271 మంది కంప్యూటర్‌ టీచర్ల ఎంపిక | 271 computer reachers select | Sakshi
Sakshi News home page

271 మంది కంప్యూటర్‌ టీచర్ల ఎంపిక

Published Fri, Oct 14 2016 12:12 AM | Last Updated on Mon, Sep 4 2017 5:05 PM

271 computer reachers select

ఏలూరు సిటీ : ప్రభుత్వ పాఠశాలల్లో కంప్యూటర్‌ విద్య అందించేందుకు కంప్యూటర్‌ టీచర్ల నియామకానికి సంబంధించి ఎంపికలు గురువారం పూర్తి చేశారు. జిల్లావ్యాప్తంగా 283 మంది కంప్యూటర్‌ టీచర్ల నియామకానికి ఆన్‌లైన్‌ పరీక్షలు నిర్వహించగా 1,256 మందికి పైగా అభ్యర్థులు పరీక్షలు రాశారు. ఈ అభ్యర్థుల కంప్యూటర్‌ నిపుణత, సర్టిఫికెట్స్, నేటివిటీ ఆధారంగా ఎంపికలు పూర్తిచేసినట్టు జిల్లా విద్యాధికారి డి.మధుసూదనరావు తెలిపారు. 271 మంది అభ్యర్థులు కంప్యూటర్‌ టీచర్లుగా ఎంపికయ్యారని తెలిపారు. ఎంపికైన అభ్యర్థుల వివరాలు డీఈవో వెబ్‌సైట్‌లో పొందుపరిచామని తెలిపారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement