం అ నంతరం మిగితా అంశాలు చర్చకు వచ్చాయి. అయితే కొన్ని అంశాలపై విస్తృతంగా చర్చ జరిగినప్పటికీ అనేక అంశాలపై తట్టి వదిలేశారు. సాయంత్రానికి సమావేశం ముగించారు. తలమడుగు మండలం సాయిలింగిలో టాయిలెట్స్ మంజూరు చేయాలని జెడ్పీటీసీ గోక గణేష్రెడ్డి కోరారు. రోడ్ల విషయంలో చర్చ జరుగుతున్న సందర్భంగా నిధుల మంజూరు విషయంలో వైస్ చైర్మన్ ఆరె రాజన్నతో ఆయనకు కొద్దిసేపు వాగ్వివాదం చోటుచేసుకుంది. ఆర్ఓఎఫ్ఆర్ కింద పట్టాలు ఇచ్చినవారికి ఇప్పటివరకు ఏ ఒక్కరికీ రైతుబంధు రాలేదని బజార్హత్నూర్ జెడ్పీటీసీ మల్లెపూల నర్సయ్య ఆవేదన వ్యక్తం చేశారు. భీంపూర్ మండలంలోని అర్లి(టి) గ్రామంలో రూ.45లక్షలతో పాఠశాల భవనాలు నిర్మిస్తుండగా 80 శాతం పనులు పూర్తయి మిగితా పనులు అసంపూర్తిగా మిగిలిపోయాయని, దీంతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని భీంపూర్ జెడ్పీటీసీ కుమ్ర సుధాకర్ అన్నారు. కుంటాల జలపాతానికి వెళ్లే రోడ్డులో ఆర్అండ్బి గెస్ట్హౌజ్కు సంబంధించిన స్థలం అన్యాక్రాంతం అవుతుందని, అధికారులు పట్టించుకోవడం లేదని నేరడిగొండ జెడ్పీటీసీ అనిల్ జాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు. గాదిగూడలో పీహెచ్సీని 24 గంటల ఆస్పత్రిగా మార్చాలని జెడ్పీటీసీ మెస్రం గంగుబాయి కోరారు. సమస్యలపై గళంసీజన్ను బట్టి అంశాల ప్రస్తావన జిల్లాలో పరిస్థితులకు అనుగుణంగా సీజన్ను బట్టి జెడ్పీ సర్వసభ్య సమావేశంలో ఆరేడు అంశాలను తీసుకొని విస్తృతంగా చర్చించాలి. ఇది నా అభిప్రాయం. గత సమావేశాల్లో సభ్యులు అడిగిన ప్రశ్నలకు సంబంధించి యాక్షన్టేక్ రిపోర్టును సమావేశం కంటే వారం ముందుగానే అందించే ఏర్పాట్లు అధికారులు చేయాలి. ఇలా జెడ్పీ సమావేశం ఓ క్రమపద్ధతిగా జరిగితే జిల్లాలోని సమస్యలు పరిష్కరించే అవకాశం ఉంటుంది. – దివ్యదేవరాజన్, కలెక్టర్ -
అనంతపురం కలెక్టర్గా గంధం చంద్రుడు
సాక్షి, అనంతపురం : జిల్లా కలెక్టర్గా గంధం చంద్రుడు నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం కలెక్టర్గా ఉన్న సత్యనారాయణను ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్ కులాల సహకార ఆర్థిక సంస్థ (ఏపీ ఎస్సీసీఎఫ్సీ) ఎండీగా నియమించింది. ఇక జిల్లా కలెక్టర్గా నియమితులైన గంధం చంద్రుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్కులాల సహకార ఆర్థిక సంస్థ (ఏపీ ఎస్సీసీఎఫ్సీ) వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్నారు. సివిల్స్లో 198వ ర్యాంకు 2010 బ్యాచ్కు చెందిన ఐఏఎస్ అధికారి గంధం చంద్రుడు స్వస్థలం కర్నూలు జిల్లా కొలిమిగుండ్ల మండలం కోటపాడు గ్రామ. లేపాక్షి నవోదయలో చదువుకున్న Výæంధం చంద్రుడు, ఆతర్వాత సికింద్రాబాద్లోని రైల్వే కళాశాలలో చదువుకున్నారు. విద్యాభ్యాసం తర్వాత దక్షిణమధ్య రైల్వే డివిజన్లో టికెట్ ఎగ్జామినర్గా పనిచేశారు. ఆ తర్వాత 2010లో సివిల్స్ రాసి 198 ర్యాంకు సాధించారు. ఐఏఎస్ శిక్షణ అనంతరం మెదక్ అసిస్టెంట్ కలెక్టర్గా తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం సబ్కలెక్టర్గా, ఐటీడీఏ పీఏగా పనిచేశారు. ఆ తర్వాత సీఆర్డీఏ అడిషనల్ కమిషనర్గా వ్యవహరించారు. జాయింట్ కలెక్టర్గా 2015 మార్చి 5న కృష్ణా జిల్లా బాధ్యతలు తీసుకున్నారు. 2017లో ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ డైరెక్టర్గా పనిచేశారు. 2019 జూలై నుంచి ఏపీ షెడ్యూల్డ్ క్యాస్ట్ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ వైస్ చైర్మన్, ఎండీగా పనిచేశారు. తాజాగా అనంతపురం జిల్లా కలెక్టర్గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ‘సంక్షేమం’పై సత్యనారాయణ మార్క్ సత్యనారాయణ ఈ ఏడాది జూన్ 7వ తేదీన కర్నూలు జిల్లా నుంచి బదిలీపై అనంతకు వచ్చారు. కేవలం 5 నెలల 22 రోజులు మాత్రమే ఆయన కలెక్టరుగా విధులు నిర్వర్తించారు. ఈ కాలంలోనే జిల్లాలో సంక్షేమ హాస్టళ్లపై దృష్టి సారించారు. ఆకస్మిక తనిఖీలు, రాత్రి బస చేస్తూ సమస్యలు స్వయంగా తెలుసుకున్నారు. అప్పటికప్పుడు పలు సమస్యలు తీర్చారు. మెనూ ప్రకారం విద్యార్థులకు పౌష్టికాహారం అందేలా కృషి చేశారు. ఈ క్రమంలో విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా ఉన్న సిబ్బందిపైనా వేటు వేశారు. ఇక రైతు భరోసా అమలులో రాష్ట్రంలోనే జిల్లా మొదటిస్థానంలో నిలిపేందుకు విశేషంగా కృషి చేశారు. -
అర్హులైన పేదలందరికీ సంక్షేమ పథకాలు
సాక్షి, గుంటూరు: ‘రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలులో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. అర్హులైన లబ్ధిదారులకు కొత్తగా ఐదు రకాల కార్డులు, ఏడు కొత్త పథకాలకు లబ్ధిదారుల ఎంపిక కోసం గ్రామ, వార్డు వలంటీర్లతో ఇంటింటి సర్వే నిర్వహిస్తోంది. పారదర్శకంగా సర్వే, సామాజిక తనిఖీ, గ్రామ సభల ద్వారా వంద శాతం సంతృప్తి స్థాయిలో అర్హుల గుర్తింపుతో వైఎస్సార్ నవశకానికి నాంది పలకనుంది. ఇందు కోసం జిల్లా వ్యాప్తంగా కార్యాచరణ ప్రారంభించాం. ఇప్పటికే వలంటీర్లకు ప్రత్యేక అవగాహన సదస్సులు నిర్వహించాం. ఎటువంటి విమర్శలకు తావులేకుండా పనిని పూర్తి చేస్తాం’ అంటూ కలెక్టర్ ఐ.శామ్యూల్ ఆనంద్ కుమార్ చెప్పారు. బుధవారం ఆయన వైఎస్సార్ నవశకంపై ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. సాక్షి : ఇంటింటి సర్వే ఎలా సాగనుంది? కలెక్టర్ : అర్హులైన పేదలందరికీ సంక్షేమ పథకాలు అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్ నవశకం కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది. ఈ నెల 20వ తేదీ నుంచి డిసెంబరు 20వ తేదీ వరకు సమగ్ర సర్వే నిర్వహిస్తాం. ఇప్పటికే మాస్టర్ ట్రైనర్ల ద్వారా 16 వేల మంది గ్రామ వలంటీర్లకు, 9 వేల మంది వార్డు వలంటీర్లకు శిక్షణ ఇప్పించాం. బుధవారం సాయంత్రం నుంచి సర్వే ప్రారంభమయ్యింది. సాక్షి : కొత్తగా ఎన్ని రకాల కార్డులు ఇస్తున్నారు? వాటి ఎంపికలు ఎలా జరుగుతాయి? కలెక్టర్ : జిల్లాలో కొత్తగా బియ్యం కార్డు, పింఛన్ కానుక కార్డు, వైఎస్సార్ ఆరోగ్యశ్రీ, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన కార్డులకు అర్హులైన లబ్ధిదారులను పారదర్శకంగా ఎంపిక చేసేందుకు సర్వే చేపట్టాం. ఈ పథకాలకు సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే మార్గదర్శకాలను జారీ చేసింది. కొన్ని పథకాల లబ్ధిదారుల ఎంపిక విషయంలో అనుమానాలు వ్యక్తమైతే సంబంధిత డిపార్టుమెంట్ అధికారులను పంపి, వివరాలను పరిశీలించి చేసి అర్హత ఉందో లేదో మరోసారి నిర్ధారిస్తాం. ఏ ఒక్కరికి అన్యాయం జరగనివ్వం. సాక్షి : ప్రభుత్వం కొత్తగా ఏయే పథకాలకు లబ్ధిదారులను ఎంపిక చేస్తోంది? కలెక్టర్ : ప్రభుత్వం ప్రధానంగా జగనన్న అమ్మఒడి, వైఎస్సార్ మత్య్సకార భరోసా, వైఎస్సార్ నేతన్న నేస్తం, సున్నా వడ్డీ రుణాలు, వైఎస్సార్ కాపు నేస్తం, టైలర్లు, నాయీబ్రాహ్మణులు, రజకులకు సంక్షేమ పథకాలు, ఇమామ్, మౌజన్, పాస్టర్, అర్చకులకు గౌరవ వేతనాలు వర్తింపజేసేందుకు అర్హుల జాబితాలను సిద్ధం చేయనున్నాం. సాక్షి : అమ్మఒడికి సంబంధించి ప్రైవేటు పాఠశాలలు, చైల్డ్ ఇన్ఫోలో నమోదు కాలేదనే ఆరోపణలు వస్తున్నాయి. వీటిని ఎలా పరిష్కరిస్తారు? కలెక్టర్ : జిల్లాలో అమ్మఒడికి పథకానికిసంబంధించి ఇప్పటికే 6.82 లక్షల మంది విద్యార్థులు ఉండగా, చైల్డ్ ఇన్ఫోలో నమోదు కాని వారు చాలా తక్కువ సంఖ్యలో (దాదాపు పది వేలలోపు) మాత్రమే ఉన్నారు. ఈ విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఆయా పాఠశాలలకు చెందిన హెచ్ఎంలు అమ్మఒడి విరాలను ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఈ పథకం అందేలా చూస్తాం. సాక్షి : సర్వే ప్రక్రియను ఎలా నిర్వహిస్తున్నారు? కలెక్టర్ : వైఎస్సార్ నవశకంలో భాగంగా నవంబరు 20 నుంచి 30వ తేదీ వరకు గ్రామ, వార్డు వలంటీర్లు ఇంటింటి సర్వే చేసి లబ్ధిదారుల వివరాలను ఆన్లైన్లో నమోదు చేస్తారు. డిసెంబర్ 9వ తేదీ నాటికి అర్హుల జాబితాను ప్రచురిస్తాం. జాబితాపై అభ్యంతరాలు, ఫిర్యాదులు, సూచనలను డిసెంబర్ 10 నుంచి 12వ తేదీ వరకు స్వీకరిస్తాం. డిసెంబర్ 13 నుంచి 16వ తేదీ వరకు గ్రామ సభలు నిర్వహించి పారదర్శకంగా పార్టీలకతీతంగా వంద శాతం సంతృప్తి స్థాయిలో లబ్ధిదారుల ఎంపిక చేపడతాం. ఎంపికైన వారి జాబితాను శాశ్వత ప్రాతిపదికన గ్రామాల్లో ప్రదర్శిస్తాం. అర్హులైన వారందరికీ జనవరి 1వ తేదీ నాటికి కొత్త కార్డులను జారీ చేస్తాం. సాక్షి : సర్వే ఏర్పాట్లు ఎలా చేశారు? కలెక్టర్ : జిల్లాలో పకడ్బందీగా సర్వే నిర్వహించేందుకు వీలుగా ఆయా శాఖల అధికారులు, జాయింట్ కలెక్టర్, తహసీల్దార్లు, ఎంపీడీవోలతో సమావేశం ఏర్పాటు చేసి దిశానిర్దేశం చేశాం. వైఎస్సార్ నవశకం కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించి అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం. సాక్షి :గ్రామ, వార్డు సచివాలయాలు అందుబాటులోకి వచ్చాయా? కలెక్టర్ : ఇప్పటికే గ్రామ, వార్డు సచివాలయాలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు అన్ని ఏర్పాట్లు చేశాం. కొన్ని ప్రాంతాల్లో ప్రారంభం కాగా, మరికొన్ని ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఖాళీగా ఉన్న గ్రామ, వార్డు వలంటీర్ల పోస్టులను సైతం భర్తీ చేసి పంచాయతీ వ్యవస్థను పటిష్టం చేస్తాం. గ్రామ, వార్డు సచివాలయాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆశయాలకనుగుణంగా లబ్ధిదారుడు దరఖాస్తు చేసుకున్న 72 గంటల్లోనే సమస్యను పరిష్కరించేందుకు కృతనిశ్చయంతో ఉన్నాం. -
‘స్పందన’కు వినతుల వెల్లువ
సాక్షి, శ్రీకాకుళం : కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమానికి వినతులు వెల్లువెత్తాయి. జిల్లా కలెక్టర్ జె.నివాస్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఆయనతో పాటు జాయింట్ కలెక్టర్ డాక్టర్ కె.శ్రీనివాసులు, ఇతర అధికారులు జిల్లా రెవెన్యూ అధికారి బలివాడ దయానిధి, డ్వామా పీడీ హెచ్.కూర్మారావు, హౌసింగ్ పీడీ వేణుగోపాల్ తదితరులు ఉన్నా రు. దసరా పండగ ముందురోజు కావడంతో ఈ వారం తక్కువగా వినతులు వచ్చాయి. ఎక్కువగా సామాజిక సమస్యలపై అందినట్టు తెలిసింది. ‘స్పందన’లో అందిన కొన్ని వినతులివీ.. ⇔ తిత్లీ తుపానులో కొబ్బరి, జీడిమామిడి తదితర వాణిజ్య పంటలు నష్టపోయిన తమకు నేటికీ పరిహారం అందజేయలేదని, సాయం అందించాలని వజ్రపుకొత్తూరు మండల రైతులు టి.శ్రీనివాసరావు తదితరులు కోరారు. ⇔ హైవే విస్తరణలో భాగంగా రణస్థలం మండలం రావివలస, రణస్థలం, గరికపాలెం గ్రామా ల పరిధిలో సుమారు 63 ఎకరాల భూములు తీసుకున్నారని, సుమారు 200 మంది రైతులకు నేటి వరకు పరిహారం మంజూరు కాలేదని, పరిహారం అందించి ఆదుకోవాలని కోరుతూ రైతులు లంక ప్రభాకరరావు, కె.మల్లేశ్వరరావు, పి.వెంకటరమణ, లక్ష్మణరావు, ఆర్.రాము, మహాలక్ష్మి వినతి ఇచ్చారు. ⇔ ప్రభుత్వం మంజూరు చేసిన కొత్త జీవో ప్రకారం ఏపీఎస్ఆర్టీసీలో పనిచేస్తున్న కార్మికులకు 58 నుంచి 60ఏళ్లకు పెంచిన రిటైర్మెంట్ వయోపరిమితి పద్ధతిని ఈ ఏడాది మే నెలలో పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు వర్తింపచేయాలని కోరుతూ జి.గణపతిరావు, ఎల్.వి.సుబ్రహ్మణ్యం తదితరులు వినతి ఇచ్చారు. ⇔ తన భూమికి పట్టాదారు పాస్ బుక్ మంజూరు కోసం దరఖాస్తు చేసుకొన్నానని, అయితే ఆ భూమిపై ఎటుంటి వివాదం, న్యాయపరమైన వాజ్యాలు లేకపోయినా కేసులు ఉన్నట్టు తప్పుడు ఎండార్సుమెంటు ఇచ్చారని రేగిడి మండలం అప్పాపురం గ్రామానికి చెందిన ఎన్.అన్నపూర్ణమ్మ తరుపున ఆమె కుమారుడు స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు. ఈ–పాస్ బుక్ కోసం 2018, జూన్ 6, ఇటీవల 2019 జూలై 22న ఫిర్యాదు చేసినా, న్యాయం జరగలేదని, ఫిర్యాదు చేశారు. ⇔ రాజాం నగర పంచాయతీలోని బొబ్బిలిరోడ్డులో గల శాంతినగర్లో ఏర్పాటుచేయనున్న మద్యం దుకాణాన్ని నిలిపివేయాలని స్థానికురాలు బి.జయలక్ష్మి, సరోజా తదితరులు వినతి ఇచ్చారు. శ్రీకాకుళం మండలం సిలగాం సింగులవలస గ్రామం మధ్యలో కాకుండా శివారులో మద్యం దుకాణం ఏర్పాటుచేయాలని కోరుతూ స్థానికులు సాయమ్మ, రాజేశ్వరి, తదితరులు వినతులిచ్చారు. ఆయా ప్రాంతాల్లోని బడి, గుడి, ఆస్పత్రి, నివాసగృహాలున్న ప్రాంతంలో మద్యం దుకాణం ఏర్పాటుతో ఇబ్బందులు తప్పవని, గ్రామానికి దూరంగా ఏర్పాటుచేయాలని వారు కోరారు. ⇔ ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన మద్యం షాపుల్లో సేల్స్మెన్ పోస్టుకు ఎంపికయ్యాయని, అపాయింట్ ఆర్డర్ అందుకున్నానని, అయితే తనకు వైకల్యం ఉన్నందున విధుల్లో చేర్చుకోనని పలాస ఎక్సైజ్ సీఐ తిప్పి పంపారని, న్యాయం చేసి ఆదుకోవాలని డి.బాలకృష్ణ ఫిర్యాదు చేశారు. ⇔ రిజిస్ట్రర్ వివాహం చేసుకున్న తన భార్య సరితను వారి తల్లిదండ్రులు తీసుకెళ్లారని, నేటి వరకు ఆచూకీ లేదని ఆమదాలవలసకు చెందిన నూక విశ్వేశ్వరరావు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన కలెక్టర్ నివాస్ జిల్లా ఎస్పీకి ఫోన్ చేసి, చర్యలు తీసుకోవాలని తెలిపారు. -
తమాషా చేస్తున్నారా? : కలెక్టర్ ఫైర్
సాక్షి, నారాయణపేట: పొద్దస్తమానం కష్టపడి రైతులు పంటలు పండిస్తే వారికి మద్దతు ధర కల్పించాలని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో దళారులతో పంటను ఎలా కొనుగోలు చేస్తారు..? ఇది ఎంతవరకు సమంజసం అని కలెక్టర్ ఫైర్ అయ్యారు. సోమవారం “పెసర పంచాయితీ’పై స్థానిక కలెక్టరేట్లో మార్క్ఫెడ్ అధికారులు, వ్యవసాయశాఖ అధికారులు, ఉట్కూర్ పీఏసీఎస్ నిర్వాహకులపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. అధికార వర్గాల ద్వారా తెలిసిన సమాచారం ప్రకారం.. మార్క్ఫెడ్ అధికారులపై కలెక్టర్ బాగానే సీరియస్ అయినట్లు తెలిసింది. అసలు కొనుగోలు కేంద్రంలోకి మార్కెట్ పాలకవర్గం వారికి పనేంటీ..? వారు ఎందుకు వచ్చారో చెప్పాలని సూటిగా అడిగినట్లు సమాచారం. మార్కెట్ పాలకవర్గంలోని ఒకరిద్దరు ప్రతినిధులు హడావుడి చేస్తూ టోకెన్లు ఇప్పించి పెసరను కొనుగోలు చేయించడంలో అంతర్యమేమిటో చెప్పాలని గట్టిగా నిలదీసినట్లు తెలిసింది. తేమ శాతం చూడకుండానే విక్రయాలా? కొనుగోలు కేంద్రాన్ని విక్రయించేందుకు వచ్చే రైతులు తెచ్చిన పెసరను ముందుగా తేమశాతం పరిశీలించకుండా ఎలా కొన్నారని.. లోడింగ్ చేసి వాపస్ వచ్చిన లారీల పరిస్థితి ఏంటీ అని మార్క్ఫెడ్ అధికారులపై కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. వెంటనే లారీల్లోని సరుకును సరిచూసి ఆరబెట్టి వాటిని తిరిగి పంపించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీచేసినట్లు సమాచారం. మంగళవారం సాయంత్రం వరకు ఇప్పటి వరకు తీసుకువచ్చిన పెసరను కొనుగోలు చేయాలని, అందులో ఏవరైనా దళారులు తెచ్చినట్లు తెలితే వారిపై క్రిమినల్కేసులు పెట్టేలా చర్యలు తీసుకోవాలని ఆదేశిసించినట్లు తెలుస్తోంది. నివేదికలు వచ్చాక చర్యలు ఈ విషయంపై క్షేత్రస్థాయిలో విచారణ జరుగుతోందని, పూర్తిస్థాయిలో నివేదికలు వచ్చిన తర్వాత ఎక్కడ ఏం జరిగిందో తెలుసుకుని చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించినట్లు తెలిసింది. ఇకపై మార్కెట్ పాలకవర్గం వారు ఎవరైనా కొనుగోలు కేంద్రంలో కాలు పెడితే బాగుండదని, కేవలం ఊట్కూర్ పీఏసీఎస్ వారితో మాత్రమే కొనుగోలు చేయించుకోండని హెచ్చరించినట్లు సమాచారం. సమీక్ష సమావేశంలో జిల్లా వ్యవసాయశాఖ అధికారి జాన్సుధాకర్, మార్క్ఫెడ్ డీఎం హన్మంత్రెడ్డి, వ్యవసాయశాఖ అధికారులు ఉన్నారు. -
మారని రిమ్స్ ఆస్పత్రి
సాక్షి, ఆదిలాబాద్: ఎన్ని విమర్శలు ఎదుర్కొంటున్నా రిమ్స్లో కొంతమంది వైద్యుల తీరు మారడం లేదు. నవిపోదురూ.. నాకేంటి అన్న చందంగా వ్యవహరిస్తున్నారు. గిరిజన మరణాలు తగ్గించాలనే ఉద్దేశంతో దివంగత ముఖ్యమంత్రి 2008లో రూ.125 కోట్లతో రాజీవ్ గాంధీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (రిమ్స్)ను ఏర్పాటు చేశారు. 500 పడకలతో ఈ ఆస్పత్రిని నిర్మించారు. కార్పొరేట్ వైద్యం అందుతుందని భావించిన ప్రజలకు నాణ్యమైన వైద్యసేవలు అందడం లేదు. జ్వరం, చిన్నపాటి రోగాలు తప్పా గుండెనొప్పి, క్యాన్సర్ తదితర వ్యాధుల చికిత్స కోసం నాగ్పూర్, యావత్మాల్, హైదరాబాద్, తదితర ప్రాంతాలకు రెఫర్ చేస్తున్నారు. గుండెనొప్పితో రిమ్స్లో చేరిన కన్జర్వేటర్ ఫారెస్టుకు సరైన వైద్యం అందక ఆస్పత్రిలోనే మృతిచెందిన సంఘటనలు అనేకం. జూనియర్ డాక్టర్లతోనే నెట్టుకొస్తున్నారు. పేదలకు మెరుగైన వైద్యసేవలు అందకపోవడంతో వారు ప్రైవేట్ వైపు మొగ్గు చూపుతూ ఆర్థికంగా ఇబ్బందులకు గురవుతున్నారు. మధ్యాహ్నమే ఇంటిముఖం.. రిమ్స్లో పనిచేసే వైద్యులు సమయపాలన పాటించడం లేదు. ఉదయం 9 నుంచి సాయంత్రం 4గంటల వరకు విధులు నిర్వహించాలి. కానీ కొంతమంది వైద్యులు ఆలస్యంగా రావడమే కాకుండా మధ్యాహ్నమే ఇంటిబాట పడుతున్నారు. ఈ విషయం రిమ్స్ అధికారులకు, జిల్లా అధికారులకు తెలిసినా చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. మధ్యాహ్నం నుంచి ప్రైవేట్ క్లినిక్లు నిర్వహిస్తూ డబ్బులు దండుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. రిమ్స్లో సీసీ కెమెరాలు, బయోమెట్రిక్ ఉన్నప్పటికీ ఏమాత్రం ప్రయోజనం లేదు. కొంతమంది వైద్యులు విధులకు హాజరుకానప్పటికీ వేతనాలు పొందుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. జూనియర్లతోనే వైద్యం.. రిమ్స్ ఆస్పత్రి జూనియర్ వైద్యులతోనే కొనసాగుతుందంటే అతిశయోక్తి కాదు. ఎమర్జెన్సీతో పాటు అన్ని వార్డుల్లో ఉదయం నుంచి రాత్రి వరకు జూనియర్ డాక్టర్లే విధులు నిర్వహిస్తున్నారు. శిక్షణలో ఉన్న వీరు రోగులకు పూర్తిస్థాయిలో వైద్యసేవలు అందించలేకపోతున్నారనే విమర్శలు ఉన్నాయి. అత్యవసర పరిస్థితుల్లో ఉంటే రోగి పరిస్థితిని సీనియర్ వైద్యుడికి ఫోన్ ద్వారా విన్నవించి ఎలాంటి వైద్యం అందించాలి అనే వివరాలను తెలుసుకుంటున్నారు. రాత్రి వేళల్లో కనీసం ఒకరిద్దరు సీనియర్ వైద్యులు కూడా ఉండటం లేదు. రాత్రి డ్యూటీలో ఉండాల్సిన వైద్యులు ఇంటి వద్ద ఉండడంతో అత్యవసర సమయంలో వైద్యుడి ఇంటికి వాహనాన్ని పంపించి వారిని రిమ్స్కు తీసుకొస్తున్నారు. ఖాళీల జాతర.. గత కొన్నేళ్లుగా రిమ్స్ ఆస్పత్రితో పాటు వైద్య కళాశాలలో పోస్టుల ఖాళీలు వెక్కిరిస్తున్నాయి. దీంతో రోగులకు నాణ్యమైన వైద్యసేవలు అందకపోగా మెడికోలకు సైతం సరైన రీతిలో విద్యాబోధన జరగడం లేదనే ఆరోపణలున్నాయి. రిమ్స్కు మొత్తం 151 పోస్టులు మంజూరు ప్రస్తుతం 95 మంది వైద్యులు మాత్రమే పనిచేస్తున్నారు. 56 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రొఫెసర్ పోస్టులు 21కి ఏడుగురు పనిచేస్తుండగా, 14 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అసోసియేట్ ప్రొఫెసర్ 30 పోస్టులకు 15 మంది పనిచేస్తుండగా, మరో 15 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అసిస్టెంట్ ప్రొఫెసర్ 41 పోస్టులకు గాను 34 పనిచేస్తున్నారు. 7 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అదేవిధంగా ట్యూటర్ పోస్టులు 59కి 39 మంది విధులు నిర్వహిస్తున్నారు. మరో 20 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆస్పత్రి అంతా కంపు కంపు రిమ్స్ ఆస్పత్రి ఆవరణతో పాటు వార్డులన్నీ కంపు కొడుతున్నాయి. మరుగుదొడ్లు సరిగా లేవు. చెత్తాచెదారం శుభ్రం చేయకపోవడంతో దుర్గంధం వెదజల్లుతోంది. రిమ్స్ ఆస్పత్రికి వెళ్లిన వారు ముక్కున వేలుసుకొని, మూతికి గుడ్డ పెట్టుకొని వెళ్లాల్సిన పరిస్థితి. ఆస్పత్రిలో రోగులను చూడటానికి వచ్చిన వారి బంధువులు రోగాల భారీన పడాల్సి వస్తుందని చర్చించుకుంటున్నారు. పారిశుధ్యం కోసం నెలకు లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నా ఫలితం మాత్రం కానరావడం లేదు. ఈ విషయమై రిమ్స్ డైరెక్టర్ కరుణాకర్, రిమ్స్ సూపరింటెండెంట్ను ఫోన్ ద్వారా సంప్రదించగా వారు స్పందించ లేదు. సెప్టెంబర్ 14న జెడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్ధన్ రిమ్స్ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆ సమయంలో ఒకరిద్దరు వైద్యులు తప్పా ఎవరూ అందుబాటులో లేరు. వైద్యులు విధులను విస్మరించి ప్రైవేట్ క్లీనిక్లు నిర్వహిస్తున్నారని తమ దృష్టికి వచ్చినట్లు చెప్పారు. ఈ విషయం జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. రిమ్స్ ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సమావేశం ఎందుకు నిర్వహించడం లేదని సూపరింటెండెంట్ను ప్రశ్నించారు. జిల్లా కలెక్టర్ దివ్యదేవరాజన్ పలుసార్లు రిమ్స్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. వైద్యులతో సమావేశం నిర్వహించారు. రోగులకు నాణ్యమైన సేవలు అం దించాలని, సమయపాలన పాటించాలని సూచిం చారు. విధులు బాధ్యతాయుతంగా నిర్వర్తించాలని పలు మార్లు ఆదేశించినప్పటికీ రిమ్స్ వైద్యుల తీరులో మా త్రం మార్పు కానరావడం లేదు. జిల్లా ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు తనిఖీలు చేపడుతున్నప్పటికీ కూడా వారిలో చలనం లేకుండా పో యిందని పలు వురు పేర్కొంటున్నారు. ఇదీ రిమ్స్ వైద్యుల తీరు.. -
బతుకమ్మ ఉత్సవాలు
సాక్షి, ఇందూరు(నిజామాబాద్ అర్బన్) : జిల్లాలో బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ రామ్మోహన్ రావు అధికారులను ఆదేశించారు. శుక్రవారం ప్రగతిభవన్లో బతుకమ్మ ఉత్సవాల నిర్వహణపై సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ బతుకమ్మ ఉత్సవాలు ఈ నెల 28 నుంచి అక్టోబర్ 6 వరకు కొనసాగుతాయని, జిల్లా వ్యాప్తంగా అన్ని శాఖల అధికారులు, ప్రభుత్వ సంస్థలు, మహిళా సంఘాలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. అక్టోబర్ 2న అన్ని గ్రామ పంచాయతీల్లో, 4న మున్సిపాల్టీల్లో, 6న జిల్లా కేంద్రంలో పెద్ద ఎత్తున సద్దుల బతుకమ్మ నిర్వహించాలని ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని ప్రధాన కూడళ్లలో మోడల్ బతుకమ్మలను ప్రదర్శించాలని సూచించారు. బతుకమ్మల నిమజ్జనానికి చెరువులు, కుంటల వద్ద ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ ఏడాది బతుకమ్మ పాట ల పోటీలు, ఫొటోగ్రఫీ పోటీలు నిర్వహించాలన్నారు. సమావేశంలో డీఆర్వో అంజయ్య, ఆర్డీఓలు వెంకటేశ్వర్లు, గోపిరాం, శ్రీనివాసులు, జిల్లా సమాచారశాఖ డీడీ ముర్తూజా, రమేశ్ రాథోడ్, సుదర్శనం, గోవింద్, జయసుధ, స్రవంతి, శశికళ, సంధ్యారాణి, బాబురావు తదితరులు పాల్గొన్నారు. -
ప్రతి పంచాయతీకీ నెలకు రూ.2లక్షలు
పల్లెల అభివృద్ధి, పరిశుభ్రత కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతి గ్రామ పంచాయతీకి నెలకు రూ.2లక్షల నిధులు మంజూరు చేస్తుందని కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మం తు తెలిపారు. గురువారం ఆయన దహెగాం మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించి 30 రోజుల ప్రణాళిక అమలు తీరును పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. సాక్షి, సిర్పూర్: పల్లెల్లో అభివృద్ధి, పరిసరాల పరిశుభ్రత కోసం ప్రతి గ్రామ పంచాయతీకి ప్రభుత్వం నెలకు రూ.2 లక్షలు మంజూరు చేస్తుంనది కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు పే ర్కొన్నారు. దహెగాం మండలంలోని ఇట్యాల, కోత్మీర్, బీబ్రా గ్రామాల్లో గురువారం ఆయన 30 రోజుల కార్యచరణ ప్రణాళిక అమలును పరి శీలించారు. ముందుగా ఇట్యాల ప్రధాన రహదారిపై మొక్కలు నాటారు. గ్రామంలో పలు కాలనీల్లో పర్యటించారు. డ్రెయినేజీలు శుభ్రం చేయించాలని అధికారులను ఆదేశించారు. మురుగు నీరు నిల్వ ఉంటే దోమలు వృద్ధి చెంది జ్వరాలు వచ్చే అవకాశముందన్నారు. అనంతరం నిర్వహించిన గ్రామసభలో మాట్లాడుతూ 30 రోజుల ప్రణాళికలో అధికారులతో పాటు గ్రామస్తులు భాగస్వాములు కావాలని సూచిం చారు. ప్రతి ఇంటికీ ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలన్నారు. శ్మశానవాటిక, డంపింగ్యార్డుల కోసం స్థలాలను గుర్తించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం మండలంలోని కోత్మీర్, బీబ్రా గ్రామాల్లో పర్యటించారు. కోత్మీ ర్లో మొక్కలను నాటారు. బీబ్రాలో శ్మశాన వాటిక స్థలాన్ని పరిశీలించారు. పల్లెలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని గ్రామస్తులకు సూచిం చారు. ఈ కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ హేమంత్కుమార్, ఎంపీపీ కంబగౌని సులోచన, తహసీల్దార్ సదా నందం, ఎంపీడీవో సత్యనారాయణ, సర్పంచులు మురారీ, తరనుం సుల్తానా, క్రిష్ణమూర్తి, ఇట్యాల, బీబ్రా ఎంపీటీసీలు భాగ్యలక్ష్మి, శంకర్, పశువైద్యాధికారి పావని, ఈజీఎస్ ఏపీవో చంద్రయ్య, ఈవోపీఆర్డీ రాజేశ్వర్గౌడ్, రైతు సమన్వయ సమితి మండల కోఆర్డినేటర్ సంతో ష్గౌడ్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ప్రసాద్రాజు, నాయకులు సురేష్, సోను తదితరులు పాల్గొన్నారు. -
ముత్తంగిలో కలెక్టర్ ఆకస్మిక పర్యటన
సాక్షి, సంగారెడ్డి జిల్లాః కలెక్టర్ హనుమంతరావు మంగళవారం ముత్తంగి గ్రామంలో ఆకస్మిక పర్యటన చేపట్టారు. గ్రామంలో అభివృద్ధి పనులపై ఆరా తీశారు. గ్రామ సర్పంచ్, వార్డు సభ్యులతో సమావేశం నిర్వహించి పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు.12న పల్లె నిద్ర, 13న మెగా శ్రమదానం నిర్వహించాలని సూచించారు. మెగా శ్రమదానం కార్యక్రమంలో గ్రామస్తులు ప్రతీఒక్కరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. గ్రామంలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులపై సమీక్ష సమావేశం నిర్వహించిన కలెక్టర్.. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న పంచాయతీ ప్రత్యేకాధికారి శైలజ (హార్టికల్చర్ ఆఫీసర్) కు షోకాస్ నోటీస్ జారీ చేశారు. -
జిల్లాను ప్రథమ స్థానంలో ఉంచాలి
సాక్షి, సిద్దిపేట: ముఖ్యమంత్రి కేసీఆర్ సూచనల మేరకు జిల్లాలోని 499 గ్రామాల్లో 30 రోజుల ప్రణాళికను సమగ్రంగా అమలుచేసి జిల్లాను ప్రథమ స్థానంలో ఉంచాలని కలెక్టర్ వెంకట్రామిరెడ్డి జిల్లా అధికార యంత్రాంగానికి సూచించారు. బుధవారం సిద్దిపేటలోని రెడ్డి సంక్షేమ భవన్లో 30 రోజుల ప్రణాళికపై జిల్లా స్థాయి అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సెప్టెంబర్ 6 నుంచి అక్టోబర్ 5వ తేదీ వరకు 30 రోజుల ప్రణాళిక అమలవుతుందన్నారు. రాష్ట్ర స్థాయిలో జరుగుతున్న ఈ ప్రణాళికను ఐఏఎస్ అధికారులు, ఉన్నతాధికారులతో కూడిన 121 బృందాలు పర్యవేక్షిస్తాయని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ఆర్థిక శాఖలు గ్రామాల అభివృద్ధికి ప్రతీ నెల రూ.339 కోట్లు అందిస్తుందన్నారు. ఈజీఎస్లో భాగంగా జిల్లాలో 27 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. గ్రామ పంచాయతీకో ట్రాక్టర్ సర్పంచ్ పాలకవర్గం సమన్వయంతో మరిన్ని రోజుల్లో ప్రతీ గ్రామ పంచాయతీకి ఒక ట్రాక్టర్ అందిస్తామని కలెక్టర్ పేర్కొన్నారు. గతంలో చెట్లకు నీళ్లు పోయడం వల్ల ట్యాంకర్ యజమాని అకౌంటులో డబ్బులు జమ అయ్యేవని, ఇక నుంచి గ్రామ పంచాయతీ అకౌంటులో జమ అవుతాయన్నారు. గ్రామంలో çప్రతి రెండు నెలలకు ఒకసారి గ్రామసభ నిర్వహించాలన్నారు. పారిశుధ్య నిర్వహణ సరిగా ఉండేలా చూడాలన్నారు. 30 రోజుల ప్రణాళికలో ప్రతీ అధికారి ఉదయం 6 గంటలకు గ్రామాలకు చేరకొని పనులు చేపట్టాలన్నారు. పనులకు గ్రేడింగ్ అన్ని జిల్లాలకు గ్రేడింగ్ ఇస్తారని, జిల్లా స్థాయిలో మండలాలకు, మండల స్థాయిలో గ్రామాలకు గ్రేడింగ్ ఇస్తారని తెలిపారు. కలెక్టర్ అనుమతి లేకుండా ఎలాంటి సెలవులు మంజూరు చేయడం ఉండదని స్పష్టం చేశారు. గ్రామాలో పనిచేసే పంచాయతీ కార్మికులకు రూ.8,500 వేతనం పెంచినట్లు పేర్కొన్నారు. పంచాయతిలో ఒక్కొక్కరికి రూ.1,600 చొప్పున సుమారు రెండు వేల మంది ఉంటే రూ.32 లక్షలను గ్రామ పంచాయతీకి ఇవ్వడం జరుగుతుందన్నారు. అనంతరం ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ తలపెట్టిన 30 రోజుల ప్రణాళికలో తను పాల్గొంటానని తెలిపారు. సమస్యలను పూర్తి స్థాయిలో పరిష్కరించేలా అధికారులు, ప్రజాప్రతినిదులు చొరవ చూపాలన్నారు. అనంతరం జెడ్పీ చైర్ పర్సన్ రోజాశర్మ మాట్లాడుతూ అధికారుల సమన్వయంతో 30 రోజుల ప్రణాళికలో జిల్లాను ప్రథమ స్థానంలో ఉంచాలన్నారు. కార్యక్రమంలో దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి, అధికారులు, పాల్గొన్నారు. -
పల్లెలు మెరవాలి
సాక్షి, రంగారెడ్డి : 30రోజుల ప్రణాళికలో భాగంగా శుక్రవారం నుంచి ప్రారంభమయ్యే పంచాయతీల ప్రత్యేక కార్యాచరణకు ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా పనిచేయాలని అధికారులకు ఇన్చార్జి కలెక్టర్ డాక్టర్ హరీష్ సూచించారు. పల్లెలను పరిశుభ్రంగా, పచ్చదనంగా తీర్చిదిద్దడమే అందరి లక్ష్యం కావాలన్నారు. బుధవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో 30 రోజుల ప్రణాళిక కార్యాచరణపై జిల్లాస్థాయి అధికారులు, ఆర్డీఓలు, ఎంపీడీఓలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హరీష్ మాట్లాడుతూ.. ప్రతి మండలానికి నియమించిన ప్రత్యేక నోడల్ అధికారి.. చేయాల్సిన పనుల జాబితాను రూపొందించుకోవాలన్నారు. పూర్తిచేసిన పనుల వివరాలను ఎప్పటికప్పుడు డీపీఓకు తెలియజేయాలన్నారు. ప్రతిఇంటి ఆవరణలో నాటుకునేందుకు వీలైన మొక్కలను అందజేయాలన్నారు. వార్షిక, పంచవర్ష ప్రణాళికలను రూపొందించి గ్రామసభల ఆమోదం తీసుకోవాలని సూచించారు. ఈ ప్రణాళికను అనుగుణంగానే బడ్జెట్ రూపొందించాలని చెప్పిన ఆయన.. అప్పులు, జీతాలు, కరెంటు బిల్లుల చెల్లింపు ఖర్చులను వ్యయం పద్దులో చూపెట్టాలన్నారు. ప్రతి ఇంటికి, ఆస్తికి కచ్చితమైన విలువ కట్టి క్రమం తప్పకుండా ఆస్తుల విలువ మదింపు చేయాలన్నారు. దీనికి అనుగుణంగా పన్నులు వసూలు చేయాలన్నారు. ప్రత్యేక నోడల్ అధికారుల నియామకం.. పంచాయతీల్లో 30 రోజుల ప్రణాళిక రూపొందించి అమలు చేసేందుకు జిల్లా స్థాయి అధికారులను ప్రత్యేక నోడల్ అధికారులుగా నియమించారు. 21 గ్రామీణ మండలాలకు ఒకరి చొప్పున నియమిస్తూ ఇన్చార్జి కలెక్టర్ ఉత్తర్వులు జారీచేశారు. గురువారం ఎంపీడీఓల సమక్షంలో ప్రత్యేక నోడల్ అధికారులు.. అన్ని పంచాయతీలకు మండల స్థాయి అధికారులను ప్రత్యేక అధికారులుగా నియమించనున్నారు. ఆమనగల్లు – జి.ప్రశాంతి (జిల్లా ఉపాధి అధికారిణి), అబ్దుల్లాపూర్మెట్ – డాక్టర్ సునందారాణి (జిల్లా ఉదాన్యశాఖ అధికారిణి), చేవెళ్ల – డాక్టర్ కేవీఎల్ నర్సింహారావు (జిల్లా పశుసంవర్థకశాఖ అధకారి), ఫరూఖ్నగర్– ఓం ప్రకాశ్ (జిల్లా ప్రణాళికాధికారి), చౌదరిగూడం – ఎ.వెంకటరమణ (వయోజన విద్యాశాఖ డీడీ), కడ్తాల్ – రత్నకల్యాణి (జిల్లా మైనారిటీ అభివృద్ధిశాఖ అధికారిణి), కందుకూరు – సత్యనారాయణరెడ్డి (జిల్లా విద్యాశాఖాధికారి), కేశంపేట –చంద్రారెడ్డి (జిల్లా భూగర్భజలశాఖ అధికారి), కొందుర్గు – జానకిరెడ్డి (జెడ్పీ అకౌంట్స్ ఆఫీసర్), మాడ్గుల – ప్రవీణ్రెడ్డి (గనులశాఖ అధికారి), మహేశ్వరం – రాజేశ్వర్రెడ్డి (జిల్లా పరిశ్రమల కేంద్రం జీఎం), మంచాల – దివ్యజ్యోతి (ఆత్మ పీడీ), మొయినాబాద్ – గీతారెడ్డి (జిల్లా వ్యవసాయశాఖ అధికారిణి), శంకర్పల్లి –ప్రశాంత్కుమార్ (డీఆర్డీఓ), శంషాబాద్ – బోజరాజు (మెప్మా పీడీ), తలకొండపల్లి – వెంకట్రాంరెడ్డి (డీఆర్డీఏ అదనపు పీడీ), ఇబ్రహీంపట్నం – సుకీర్తి (మత్స్యశాఖ అధికారిణి), షాబాద్ – అంజయ్య (జిల్లా సహకారశాఖ అధికారి), కొత్తూరు–ఛాయాదేవి (మార్కెటింగ్ శాఖ ఏడీ), నందిగామ–ఎన్.మోతీ (జిల్లా సంక్షేమాధికారిణి), యాచారం – జ్యోతి (మార్క్ఫెడ్ డీఎం)లను ప్రత్యేక నోడల్ అధికారులుగా నియమితులయ్యారు. మార్గదర్శకాలు జారీ.. పంచాయతీల్లో 30 రోజుల ప్రణాళిక అమలులో కీలకమైన కోఆప్షన్, పంచాయతీ స్థాయీ సంఘాల కమిటీలను నియమించేందుకు ఇన్చార్జి కలెక్టర్ మార్గదర్శకాలు జారీచేశారు. ఒక్కో జీపీకి ముగ్గురు చొప్పున కోఆప్షన్ సభ్యులు, నాలుగు చొప్పున స్టాండింగ్ కమిటీలను నియమించాలని సూచించారు. వీటి నియామకంలో పాటించాల్సిన నిబంధనలను పేర్కొంటూ ఎంపీడీఓలకు సర్క్యులర్ జారీచేశారు. -
‘ప్రక్షాళన’ ఏది?
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూ–రికార్డుల ప్రక్షాళనలో భారీగా అవకతవకలు చోటుచేసుకుంటుంటే ఎందుకు ప్రేక్షక పాత్ర వహించారని ముఖ్యమంత్రి కేసీఆర్.. జిల్లాల కలెక్టర్లపై మండిపడ్డారు. క్షేత్ర స్థాయిలో వీఆర్ఓలు, తహసీల్దార్లు అక్రమాలకు పాల్పడుతుంటే మీరెందుకు చర్యలు తీసుకోలేకపోయారని కలెక్టర్లను సూటిగా ప్రశ్నించారు. పరిపాలన సౌలభ్యం కోసం ఏర్పాటు చేసిన చిన్న జిల్లాలపైనా కలెక్టర్లు పట్టు సాధించలేకపోతే ఎలాగంటూ కేసీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. భూ ప్రక్షాళనపై కుప్పలు తెప్పలుగా ఫిర్యాదులొస్తున్నా.. మీరేం చేస్తున్నారంటూ కలెక్టర్లకు క్లాస్ పీకారు. మంగళవారం ప్రగతి భవన్లో జిల్లా కలెక్టర్లతో సుదీర్ఘంగా సమావేశమైన సీఎం.. కొత్త రెవెన్యూ చట్టం తయారీపై సలహాలను స్వీకరించడంతో పాటు కొత్త పంచాయతీరాజ్, మునిసిపల్ చట్టాల అమలుపై సమీక్ష నిర్వహించారు. ఉదయం 11.45 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు దాదాపు 8 గంటలకు పైగా జరిగిన ఈ సమావేశంలో కేసీఆర్ పలుమార్లు కలెక్టర్ల పనితీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. క్షేత్రస్థాయి అధికారుల పనితీరుపై కలెక్టర్ల పర్యవేక్షణ లోపించిందని, పంచాయతీరాజ్ చట్టం తీసుకొచ్చి 50 రోజులైనా అమలు చేయడంలో ఎలాంటి ప్రగతీ లేదని సీఎం ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఈ సమావేశానికి సంబంధించి సీఎంవో ఎలాంటి ప్రకటనా జారీ చేయలేదు. వీఆర్ఓ, తహసీల్దార్ల అధికారాలకు చెక్ గ్రామ రెవెన్యూ అధికారులు (వీఆర్వో), తహసీల్దార్ల అధికారాలకు కత్తెర పడడం ఖాయంగా కనబడుతోంది. పట్టాదారు పాస్ పుస్తకాలు, మ్యుటేషన్లు, విరాసత్ వంటి అవసరాల కోసం వచ్చే రైతులు, సామాన్య ప్రజలను.. క్షేత్ర స్థాయిలో వీఆర్ఓలు, తహసీల్దార్లు లంచాల కోసం తీవ్ర వేధింపులకు గురిచేయడం నిత్యకృత్యంగామారిన నేపథ్యంలో ప్రభుత్వం తీవ్ర నిర్ణయానికి సిద్ధమైనట్లు తెలిసింది. కొత్త రెవెన్యూ చట్టం లక్ష్యాలు, ప్రాధాన్యతపై సీఎం కేసీఆర్.. కలెక్టర్లసమావేశంలో వివరిస్తున్న సందర్భంగా ఈ అంశాలు ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం. గ్రామ రెవెన్యూ రికార్డుల సంరక్షకులుగా ఉండాల్సిన వీఆర్వోలే వాటిని తారుమారు చేసి ఒకరి భూములను మరొకరికి కట్టబెట్టుతున్న వైనంపై ఆయనఆగ్రహం వ్యక్తం చేశారు. భూ–రికార్డుల పరిరక్షణతో పాటు భూములకు సంబంధించిన అన్ని రకాల బాధ్యతల నుంచి వీఆర్ఓలను తప్పించాలనే నిర్ణయానికి సీఎం వచ్చినట్లు సమాచారం. కొత్త రెవెన్యూ చట్టం వచ్చాక వీఆర్ఓలు భూమియేతర వ్యవహారాలకే పరిమితం కానున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలకు లబ్ధిదారుల ఎంపిక, కుల, ఆదాయ తదితర ధ్రువీకరణ పత్రాల జారీకి విచారణ జరిపే బాధ్యతలను మాత్రమే వీఆర్వోలకు కట్టబెట్టాలని సర్కారు యోచిస్తోంది. తహశీల్దార్ల అధికారాలకు సైతం ప్రభుత్వం కోత పెట్టి జాయింట్ కలెక్టర్లకు కీలక అధికారాలను అప్పగించాలని భావిస్తున్నట్లు తెలిసింది. మంగళవారం ప్రగతిభవన్లోముఖ్యమంత్రి కేసీఆర్తో జరిగిన సమావేశానికి హాజరైన కలెక్టర్లు, అధికారులు సెప్టెంబర్ 10న మళ్లీ పిలుస్తా కొత్త పంచాయతీరాజ్, మునిసిపల్ చట్టాలు, హరితహారం కార్యక్రమం అమలు పురోగతిని సమీక్షించేందుకు సెప్టెంబర్ 10న జిల్లా కలెక్టర్లతో మరోసారి సమావేశం నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించినట్లు తెలిసింది. ఆలోగా మంచి పురోగతి సాధించి రావాలని కలెక్టర్లకు ఆదేశించినట్లు సమాచారం. నేడు కోమటిబండకు సీఎం,కలెక్టర్లు సాక్షి, హైదరాబాద్: గజ్వేల్ నియోజకవర్గంలోని కోమటిబండను సీఎం కేసీఆర్తోపాటుగా అన్ని జిల్లాల కలెక్టర్లు సందర్శిస్తున్నారు. క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా సీఎం నియోజకవర్గంలో గజ్వేల్లో హరితహారం కింద చేపట్టిన కార్యక్రమాలను జిల్లాల కలెక్టర్లు, ఇతర శాఖల అధికారులతో కలిసి సీఎం పరిశీలిస్తారు. బుధవారం ఉదయం హైదరాబాద్ నుంచి అధికారుల బృందం బయలుదేరి గజ్వేల్ నియోజకవర్గంలోని కోమటిబండ సహా వివిధ ప్రాంతాల్లో పర్యటించనుంది. మధ్యాహ్నం అక్కడే భోజనం చేసి సాయంత్రానికి ఈ బృందం నగరానికి చేరుకుంటుందని అధికారవర్గాలు వెల్లడించాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న 60రోజుల పచ్చదనం, పరిశుభ్రత కార్యాచరణ ప్రణాళిక అమలులో భాగంగా హరితహారం కింద సీఎం నియోజకవర్గంలో అమలుచేసిన కార్యక్రమాలు, సాధించిన ఫలితాలను గురించి ఈ పర్యటనలో వివరిస్తారు. గజ్వేల్లో గత మూడు, నాలుగేళ్లలో సహజ అడవి పునరుద్ధరణ (అటవీ భూముల సంరక్షణ) చర్యలు విజయవంతమైన సంగతి తెలిసిందే. ఈ నియోజకవర్గంలోని దాదాపుగా అన్ని గ్రామాల్లో హరితహారం కింద చేపట్టిన కార్యక్రమాలు సత్ఫలితాలు ఇవ్వడం, దాదాపు మూడేళ్ల క్రితం కోమటిబండ వద్ద మిషన్ భగీరథ ప్రాజెక్టుకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేసినపుడు ‘అవెన్యూ ప్లాంటేషన్’కింద రోడ్డుకు ఇరువైపులా నాటిన మొక్కలు ఏపుగా పెరగడంతో వాటిని ఈ బృందం పరిశీలించనుంది. గతంలోనూ సీఎం సూచనల మేరకు కలెక్టర్ల బృందం కోమటిబండను సందర్శించి అక్కడ హరితహారం, ఇతర కార్యక్రమాలను పరిశీలించి వచ్చిన సంగతి విదితమే. ఇక సత్వర రెవెన్యూ సేవలు కొత్త రెవెన్యూ చట్టం రూపకల్పనలో భాగంగా అంశాలవారీగా కలెక్టర్ల నుంచి అభిప్రాయాలు, సలహాలను సీఎం స్వీకరించారు. అవినీతి లేకుండా రెవెన్యూ వ్యవహారాలు ఎలా నడపాలి? రైతులకు సత్వర సేవలు ఎలా అందించాలి? భూ రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత 24 గంటల్లోపే రైతు ఇంటికి పాస్బుక్ వెళ్లాలంటే ఏం చేద్దాం? అన్న అంశాలపై కలెక్టర్ల అభిప్రాయాలను సేకరించారు. ఈ క్రమంలో రెవెన్యూకు సంబంధించిన అంశాలపై కలెక్టర్ల చేతికి ప్రశ్నావళిని ఇచ్చి సమాధానాలను రాబట్టుకున్నట్లు తెలిసింది. -
ప్ర‘హరీ’పై కలెక్టర్ సీరియస్
సాక్షి, అనంతపురం: ధర్మవరం మండలం దర్శనమల ఉన్నత పాఠశాల ప్రహరీ గాలికి కూలిపోయిన ఘటనపై కలెక్టర్ సత్యనారాయణ సీరియస్ అయ్యారు. రూ.20 లక్షల వ్యయంతో నిర్మించిన ప్రహరీ గాలికి కూలిపోవడంపై వెంటనే పూర్తిస్థాయిలో విచారించి సదరు కాంట్రాక్టర్పై కేసు నమోదు చేయాలని ఆదేశించారు. అంతేకాకుండా సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కాంట్రాక్టర్లు హడావుడిగా చేసిన పనులన్నింటిపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. 20 రోజుల్లో నిర్మాణం పూర్తి దర్శనమల ఉన్నత పాఠశాల ప్రహరీ నిర్మాణ పనులను మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూరి సమీప బంధువు నారాయణప్ప దక్కించుకున్నారు. ఎన్నికల ముందు 20 రోజుల్లోనే పనులు పూర్తి చేయించి టీడీపీ హయాంలోనే బిల్లు డ్రా చేసుకోవాలని చూశారు. ఈ క్రమంలోనే హడావుడిగా ప్రహరీని నాసిరకంగా నిర్మించారు. అయితే ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో బిల్లు మంజూరు కాలేదు. ఇటీవల వీచిన మోస్తరు గాలికే ప్రహరీ కూలిపోయింది. ఘటనపై ఈనెల 9న ‘ప్ర’హరీ’ శీర్షికతో ‘సాక్షి’లో వార్తా కథనం ప్రచురితమైంది. స్పందించిన కలెక్టర్ సత్యనారాయణ ఎస్ఎస్ఏ పీఓ రామచంద్రారెడ్డి, డీఈలతో మాట్లాడారు. పని ఎవరు చేశారు.. ఎలా చేశారు.. నాసిరకంగా నిర్మిస్తుంటే అధికారులు ఏమి చేస్తున్నారని ప్రశ్నించారు. వెంటనే పూర్తిస్థాయిలో విచారణ చేయడంతో పాటు కాంట్రాక్టర్పై కేసు నమోదు చేయించాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో పంచాయతీ స్పెషల్ ఆఫీసర్తో ఫిర్యాదు ఇప్పించి కాంట్రాక్టర్పై కేసు నమోదు చేయిస్తామని ఎస్ఎస్ఏ అధికారులు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ప్రహరీ నిర్మాణాలపై విచారణ సార్వత్రిక ఎన్నికల ముందు టీడీపీ నాయకులు చాలాచోట్ల పాఠశాలలకు ప్రహరీలు నిర్మించారు. 15–20 రోజుల్లో నిర్మాణాలు పూర్తి చేసి బిల్లులు పెట్టేశారు. అప్పటి మంత్రులు, ఎమ్మెల్యేలు ఒత్తిడి చేయడంతో అధికారులు కూడా నోరు మెదపకుండా కొందరికి బిల్లులు కూడా ఇచ్చేశారు. మరికొందరి బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. వీటన్నింటిపై విచారణ చేయించేలా కలెక్టర్ నిర్ణయం తీసుకున్నారు. ఆయా పనుల్లో నాణ్యత ఏ మేరకు ఉందో పూర్తిస్థాయిలో విచారించి నివేదిక ఇవ్వాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. దీంతో కాంట్రాక్టర్లలో వణుకు మొదలైంది. -
అక్రమ ముత్యాల టు ఆణిముత్యాల
సాక్షి, పశ్చిమగోదావరి(ఏలూరు) : జిల్లా కేంద్ర సహకార బ్యాంకు గాడిలో పడుతుందా అన్నది కీలకంగా మారింది. గత ఐదేళ్ల కాలంలో తెలుగుదేశం ప్రభుత్వ పాలనలో డీసీసీబీ చైర్మన్ ముత్యాల రత్నం ఆధ్వర్యంలో అనేక అక్రమాలు చోటు చేసుకున్నాయి. గ్యారెంటీలు లేకుండా కోట్లాది రూపాయలు రుణాలు ఇచ్చేశారు. మరోవైపు ఇష్టారాజ్యంగా కనీసం టెండర్లు పిలవకుండానే తెలుగు తమ్ముళ్లకు అవుట్సోర్సింగ్ పేరుతో ఉద్యోగాలు ఇచ్చేశారు. ఇప్పటికే బ్యాంకు అక్రమాలపై విచారణ జరుగుతోంది. ఇప్పుడు పర్సన్ ఇన్చార్జిగా జిల్లా కలెక్టర్ రేవు ముత్యాలరాజు బాధ్యతలు స్వీకరించడంతో అక్రమార్కులలో వణుకు మొదలైంది. అంతా అడ్డగోలే! గత డీసీసీబీ చైర్మన్ ముత్యాల రత్నం హయాంలో టెండర్లు పిలవకుండా అవుట్సోర్సింగ్ నియామకాలు జరిగిపోయాయి. ఎటువంటి నిబంధనలు పాటించకుండా బ్యాంకులో అవుట్సోర్సిం గ్ కింద సుమారు 50 మంది వరకూ పనిచేస్తున్నారు. చైర్మన్ డ్రైవర్ను కూడా పర్మినెంట్ చేయించుకునే ప్రయత్నం జరిగింది. చివరి జనరల్ బాడీలో తన డ్రైవర్ను పర్మినెంట్ చేయాలని సీఈఓకు చెప్పారు. తన పార్టీకి చెందిన వారిని ఎక్కువ మందిని నియమించుకున్నారు. పర్మినెంట్ ఉద్యోగిని ఇంటి వద్ద పనులు చేయిం చుకోవడం కోసం నియమించుకున్నారు. ఇతనిని ఆకివీడు, ఒడిశాలలో చైర్మన్ ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్లి వంటలు చేయడం కోసమే వాడుకున్నట్లు సమాచారం. ఇప్పుడు అతనికి వాలంటరీ రిౖటైర్మెంట్ ఇచ్చి అతని కుమారుడికి ఉద్యోగం ఇచ్చేందుకు యత్నాలు జరుగుతున్నా యి. ఇందుకు మెడికల్ ఇన్వాలిడేషన్ సర్టిఫికెట్ ఉండాలి. కనీసం ఐదేళ్లు సర్వీస్ ఉంటే గానీ వాలంటరీ రిటైర్మెంట్కు అనుమతి ఇవ్వకూడదు. అయితే ఈ ఉద్యోగికి మూడేళ్లు కూడా ఇంకా సర్వీస్ లేదని సమాచారం. ఈ విధంగా నిబంధనలకు వ్యతిరేకంగా ఇప్పటికే ముగ్గురిని బ్యాంకులో నియమించినట్టు సమాచారం. 18 ఏళ్ల క్రితం చనిపోయిన వ్యక్తి కుమారుడికి కోర్టు ఆర్డర్ సరిగా లేకపోయినా ఉద్యోగం ఇచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. బ్యాంకు సీఈఓగా 2015లో రిటైరైన వ్యక్తిని నియమించుకున్నారు. విచారణ గాలికి.. జిల్లా సహకార బ్యాంకులో జరిగిన కుంభకోణం విచారణ ఇంతవరకూ తేలలేదు. డీసీసీబీలో జరిగిన అక్రమాలపై ఈ ఏడాది జనవరి 18న రిజిస్ట్రార్ ఆఫ్ కో–ఆపరేటివ్ సొసైటీస్ విచారణకు ఆదేశాలు జారీ చేశారు. అయితే డీసీసీబీ చైర్మన్ ముత్యాల రత్నం తనకు ఉన్న పలుకుబడితో ఇప్పటి వరకూ విచారణ పూర్తికాకుండా ఒత్తిళ్లు తెచ్చారు. ఈ పాలకవర్గం హయాంలో డీసీసీబీలో సుమారు 33.32 కోట్ల రూపాయలు సెక్యూరిటీలు లేకుండా రుణం ఇచ్చి బ్యాంకు నష్టాలకు కారణమయ్యారు. సెక్యూరిటీలు లేకుండా రుణాలు ఇచ్చి బ్యాంకు నష్టాలకు కారణమైన పశ్చిమ గోదావరి జిల్లా కేంద్ర సహకార బ్యాంకు అధికారులు, ఉద్యోగులపై విచారణ చేపట్టాలని జనవరిలో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. జనవరిలోనే విచారణకు ఆదేశించినా ఇప్పటి వరకూ నివేదిక ఇవ్వకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నివేదిక తొక్కి పెట్టేందుకు అంటూ ఒక్కో బ్యాంకు బ్రాంచి నుంచి మూడు లక్షల రూపాయల చొప్పున వసూలు చేశారు. సుమారు 34 బ్రాంచుల నుంచి ఈ డబ్బులు వసూలు చేసినట్లు సమాచారం. కలెక్టర్ ముత్యాల రాజు బాధ్యతల స్వీకరణ కొత్త ప్రభుత్వం డీసీసీబీకి పర్సన్ ఇన్చార్జిగా కలెక్టర్ ముత్యాలరాజును నియమించింది. ఆయన బాధ్యతలు స్వీకరించారు. సమర్థవంతమైన అధికారిగా పేరున్న ముత్యాలరాజు బ్యాంకు వ్యవహారాలపై పూర్తిస్థాయిలో దృష్టి పెడితే మాత్రం అవకతవకలు బయటపడే అవకాశం ఉంది. -
అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు
-
వ్యవస్థను మారుద్దాం
సబ్రిజిస్ట్రార్ కార్యాలయాల్లో డబ్బు లేనిదే పని జరగడం లేదు.. పట్టణ ప్రాంతాల్లో ప్లాన్ అప్రూవల్స్కు కూడా లంచాలు అడుగుతున్నారు.. సర్టిఫికెట్ కోసం మీసేవలో దరఖాస్తు చేసుకున్నప్పటికీ మళ్లీ ఎమ్మార్వో ఆఫీసులో లంచాలిచ్చుకోవాల్సిన పరిస్థితి ఉందని చెబుతున్నారు. దీనిని పూర్తిగా నివారించడానికి నా దగ్గర నుంచి నేను చాలా బలంగా సంకేతాన్ని ఇస్తున్నా. దీనివల్ల 50 శాతం మాత్రమే ఫలితం ఉంటుంది. కింది స్థాయిలో మిగిలిన 50 శాతం చేయాల్సింది కలెక్టర్లు, ఎస్పీలే. – సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి : అవినీతిని అసలు ఉపేక్షించేది లేదని, మండల స్థాయి నుంచే వ్యవస్థను మార్చాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జిల్లా కలెక్టర్లు, ఎస్పీలను ఆదేశించారు. దిగువ స్థాయి సిబ్బందికి కౌన్సెలింగ్ చేయాలని, రెండు మూడు నెలల్లో పాజిటివ్ రిపోర్టు రావాల్సిందేనని,ఇందుకు అనుగుణంగా పరిస్థితుల్లో మార్పు తీసుకురావాలని సూచించారు. అవినీతి లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత కలెక్టర్లు, ఎస్పీలదేనని స్పష్టం చేశారు. ప్రజల నుంచి వచ్చే ఏ అర్జీ అయినా లంచం లేకుండా పరిష్కారం కావాలన్నారు. ‘స్పందన’ కార్యక్రమంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బుధవారం సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మీసేవలో ఫలానా సర్టిఫికెట్ కావాలని దరఖాస్తు పెడితే.. మళ్లీ ఎమ్మార్వో కార్యాలయానికి వెళ్లి లంచం ఇస్తేకాని పని కావడం లేదని చెబుతున్నారని, ఇలాంటివి ఎక్కడా జరక్కుండా చూడాల్సిన బాధ్యత కలెక్టర్లదేనని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. అలాంటి అధికారులను పిలిపించుకుని కౌన్సెలింగ్ చేయాల్సిందిగా సూచించారు. ‘నాస్థాయి నుంచి నేను మొదలు పెట్టాను.. మీ స్థాయిలో మీరు మండల స్థాయి అధికారులను పిలిపించుకుని మాట్లాడండి.. రెండు మూడు నెలల్లో నాకుపాజిటివ్ రిపోర్ట్ కావాలి.. మండల కార్యాలయాల్లో లంచాలు లేకుండా పనులు జరుగుతున్నాయని నాకు నిఘా అధికారులు నివేదిక ఇచ్చే పరిస్థితి తీసుకురావాలి.. ఇలా జరగాలంటే అది మీ చేతుల్లోనే ఉంది’ అని కలెక్టర్లను ఉద్దేశించి అన్నారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో పరిస్థితి మారాలి ఏ రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నా సబ్రిజిస్ట్రార్ కార్యాలయాల్లో డబ్బు లేనిదే పని జరగడం లేదన్న పరిస్థితి ఉందని, దీన్ని ఎలా అరికట్టాలో, ఈ పరిస్థితిని ఎలా మార్చాలో సలహాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. కలెక్టర్లను కోరారు. పట్టణ ప్రాంతాల్లో ప్లాన్ అప్రూవల్స్కు కూడా లంచాలు అడిగే పరిస్థితి ఉందని, దీన్ని కూడా పూర్తిగా నివారించాల్సిందేనని స్పష్టం చేశారు. అవినీతి నిర్మూలనలో కలెక్టర్లు, ఎస్పీలు గట్టి సందేశం ఇవ్వాలని, నా దగ్గర నుంచి నేను చాలా బలంగా సంకేతాన్ని ఇస్తున్నానని, దీనివల్ల జరిగేది 50 శాతం మాత్రమేనని చెప్పారు. మిగిలిన 50 శాతం చేయాల్సింది కలెక్టర్లు, ఎస్పీలేనని, మీరు మనసు పెడితే ఇది సాధ్యమేనన్నారు. పోలీస్స్టేషన్ స్థాయిలో అవినీతి ఆగిపోవాల్సిందేనని, ఎస్పీలు వెంటనే చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎమ్మార్వో లెవల్లో అవినీతి ఆగిపోతే కలెక్టర్ గురించి, పోలీస్ స్టేషన్ స్థాయిలో అవినీతి ఆగిపోతేనే ఎస్పీ గురించి ప్రజలు బాగా చెబుతారని ముఖ్యమంత్రి అన్నారు. ‘స్పందన’ కింద వినతులు తీసుకుంటున్న సిబ్బందికి కచ్చితంగా శిక్షణ ఇవ్వడంతో పాటు మార్గదర్శకాలు చెప్తూ.. అవినీతిని అంతం చేయాల్సిన అంశాన్ని కూడా వారికి వివరించాలని సూచించారు. వచ్చే వారంలో ఒకరోజు నిర్ణయించుకుని ఆ మేరకు అధికారులను పిలిపించుకుని ఈ విషయాలు చెప్పాలిందిగా కలెక్టర్లు, ఎస్పీలకు ముఖ్యమంత్రి సూచించారు. ఈ సమావేశంలో కలెక్టర్, ఎస్పీ ఉండేలా చూసుకోవాలన్నారు. కలెక్టర్లు స్పందన కార్యక్రమాన్ని మిస్ కావొద్దని, వస్తున్న వినతుల పరిష్కారంలో నాణ్యత ఉండాలని, ప్రతి రశీదు మీద తేదీ ఉండాలని సూచించారు. కలెక్టర్లు అందరూ బాగా పని చేస్తున్నారని సీఎం అభినందించారు. మనసుపెట్టి వినతులు పరిష్కరించండి వినతుల పరిష్కారంలో లోపాలను ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్లో ప్రస్తావించారు. విజయవాడ సెంట్రల్ నుంచి ఒక వినతి వచ్చిందని, బినామీ డీలర్ రేషన్ షాపు నిర్వహిస్తున్నారని ఫిర్యాదు చేశారని, సరైన పత్రాలు చూపించలేదని ఫిర్యాదును తిరస్కరించామంటూ అధికారులు పేర్కొన్న విషయాన్ని ముఖ్యమంత్రి ఎత్తిచూపారు. ఫిర్యాదుదారు ఎలా పత్రాలు చూపిస్తారు? విచారణ చేయాల్సిన బాధ్యత అధికారులదే కదా.. మనం విచారణ చేయకుండా పిటిషన్ను రిజెక్ట్ చేస్తే దీనివల్ల ఏం ప్రయోజనం..? అని ప్రశ్నించారు. మనసు పెట్టి ప్రజల వినతులను పరిష్కరించాలని చెప్పారు. స్పందన కార్యక్రమం నిర్వహణలో నాణ్యత లేకపోతే ఉపయోగం ఉండదన్నారు. కలెక్టర్లు, అధికారులు మనసుపెట్టి పని చేయాలని, ఎవరైనా బాధపడుతూ మన దగ్గరకు వచ్చారంటే.. మనం ఫీల్ అయ్యి ఆ వినతిని పరిష్కరించాలని చెప్పారు. ఆ సమస్యను ఎప్పుడు (టైంలైన్) పరిష్కరిస్తామో రశీదులో స్పష్టంగా ఇవ్వాలని, దానిని తప్పనిసరిగా ఫాలో కావాలని సీఎం సూచించారు. ‘స్పందన మొదటి కార్యక్రమం ద్వారా 4,400కు పైగా వినతులు వచ్చాయి. వీటిని 7 రోజుల్లో పూర్తి చేస్తామని చెప్పాం. దీనిపై కలెక్టర్లు దృష్టిపెట్టాలి. స్పందన కార్యక్రమం కింద వినతి పత్రం ఇచ్చాక ప్రజలకు కాన్ఫిడెన్స్ ఇవ్వాలి. ఒక స్పందనలో వచ్చిన వినతులకు వచ్చే స్పందన కల్లా.. క్లియర్ టైం లైన్ ఇవ్వాలి. వినతుల పరిష్కారానికి ఒక పటిష్ట యంత్రాంగాన్ని రూపొందించుకోవాలి. దీని తర్వాత ఆకస్మిక తనిఖీలు క్రమం తప్పకుండా చేయాలి’ అని ముఖ్యమంత్రి సూచించారు. గ్రామ సచివాలయాల్లోనే రేషన్కార్డు పెన్షన్లు, హౌసింగ్, రేషన్కార్డుల మీద వినతులు ఎక్కువగా వస్తున్నాయని అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. వీటి పరిష్కారానికి గ్రామ సచివాలయాలను డైనమిక్గా ఉపయోగించుకోవచ్చని సీఎం పేర్కొన్నారు. రేషన్కార్డు, పెన్షన్ ఏం అడిగినా 72 గంటల్లోగా పరిష్కరించాలని చెప్పారు. స్కానర్, ప్రింటర్, కంప్యూటర్, లామినేటెడ్ యంత్రం కూడా గ్రామ సచివాలయాల్లో పెడుతున్నామని సీఎం పేర్కొన్నారు. గ్రామ సచివాలయాల్లోనే రేషన్కార్డు ఇచ్చేలా ప్రయత్నాలు చేస్తున్నామని, దీనిపై అధికారులకు ఆదేశాలు ఇస్తామన్నారు. ప్రతి విషయానికి సంబంధించిన జాబితా గ్రామ సచివాలయంలో ఉంచుతామని, దీనివల్ల కంటిన్యూగా సోషల్ ఆడిట్ జరుగుతుందని చెప్పారు. అర్హులకు పథకాలు అందని పరిస్థితి ఉండకూడదన్నారు. గ్రామ వలంటీర్లను కచ్చితంగా దీంట్లో భాగస్వామ్యం చేస్తున్నామని, వారిని సమర్థవంతంగా వాడుకోవాలని సూచించారు. హాస్టళ్లలో వసతుల మెరుగుదల కోసం ప్రతి జిల్లాకు రూ.15 కోట్లు ఇస్తున్నామని, కలెక్టర్లు తనిఖీలకు వెళ్లేలోపు వాటికి సంబంధించిన నివేదికలు తెప్పించుకోవాలని, ఆ మేరకు నిధులను ఖర్చు చేయాలన్నారు. స్పందన ద్వారా వినతులు ఇవ్వడానికి వస్తున్న ప్రజలకు సౌకర్యాలు లేవని పత్రికల్లో కథనాలు వచ్చాయని, ఇకపై స్పందన కేంద్రం వద్ద షామియానా, నీళ్లు, కుర్చీలు ఉండేలా చూసుకోవాలని, మజ్జిగ ఇచ్చే ఏర్పాటు చేయాలని చెప్పారు. ప్రతి మండలంలో కూడా స్పందన కార్యక్రమం చేపట్టాలని, ఎక్కడా నిర్వహించలేదన్న ప్రశ్న తలెత్తకూడదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు రూ.7 లక్షల పరిహారం 2014–2019 మధ్య కాలంలో డిస్ట్రిక్ క్రైం రికార్డ్స్ బ్యూరో ప్రకారం 1,513 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే, 391 మంది రైతుల కుటుంబాకు మాత్రమే గత ప్రభుత్వం పరిహారం ఇచ్చినట్లుగా రికార్డులు చెబుతున్నాయని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో అన్నారు. దీన్నిబట్టి చూస్తే గత ప్రభుత్వం ఈ రైతు కుటుంబాలకు పరిహారాన్ని నిరాకరించినట్లు అర్థం అవుతోందన్నారు. మీ మీ జిల్లాల్లో డేటాను పరిశీలించాలని, ఎవరైనా అర్హులైన రైతు కుటుంబాలు ఉంటే వెంటనే వారికి పరిహారం ఇచ్చి వారి కుటుంబాల్లో ఆత్మస్థైర్యాన్ని నింపాలని చెప్పారు. ‘ఎక్కడైనా సరే.. రైతు కుటుంబాల్లో జరగరానిది జరిగితే వెంటనే కలెక్టర్ స్పందించాలి. స్థానిక ఎమ్మెల్యేతో కలిసి ఆ కుటుంబం దగ్గరకు వెళ్లాలి. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు రూ.7 లక్షలు పరిహారం ఇవ్వాలి. ఆ పరిహారాన్ని వేరొకరు తీసుకోలేని విధంగా ఒక చట్టాన్ని కూడా తీసుకు వస్తున్నాం. రైతుల విషయంలో సానుభూతి, మానవీయతతో ఉండాలి. మనిషే చనిపోయిన తర్వాత.. మనం కూడా తోడుగా లేకపోతే సరైన సందేశం ఇచ్చినట్టు కాదు. మనం ఇచ్చే పరిహారం ఆత్మహత్యలను ప్రోత్సహించేందుకు ఎంతమాత్రం కాదు. ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకు ఆత్మస్థైర్యం ఇవ్వడమే మన ఉద్దేశం’ అని సీఎం స్పష్టీకరించారు. సబ్రిజిస్ట్రార్ కార్యాలయాల్లో డబ్బు లేనిదే పని జరగడం లేదు.. పట్టణ ప్రాంతాల్లో ప్లాన్ అప్రూవల్స్కు కూడా లంచాలు అడుగుతున్నారు.. సర్టిఫికెట్ కోసం ఇ–సేవలో దరఖాస్తు చేసుకున్నప్పటికీ మళ్లీ ఎమ్మార్వో ఆఫీసులో లంచాలిచ్చుకోవాల్సిన పరిస్థితి ఉందని చెబుతున్నారు. దీనిని పూర్తిగా నివారించడానికి నా దగ్గర నుంచి నేను చాలా బలంగా సంకేతాన్ని ఇస్తున్నా. దీనివల్ల 50 శాతం మాత్రమే ఫలితం ఉంటుంది. కింది స్థాయిలో మిగిలిన 50 శాతం చేయాల్సింది కలెక్టర్లు, ఎస్పీలే.మనసు పెట్టి పని చేస్తే ‘స్పందన’లో వచ్చే ప్రతి అర్జీని పరిష్కరించవచ్చు. ఈ కార్యక్రమాన్ని కలెక్టర్లు మిస్ కాకూడదు. వస్తున్న వినతుల పరిష్కారంలో నాణ్యత ఉండాలి. ప్రతి రశీదు మీద తేదీ ఉండాలి. మళ్లీ వచ్చే స్పందన నాటికి గత వారం అర్జీలు పరిష్కారమయ్యేలా చూడాలి. రైతులు కానీ, కౌలు రైతులు కానీ ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉన్నప్పుడు కచ్చితంగా జిల్లా కలెక్టర్ ఆ కుటుంబం దగ్గరకు వెళ్లాలి. మళ్లీ సీఎం కార్యాలయం చెప్పే పరిస్థితి ఉండకూడదు. మనది ప్రజల ప్రభుత్వం. మానవత్వం ఉన్న ప్రభుత్వం. ఈ దిశగానే పాలన ఉంటుంది. ‘స్పందన’ లేని ఏఎస్వో సస్పెన్షన్ విజయవాడ: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘స్పందన’ (ప్రజా అర్జీల స్వీకరణ) కార్యక్రమంలో నిర్లక్ష్యం వహించిన అధికారిపై సస్పెన్షన్ వేటు పడింది. గతనెల 29న స్వీకరించిన అర్జీలను అధికారులు ఏవిధంగా పరిష్కరించారనే దానిపై సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పరిశీలిస్తుండగా.. పౌర సరఫరాల విభాగంలోని ఏఎస్వో నిర్లక్ష్యం బయటపడింది. దీంతో సంబంధిత అధికారిని ప్రభుత్వం సస్పెండ్ చేసింది. వివరాల్లోకి వెళితే.. గతనెల 29న విజయవాడలో నిర్వహించిన స్పందన కార్యక్రమానికి ఓ వ్యక్తి హాజరై.. విజయవాడ తూర్పు నియోజకవర్గ పరిధిలోని 250 నంబర్ రేషన్ డిపోను బినామీ పేరుతో నడుపుతున్నారని, సంబంధిత డీలర్ నకిలీ 10వ తరగతి సర్టిఫికెట్తో రేషన్ షాపు పొందారని ఫిర్యాదు చేశారు. ఆ అర్జీపై అసిస్టెంట్ సప్లై ఆఫీసర్ (ఏఎస్వో) ఉదయభాస్కర్ విచారణ జరపకుండా, దరఖాస్తులో సరైన ఆధారాలు చూపలేదని పేర్కొంటూ తిరస్కరించారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా వచ్చిన అర్జీల పరిష్కారాల తీరును పరిశీలిస్తున్న క్రమంలో ఈ ఫిర్యాదును పరిశీలించారు. బుధవారం కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ముఖ్యమంత్రి ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ.. ఫిర్యాదుదారు ఆధారాలు చూపలేదంటూ ఏఎస్ఓ ఉదయభాస్కర్ ఆ అర్జీని తిరస్కరించడం సరైన పద్ధతి కాదన్నారు. దీనిపై జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ స్పందిస్తూ.. అర్జీని పూర్తిగా పరిశీలించకుండా తిరస్కరించిన సంబంధిత అధికారిని సస్పెండ్ చేయాలంటూ పౌర సరఫరాల శాఖ ఇన్చార్జి, జాయింట్ కలెక్టర్ మాధవీలతను ఆదేశించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ సరైన విచారణ చేయకుండా అర్జీని తిరస్కరించడం వల్లే ఏఎస్వోపై చర్యలు తీసుకున్నట్టు చెప్పారు.డీలర్పై వచ్చిన ఫిర్యాదు నిజమో, కాదో ఇంకా తెలియదని, దీనిపై విచారణ జరపాల్సి ఉందని పేర్కొన్నారు. సీఎం వైఎస్ జగన్ స్పందన అర్జీలపై పూర్తిస్థాయిలో అధ్యయనం చేస్తున్నారని కలెక్టర్ పేర్కొన్నారు. అధికారులు ప్రతి అర్జీని పూర్తిస్థాయిలో విచారించి చర్యలు తీసుకోవాల్సి ఉందన్నారు. నిజానిజాలు తెలుసుకోకుండా అర్జీని తిరస్కరించడమంటే.. విధి నిర్వహణలో ఏఎస్వో ఉదయభాస్కర్ అలక్ష్యంగా వ్యవహరించడమేనని పేర్కొన్నారు. ఈ విధంగా మరొకరు చేయకుండా ఉండేందుకు ఏఎస్వోపై చర్యలు తీసుకున్నామని కలెక్టర్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. -
కలెక్టర్లకు ‘పుర’పవర్స్
సాక్షి, హైదరాబాద్: ఇప్పటివరకు జిల్లా కలెక్టర్లు పంచాయతీలు, గ్రామీణ ప్రాంతాలపైనే దృష్టి సారిస్తూ వస్తున్నారు. మున్సిపాలిటీల్లో సమస్యలను ఆయా పాలకవర్గాలు, అధికారులే పరిష్కరించేవారు. ఒకవేళ అందులో విఫలమైనా కలెక్టర్లు చర్యలు తీసుకునే పరిస్థితి ఉండేది కాదు. ప్రజలు బయటకు వచ్చి ధర్నాలు, ఆందోళనలు చేసినా అది పట్టణానికే పరిమితమయ్యేది. దీంతో తీవ్రమైన సమస్య ఉత్పన్నమైతే తప్ప ప్రభుత్వం రంగంలోకి దిగేది కాదు. ఈ పరిస్థితి కొత్త చట్టంతో మారిపోనుంది. పురపాలికల్లో ఏ సమస్య తలెత్తినా వాటిని పరిష్కరించాల్సిన బాధ్యత అధికారులతో పాటు ప్రజాప్రతినిధులకు తప్పనిసరి కానుంది. దీంతో మున్సిపాలిటీల్లో అడ్డగోలు వ్యవహారాలకు కళ్లెం పడనుంది. పాలనలో పారదర్శకత, పాలకవర్గాల్లో జవాబుదారీతనం పెంపొందించేలా ఉద్యోగులు, ప్రజాప్రతినిధులను ప్రతి ఒక్కరిని బాధ్యులను చేసేలా కొత్త పురపాలక చట్టంలో నిబంధనలను రూపొందిస్తున్నారు. ఈ చట్టం అమలు బాధ్యతలను కలెక్టర్లకు అప్పగించనున్నారు. పట్టణ స్థానిక సంస్థలపై కలెక్టర్లకు సంపూర్ణ అధికారాలు కట్టబెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి పనులు అమలు చేయడమే కాకుండా పురపాలనను గాడిలో పెట్టే బాధ్యతను కూడా వారికే అప్పగించింది. మున్సిపాలిటీలను పర్యవేక్షించే బాధ్యతను ప్రభుత్వం కలెక్టర్ల ద్వారా చేపట్టనుంది. తద్వారా పురపాలక సంఘాలపై ప్రభుత్వ అజమాయిషీ కొనసాగనుంది. ఇందులో భాగంగా పన్నుల వసూళ్లు, హరితహారం, ప్రభుత్వ పథకాల అమలులో పాలకవర్గాలను బాధ్యులను చేయనుంది. విధి నిర్వహణలో అలసత్వం ప్రదర్శిస్తే క్రమశిక్షణ చర్యలు తీసుకునే అధికారం కలెక్టర్లకు కట్టబెట్టనుంది. ఇప్పటివరకు పాలకవర్గాల తీర్మానాలను మాత్రమే సమీక్షించే అధికారం కలెక్టర్లకు ఉండేది. కొత్త చట్టంలో అవసరమైతే ప్రజాప్రతినిధులపై వేటు వేసే విచక్షణాధికారం కూడా కలెక్టర్లకు ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తోంది. ప్రతి 15 రోజులకోసారి మున్సిపాలిటీలను తనిఖీ చేసేలా, పనితీరు సమీక్షించేలా జాబ్చార్ట్ను రూపొందిస్తోంది. అప్పిలేట్ ట్రిబ్యునల్..! ప్రజాప్రతినిధులపై తీసుకునే చర్యలను సమీక్షించేందుకు ప్రత్యేక అప్పిలేట్ ట్రిబ్యునల్ను ఏర్పాటు చేసే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. ప్రస్తుత చట్టం ప్రకారం ప్రజాప్రతినిధులపై చర్యలు తీసుకునే అధికారం ప్రభుత్వానికే ఉండేది. తాజాగా దీన్ని కలెక్టర్లకు కట్టబెడుతూ.. సమీక్షించేందుకు ప్రత్యేక ట్రిబ్యునల్ను ఏర్పాటు చేయనుంది. దీనికి జిల్లా జడ్జి స్థాయి అధికారి అప్పిలేట్ అధికారిగా వ్యవహరించే అవకాశముంది. ప్రజాప్రతినిధులపై సీఎం ఆసక్తికర వ్యాఖ్యలు ఇటీవల జరిగిన ఓ మున్సిపల్ సమీక్ష సమావేశంలో సీఎం కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసినట్లు మున్సిపల్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. టౌన్ ప్లానింగ్ అంతా అవినీతిమయం అయిపోయిందని, ఈ వ్యవస్థ ప్రజలకు ఉపయోగపడట్లేదని సీఎం అభిప్రాయపడ్డట్లు సమాచారం. టౌన్ ప్లానింగ్తో పాటు ప్రజాప్రతినిధులపై కూడా ఆయన చేసిన కీలక వ్యాఖ్యల ఆధారంగానే కొత్త చట్టంలో కలెక్టర్లకు కీలక అధికారాలిస్తున్నారనే చర్చ జరుగుతోంది. తాము ఇటీవలే హైదరాబాద్లో సర్వే నిర్వహించామని, ఇందులో 90 శాతం మంది కార్పొరేటర్లు అవినీతిపరులనే అభిప్రాయం ప్రజల్లో ఉందని, వీరి వల్ల స్థానికంగా ఎలాంటి ఉపయోగం లేదని, వీరి కంటే ప్రత్యేకాధికారుల పాలనే మేలనే ఉద్దేశంతో ప్రజలున్నారని చెప్పిన కేసీఆర్ అవినీతి చేసినా, అంకిత భావంతో పనిచేయకపోయినా చైర్మన్లు, కౌన్సిలర్లను కూడా సస్పెండ్ చేసే అధికారాలుండాలని చెప్పారని ఉన్నతాధికారులు చెబుతున్నారు. -
సంక్షేమ సారధి
-
విద్యార్థులకు రుచికరమైన భోజనం అందించాలి
సాక్షి, చౌడేపల్లె: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు మధ్యాహ్న భోజనం రుచికరంగా అందించాలని కలెక్టర్ నారాయణ భరత్గుప్త అన్నారు. పుంగనూరు పర్యటన ముగించుకుని చిత్తూరు వెళుతున్న కలెక్టర్ చౌడేపల్లె మండలం పుదిపట్ల ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనాన్ని తిన్నారు. భోజనం నాణ్యతపై దృష్టి పెట్టాలని వంట నిర్వాహకులకు సూచించారు. కలెక్టర్ మాట్లాడుతూ పది పరీక్షల్లో ఉత్తమ ఫలితాల సాధనకు కృషి చేయాలని హెచ్ఎం వేదవతికి సూచించారు. విద్యార్థుల జీవితాలకు మార్గం చూపేలా బోధన సాగాలని తెలిపారు. గత ఏడాది పుదిపట్లలో 98 శాతం ఉత్తీర్ణత సాధిం చామని హెచ్ఎం కలెక్టర్కు వివరించారు. ఈ ఏడాది ఇప్పటి నుంచే ప్రత్యేక తరగతులు నిర్వహించి, వందశాతం ఉత్తీర్ణత సాధించేందుకు కృషి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. పాఠశాలలో అభివృద్ధి పనులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. వాచ్మెన్ కావాలని పాఠశాల సిబ్బంది కోరారు. పరిశ్రమల స్థాపనతో ఉపాధి చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలో పరిశ్రమల స్థాపనతో ఎంతో మందికి ఉపాధి లభిస్తుందని కలెక్టర్ నారాయణ భరత్గుప్త అన్నారు. మంగళవారం కలెక్టరేట్లో జిల్లా పరిశ్రమల ప్రమోషన్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ 21 ఎంఓయూలు చేయడం ద్వారా 7,911 మందికి ఉపాధి కల్పిస్తున్నామన్నారు. జిల్లాలో 2018–19 సంవత్సరాల్లో 1,363 యూనిట్లు స్థాపించినట్లు చెప్పారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు 175 యూనిట్లు స్థాపించినట్లు తెలిపారు. 2014–15 నుంచి 2019–20 వరకు 3,289 యూనిట్ల ద్వారా 92,697 మందికి ఉపాధి కల్పించినట్లు వెల్లడించారు. 2018–19లో మెగా పరిశ్రమల స్థాపనలో భాగంగా 9 పెద్ద పరిశ్రమలను స్థాపించామన్నారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు పరిశ్రమల స్థాపనపై అవగాహన కల్పించేందుకు ప్రతినెలా 5న అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు. సింగిల్ డెస్క్ హోటల్ ద్వారా మూడు నెలల కాలంలో 352 దరఖాస్తులు అందగా 331 దరఖాస్తులను ఆమోదించామన్నారు. 129 పెద్ద పరిశ్రమలకుగాను 78 పరిశ్రమలు ఉత్పత్తి ప్రారంభించాయన్నారు. అనంతరం జాయింట్ కలెక్టర్ మార్కండేయులు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఎంఓయూలను అందజేశారు. ఈ కార్యక్రమంలో జేసీ కమలకుమారి, పరిశ్రమల శాఖ జీఎం అనిల్కుమార్రెడ్డి, ఏపీఐఐసీ జెడ్ఎం ఐఎల్.రామ్, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. -
ప్రతి అర్జీ పరిష్కరించాల్సిందే
సాక్షి, అమరావతి: ‘ప్రతి సోమవారం స్పందనలో వచ్చే ప్రతి అర్జీ పరిష్కరించాల్సిందే. అర్జీ ఇచ్చినప్పుడే అర్జీదారునికి రశీదు ఇవ్వాలి. ఆ సమస్యను ఎన్ని రోజుల్లోగా పరిష్కరిస్తారన్నది కూడా రశీదులో నిర్దిష్టంగా పేర్కొనాలి. ఆలోగా సమస్యను కచ్చితంగా పరిష్కరించాల్సిందే’ అని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దిశా నిర్దేశం చేశారు. మంగళవారం సచివాలయం నుంచి ‘స్పందన’ కార్యక్రమంపై జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో ఆయన టెలీకాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ‘మాట ఇస్తే కచ్చితంగా నిలబెట్టుకోవాల్సిందే.. అప్పుడే ప్రజల విశ్వాసాన్ని పొందగలం.. మాపై ప్రజలు అచంచలమైన విశ్వాసం ఉంచి అఖండ విజయాన్ని అందించారు. వారి ఆశలు నెరవేర్చి ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది’ అని చెప్పారు. ‘రాష్ట్రంలో మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రతి సోమవారం నిర్వహించే స్పందన కార్యక్రమంలో అర్జీల ద్వారా వచ్చిన ప్రతి సమస్యను పరిష్కరించడమే కాకుండా.. ఎక్కడెక్కడ ఎలాంటి సమస్యలు అధికంగా ఉన్నాయో విశ్లేషించి, వాటికి కారణాలు ఏమిటో తెలుసుకోవాలి. శాశ్వతంగా ఆ సమస్యలను పరిష్కరించడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశంపై కార్యాచారణ ప్రణాళిక రూపొందించుకోవాలి. అర్జీల్లో చిన్న చిన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలి. రహదారులు, తాగునీటి సమస్య వంటి సామాజిక సమస్యల పరిష్కారానికి నిధుల మంజూరు కోసం ముఖ్యమంత్రి కార్యాలయంలో ఒక అధికారిని నియమిస్తాం. ఆ అధికారిని మీరు సంప్రదించి త్వరితగతిన పనులు జరిగేలా చూడండి’ అని సీఎం ఆదేశించారు. ఆన్లైన్లో పరిశీలన మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకూ ప్రతి అర్జీని కంప్యూటరీకరించి, ఆన్లైన్ వెబ్ పోర్టల్లో నమోదు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారులకు సూచించారు. మండల స్థాయి మొదలు తాను నిర్వహించే ప్రజాదర్బార్లో వచ్చే అర్జీల వరకు అన్నింటినీ ఆన్లైన్ వెబ్ పోర్టల్లో పొందుపరచాలని, నిర్దిష్ట గడువులోగా ఆ సమస్యలు పరిష్కరించారో లేదో తనిఖీ చేయాలని కలెక్టర్లు, ఎస్పీలను ఆదేశించారు. ఆన్లైన్లో వీటిని ముఖ్యమంత్రి కార్యాలయం నేరుగా పర్యవేక్షిస్తుందని స్పష్టం చేశారు. గ్రామ స్థాయి పర్యటనలకు, పల్లె నిద్రకు వెళ్లినప్పుడు ‘స్పందన’లో వచ్చిన అర్జీల పరిష్కారంపై ప్రజల అభిప్రాయాలను తెలుసుకోవాలన్నారు. రచ్చబండ, ఇతర అధికారిక కార్యక్రమాలకు వచ్చినప్పుడు తానూ తనిఖీ చేస్తానని స్పష్టం చేశారు. దీని వల్ల కింది స్థాయి అధికారులు బాధ్యతాయుతంగా పని చేస్తారని, సమస్యలను చిత్తశుద్ధితో పరిష్కరిస్తారని చెప్పారు. స్పందన కార్యక్రమంలో వచ్చే అర్జీల పరిష్కారంపై ప్రతి మంగళశారం ఉదయం 11.30 నుంచి 12 గంటల వరకూ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షిస్తానన్నారు. చిన్న చిన్న సమస్యలను 72 గంటల్లోగా పరిష్కరించాలని ఆదేశించారు. ఇంట్లో నుంచే సమస్య నమోదు భవిష్యత్లో ప్రజలు ఇంట్లో నుంచే తమ సమస్యను వెబ్ పోర్టల్లో నమోదు చేసేలా ముఖ్యమంత్రి కార్యాలయం చర్యలు చేపడుతున్నట్లు సమాచారం. ఆ మేరకు వెబ్ పోర్టల్ను ఇప్పటికే అభివృద్ధి చేసినట్లు తెలిసింది. -
జిల్లాలో ఉర్దూ వెబ్సైట్..
సాక్షి, మహబూబ్నగర్ : డిజిటల్ ఇండియా కార్యక్రమంలో భాగంగా పరిపాలనా వ్యవస్థలో అనేక మార్పులకు, అభివృద్ధి కార్యక్రమాలకు వేదికైన మహబూబ్నగర్ జిల్లా నేడు మరో అడుగు ముందుకేసింది. ఇప్పటివరకు ఇంగ్లీషు, తెలుగులోనే అందుబాటులో ఉండే మహబూబ్నగర్ జిల్లా వెబ్సైట్ను సరికొత్తగా ఉర్దూ భాషలోనూ అందుబాటులోకి వచ్చింది. ఉర్దూ మాట్లాడే, చదివే వారికోసం స్వాస్ సాంకేతిక టెక్నాలజీ సహాయంతో ఈ ఉర్దూ వెబ్సైట్ను రూపకల్పన చేశారు. ఉర్దూలో మహబూబ్నగర్ జిల్లా ఎన్ఐసీ వెబ్సైట్ ప్రస్తుతం అందుబాటులోకి రావడంపై ఉర్దూ భాష మాట్లాడే వారు సంతోషం వ్యక్తం చేశారు. ఇప్పటికే జిల్లాలో అనేక మార్పులకు శ్రీకారం చుట్టిన జిల్లా కలెక్టర్ డి.రొనాల్డ్రోస్ ఈ సరికొత్త ప్రయోగానికి నాంది పలికారు. ఉర్దూ భాషలో మహబూబ్నగర్ జిల్లా వెబ్సైట్ను అందుబాటులోకి తెచ్చేందుకు ఎన్ఐసీ అధికారులు అందుబాటులో ఉన్న సాంకేతిక టెక్నాలజీ వినియోగించి తుది మెరుగులు దిద్దారు. నెల రోజులపాటు కసరత్తు చేసిన ఎన్ఐసీ అధికారులు తాజాగా అందుబాటులోకి వచ్చిన మహబూబ్నగర్ జిల్లా ఉర్దూ వెబ్సైట్కు అంకురార్పన చేశారు. దేశంలోనే మొదటిసారి.. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న డిజిటల్ ఇండియా కార్యక్రమంలో బాగంగా దేశంలోనే మొదటిసారిగా మహబూబ్నగర్ జిల్లా వెబ్సైట్ను ఉర్దూలో అందుబాటులోకి తెచ్చారు. ఇప్పటికే ఈ వెబ్సైట్ను ఇంగ్లిష్, తెలుగులో నిర్వహిస్తుండటమే కాకుండా అంధులకు, దృష్టిలోపం ఉన్నవారికి సైతం అందుబాటులోకి తెచ్చారు. తాజాగా ఉర్దూ భాషలోనూ వెబ్సైట్ ద్వారా మహబూబ్నగర్ జిల్లా తాజా సమాచారాన్ని ప్రజలకు చేరవేసేందుకు జిల్లా యంత్రాంగం చేసిన కృషి మెరుగైన ఫలితాలు తీసుకురానుంది. అయితే జిల్లాలో ఇప్పటికే డిజిటల్ ఇండియా కార్యక్రమంలో బాగంగా ఈ–ఆఫీస్ విధానంతో ప్రభుత్వ కార్యాలయాలన్నింటిని అనుసంధానం చేసి ఫైళ్ల నిర్వహణను అత్యంత సులభతరం చేయడంలో కలెక్టర్ రొనాల్డ్రోస్ సఫలీకృతులయ్యారు. ప్రతీ అధికారి, కింది స్థాయి సిబ్బంది ఎవరూ కార్యాలయాల చుట్టూ సంతకాల కోసం, అనుమతుల కోసం తిరిగే వీలు లేకుండా తమ కార్యాలయం నుండే ఈ–ఆఫీస్ విధానంతో క్షణాల్లో అనుతులు తీసుకునే వెసులుబాటును అందుబాటులోకి తెచ్చారు. అఖిలపక్ష పార్టీల ముస్లిం నాయకుల సమక్షంలో.. ఈ విధానంతో పనిభారం తగ్గడమే కాకుండా అధికారులు అందుబాటులో ఉండే అవకాశం కలిగింది. ఇదిలాఉండగా, ఉర్దూ వెబ్సైట్ను మొదటిసారిగా అందుబాటులోకి తేవడం ఎంతో గర్వకారణమని జిల్లా అఖిలపక్ష పార్టీల ముస్లిం నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు కలెక్టర్ రొనా ల్డ్రోస్ సోమవారం ప్రజావాణి కార్యక్రమం వేదికగా అఖిలపక్ష పార్టీల ము స్లిం నాయకుల సమక్షంలో ఉర్దూ వెబ్సైట్ను ప్రారంభించారు. ఈ వెబ్సైట్ రూపకల్పనకు స్వాస్ సాంకేతిక టెక్నాలజీ ఎంతో ఉపయోగపడిందని, ఎన్ఐసీ అధికారుల శ్రమ ఫలితంగా ఉర్దూ వెబ్సైట్ను ఆవిష్కరించేందుకు వీలుకలిగిందని కలెక్టర్ రొనాల్డ్రోస్ అన్నారు. -
నా సెల్ నంబర్ బ్లాక్ చేశారు
సాక్షి, చెన్నై: కరూర్ కలెక్టర్, ఎంపీ జ్యోతిమణిల మధ్య వార్ మరింతగా ముదురుతోంది. ఎంపీ అన్న కనీస మర్యాద కూడా తనకు కలెక్టర్ ఇవ్వడం లేదని జ్యోతిమణి ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా పద్ధతి మార్చుకోకుంటే, పార్లమెంట్లో ప్రస్తావించాల్సి ఉంటుందన్న హెచ్చరికలు చేశారు. తన సెల్ నంబర్ను ఆయన బ్లాక్ చేసి ఉండడం బట్టిచూస్తే, ఏ మేరకు కలెక్టర్ తీరు ఉందో స్పష్టం అవుతోందని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.లోక్సభ ఎన్నికల నగారా మోగినప్పటి నుంచి కరూర్ లోక్సభ నియోజకవర్గంలో రాజకీయ వివాదం రాజుకుంటూ వచ్చిన విషయం తెలిసిందే. ఇక్కడ అన్నాడీఎంకే అభ్యర్థిగా గత ›ప్రభుత్వంలో పార్లమెంట్ డిప్యూటీ స్పీకర్ తంబిదురై రేసులో ఉండడం ఇందుకు కారణం. అలాగే, ఆయనపై తీవ్ర వ్యతిరేకత నియోజకవర్గంలో ఉండడాన్ని అస్త్రంగా చేసుకుని కాంగ్రెస్ అభ్యర్థి జ్యోతిమణి తీవ్రంగానే ఓట్ల వేట సాగించారు. అయితే, ఎన్నికల నామినేషన్ దాఖలు మొదలు, ప్రచారాల అనుమతి వరకు అడుగడుగునా జ్యోతిమణికి అడ్డంకులు తప్పలేదు. కరూర్ జిల్లా డీఎంకే నేత, మాజీ మంత్రి సెంథిల్ బాలాజి తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేయడంతో ఆయన్ను అధికారులు టార్గెట్ చేశారన్న ప్రచారం ఎన్నికల వేళ జోరుగానే సాగింది. ఇందుకు తగ్గట్టుగా బెదిరింపుల ఆడియోలు, వీడియోలు ఆ సమయంలో వైరల్గా మారాయి. ఇక, కరూర్ కలెక్టర్ ఎన్నికల అధికారి వ్యవహరించిన అన్భళగన్ అధికార పక్షానికి ప్రత్యక్షంగానే సహకరిస్తున్నారంటూ కాంగ్రెస్ అభ్యర్థిగా జ్యోతిమణి, అరవకురిచ్చి అసెంబ్లీ డీఎంకే అభ్యర్థిగా సెంథిల్ బాలాజి తీవ్రంగానే విరుచుకుపడ్డారు. అదే సమయంలో ప్రచార ముగింపు రోజున సాగిన అల్లర్లు, ఎన్నికల రోజున వివాదాలు...ఇలా చెప్పుకుంటూ పోతే, ప్రతి విషయంలోనూ అధికారులు అధికార పక్షానికి అండగా వ్యవహరించారన్న ఆరోపణల్ని, ఆగ్రహాన్ని ప్రతి పక్షాలు కేంద్ర ఎన్నికల కమిషన్ వరకు తీసుకెళ్లాయి. ఈవీఎంలను భద్రత పరిచిన స్ట్రాంగ్ రూములకు భ›ద్రత మరీ తక్కువగా నియమించి ఉండడంవంటి వ్యవహారాలు ఎన్నికల కమిషన్ విచారణకు సైతం దారి తీశాయి. ఈ ఎన్నికల వివాదం అన్నాడీఎంకే – కాంగ్రెస్ అభ్యర్థి మధ్య అని చెప్పడం కన్నా, కలెక్టర్ అన్భళగన్– కాంగ్రెస్ అభ్యర్థి జ్యోతిమణి మధ్య అన్నట్టుగా మారింది. ఎట్టకేలకు ఈ ఎన్నికల్లో జ్యోతిమణి ఎంపీగా విజయకేతనం ఎగుర వేశారు. అయినా, ఈ ఇద్దరి మధ్య వివాదం సమసినట్టు లేదు. ఇందుకు కారణం, వివాదం మరింతగా ముదిరిందనేందుకు తగ్గట్టుగా కలెక్టర్పై జ్యోతి మణి విరుచుకు పడడం గమనార్హం. ప్రజాసమస్యలపై ఎవర్ని ఆదేశించాలి.. అరవకురిచ్చి ఎమ్మెల్యే సెంథిల్ బాలాజీతో కలిసి ఎంపీ జ్యోతి మణి శని, ఆదివారాల్లో నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ప్రజా సమస్యల్ని తెలుసుకున్నారు. అయితే, అధికారులు తన పర్యటనలో కనిపించక పోవడంతో తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. జిల్లా కలెక్టర్ పనితీరును గుర్తు చేస్తూ, ఏ మేరకు తమకు ఆయన మర్యాదను ఇస్తున్నారో అన్నది తాజాగా స్పష్టం అవుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా ఎంపీగా ఉన్న తనను, ఎమ్మెల్యేగా ఉన్న సెంథిల్బాలాజీని తాగు నీటి ఎద్దడిపై జరిగిన సమావేశానికి ఆహ్వానించకపోవడం విచారకరంగా పేర్కొన్నారు. ఎంపీ అన్న కనీస మర్యాద కూడా ఇవ్వక పోగా, తన సెల్ నంబర్ను కలెక్టర్ బ్లాక్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల సమస్యలపై కలెక్టర్తో చర్చించలేని పరిస్థితి ఉందని, ఆయన పద్ధతి మార్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఎన్నికల సమయంలో తన సెల్ నంబర్ బ్లాక్ చేసి ఉంటారేమోనని, ఇకనైనా పద్దతి మార్చుకోవాలని, లేని పక్షంలో పార్లమెంట్లో కలెక్టర్ తీరును ప్రస్తావించక తప్పదని హెచ్చరించారు. -
నవశకానికి దిశానిర్దేశం
సాక్షి, విజయనగరం : అమరావతిలో రాష్ట్ర ముఖ్య మంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తరువాత తొలిసారిగా జిల్లా కలెక్టర్ల సదస్సు సోమవారం నిర్వహించనున్నారు. ఈ సదస్సుకు సంబంధించి అజెండాను ప్రభుత్వం రెండురోజుల క్రితమే ఖరారు చేసింది. ఈ సదస్సులో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న నవరత్నాలపై చర్చకు అధిక ప్రాధాన్యం ఇస్తూ ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. నవరత్నాల్లో ఉన్న పలు పథకాల అమలు గురించి అజెండాలో చేర్చా రు. వీటితోపాటు ప్రస్తుత వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో తలెత్తుతున్న సమస్యలపైనా దృష్టిసారించారు. ముఖ్యంగా ఎనిమిది అంశాలపై ఫోకస్ చేశారు. అందులో మొదటిది గ్రామ సచివాలయ వ్యవస్థ. ఆక్టోబర్ 2వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఈ వ్యవస్థతోపాటు ఆగస్టు 15వ తేదీ నుంచి విధుల్లోకి రానున్న గ్రామ వలంటీర్ల గురించి చర్చించాలని నిర్ణయించారు. ఆరో గ్యశ్రీ పథకం అమలు, 108, 104 సేవలు రెండో ప్రాధాన్యత అంశంగా చేర్పించారు. సెప్టెంబర్ నెల నుంచి ఇంటింటికి సరకులు పంపిణీ, సన్నబియ్యం పంపిణీ మూడో అంశంగా చేర్చారు. పాఠశాలల్లో పిల్లల నమో దు, పుస్తకాలు, యూనిఫాం పంపిణీ అంశం తర్వాత చర్చిస్తారు. కరువు, ప్రస్తుతం పంటలు సాగు పరిస్థితి, పశుగ్రాసం, తాగునీరు, విద్యుత్ సరఫరాపై సమీక్షిస్తారు. వైఎస్సార్ భద్రతా రాష్ట్రంలో జనరంజక పాలన మొదలైంది. వివిధ వర్గాలవారి సంక్షేమం కోసం ముఖ్యమంత్రి ఉన్నతస్థాయిలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. వాటి అమలుపై ఉన్నతాధికారులకు దిశానిర్దేశం చేశారు. దానిపై ఇప్పటికే తగిన ప్రణాళికలు రూపొందించారు. ఇక క్షేత్రస్థాయిలో అమలుకు అవసరమైన సూచనలు చేసేందుకు జిల్లా కలెక్టర్ల సదస్సు సోమవారం నిర్వహించనున్నారు. నవరత్నాల అమలుకు సంబంధించి... తాజాగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు అవసరమైన జిల్లా సమాచారంతో కలెక్టర్ హరిజవహర్లాల్ అమరావతికి పయనమయ్యారు. పెన్షన్ల పంపిణీ, ఇళ్ల పట్టాలు పంపిణీ, కౌలు రైతులకు రుణ అర్హత కార్డుల జారీ తదితర అంశాలు కూడా చర్చకు రానున్నాయి. వీటన్నింటిపై అధి కా రుల నుంచి సమాచారం తీసుకోవడమే కాకుండా ముఖ్యమంత్రి వీటిపై మార్గనిర్దేశనం చేస్తారు. పూర్తి సమాచారంతో వెళ్లిన కలెక్టరు ముఖ్యమంత్రి జగన్హన్రెడ్డి నిర్వహిస్తున్న జిల్లా కలెక్టర్ల సదస్సుకు జిల్లా కలెక్టర్ ఎం.హరిజవహర్లాల్ శనివారం సాయంత్రం జిల్లా నుంచి వెళ్లారు. ఆదివారం స్థానికంగా పనులు చూసుకుని సోమవారం సమావేశానికి హాజరవుతారు. కలెక్టర్ల సదస్సు ముఖ్య ఉద్దేశానికి సంబంధించి ముందే ప్రభుత్వం సమాచారం ఇచ్చింది. ఆ మేరకు పూర్తి సమాచారంతో కలెక్టర్ పయనమయ్యారు. కొత్త ముఖ్యమంత్రితో తొలి సదస్సు కావడంతో అజెండాలోని అంశాలకు సంబంధించిన సమాచారంతోపాటు... మరింత ఇతర సమాచారాన్ని కూడా కలెక్టర్ తీసుకెళ్లినట్టు తెలుస్తోంది. జిల్లా పరిస్థితులపై నివేదిక ప్రభుత్వ అజెండాకు అనుగుణంగా జిల్లాలో పరిస్థితులను కలెక్టర్ హరి జవహర్లాల్ ముఖ్యమంత్రికి నివేదించనున్నారు. జిల్లాలో 919 గ్రామపంచాయతీల్లో సచివాలయ ఏర్పాటు, సిబ్బంది నియామకంపై కసరత్తు చేసి తీసుకెళ్లారు. వారితోపాటు 50 కుటుంబాలకు ఒక వలంటీర్ నియామకానికి సంబంధించి నివేదిక తయారు చేశారు. అందులో జిల్లాలో 10,012 మంది వలంటీర్లు అవసరమని పేర్కొన్నారు. ⇔వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకంలో భాగంగా ఇప్పటికే జిల్లాలో 108 వాహనాలు 27, 104 వాహనాలు 19 ఉన్నట్లు కలెక్టర్ సీఎంకు నివేదించనున్నారు. వీటికి అదనంగా 108 వాహనాలు 9, 104 వాహనాలు 8 కావాలని కోరేందుకు సిద్ధమయ్యారు. ⇔ఇంటింటికీ రేషన్ సరుకులు పంపిణీ అంశం గురించి కలెక్టర్ సీఎంకు నివేదిస్తారు. జిల్లాలో ప్రస్తుతం 7,13,053 కార్డులు ఉన్నాయని, ఆయా కార్డులకు 1,20,784 క్వింటాళ్ల బియ్యం సరఫరా చేయాల్సి ఉందని, ఇందుకు అవసరమయ్యే వలంటీర్ల గురించి కూడా కలెక్టర్ వివరిస్తారు. ⇔విద్యకు సంబంధించి పిల్లల నమోదు, పుస్తకాల పంపిణీ, యూనిఫాం పంపిణీ గురించి నివేదిస్తారు. జిల్లాలో ఈ ఏడాది 1,44,356 మంది పిల్లలు బడిలో ఉన్నారు. వీరికి ఒక్కొక్కరికి మూడు జతల యూనిఫాం లెక్కన పంపిణీ చేయాల్సి ఉండగా ఇప్పటివరకు 54.90శాతం పంపిణీ చేశారు. పుస్తకాలు పంపిణీ కూడా 80శాతం పూర్తయింది. మిగతా పంపిణీకి సంబంధించి కార్యాచరణ వివరించనున్నారు. అమ్మ ఒడి పథకంలో అమలు చేస్తే లబ్ధిదారుల సంఖ్యపై ఇప్పటికే అధికారులు ఒక అంచనాకు రాగా ఆ విషయం కలెక్టరు వివరించనున్నారు. ⇔జిల్లాలో గతేడాది ఖరీఫ్, రబీలో ప్రకటించిన కరువు మండలాలకు రావాల్సిన పంటల నష్ట పరి హారం గురించి కలెక్టర్ ప్రస్తావించనున్నారు. ఖరీ ఫ్లో 8,917 హెక్టార్లలో పంట నష్టం జరిగింది. ఇందుకు 24,320మంది రైతులకు రూ.13.37 కోట్లు పంటల నష్ట పరిహారం రావాల్సి ఉంది. రబీలో 9388 హెక్టార్లలో పంట నష్టం జరిగింది. 30,893మంది రైతులకు రూ.9.25కోట్లు పరిహా రం రావాలి. సదస్సులో కలెక్టర్ ఈ అంశం ప్రస్తావించనున్నారు. జిల్లాలో ప్రస్తుతం నెలకొన్న వాతావరణ పరిస్థితులు, వర్షాల ఆలస్యం తదితర అంశాలు వల్ల కలిగే ఇబ్బందులు నివేదించనున్నారు. ⇔జిల్లాలో 1,06,126మంది పెన్షన్లు పొందుతున్నారు. పెన్షన్లు మొత్తం పెంపు తర్వాత నెలకు రూ.71.35కోట్లు అవసరం అవుతుంది. ఈ అంశంతో పాటు 60 ఏళ్లకు తగ్గిస్తే అదనంగా పెరిగే పెన్షనర్ల గురించి కూడా చర్చించనున్నారు. ⇔జిల్లాలో గత ప్రభుత్వ హయాంలో 23,405 మందికి ఇళ్ల పట్టాలు జారీ చేశారు. ఈ ప్రభుత్వం కొంతమందికి ఇళ్లు కట్టించి ఇవ్వాలని చూస్తోంది. వీటిపై వివరాలు కోరింది. అయితే ప్రస్తుతం దరఖాస్తులు పెండింగ్లో ఉండే లబ్ధిదారులు లేరని కలెక్టర్ నివేదికలో పొందుపరిచారు. ⇔ కౌలు రైతులకు రుణ అర్హత కార్డులు 13,218 జారీ చేశారు. ఈ వివరాలు కోరడంతో కలెక్టర్ సమాచారం సేకరించారు. దీని ఆధారంగా నూతన విధివిధానాలు రూపొందే అవకాశం ఉంది. -
ఒక్కరే ఉండాలి...అది ఉన్నతాధికారే..
సాక్షి, ఏలూరు (మెట్రో): బాధ్యతలు స్వీకరించి వారం రోజులు కాకముందే వినూత్న పద్ధతులను అమలు చేస్తున్నారు కలెక్టర్ రేవు ముత్యాలరాజు. జిల్లాలో ఇప్పటికే ఉన్నతాధికారులందరితోనూ సమావేశాన్ని నిర్వహించిన కలెక్టర్ ప్రతి సోమవారం నిర్వహించే మీ కోసం కార్యక్రమంలోనూ మూస పద్ధతికి స్వస్తి పలికారు. సమూల మార్పులకు చర్యలు చేపట్టారు. సోమవారం వచ్చిందంటే జిల్లా అధికారులంతా మూకుమ్మడిగా కలెక్టరేట్లో మీ కోసం కార్యక్రమానికి వస్తారు. మీ కోసం కార్యక్రమంలో కలెక్టర్కు ప్రజలు ఫిర్యాదులు చేస్తుంటే ఆ ఫిర్యాదులను కలెక్టర్ సంబంధిత శాఖాధికారులకు అప్పగించి వాటి పరిష్కారం కోసం ఆదేశాలు జారీ చేస్తుంటారు. ఇది ఇప్పటి వరకూ కొనసాగింది. అయితే కలెక్టర్ రేవు ముత్యాలరాజు ఈ పద్ధతిని మానేయాలని అధికారులను ఆదేశించారు. కేవలం ప్రాధాన్యం కలిగిన అధికారులు మాత్రమే మీ కోసం కార్యక్రమానికి హాజరు కావాలంటూ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఫిర్యాదులు రానీ, వచ్చినా అరకొరా వచ్చే శాఖల అధికారులు ఈ కార్యక్రమానికి రావాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ప్రజలు ప్రధానంగా ఎదుర్కొనే సమస్యలు ఉన్న శాఖల అధికారులు మాత్రమే రావాలనీ, వచ్చిన ఫిర్యాదులు తక్షణమే పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు. ఒక్కరే ఉండాలి... అదీ ఉన్నతాధికారే.. ఇప్పటివరకూ ప్రతి సోమవారం నిర్వహించే మీ కోసం కార్యక్రమానికి ఒక్కో శాఖ నుంచి ఇద్దరేసి అధికారులు హాజరవుతుండేవారు. వచ్చే సోమవారం నుంచి ప్రతి శాఖ నుంచి ఒక్కరు మాత్రమే మీ కోసం కార్యక్రమానికి హాజరు కావాలంటూ కలెక్టర్ ఆదేశాలిచ్చారు. వచ్చే అధికారి కూడా ఆ శాఖ ఉన్నతాధికారి అయి ఉండాలని స్పష్టం చేశారు. కిందిస్థాయి సిబ్బందిని పంపిస్తే వారిపై చర్యలు ఉంటాయని కలెక్టర్ హెచ్చరించారు. అధికారులు ఎవరైనా జిల్లా దాటివెళ్లాల్సి వస్తే తప్పనిసరిగా తన అనుమతి తీసుకోవాలని ఆదేశించారు. తిప్పిపంపిన కలెక్టర్ ఫిర్యాదులు రాని శాఖలైన అగ్నిమాపక, రవాణా, చేనేత, ఆర్టీసీ, నెడ్క్యాప్, ఎల్డీఎం, జిల్లా మలేరియా, ఆడిట్, మహిళా కౌన్సిలర్ విభాగం, కమర్షియల్ టాక్స్ వంటి శాఖల అధికారులను కలెక్టర్ సోమవారం మీ కోసం కార్యక్రమం నుంచి తిప్పి పంపించేశారు. ఈ సమయాన్ని ఇతర పనులకు కేటాయించాలని, ప్రజలకు మెరుగైన సేవలు అదించాలని కలెక్టర్ సూచించారు. ఫిర్యాదుదారులకు ఫోన్ ప్రతి సోమవారం వచ్చిన ఫిర్యాదులు పరిష్కారమయ్యాయా, కాలేదా, ఎందుకు కాలేదు వంటి వాటిపై ఇక నుంచి కలెక్టర్ ప్రత్యేకించి ప్రతి శుక్రవారం పరిశీలించనున్నారు. పరిష్కారమయ్యాయని అధికారులు చెప్పే అర్జీలను పునఃపరిశీలించనున్నారు. కలెక్టర్ అప్పటికప్పుడు ఏదో ఒక ఫిర్యాదుదారునికి ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకోనున్నారు. అధికారుల్లో జవాబుదారీతనం పెంచేందుకు కలెక్టర్ ముత్యాలరాజు కొత్త విధానాలను అమలు చేస్తున్నారు. ఉద్యోగుల కోసమూ ‘మీ కోసం’ ఉద్యోగుల సమస్యలనూ పరిష్కరించేందుకు ఆయా శాఖల ఉన్నతాధికారులతో మీ కోసం కార్యక్రమాన్ని ప్రతినెలా నిర్వహించేందుకు చర్యలు తీసుకోనున్నట్లు కలెక్టర్ ముత్యాలరాజు చెప్పారు. ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తేనే ప్రజలకు పూర్తిస్థాయిలో సేవలను ప్రతి ఉద్యోగి అందించగలుగుతారని ఆయన అభిప్రాయపడ్డారు. వీలైతే ఈనెల 21న ఉద్యోగుల మీ కోసం కార్యక్రమాన్ని నిర్వహించనున్నామని కలెక్టర్ ‘సాక్షి’కి తెలిపారు. ఉద్యోగులు ఎదుర్కొనే సమస్యలను నేరుగా తన దృష్టికి తీసుకురావచ్చని సూచించారు. -
తండ్రి కోరికను కాదనుకుండా...
నాకు ఇంజినీరింగ్ అంటే ఇష్టం. మా నాన్నకు ప్రజలకు సేవ చేసే ఉద్యోగం అంటే ఇష్టం. ఎందుకంటే ఆయన తన జీవిత కాలమంతా ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఇంజినీర్గా పని చేశారు. అదంతా రొటీన్. పరిపాలనా విభాగాల్లో ఉద్యోగం చేస్తే పేద, మధ్య తరగతి ప్రజలకు కొంతయినా సేవ చేసే భాగ్యం కలుగుతుందనే భావన ఆయనది. నా ఇష్టాన్ని, నాన్న ఆశయాన్ని కలగలిపి నా జీవన పయనం సాగిస్తున్నాను. ఎలక్ట్రికల్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ పూర్తి చేసి.. తరువాత గ్రూప్–1 పరీక్ష రాసి తొలిసారి ఆర్డీఓగా ఉద్యోగ బాధ్యతలు స్వీకరించాను. తరువాత వివిధ జిల్లాల్లో పలు బాధ్యతలు నిర్వర్తిస్తూ.. తొలిసారిగా ఇంత పెద్ద జిల్లాకు కలెక్టర్గా రావడం అదృష్టంగా భావిస్తున్నాను. అన్ని సమస్యలూ కలగలిపిన జిల్లా ఇది. అన్నింటినీ సమన్వయం చేసుకుంటూ అందరికీ అభివృద్ధి ఫలాలను అందించాలి. కార్యాలయంలో కూర్చొని మిగిలిన వారిపై గద్దిస్తే సరిపోదు. ప్రజాక్షేత్రంలో ఉంటూ ‘రండి పని చేద్దాం’ అని పిలుపునిచ్చే మనస్తత్వం నాది. ఆ దిశగానే అడుగులు వేస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కలల పంటయిన నవరత్నాలను విజయవంతంగా అమలు చేయడం నా ముందున్న ప్రథమ కర్తవ్యం. ‘సాక్షి’తో జిల్లా నూతన కలెక్టర్ డి.మురళీధర్రెడ్డి :తండ్రే ఆయనకు స్ఫూర్తి. వృత్తిలో ఒడిదొడుకులు సహజం. బాధ కలిగినా, సంతోషం కలిగినా ఎక్కువగా రియాక్ట్ కాకూడదనే తన తండ్రి సిద్ధాంతాన్ని విశ్వసించారు. బ్యాలెన్స్డ్గా ఉంటే అదే సక్సెస్ను తెచ్చి పెడుతుందనే సూత్రాన్ని అమలు చేస్తున్నారు. టెక్నాలజీలో ముందుకు వెళ్దామనుకున్నారు. తండ్రి మాత్రం ప్రజలకు సేవచేసే ఉద్యోగం సంపాదించాలన్నారు. తన ఆసక్తిని పక్కన పెట్టకుండా, తండ్రి కోరికను కాదనుకుండా నొప్పింపక తానొవ్వక అన్నట్టు అడ్మినిస్ట్రేటివ్ సర్వీసులో చేరి వృత్తికి సాంకేతికతను జోడించి ముందుకు వెళ్తున్నారు. ఆయనే మన కలెక్టర్ డి.మురళీధర్రెడ్డి. బాల్యం నుంచి కలెక్టర్ పదవి వరకు తన ప్రస్థానాన్ని ‘సాక్షి’తో పంచుకున్నారు. ప్రతిష్టాత్మకమైన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్గా తన ప్రాధాన్య అంశాలను వివరించారు. స్వస్థలం, చదువు.. మాది కర్నూలు జిల్లా పాణ్యం మండలం బలపనూరు గ్రామం. బాల్యం వివిధ ప్రాంతాల్లో గడిచింది. ఉద్యోగ రీత్యా మా తండ్రి గారు ఏలూరు, రాజమండ్రి తదితర ప్రాంతాల్లో పనిచేయడం వల్ల తిరగాల్సి వచ్చేది. స్వగ్రామమైన బలపనూరులోనే ప్రాథమిక విద్యాభ్యాసం చేశాను. ఏడో తరగతి వరకు అక్కడే చదివాను. తర్వాత కర్నూలులో పదో తరగతి వరకు చదివాను. ఇంటర్మీడియట్ (ఎంపీసీ) గుంటూరులోని విజ్ఞాన్ కళాశాలలో, కర్నూల్లో పుల్లారెడ్డి ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్, తిరుపతిలోని ఎస్వీ యూనివర్సిటీలో ఎంటెక్ చేశాను. కుటుంబ నేపథ్యం.. మాతండ్రి పేరు రవికుమార్రెడ్డి, తల్లి శ్యామల. మా నాన్న గారు ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో పనిచేశారు. ఏఈగా బాధ్యతలు ప్రారంభించి ఈఈ వరకూ ఎదిగి ఉద్యోగ విరమణ చేశారు. నా సతీమణి పేరు హేమ. వారిది కూడా కర్నూలే. పెద్దలు కుదిర్చిన వివాహం మాది. ఆమె ఎమ్మెస్సీ చేశారు. వివాహం తరువాత ఎంబీఏలో డిప్లమో చేశారు. ఇద్దరు పిల్లలు ఉన్నారు. బాబు మణిపాల్లో ఇంజినీరింగ్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. పాప వెల్లూరు బిట్స్లో కంప్యూటర్ ఇంజినీరింగ్ చదువుతోంది. ఇంజినీరింగ్ వైపు వెళ్దామనుకుని.. అడ్మినిస్ట్రేటివ్ సర్వీసులోకి.. తండ్రి ఇంజినీర్గా పని చేయడంతో నాకు కూడా ఇంజినీర్గా స్థిరపడాలని ఉండేది. అందుకే ఎలక్ట్రికల్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్లో పీజీ చేశాను. నాకేమో ఇంజినీరింగ్ వైపు ఆసక్తి. టెక్నికల్గా వెళ్దామనుకున్నాను. కానీ మా తండ్రి అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ వైపు వెళ్లాలని కోరుకునేవారు. ప్రజలకు సేవ చేసే సర్వీసులో ఉద్యోగం సంపాదించాలని, పేదల సేవలో ఉండే ఉద్యోగం చేస్తే మనిషికి సంతృప్తి అనేది ఉంటుందని చెప్పేవారు. తొలుత ఇంజినీరింగ్ సర్వీస్ కోసం ప్రిపేర్ అయ్యాను. అలాగని తండ్రి కోరికను కాదనలేకపోయాను. అడ్మినిస్ట్రేటివ్ సర్వీసు కోసం ప్రయత్నించాను. ఆ ప్రయత్నంలో భాగంగా 1996లో గ్రూప్–1 సర్వీసు వచ్చింది. ఆ తర్వాత ఇటువైపు ఉండిపోయాను. అలాగని అడ్మినిస్ట్రేటివ్లోకి వచ్చిన తర్వాత టెక్నాలజీని ఎక్కడా వదలలేదు. టెక్నాలజీకి దూరం కాలేదు. నా స్టైల్ ఆఫ్ ఫంక్షన్లో కూడా ఎప్పుడూ సాంకేతికత ఉంటుంది. ప్రతి దాంట్లో సాంకేతికతను జోడిస్తాను. వృత్తిలో ఆ ఇద్దరే ఆదర్శం అడ్మినిస్ట్రేటివ్ సర్వీసులోకి వచ్చాక ఓ ఇద్దరు సీనియర్ ఐఏఎస్లను ఆదర్శంగా తీసుకున్నాను. మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్ కృష్ణయ్య, అగ్రికల్చర్ ప్రిన్సిపల్ సెక్రటరీ బి.రాజశేఖర్తో పనిచేసిన అనుభవం ఉంది. వారి నుంచి ఎంతో నేర్చుకున్నాను. ప్రతి దానిలో వారి ద్వారా స్ఫూర్తి పొందాను. వారిని నేనొక మోడల్గా తీసుకునే వాడిని. పనిచేసే చోట ప్రతి అధికారి వద్ద మంచి సంబంధాలు కొనసాగిస్తూ రావడం నాకు ఆయా విభాగాల్లో మంచి సంతృప్తిని ఇచ్చింది. ఫస్ట్టైమ్ కలెక్టర్గా ఫీలింగ్? ఒకసారి కలెక్టర్గా చేస్తే రాష్ట్రస్థాయి పోస్టుకు వెళ్లే సమయంలో ఎంతో ఉపయోగపడుతుంది. స్వచ్ఛభారత్ కమిషన్గానీ, ఈజీఎంఎంగానీ, అగ్రికల్చర్ కమిషనర్ పోస్టులు రాష్ట్రస్థాయి పోస్టులే. కలెక్టర్గా చేసి వెళ్లిన తరువాత అన్ని విభాగాలపై ఒక పట్టు అనేది వస్తుంది. మిగిలిన పోస్టులలో ఇంత గుర్తింపు రాదు. సీఎం జగన్ అప్పగించిన బాధ్యతపై.. రాష్ట్రంలో తూర్పు గోదావరి జిల్లాను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారు. చాలా మంచి కలెక్టర్లు ఇక్కడ పనిచేశారు. ఇక్కడా చాలా విభిన్నంగా ఉంటుంది. అలాగే రాజకీయంగా కూడా.. ఇలాంటి జిల్లాకు కలెక్టర్గా నియమించడం అదృష్టంగా భావిస్తున్నాను. ప్రాధాన్య అంశాలు వైద్య, ఆరోగ్యం, విద్య అభివృద్ధికి మొదటి ప్రాధాన్యం ఇస్తాను. వైద్యులు ఆస్పత్రుల్లో వారివారి పనులు సక్రమంగా నిర్వర్తిస్తే ఎటువంటి ఇబ్బందులూ ఉండవు. ఖర్చు కూడా చేయాల్సిన పని ఉండదు. అదే విధంగా ఉపాధ్యాయులు కూడా తమ వృత్తిని సక్రమంగా నిర్వర్తిస్తే ప్రభుత్వ పాఠశాలలు మూతవేయాల్సిన పని ఉండదు. చాలామంది ఉపాధ్యాయులు సక్రమంగా పాఠశాలలకు వెళ్లడం లేదని తమకు తెలిసిందని, దీనిపై మొదటిసారిగా ప్రత్యేక దృష్టి సారించి విద్యా వ్యవస్థను బలోపేతం చేస్తాను. నాకు కావల్సింది నాణ్యమైన విద్య మాత్రమేనని, అంతే తప్ప పర్సంటేజ్లో మొదటి స్థానం ఉండడం కాదని జిల్లా విద్యాశాఖాధికారికి చెప్పాను. ఏజెన్సీపై ప్రధాన దృష్టి నేను శుక్రవారం విధుల్లో చేరాను. శనివారం, ఆదివారం ఏజెన్సీలో గడిపాను. అక్కడ ఉన్న సమస్యలపై ప్రత్యక్షంగా అవగాహన ఉంటుంది. ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగిని అక్కడ పోస్టింగ్ వేస్తే అది ఒక శిక్షలా భావిస్తారు. అగ్రికల్చర్లో నేను ఉన్నప్పుడు ఏజెన్సీకి వేస్తారంటే మా వాళ్లు ‘వద్దుసార్ ట్రైబల్ ఏరియా సార్, అక్కడ పీవోలు వదలరు సార్’ ఇలా రకరకాలుగా అంటుండేవారు. సీనియర్ అధికారులుగా మేమే ముందుగా వెళ్తే మిగిలివారిలో ఆత్మస్థైర్యం వస్తుంది. అంతే కాకుండా మనం ఇక్కడ కూర్చుని వెళ్లండి అంటే బాగుండదు. నేను మా అధికారులకు, డీఎంహెచ్వోకు చెప్పేదదే. అక్కడికి వెళ్లండి.. ఒక నైట్ అక్కడ ఉండండి అంటుంటాను. డీఎంహెచ్వో వెళ్లారనుకోండి, ఆయన నైట్ అక్కడ ఉంటే ఆయనతో పాటు వైద్యులంతా అక్కడ ఉంటారు. ఆయన ఉదయం వెళ్లి రాత్రికి వచ్చేస్తే ఆయనతోపాటు తిరిగి డాక్టర్లూ వచ్చేస్తారు. నాణ్యమైన విద్యావిధానం అవసరం.. నాణ్యమైన విద్య కావాలని అధికారులను కోరుతున్నాను. పిల్లలకు ఏ పరీక్ష పెడుతున్నామో అదే పరీక్షను ఉపాధ్యాయులకు పెడితే ఎంత వరకు విజయవంతం అవుతారో చూడాలని డీఈవోకు వివరించాను. పిల్లలకు పరీక్ష పెట్టిన ఉపాధ్యాయులు, తమ సబ్జెక్టుల్లో ఎలాంటి నిపుణత కలిగి ఉంటారనేది తెలుసుకోవచ్చని అన్నాను. అటువంటప్పుడే మనం కోరుకున్న విద్యను విద్యార్థులకు అందించగలమని అన్నాను. నాకు ఉద్యోగం వచ్చేసింది.. నాకేంటి అనేది ఉండకూడదు. ప్రభుత్వ ఉద్యోగంలో ప్రతిదీ నేర్చుకుంటూ ఉండాలి. టీచర్కు ఇది ఇంకా ఎక్కువగా ఉండాలి. ఒక మాడ్యూల్ చేయమని డీఈఓకు చెప్పాను. అసోసియేషన్ వాళ్లతో కూడా సమావేశం పెట్టమని చెప్పాను. దీనిలో వారికి ఏమైనా సాధకబాధకాలు చెప్పుకోవచ్చు. ఆస్పత్రులపై దృష్టి సారిస్తా.. జిల్లాలోనూ, ఏజెన్సీ ప్రాంతాల్లోను ఆస్పత్రుల్లో ఉండే సిబ్బంది వివరాలను సేకరిస్తున్నాను. ఏజెన్సీ ప్రాంతాల్లో వైద్యులను నియమించడంతో పాటు మెరుగైన వైద్యం అక్కడివారికి అందజేసేలా చర్యలు తీసుకుంటాను. మాతా శిశు మరణాల తగ్గింపునకు ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రత్యేక చర్యలు తీసుకుంటాను. చింతూరు, రంపచోడవరం ఆస్పత్రుల్లో వైద్యుల కొరత ఉంది. కాంట్రాక్టు ప్రాతిపదికన తీసుకుందామంటే రాజమహేంద్రవరం నుంచి, కాకినాడ నుంచి రంపకు ఫర్వాలేదు కానీ, చింతూరుకు ఇబ్బందే. కొన్ని అంశాలను గుర్తించాము. స్పెషలిస్ట్ డాక్టర్లను భద్రాచలం నుంచి చింతూరుకు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తాను. డాక్టర్లు అందరినీ కాకుండా ఒకసారి డీఎంహెచ్వోతో కూర్చుని మాట్లాడి ప్రతి నెలా కాకపోయినా ప్రతి ఆరు నెలలకైనా ఏజెన్సీకి వెళ్లాలనే అంశాన్ని పరిశీలిస్తున్నాను. రొటేషన్ పద్థతిలో ఏజెన్సీ ప్రాంతాల్లో వైద్యులు పని చేసేలా చర్యలు చేపడతాను. బాల్యంలో సంతోషపడిన,బాధపడిన ఘటనలు.. కుటుంబపరంగా కానీ, ప్రాథమిక, ప్రాథమికోన్నత విద్యలో ఎక్కువ అంచనాలు ఉన్నవారు బాధపడతారు. నా సామర్థ్యాన్ని బట్టి నేను పనిచేయడమే నేర్చుకున్నాను. ఉత్తమ ర్యాంకులు..! చదువులో కూడా నేను టాప్లో రావాలని ఎప్పుడు అనిపించలేదు. కానీ టాప్ ప్లేస్లో ఉండేవాడిని. గ్రూప్–1లో కూడా సెకండ్ ర్యాంక్ వచ్చింది. సినిమాలపై.. సినిమాలంటే ఇష్టం. ఎక్కువగా చూస్తాను. తెలుగు సినిమాలు ఎక్కువగా చూస్తాను. చిన్నప్పుడు సహజంగా ఎన్టీఆర్.. తరువాత కమల్హాసన్, మాధవన్లను.. అభిమానించేవాడిని. ఈ జనరేషన్లో ప్రత్యేకంగా ఎవరూ లేరు. ఫిట్నెస్పై.. చిన్నప్పటి నుంచి యాక్టివ్ ఫిజికల్ లైఫ్ నాది. చిన్నపుడు ఎన్సీసీ, ఇంటర్మీడియట్లో డ్రిల్, తరువాత షటిల్, క్రికెట్, యుక్త వయసులో ఆడే అన్ని క్రీడల్లో పాల్గొనేవాడిని. ప్రత్యేకంగా ఒకటని లేదు. ఫిట్నెస్పై ఎక్కువ దృష్టి పెడతాను. పనివేళల్లో పనిచేస్తే చాలు.. ప్రభుత్వం నిర్దేశించిన విధంగా ప్రతి ఉద్యోగి తనకు కేటాయించిన విధులను కార్యాలయ పని వేళల్లో సక్రమంగా చేస్తే సరిపోతుంది. తాను ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6.30 వరకు కలెక్టరేట్లో ప్రజలకు అందుబాటులో ఉంటాను. ఎక్కడ ఏ విభాగంలో అవినీతి జరుగుతున్నా నేరుగా తమ దృష్టికి తీసుకురావచ్చు. నవరత్నాలే మొదటి ప్రాధాన్యం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న నవరత్నాలే మొదటి ప్రాధాన్యం. ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలు అందరికీ అందేలా చేసేందుకు కృషి చేస్తాను. పేద వర్గాల సంక్షేమమే ప్రధాన ఉద్దేశంగా రాష్ట్ర ప్రభుత్వం నవరత్న పథకాలను ప్రవేశపెట్టింది. ప్రభుత్వ నిర్ణయం ఎలా ఉంటే వాటిని నేరుగా అమలు చేయాల్సిన బాధ్యత అధికారులదే. వీటిలో ఏవిధమైన నిర్లక్ష్యం సహించను. వ్యవసాయంలో కొత్త విధానాలకు శ్రీకారం జిల్లాలో 4 లక్షలకు పైగా హెక్టార్లలో సాగు జరుగుతున్నట్లు చెబుతున్నారు. మిగిలిన జిల్లాల కన్నా తూర్పుగోదావరి జిల్లాలో వ్యవసాయ రంగంలో సమస్యలు తక్కువగా ఉంటాయి. రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధరతో పాటు పంటను విక్రయించుకునేలా ప్రత్యేక మార్కెటింగ్ యార్డులు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సి ఉంది. రైతు ఆదాయాన్ని పెంచేలా పంట ఉత్పత్తులు ఉండాలి. ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా జీరో బేస్డ్ బడ్జెట్ కింద ప్రకృతి వ్యవసాయం చేయడంపై దృష్టి పెడతా. ఏజెన్సీ ప్రాంతాల్లో రైతులు పండించిన పంట బయటకు తీసుకు వెళ్లడానికి ఇబ్బందులు పడుతున్నారు. అటువంటి ప్రాంతాల్లో మినీ ప్రాసెసింగ్ యూనిట్లు ఎక్కువగా పెట్టాల్సి ఉంది. అదే విధంగా ఆక్వా రంగాన్ని అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపడతాం. పోలవరం సమస్యలు పరిష్కరిస్తా పోలవరం నిర్వాసితులకు పూర్తి స్థాయిలో న్యాయం జరిగేలా ఇప్పటికే అధికారులు చర్యలు చేపట్టారు. దీనికి ప్రత్యేకంగా ఒక వెబ్సైట్ కూడా ఏర్పాటు చేశారు. ఎవరైనా అర్హులై ఉండి ప్రభుత్వ సాయం అందకపోతే తప్పకుండా పరిశీలిస్తాం. ఏజెన్సీలో ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కింద భూములు కోల్పోయిన వారికి మంచి భవనాలను కట్టించి ఇస్తాం. రంగం మారడం వల్ల నిరాశచెందారా? అదేంలేదు. నేను ఆర్డీవో స్థాయి నుంచీ సాంకేతికతను వినియోగిస్తూ వస్తున్నాను. ఏ బాధ్యతలు చేపట్టినా సంతృప్తిగానే చేశాను. అనంతపురంలో శిక్షణ అయిన తర్వాత గద్వాల్ ఆర్డీవోగా మొదటి పోస్టింగ్ వచ్చింది. ఆ తర్వాత విజయనగరం ఆర్డీవోగా, అక్కడే హౌసింగ్ పీడీ చేశాను. అనంతరం వైద్య, ఆరోగ్య మంత్రి అరుణ వద్ద పీఏగా వెళ్లాను. మాకు పదోన్నతి వచ్చే సమయంలో హైదరాబాద్లో ఆర్కియాలజీ మ్యూజియంలో తక్కువ సమయం పనిచేశాను. అనంతరం భద్రాచలం దేవస్థానం ఈవోగా పనిచేశాను. అక్కడి నుంచి విజయనగరం డీఆర్డీఏ పీడీగా బదిలీ అయ్యాను. తర్వాత వుడా కార్యదర్శిగా, జీవీఎంసీ అడిషనల్ కమిషనర్గా పనిచేశాను. అక్కడి నుంచి ఏపీఐఐసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా బదిలీ అయింది. తదుపరి కృష్ణా జిల్లాలో అడిషనల్ జాయింట్ కలెక్టర్గా పనిచేశాను. ఐఏఎస్గా పదోన్నతి వచ్చాక కాకినాడ పోర్ట్ డైరెక్టర్గా వచ్చాను. తర్వాత గుంటూరు జాయింట్ కలెక్టర్గా, ఈజీఎంఎం సీఈవోగా పనిచేశాను. రాష్ట్ర విభజన తర్వాత స్వచ్ఛ భారత్ మిషన్ మొదటి ఎండీగా చేశాను. ఈ పోస్టులో ఉండగా వ్యవసాయ శాఖ స్పెషల్ కమిషనర్గా అదనపు బాధ్యతలు అప్పగించారు. ప్రతిచోటా సంతృప్తికరంగానే విధులు నిర్వహించాను. అసంతృప్తి అనేది లేదు. తండ్రే స్ఫూర్తి.. నా తండ్రినే స్పూర్తిగా తీసుకున్నాను. ఏ ఉద్యోగికైనా వృత్తిలో ఒడుదొడుకులు సహజమని, అటువంటప్పుడు ఏ సవాల్ ఎదురైనా బాధపడకూడదనే విషయాన్ని తండ్రి రవికుమార్రెడ్డి నుంచి నేర్చుకున్నాను. మా తండ్రి నీటిపారుదల విభాగంలో చిన్న ఉద్యోగం చేసినప్పటికీ ఎన్నో ఒడుదొడుకులు వస్తున్నా, వాటిని పట్టించుకోకుండా వృత్తిలో మమేకమై పని చేస్తుండేవారు. తనకు బాధకలిగినా, సంతోషం కలిగిన ఎక్కువగా స్పందించేవారుకాదు. బ్యాలెన్స్డ్గా ఉండేవారు. నేనూ అలాగే ఉండాలనుకునేవాడిని. ఆయనే నాకు స్ఫూర్తి. ఆయనలా పని చేయాలనే సంకల్పం మొదటి నుంచీ ఉంది. కలెక్టర్ : డి.మురళీధర్ రెడ్డి తల్లిదండ్రులు : రవికుమార్రెడ్డి, శ్యామల స్వస్థలం : బలపనూరు, కర్నూలు జిల్లా భార్య : హేమ పిల్లలు : నిఖిత్, రచన -
‘కౌంటింగ్ సెంటర్ల వద్ద మూడంచెల భద్రత’
తూర్పుగోదావరి జిల్లా: ప్రశాంత వాతావరణంలో ఎన్నికల కౌంటింగ్కు ఏర్పాట్లు జరుగుతున్నాయని, కౌంటింగ్ సెంటర్ల వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేస్తున్నట్లు తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా తెలిపారు. కాకినాడలో విలేకరులతో మాట్లాడుతూ.. ఈ నెల 23వ తేదీ ఉదయం ఆరున్నర గంటలకు కౌంటింగ్ సిబ్బంది, ఏజెంట్లు కౌంటింగ్ సెంటర్లకు హాజరుకావాలని సూచించారు. స్ట్రాంగ్రూంల దగ్గరలోనే కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. ఉదయం ఏడున్నర గంటలకు స్ట్రాంగ్ రూమ్లు తెరుస్తామన్నారు. 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపుతో కౌంటింగ్ ప్రారంభమౌతుందని తెలిపారు. నియోజకవర్గంలో పోలింగ్ కేంద్రాలను బట్టి 12 నుంచి 14 టేబుళ్లు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. రంపచోడవరం నియోజకవర్గంలో అత్యధికంగా 29 రౌండ్లలో ఓట్ల లెక్కింపు ఉంటుందని, పెద్దాపురం, కాకినాడ సిటీ, రాజమహేంద్రవరం సిటీ, మండపేట నియోజకవర్గాల్లో అత్యల్పంగా 16 రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరుగుతుందని తెలిపారు. ఎన్నికల నిబంధనల ప్రకారం కౌంటింగ్ రోజున కాకినాడ సిటీలో ఊరేగింపులకు అనుమతి లేదన్నారు. కౌంటింగ్ హాల్లో ఏ పార్టీ ఏజెంట్ అయినా నిబంధనలు ఉల్లంఘించి వ్యవహరిస్తే ఆర్ఓ చర్యలు తీసుకుంటారని హెచ్చరించారు. జిల్లాలో కౌంటింగ్ ప్రక్రియ కోసం 5098 మంది ప్రభుత్వ సిబ్బందిని వినియోగిస్తున్నామని వివరించారు. ఇప్పటివరకు 19 అసెంబ్లీ నియోజకవర్గాలకు 21,727, మూడు పార్లమెంటు స్థానాలకు 19,418 పోస్టల్ బ్యాలెట్లు అందాయని పేర్కొన్నారు. -
అన్నదాత.. ఆక్వా జిల్లాకు రెండు కళ్లు
ఆకివీడు: వ్యవసాయం, ఆక్వా రంగాలు జిల్లాకు రెండు కళ్లులాంటివని, వాటి అభివృద్ధికి తగిన ప్రణాళికలు రూపొందిస్తామని కలెక్టర్ ప్రవీణ్కుమార్ చెప్పారు. మండలంలోని చినకాపవరం, రామయ్యగూడెం ప్రాంతాల్లోని ఆక్వా చెరువులను గురువారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా విలేకర్లతో మాట్లాడుతూ జిల్లాలో ప్రధాన వనరులుగా ఉన్న వ్యవసాయం, ఆక్వా రంగాన్ని అభివద్ధి చేసినప్పుడే జిల్లా ప్రగతి పథంలో ముందుకు వెళుతోందని అన్నారు. పారిశ్రామికంగా జిల్లా అంతగా అభివృద్ధి చెందలేదన్నారు. వరి రైతులు పడుతున్న ఇబ్బందుల్ని పరిశీలించి పరిష్కరిస్తున్నామన్నారు. ధాన్యానికి మద్దతు ధర లభించేందుకు, ధాన్యాన్ని కొనుగోలు చేసేలా చర్యలు తీసుకున్నామన్నారు. ఆక్వా సాగులోని ఇబ్బందులను రైతులు, రైతు సంఘాల ప్రతినిధులు తనదృíష్టికి తీసుకువచ్చారని తులిపారు. జిల్లాలో 67,518 హెక్టార్లలో ఆక్వా చెరువులున్నాయని, దీనిలో 21 వేల హెక్టార్లలో రొయ్యల సాగు చేస్తున్నారన్నారు. చేపల సాగులో మేత, ఇతరత్రా వినియోగంలో అధిక వ్యయం తగ్గించుకునేందుకు రైతులకు అవగాహన కల్పిస్తామని చెప్పారు. రొయ్యల సాగు తీవ్ర ఒడిదుడుకుల్లో ఉందని రైతులు చెబుతున్నారన్నారు. నష్టం అపారంగా ఉంటుందని, లాభాలు వస్తే అంతంత మాత్రమేనని రొయ్య రైతులు తెలిపారన్నారు. రొయ్యల ధరను సిండికేట్గా ఏర్పడి వ్యాపారులు తగ్గిస్తున్నారనే వాదనను క్షుణ్ణంగా పరిశీలిస్తామన్నారు. రైయ్య రైతులకు కోల్డ్ స్టోరేజ్లు, ప్రాసెసింగ్ యూనిట్లు తదితర సమ్యలున్నాయని చెప్పారు. వాటి పరిష్కారానికి ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామన్నారు. జిల్లాకు ప్రధాన ఆదాయం వనరుగా ఉన్న ఆక్వా రంగాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ధాన్యానికి «మద్దతు ధర ప్రకటించినట్లుగా రొయ్యలు, చేపల ధరలు ప్రభుత్వం ప్రకటించకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని రైతులు చెప్పారని కలెక్టర్ తెలిపారు. ఆక్వా జోన్ల ఏర్పాటుకు సన్నాహాలు జిల్లాలో ఆక్వా జోన్ల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నట్టు కలెక్టర్ చెప్పారు. ఆక్వా అభివృద్ధి జరిగితే జిల్లాలో తలసరి ఆదాయం పెరుగుతుందన్నారు. వరి రైతులకు ఇబ్బంది లేకుండా ఆక్వా రంగాన్ని ప్రోత్సహిస్తామన్నారు. కొత్తగా చెరువులు తవ్వేందుకు అనుమతులను జిల్లా స్టీరింగ్ కమిటీ సమావేశాల ద్వారా మంజూరు చేస్తామన్నారు. రొయ్య రైతుల్ని ఆదుకోవాలి రొయ్య రైతుల్ని ఆదుకోవాలని, ప్రాసెసింగ్ యూనిట్లు, కోల్డ్ స్టోరేజ్ల నిర్మాణానికి అనుమతులు ఇవ్వాలని జాతీయ రొయ్య రైతుల సమాఖ్య అధ్యక్షుడు ఇందుకూరి మోహనరాజు, రొయ్య రైతుల సంఘం జిల్లా అధ్యక్షుడు వేగేశ్న సత్యనారాయణరాజు కలెక్టర్కు విజ్ఞప్తి చేశారు. పంట చేతికి అందేంత వరకూ నమ్మకం లేదని, 20 నుండి 40 శాతం పంట వైరస్కు గురవుతుందని చెప్పారు. కౌంటింగ్ ఉన్న రొయ్యకు ధర లభించడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు.ఆక్వా రైతు, వైఎస్సార్ సీపీ నాయకుడు వేగేశ్న వెంకట్రాజు(యండగండి శ్రీను) మాట్లాడుతూ రొయ్యల ధర నికరంగా ఉండేలా చర్యలు తీసుకోవలని విజ్ఞప్తి చేశారు. కలెక్టర్ వెంట ఆక్వా రైతులు, వైఎస్సార్ సీపీ నాయకులు గొట్టుముక్కల సూర్యనారాయణరాజు(సూరిబాబు), అల్లూరి తమ్మిరాజు, ఇందుకూరి సూర్యనారాయణరాజు, అల్లూరి సత్యనారాయణరాజు, మత్స్యశాఖ జేడీ ఎస్.అంజలి, డీడీ తిరపతయ్య, ఏడీ చాంద్ బాషా, నరసాపురం ఆర్డీఓ సలీం ఖాన్, ఎఫ్డీఓ మంగారావు ఉన్నారు. -
‘చిత్తూరులో 52 వేల మందికి పోస్టల్ ఓట్లు’
చిత్తూరు: జిల్లా వ్యాప్తంగా 52 వేల మంది ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని కల్పించినట్లు, అలాగే ఆర్మీ సర్వీసులో ఉన్నవారికి కూడా పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని కల్పించినట్లు చిత్తూరు జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న వెల్లడించారు. చిత్తూరులో ప్రద్యుమ్న విలేకరులతో మాట్లాడుతూ.. ఎలక్షన్ కమిషన్ ఆదేశాల ప్రకారం ఏప్రిల్ 2వ తేదీ వరకు పోస్టల్ బ్యాలెట్లు ఇచ్చామని తెలిపారు. ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వడం కుదరదని స్పష్టంగా పేర్కొన్నారు. వివిధ శాఖల ద్వారా ఎలక్షన్ ప్రక్రియలో పాల్గొన్న వారికి ఆయా శాఖాధిపతుల ద్వారా పోస్టల్ బ్యాలెట్ ఇచ్చే సౌకర్యం చేపట్టామని అన్నారు. ఓటరు లిస్టులో పొరపాట్లు, అడ్రస్ ట్యాలీ కాకపోవడం వల్ల కొందరికి పోస్టల్ బ్యాలెట్లు మంజూరు కాకపోయి ఉండవచ్చునని అనుమానం వ్యక్తం చేశారు. పోస్టల్ బ్యాలెట్లు చాలా మందికి మంజూరు కాలేదంటూ చిత్తూరు వైఎస్సార్సీపీ అసెంబ్లీ అభ్యర్థి శ్రీనివాసులు, జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. -
రెండేళ్లుగా మౌనముద్ర!
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ఐఏఎస్ అధికారులకు జిల్లా కలెక్టర్గా ఒకటి రెండు మార్లే అవకాశం వస్తుంది. ఆ కాలంలో జిల్లాలో విస్తృతంగా పర్యటించి సమస్యలు తెలుసుకొని వాటిని పరిష్కరించి ప్రజల మన్ననలు పొందాలని వారు పరితపిస్తారు. కానీ తొలిసారి కలెక్టర్గా బాధ్యతలు చేపట్టిన వాడ్రేవు వినయ్చంద్ మాత్రం అందుకు భిన్నం. ఆయన ప్రకాశం జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టి నేటితో సరిగ్గా రెండేళ్లు. ఈ పాలనా కాలంలో జిల్లా ప్రజల సమస్యలు పట్టించుకొని పరిష్కరించిన దాఖలాలు లేవు. అధికార పార్టీ నేతలు చెప్పింది చేయడమే ఆయన పనిగా పెట్టుకున్నారు. అందుకే వారికి తప్ప ప్రజలకు దగ్గర కాలేక పోయారు. గ్రీవెన్స్ డేకూ దూరం.. దూరం.. వెనుకబడిన ప్రకాశం జిల్లా కరువుతో పాటు తాగు, సాగునీటి ఇబ్బందులకు నిలయం. దీని పర్యవసానంగా ప్లోరైడ్, కిడ్నీ వ్యాధిగ్రస్తులకు కేంద్రంగా మారింది. ఏటా వందల సంఖ్యలో కిడ్నీ మరణాలు ఇక్కడ సర్వ సాధారణమయ్యాయి. ప్రజలకు సురక్షిత తాగు నీరందించాలన్న ఆలోచన పాలకులకు రాలేదు. ఆదిశగా కలెక్టర్ వినయ్చంద్ తీసుకున్న చర్యలు శూన్యం. వేలాది గ్రామాల్లో తాగునీటి ఇబ్బందులున్నా కనీసం వందల సంఖ్యలో గ్రామాలకు కూడా ప్రభుత్వం తాగునీటి అందిస్తున్న దాఖలాలు లేవు. అందులో కూడా సగం అవినీతే. దీనిపై రాష్ట్ర స్థాయిలో ఫిర్యాదులున్నా చర్యలు లేవు. జిల్లా కలెక్టర్ వారి జోలికెళ్లరు. సామాన్య జనమన్నా.. వారి సమస్యలన్నా ఆయనకు చిరాకేమో! గ్రీవెన్స్ డేకు సైతం ఆయన అరుదుగా మాత్రమే హాజరవుతూ ఉంటారు. రైతుల గోడు పట్టలేదు.. జిల్లాలో పొగాకు, సుబాబుల్, జామాయిల్ రైతుల కష్టాలకు కొదువలేదు. వారికి గిట్టుబాటు ధర లభించదు. కర్రకు గిట్టుబాటు ధర కల్పించే విషయంలో ఇక్కడి కలెక్టర్స్పందించి చొరవ చూపిన దాఖలాలు లేవు. రైతులు, రైతు సంఘాల నేతలు కలెక్టరేట్ అంటేనే విముఖత వ్యక్తం చేసే పరిస్థితి. ఇక జిల్లా లో అధికంగా రైతులు పండించే కందులు, శనగల కొనుగోళ్లలో కొందరు అధికారులు అక్రమాలకు తెరలేపి రైతుల నోళ్లు కొట్టినా కలెక్టర్ స్పందించిన దాఖలాలు లేవు. మార్కెఫెడ్ అధికారులు రైతుల వద్ద కాకుండా టీడీపీ నేతల వద్ద కందులు, శనగలు కొన్నా వారిపై చర్యలు లేవు. దేవరపల్లి వైపు తొంగి చూడలేదు.. దళితుల సమస్యలపైనా కలెక్టర్ స్పందన కనిపించన పరిస్థితి. ఉదాహరణకు దేవరపల్లె దళితుల భూ సమస్య జిల్లానే కాకుండా రాష్ట్రాన్నే కుదుపు కుదిపింది. దశాబ్దాలుగా దళితుల స్వాధీనంలో ఉన్న భూములు అధికార పార్టీ నేతలు దౌర్జన్యంగా స్వాధీనం చేసుకున్నారు. చెరువు తవ్వకమంటూ రాత్రికి రాత్రే పనులు చేపట్టారు. అయినా పాలనా«ధికారి ఆ వైపు తొంగి చూడలేదు. సమస్య జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయికి మారినా ఆయనలో స్పందన లేదు. ఇరుపక్షాలను పిలిపించి సమస్యను పరిష్కరించాల్సిన కలెక్టర్ మౌనముద్ర దాల్చటంతో ఇది శాంతిభద్రతల సమస్యగా ఉత్పన్నమైంది. సాక్షాత్తు జిల్లా రెవెన్యూ అధికారి, తహశీల్దార్ దళితుల భూముల స్వాధీనంలో కీలకపాత్ర పోషించారని దేవరపల్లె దళితులు నెత్తినోరు బాదుకున్నారు. అధికార పార్టీకి చెందిన మంత్రితో పాటు జిల్లాకు చెందిన ఎస్సీ కమిషన్ చైర్మన్ సైతం దేవరపల్లె విషయంలో ప్రభుత్వం, అధికారులు తప్పు చేశారని బహిరంగంగానే విమర్శలు చేశారు. ఇది జిల్లా పాలనాధికారికి మచ్చ తెచ్చిన విషయమే. ♦ రిమ్స్ మెడికల్ కళాశాల విద్యార్థుల కోర్సు పూర్తయి చాలా కాలం అయినా కళాశాలకు ఎంసీఐ అనుమతులు రాకపోవడంతో విద్యార్థులు నెత్తినోరు బాదుకున్నారు. సకాలంలో ఎంసీఐ రాకపోవడంతో ఆందోళనకు గురైన విద్యార్థులు జిల్లా కలెక్టర్ బంగ్లాను ముట్టడించారు. వైద్య విద్యార్థులకు బాసటగా నిలిచి సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేయాల్సిన పాలనాధికారి ఆ దిశగా ఎటువంటి చర్యలు చేపట్టలేదు. ♦ జిల్లాలో తాగు, సాగునీటి సమస్య తలెత్తినప్పుడు స్పందించి ప్రజాప్రతినిధులతో సమావేశం పెట్టి సమస్య తీవ్రతను ప్రభుత్వం దృష్టికి తెచ్చి పరిష్కరించాల్సిన బాధ్యత కలెక్టర్పై ఉన్నా వినయ్చంద్ ఆ దిశగా చేసిన ప్రయత్నాలు తక్కువనే చెప్పాలి. గత ఏడాది సాగర్లో నీళ్లున్నా ఆయకట్టుకు తగినంత నీరు తీసుకరావడంలో పాలనాధికారి విఫలమయ్యారు. ♦ ఈ–ఆఫీస్ పైన కలెక్టర్ పెద్దగా శ్రద్ధ పెట్టినట్లు కనిపించడం లేదు. ఈ–ఆఫీస్ వేగవంతం చేయాలంటూ ప్రభుత్వం పదే పదే చెబుతున్నా.. జిల్లాలో ఆ ప్రయత్నం వేగం పుంజుకోలేదు. గత కలెక్టర్ హయాంలో ఈ–ఆఫీస్ ప్రతిష్టాత్మకంగా చేపట్టారు. రాష్ట్రంలోనే ప్రకాశం జిల్లా మొదటి మూడు స్థానాల్లో ఉండింది. నేడు పరిస్థితి బిన్నంగా మారింది. ♦ గ్రీవెన్స్ డే వినతుల పరిష్కారానికి కలెక్టరేట్లో పెద్దగా కసరత్తు జరగడం లేదు. ప్రజాలిచ్చిన వినతులు ఎంత మేర పరిష్కారమయ్యాయన్న విషయంపై వారం వారం రివ్యూ సమావేశాలు నిర్వహిస్తే అధికారులు త్వరగా పరిష్కరించేందుకు అవకాశం ఉండేది. కానీ కలెక్టర్ ఈ విషయంలో మొక్కుబడి సమావేశాలకు పరిమిత మయ్యారు. జిల్లాలో ఉన్న ప్రధాన సమస్యలనూ ఆన కిందిస్థాయి అధికారులపై తోసి తనకేమీ పట్టనట్లుండి పోతున్నారన్న విమర్శ ఉంది. ♦ నాగార్జునసాగర్ ప్రాజెక్టు స్థలాన్ని టీడీపీ కార్యాలయానికి తీసుకోవాలన్న అధికార పార్టీ నేత ప్రయత్నాలను అప్పట్లో ఇరిగేషన్ ఎస్ఈ అడ్డుకున్నా జిల్లా పాలనాధికారి స్పందించ లేదు. విలువైన ప్రభుత్వ స్థలాలు పార్టీ కార్యాలయాలకు అప్పగిస్తే ప్రభుత్వ కార్యాలయాలకు స్థలాలు లేకుండాపోయే ప్రమాదం ఉంది. అధికార పార్టీ నేత పట్టుపట్టి ఇరిగేషన్ ఎస్ఈని బదిలీ చేయించారు. అధికార పార్టీ నేత జిల్లా స్థాయి అధికారిని బదిలీ చేయిస్తే ప్రధాన అధికారి పట్టించుకోకపోతే మిగిలిన అధికారుల్లో ఆత్మస్థైర్యం దెబ్బతినే అవకాశం ఉందని అధికారులు వాపోతున్నారు. ♦ జిల్లాలో అభివృద్ధి పనుల టెండర్ల వ్యవహారం రచ్చకెక్కింది. పేరుకు ఈ–టెండర్లు అయినా అధికార పార్టీ నేతలు, కొందరు అధికారులు కుమ్మక్కై కాంట్రాక్టర్లు టెండర్లలో పాల్గొనకుండా అడ్డుకుంటున్నారు. కొందరు అధికారులు వాటాలు తీసుకొని పనులను అబౌ రేట్లకు కేటాయించి ప్రజాధనానికి గండికొట్టారు. వెలిగొండ, గుండ్లకమ్మ పునరావాస పనుల టెండర్లలో ఇదే జరిగింది. ♦ కార్పొరేషన్ టెండర్ల వ్యవహారం ఇంతకు మించి అక్రమాలు వెలుగుచూస్తున్నాయి. వేరే కాంట్రాక్టర్లు పోటీకి రాకుండా అధికారులే అడ్డుకుంటున్నారు. ఇష్టానుసారంగా అబౌ రేట్లకు పనులు అప్పగిస్తున్నారు. జిల్లా పాలనాధికారి ప్రత్యేకాధికారిగా ఉన్నా... ఇక్కడి అక్రమాలకు అడ్డుకట్ట పడటం లేదు. ♦ అధికార పార్టీ ఒత్తిడులతో జిల్లాలో కొందరు కింది స్థాయి అధికారులు ఇబ్బందులు పడుతుండగా వారికి పెద్ద దిక్కుగా భరోసా కల్పించాల్సిన పాలనాధికారి మౌనంగా ఉన్నారని, కొందరు అధికారులు పార్టీ నేతల అండ చూసుకొని చెలరేగిపోతున్నా వారిపై చర్యలు తీసుకుంటున్న దాఖలాలు లేవని అధికార వర్గాలే విమర్శిస్తుండటం గమనార్హం. జిల్లా పాలనాధికారి జిల్లా పరిషత్ సమావేశానికి ఎగనామం పెట్టారు. కలెక్టర్ సమావేశానికి రావాలని జడ్పీ సర్వసభ్య సమావేశం పలుమార్లు తీర్మాణం చేసింది. కలెక్టర్ రావాలంటూ సభ్యులు ఆందోళన కూడా నిర్వహించారు. అయినా కలెక్టర్ వినయ్చంద్ జడ్పీ సమావేశానికి హాజరైన సందర్భాలే లేవు. జిల్లాలో సహకార వ్యవస్థలను అధికార పార్టీ నేతలు నిర్వీర్యం చేసినా కలెక్టర్గా వినయ్చంద్ అటువైపు తొంగి చూడలేదు. ఒంగోలు డెయిరీ వివాదం రచ్చ కెక్కింది. సంఘాలను నిర్వీర్యం చేసి ఆస్తులు కొల్లగొట్టేందుకు పాలకవర్గం ప్రయత్నించింది. పీడీసీసీబీ, డీసీఎంఎస్లు రోడ్డున పడ్డాయి. వీటి పంచాయితీలు ముఖ్యమంత్రి స్థాయిలో నడిచాయి. కానీ కలెక్టర్కు మాత్రం ఇవేవీ పట్టలేదు. మొత్తంగా ప్రకాశం కలెక్టర్ వినయ్చంద్ రెండేళ్ల పాలనలో జిల్లాలో పాలనకు పక్షవాతం సోకిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. -
మీడియా పట్ల కలెక్టర్ దురుసు ప్రవర్తన
వైఎస్సార్ జిల్లా: ఒంటిమిట్టలో సీతారాముల కల్యాణం కోసం మంజూరు చేసిన పాసుల విషయంలో గందరగోళం నెలకొంది. మంజూరైన పాసుల్లో అధికారులు చేతివాటం ప్రదర్శించారు. విలేకర్ల పాసుల విషయంలో మీడియా ప్రతినిధులు కలెక్టర్ను సంప్రదించగా ఆయన వారిపట్ల దురుసుగా ప్రవర్తించారు. మీరు పాసులు అమ్ముకుంటారు.. మీరు కుటుంబాలతో వస్తే బయటకు తోసేస్తాం అంటూ కలెక్టర్ హరికిరణ్ దురుసుగా మాట్లాడారు. కలెక్టర్ వ్యాఖ్యల పట్ల విలేకరులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఒంటిమిట్ట కల్యాణోత్సవాన్ని బహిష్కరించాలని స్థానిక విలేకరులు నిర్ణయం తీసుకున్నారు. అలాగే రేపు ప్రత్యక్ష ఆందోళనకు కూడా పిలుపునిచ్చారు. -
ఎన్నికలు ఆపేస్తా!.. ఆడియో వైరల్
సాక్షి, చెన్నై: కరూర్ జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి అన్బళగన్కు డీఎంకే, కాంగ్రెస్ వర్గాలు బెదిరింపులు ఇవ్వడం వివాదానికి దారి తీసింది. ఇందుకు స్పందించిన కలెక్టర్ తననే బెదిరిస్తారా ఎన్నికల్ని ఆపేస్తా అంటూ కాంగ్రెస్ అభ్యర్థికి హెచ్చరిక ఇస్తూ చేసిన వ్యాఖ్యల ఆడియో వైరల్గా మారింది. తాజా పరిణామాల నేపథ్యంలో ఎన్నికల వేళ కరూర్ లోక్సభ పరిధిలో టెన్షన్ పెరిగింది. కరూర్ లోక్సభ ఎన్నికల్లో అన్నాడీఎంకే అభ్యర్థిగా పార్లమెంట్ డిప్యూటీ స్పీకర్ తంబిదురై, డీఎంకే కూటమిలో కాంగ్రెస్ అభ్యర్థిగా జ్యోతిమణి పోటీ చేస్తున్నారు. ఇక్కడ తంబిదురైకు వ్యతిరేక పవనాలు ఉన్నట్టుగా సంకేతాలు వెలువడుతూ వస్తున్నాయి. దీన్ని తనకు అనుకూలంగా మలుచుకునేందుకు జ్యోతిమణి తీవ్రంగానే కుస్తీ పడుతున్నారు. అయితే, ఈ సీటు చేజారకుండా మంత్రి విజయ భాస్కర్ నేతృత్వంలో అన్నాడీఎంకే కూటమి వర్గాలు వ్యూహాలకు పదునుపెట్టారు. తామేమీ తక్కువ కాదన్నట్టుగా డీఎంకే నేత సెంథిల్బాలాజి నేతృత్వంలో ఆకూటమి వర్గాలు జ్యోతిమణి కోసం రేయింబవళ్లు శ్రమించే పనిలో పడ్డారు. నామినేషన్ దాఖలు నుంచి ప్రచారాల ముగింపు వరకు కరూర్లో ఇరు వర్గాల మధ్య సమరం అన్నది లేని రోజంటూ లేదు. ఇక, ఎన్నికల ప్రచారం చివరి రోజున సైతం కరూర్ రణరంగానికి మారే పరిస్థితి చోటు చేసుకుంది. కాంగ్రెస్, అన్నాడీఎంకే అభ్యర్థులు ఇరువురు ఒకే చోట ప్రచార సభ ముగింపునకు తగ్గట్టుగా అనుమతులు కోరడం, ఇది కాస్త వివాదానికి దారి తీయడం, కలెక్టర్, ఎన్నికల అధికారి జోక్యం చేసుకోవడం, ఒత్తిళ్లు పెరగడం వంటి పరిణామాలు కరూర్లో ఉత్కంఠను రేపాయి. ఈ నేపథ్యంలో కలెక్టర్ అన్భళగన్, కాంగ్రెస్ అభ్యర్థి జ్యోతిమణి మధ్య సాగిన ఆడియో ఒకటి ప్రస్తుతం వైరల్గా మారింది. ఆడియో వైరల్ : కలెక్టర్ అన్బళగన్కు డీఎంకే, కాంగ్రెస్ వర్గాలు బెదిరింపులు ఇచ్చినట్టుగా తొలుత సంకేతాలు వెలువడ్డాయి. ఇందుకు తగ్గట్టుగానే మీడియా ముందుకు వచ్చిన అన్బళగన్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే, ఆంతోనియామలై పోలీసుస్టేషన్లో డీఎంకే నేత సెంథిల్ బాలాజి, కాంగ్రెస్ అభ్యర్థి జ్యోతి మణిలతో పాటు వంద మందిఫై ఫిర్యాదు చేశారు. కేసులు నమోదయ్యాయి. ఈ పర్వం ఓ వైపు సాగిన నేపథ్యంలో, మరో వైపు తనను కలెక్టర్ బెదిరించారన్నట్టుగా జ్యోతిమణి స్పందించే రీతిలో ఓ ఆడియో వైరల్గా మారింది. జ్యోతి మణి, కలెక్టర్ల మధ్య మాటల తూటాలు పేలాయి. బెదిరించాల్సిన అవసరం తమకు లేదని, అనుమతి కోసం తమ వాళ్లు వచ్చారని జ్యోతిమణి సమాధానం ఇవ్వడం గమనార్హం. సమస్యను జఠిలం చేస్తే ఎన్నికల్ని ఆపేస్తానంటూ కలెక్టర్ హెచ్చరించడంతో జ్యోతిమణి మౌనం వహించక తప్పలేదు. అధికార పక్షంపై డీఎంకే, కాంగ్రెస్ వర్గాలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. అధికారులు అందరూ ప్రజల్ని బెదిరించే విధంగా వ్యవహరిస్తున్నారని, తంబిదురైకు అనుకూలంగానే ఇక్కడ ప్రతి ఒక్కరూ పనిచేస్తున్నారని జ్యోతిమణి ఆరోపిస్తున్నారు. ఎన్నికలు శాంతియుతంగా జరిపే రీతిలో ఈసీ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అయితే ఎన్నికల్ని ఆపించేందుకు కాంగ్రెస్, డీఎంకే కుట్ర చేస్తున్నట్టుగా తంబిదురై మద్దతుదారులు ఎదురు దాడి చేస్తున్నారు. -
కలెక్టర్ల కనుసన్నల్లో పురపాలన
సాక్షి, హైదరాబాద్: ఇకపై ఇష్టారాజ్యంగా పట్టణ ప్రణాళిక అమలుపరచడం కుదరదు. అయినవారికి అడ్డగోలుగా అనుమతులు మంజూరు చేసే వీలుండదు. అవినీతిపరులకు కొత్తగా రాబోతున్న పురపాలక చట్టం ముకుతాడు వేయనుంది. ఈ చట్టం ప్రకారం కలెక్టర్ సారథ్యంలోని అధికారుల కమిటీకి భవన నిర్మాణ అనుమతులు జారీ చేసే అధికారం రానుంది. ప్రస్తుతం పురపాలికల్లో టౌన్ప్లానింగ్ అధికారి (టీపీవో), కమిషనర్ నిర్ణయాధికారం మేరకు అనుమతులు మంజూరవుతున్నాయి. వీటిలో పారదర్శకత లోపిస్తోంది. కాసులు సమర్పిస్తే ఎంతటి అడ్డగోలు నిర్మాణాకైనా అనుమతులు వస్తాయనే విమర్శలున్నాయి. మున్సిపల్ శాఖలో అవినీతి వేళ్లూనుకుందని, ప్రక్షాళన అవసరమని ఇటీవల సీఎం అన్నారు. ఈ నేపథ్యంలో కొత్త పంచాయతీరాజ్ చట్టం తరహాలో నయా పురపాలక చట్టం తీసుకురావాలని నిర్ణయించారు. పట్టణాలు, నగరాల భౌగోళిక పరిస్థితులకు అనుగుణంగా చట్టానికి రూపకల్పన చేస్తున్నారు. ఇతర రాష్ట్రాలు, విదేశాల్లోని పట్టణ స్థానిక సంస్థలు, నగరాభివృద్ధి సంస్థల చట్టాలను అధ్యయ నం చేస్తున్నారు. పట్టణీకరణకు అనుగుణంగా మౌలి క సదుపాయాల కల్పనకు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు కొత్త చట్టం ద్వారా అధికారాలు, బాధ్యతలు కల్పించే దిశగా చట్టానికి మెరుగులు దిద్దుతున్నారు. ప్రజా ప్రతినిధులకు బాధ్యత స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు ఉత్సవ విగ్రహాలు కాకుండా కొత్త చట్టం ద్వారా పూర్తిస్థాయిలో జవాబుదారీతనం సక్రమించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. విధులు, బాధ్యతలు సక్రమంగా నిర్వహించకుంటే వారిపైనా చర్యలు తీసుకునేలా కొత్త చట్టంలో నిబంధనలు పొందుపరుస్తున్నారు. ఎన్నికల ద్వారా బాధ్యతలు చేపట్టిన పురపాలికల చైర్మన్లు/మేయర్లు, కార్పొరేటర్లు/కౌన్సిలర్లు చట్టానికి లోబడి వ్యవహరించాలి. అంతేకాదు తమ హయాంలో జరిగిన పనులకు ఆ తర్వాత కూడా వారే బాధ్యులుగా ఉండేలా నిబంధనలు ఉండనున్నాయి. ఇతర రాష్ట్రాల్లో అధ్యయనం వివిధ రాష్ట్రాల్లో మనుగడలో ఉన్న మున్సిపల్ చట్టాలను రాష్ట్ర ప్రభుత్వం అధ్యయనం చేస్తోంది. ఈ మేరకు అధికారుల బృందం ఇటీవల గుజరాత్, తమిళనాడు, కేరళ, కర్ణాటకలో పర్యటించి చట్టాలను మదింపు చేసింది. ప్రణాళికబద్ధంగా అభివృద్ధి జరగడంలో టౌన్ప్లానింగ్ శాఖదే కీలక భూమిక. జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏలు మినహాయిస్తే మున్సిపాలిటీల్లో టీపీవోలు, గ్రామీణ ప్రాంతాల్లోనైతే డీటీసీపీ విభాగం లేఅవుట్లు, భవన నిర్మాణ అనుమతులు జారీ చేయాల్సి ఉంటుంది. ఉద్యోగుల కొరత, పని భారం కారణంగా ఈ యంత్రాంగం క్షేత్రస్థాయిలో పరిశీలించకుండానే అనుమతులు మంజూరు చేస్తోంది. దీంతో మాస్టర్ ప్లాన్/బిల్డింగ్ ప్లాన్కు విరుద్ధంగా భవనాలు వెలుస్తున్నాయి. కనీస సౌకర్యాలు లేకుండానే లేఅవుట్లు పుట్టుకొస్తున్నాయి. అవినీతికి తెరలేస్తోంది. వీటిని పరిగణనలోకి తీసుకున్న సర్కారు భవిష్యత్తులో పట్టణాలు కాంక్రీట్ జంగిల్లా సమస్యాత్మకంగా మారకుండా జాగ్రత్తలు తీసుకోవాలని నిర్ణయించింది. పర్యావరణానికి సంబంధించిన అంశాలను పరిగణనలోకి తీసుకుని అనుమతులు ఇచ్చే అంశాన్ని కొత్త చట్టంలో జోడిస్తున్నారు. పన్నులు పీకాల్సిందే! మున్సిపాలిటీలు సొంతంగా ఆర్థిక వనరులు సమకూర్చుకునేలా కొత్త చట్టంలో ప్రాధాన్యం కల్పిస్తున్నారు. స్థానిక సంస్థలకు రావాల్సిన పన్నులను పకడ్బందీగా వసూలు చేసుకునే అధికారాలు మున్సిపాలిటీలకు సక్రమించనున్నాయి. ఆస్తి, నీటి, లైబ్రరీ పన్నులను 100 శాతం వసూలు చేయడమే గాకుండా.. బకాయిలు రాబట్టడానికి రెవెన్యూ రికవరీ యాక్ట్ వినియోగించుకునే వెసులుబాటును పురపాలికలకు కట్టబెట్టే అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉంది. కమిషనర్లకు న్యాయాధికారాలు కల్పించే అంశాన్ని పొందుపరుస్తున్నారు. జీహెచ్ఎంసీ, వ్యతిరేకంగా అక్రమ భవన నిర్మాణాలు, వివిధ రకాల వ్యాపారాల పర్యవేక్షణ, ప్రభుత్వ భూములు, ఆస్తుల పరిరక్షణ, అక్రమార్కులపై చర్యలు తీసుకోవడం న్యాయాధికారాలతోనే సాధ్యమని ప్రభుత్వం భావిస్తోంది. పురపాలక సంఘాల పరిధిలో జరుగుతున్న భూదందాలు, సర్కారీ భూముల ఆక్రమణల్లో కమిషనర్లు ప్రేక్షక పాత్రకే పరిమితం అవుతున్నారు. ఈ నేపథ్యంలో పట్టణ ప్రాంతాల్లోని భూ వ్యవహారాలను పురపాలికల పరిధిలోకి తెస్తే ఎలా ఉంటుందనే దానిపై మల్లగుల్లాలు పడుతోంది. -
ఎన్నికల విధులకు పంపిస్తే ఓటెలా వెయ్యాలి?
సాక్షి, అమరావతి: మమ్మల్ని ఎన్నికలకు రెండ్రోజుల ముందు ఎన్నికల డ్యూటీకి వేశారు.. మరి ఓటు ఎక్కడ వేయాలి? ఎలా వేయాలి? అని పలువురు ఉద్యోగులు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తాజాగా ఆశా వర్కర్లు, ఫార్మసిస్ట్లు, ఎంపీహెచ్ఏలతో పాటు పలువురు మున్సిపల్ ఉద్యోగులను ఎన్నికల విధుల్లో నియమిస్తూ ఆయా జిల్లాల కలెక్టర్లు ఆదేశాలిచ్చారు. కనీసం వారికి పోస్టల్ బ్యాలెట్ ద్వారానైనా ఓటు వేసే అవకాశం కల్పించకుండా ఆదేశాలిచ్చారు. దీంతో వేలాది మంది ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒక్క ఆశా వర్కర్లే 42 వేల మంది ఉన్నారు. ఇక ఏఎన్ఎంలు, ఎంపీహెచ్ఏలే 8 వేల మందిపైనే ఉన్నారు. వీళ్లందరికీ ఎన్నికల విధులకు వెళ్లాలని ఈనెల 8వ తేదీన ఆయా జిల్లాల కలెక్టర్లు ఆదేశాలిచ్చారు. పోస్టల్ బ్యాలెట్ ప్రస్తావనే లేదు. ఈ ఆదేశాలు చూసిన ఉద్యోగులు మండిపడుతున్నారు. ఐదేళ్లకోసారి తమకు నచ్చిన అభ్యర్థిని ఎన్నుకోవడానికి అవకాశమొస్తే ఇలా కనీసం పోస్టల్ బ్యాలెట్ అవకాశం ఇవ్వకపోవడం దారుణమని వాపోతున్నారు. వైద్య ఆరోగ్య శాఖ, మున్సిపాలిటీ శాఖకు చెందిన కొంతమంది ఉద్యోగులు మంగళవారం విజయవాడ మున్సిపల్ కార్యాలయానికి వెళ్లి నిరసన చేపట్టారు. ఎన్నికల విధులకు వెళ్లడానికి అభ్యంతరం లేదని, తమకు పోస్టల్ బ్యాలెట్ అవకాశం కల్పించి తీరాలని పట్టుపడుతున్నారు. ఓటు వేసే అవకాశం కల్పిస్తేనే విధులకు వెళతామని భీష్మించారు. వైద్య ఆరోగ్యశాఖ ఉద్యోగుల సంఘం ప్రతినిధి అరవపాల్ ఆధ్వర్యంలో పలువురు ఉద్యోగులు మున్సిపల్ అధికారులను కలిశారు. ఓటు వేసుకోవడానికి వీలు లేకుండా ఎన్నికల విధులకు వేసి, ఇలా చేయడం సరైనది కాదని, పోస్టల్ బ్యాలెట్ అవకాశం కల్పించాలని కోరారు. పోస్టల్ బ్యాలెట్ ద్వారా కల్పించాలని విన్నవించగా ఎన్నికల విధులకు సరిపడా సిబ్బంది లేరని, మీరే వేరొకరిని ఏర్పాటు చేయండి.. అంటూ సమాధానమిస్తున్నారని అరవపాల్ సాక్షితో చెప్పారు. -
ఏప్రిల్ 11న సార్వత్రిక సెలవు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని 17 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్న ఏప్రిల్ 11ను సార్వత్రిక సెలవు దినంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలకు సాధారణ సెలవు అమలవుతుందని తెలిపింది. పోలింగ్ కేంద్రాలు, ఎన్నికల సామగ్రి పంపిణి కేంద్రాల ఏర్పాటుకు వినియోగించే ప్రభుత్వ భవనాలు, విద్యా సంస్థలు, ఇతర భవనాల్లో నిర్వహించే కార్యాలయాలకు పోలింగ్కు ముందు రోజు ఏప్రిల్ 10తో పాటు పోలింగ్ రోజు ఏప్రిల్ 11న స్థానిక సెలవు దినంగా ప్రకటించే అధికారాన్ని జిల్లా కలెక్టర్లకు ఇచ్చింది. లోక్సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరగనున్న మే 23న అవసరమైతే స్థానిక సెలవును ప్రకటించాలని కలెక్టర్లను కోరింది. ఏప్రిల్ 11న పోలింగ్ రోజు పరిశ్రమలు, కర్మాగారాలు, దుకాణాల్లో పనిచేసే కార్మికులకు వేతనంతో కూడిన సెలవును ప్రభుత్వం ప్రకటించింది. ఎన్నికలు జరిగే నియోజకవర్గంలో ఓటు హక్కు కలిగి ఉండి ఎన్నికలు జరగని బయటి ప్రాంతంలో పనిచేసే ఉద్యోగులు, తాత్కాలిక ఉద్యోగులకు సైతం వేతనంతో కూడిన సెలవు వర్తిస్తుందని పేర్కొంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.