Abhay Singh
-
గంజాయి కేసులో ఐఐటీ బాబా అరెస్ట్!
జైపూర్: మహా కుంభమేళాతో దేశం దృష్టిని ఆకర్షించిన ఐఐటీ బాబా(IIT Baba) అభయ్ సింగ్ మరోసారి వార్తల్లోకి ఎక్కారు. గంజాయి కేసులో తాజాగా ఆయన్ని జైపూర్ పోలీసులు అరెస్ట్ చేసినట్లు సమాచారం. ఈ విషయాన్ని స్వయంగా ఐఐటీ బాబానే ధృవీకరించడం విశేషం. ఐఐటీ బాబా సూసైడ్ చేసుకుంటానన్న ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు జైపూర్ షిప్రా పాథ్ పోలీసులు ఓ హోటల్లో ఉన్నారనే సమాచారంతో అక్కడికి వెళ్లారు. ఆ టైంలో ఆయన నుంచి గంజాయి సేవిస్తుండడంతో పోలీసులు అదుపులోకి తీన్నారు. ఆయనపై నార్కోటిక్ డ్రగ్స్ &సైకోట్రోపిక్ సబ్స్టానెన్స్(NDPS) యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్లు అక్కడి మీడియా కథనాలు ఇచ్చింది. VIDEO | Amid reports of his arrest, Maha Kumbh fame Abhay Singh, alias 'IIT Baba' was seen celebrating his birthday with followers in Jaipur. pic.twitter.com/WhA8aTIUv2— Press Trust of India (@PTI_News) March 3, 2025అయితే.. ఆయన అరెస్ట్ ప్రచారం నడుమ అనూహ్యంగా ఆయన తన భక్తుల మధ్య పుట్టినరోజు వేడుకలు చేసుకుంటూ కనిపించారు. దీంతో మీడియా ఆయన్ని అరెస్ట్పై ఆరా తీసింది. తాను ఆత్మహత్య చేసుకుంటానన్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని అన్నారాయన. అయితే తాను గంజాయి తీసుకున్న మాట వాస్తవమేనని.. అయితే పరిమితితో కూడి గంజాయి ఉండడంతో పోలీసులు బెయిల్ మీద తనను విడుదల చేశారని అన్నారాయన. అయితే తన దృష్టిలో అది గంజాయి కాదని.. ప్రసాదమని ఆయన వ్యాఖ్యానించారు. ఇదిలా ఉంటే.. ఓప్రైవేట్ టీవీ ఛానెల్ ఇంటర్వ్యూలో తనపై దాడి జరిగిందంటూ నోయిడా పీఎస్ వద్ద ఐఐటీ బాబా హడావిడి చేసిన సంగతి తెలిసిందే. చివరకు పోలీసులు ఆయన్ని శాంతపర్చి అక్కడి నుంచి పంపించేశారు. అయితే ఇంటర్వ్యూకు ముందు ఆయనే సదరు ఛానెల్ యాంకర్పై దాడి చేశారంటూ ప్రచారం జరగడం గమనార్హం. ఈ ఘటనకు సంబంధించి ఎలాంటి కేసు నమోదు కాలేదు.ఐఐటీ బాబాగా ప్రయాగ్రాజ్ మహా కుంభమేళా(Prayagraj Maha Kumbh) అభయ్ సింగ్ ఓ టీవీ ఛానెల్ ఇంటర్వ్యూతో పాపులారిటీ సంపాదించుకున్నారు. హర్యానా చెందిన అభయ్ ఐఐటీ బాంబేలో ఏరోస్పేస్ ఇంజినీరింగ్ పూర్తిచేసినట్లు చెబుతున్నారు. కొంతకాలం ఓ కార్పొరేట్ సంస్థలో పనిచేసిన ఆయన.. దాన్ని వదిలేశారట. ఆపై కొంతకాలం ఫొటోగ్రఫీ.. అటు నుంచి ఆధ్యాత్మికం వైపు అడుగులు వేశారట. -
టీవీ డిబెట్లో ఐఐటీ బాబాపై దాడి.. వీడియో వైరల్
ఢిల్లీ: కుంభామేళాతో పాపులర్ అయిన ఐఐటీ బాబా అభయ్ సింగ్కు బిగ్ షాక్ తగిలింది. కొందరు వ్యక్తులు ఆయనపై కర్రలతో దాడి చేశారు. అభయ్ సింగ్లో ఓ టీవీ ఛానల్లో డిబెట్లో పాల్గొన్న సమయంలో ఈ దాడి ఘటన చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.ఐఐటీ బాబా అభయ్ సింగ్ తాజాగా నోయిడాలో ఓ ప్రైవేటు టీవీ ఛానల్లో డిబెట్లో పాల్గొన్నారు. డిబెట్ కొనసాగుతున్న సమయంలో కాషాయ దుస్తులు ధరించి వచ్చిన కొంత మంది వ్యక్తులు అక్కడికి వచ్చారు. అనంతరం, అభయ్సింగ్తో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో కర్రలతో దాడి చేసినట్టు తెలుస్తోంది. దాడి తర్వాత ఆయన డిబెట్ రూమ్ నుంచి బయటకు వచ్చారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్బంగా తనకు న్యాయం చేయాలని పోలీస్ అవుట్ పోస్టు ఎదుట బైఠాయించారు. దీంతో, పోలీసులు.. ఆయనకు నచ్చజెప్పి అక్కడి నుంచి పంపించేశారు. ఇక, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.I know, This is all Media Strategy but still I think, Media is mentally exploiting this IIT Baba for its TRP, This Baba should not go to such programs.pic.twitter.com/w7j0z0FAQC— Harsh (@harsht2024) February 28, 2025ఎవరీ ఐఐటీ బాబా..?ఐఐటీ బాంబేలో ఏరోస్పేస్ ఇంజినీరింగ్ చదువుకున్న అభయ్ సింగ్ ఇప్పుడు బాబాగా అవతరించారు. ఐఐటీ బాబాగా (IIT Baba) పిలుస్తున్నారు. అభయ్ సింగ్ది హర్యానా రాష్ట్రం. మహా కుంభమేళా సందర్భంగా ఐఐటీ బాబా పేరుతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన విషయం తెలిసిందే. క్యాంపస్ ప్లేస్మెంట్లోనే ఉద్యోగం.. కొంతకాలం కార్పొరేట్లో పనిచేసిన ఆయన.. దాన్ని వదులుకొన్నారు. ఫొటోగ్రఫీపై మక్కువతో అటువైపు దృష్టి సారించారు. ఈ క్రమంలోనే ఆధ్యాత్మికం వైపు అడుగులు వేశారు. మహా కుంభమేళాకు వచ్చిన ఆయన.. ఓ వార్తా ఛానెల్ ఇంటర్వ్యూతో సోషల్ మీడియాలో వైరల్గా మారారు. ఐఐటీ బాబా, ఇంజినీర్ బాబాగా నెటిజన్లు ఆయన్ను పేర్కొంటున్నారు. సైన్స్ ద్వారా ఆధ్యాత్మికతను మరింత ఆస్వాదిస్తున్నట్లు చెప్పారు. నెటిజన్లకు క్షమాపణలు..ఇదిలా ఉండగా.. చాంపియన్ ట్రోఫీలో పాకిస్థాన్పై భారత్ గెలవదంటూ ఐఐటీ బాబా (IIT Baba) జోష్యం చెప్పిన విషయం తెలిసిందే. ‘ఈసారి భారత్ గెలవదు. విరాట్ కోహ్లీ సహా అందరికీ ఈ విషయం చెప్పండి. ఇండియా గెలవదని నేను చెబుతున్నానంటే ఇండియా గెలవదంతే’ అంటూ ఐఐటీ బాబా జోష్యం చెప్పారు. అయితే, మ్యాచ్లో టీమిండియా ఘన విజయం సాధించింది. దీంతో ఈ ఐఐటీ బాబాపై సోషల్ మీడియాలో ట్రోల్స్ వెల్లువెత్తాయి. ఇలా జోష్యం చెప్పడం మానేయాలంటూ ఐఐటీ బాబాకు క్రికెట్ అభిమానులు సూచిస్తున్నారు.ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో ట్రోలింగ్స్పై ఐఐటీ బాబా తాజాగా స్పందించారు. ఈ మేరకు క్షమాపణలు చెబుతూ తన ఎక్స్ ఖాతాలో ఓ పోస్టు షేర్ చేశారు. ‘నేను బహిరంగంగా క్షమాపణలు చెప్పాలనుకుంటున్నాను. ఇది పార్టీ టైం. కాబట్టి ప్రతి ఒక్కరూ సంబరాలు చేసుకోవాలి. భారత్ గెలవదని చెప్పాను కానీ, గెలుస్తుందని నా మనసుకు తెలుసు’ అంటూ ఆ పోస్టులో పేర్కొన్నారు. ఈ పోస్ట్కు విరాట్ కోహ్లీ, టీమిండియా సంబరాలు చేసుకుంటున్న ఫొటోలను జోడించారు. -
అభయ్ సింగ్ డబుల్ ధమాకా
ఆసియా డబుల్స్ స్క్వాష్ చాంపియన్షిప్లో భారత స్టార్ అభయ్సింగ్ పురుషుల డబుల్స్, మిక్స్డ్ డబుల్స్లో విజేతగా నిలిచాడు. మలేసియాలో జరిగిన ఈ టోర్నీలో పురుషుల డబుల్స్ ఫైనల్లో అభయ్–వెలవన్ 11–4, 11–5తో ఒంగ్ సై హుంగ్–సిఫిక్ (మలేసియా)లపై నెగ్గారు. ‘మిక్స్డ్’ ఫైనల్లో అభయ్–జోష్నా చినప్ప (భారత్) 11–8, 10–11, 11–5తో టాంగ్ వింగ్–టాంగ్ హాంగ్ (హాంకాంగ్)లపై గెలిచారు. -
గుడ్ఫెలో క్లాసిక్ స్క్వాష్ టోర్నీ విజేత అభయ్
భారత స్టార్ ప్లేయర్ అభయ్ సింగ్ తన కెరీర్లో ఎనిమిదో ప్రొఫెషనల్ స్క్వాష్ అసోసియేషన్ (పీఎస్ఎ) సింగిల్స్ టైటిల్ను సాధించాడు. కెనడాలోని టొరంటోలో జరిగిన గుడ్ఫెలో క్లాసిక్ టోర్నీలో అభయ్ సింగ్ విజేతగా నిలిచాడు. 40 నిమిషాలపాటు జరిగిన ఫైనల్లో 25 ఏళ్ల అభయ్ 11–7, 11–9, 11–9తో మోరిస్ డేవ్రెడ్ (వేల్స్)పై విజయం సాధించాడు. ఈ ఏడాది అభయ్కిది రెండో టైటిల్. గత నెలలో ముంబైలో జరిగిన జేఎస్డబ్ల్యూ విల్లింగ్డన్ టోర్నీలోనూ అభయ్ టైటిల్ గెలిచాడు. -
ఉత్కంఠ పోరులో పాక్పై విజయం.. భారత్ ఖాతాలో పదో స్వర్ణం
Asian Games 2023: ఆసియా క్రీడలు-2023లో భారత్ ఖాతాలో పదో స్వర్ణం చేరింది. స్క్వాష్ క్రీడాంశంలో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్తో పోరులో భారత పురుషుల జట్టు అద్భుత విజయం సాధించింది. హోంగ్జూలో శనివారం నాటి ఉత్కంఠ ఫైనల్లో పాక్ టీమ్ను 2-1తో ఓడించి బంగారు పతకం గెలిచింది. సౌరవ్ ఘోషల్, అభయ్ సింగ్, మహేశ్ మంగావ్కర్, హరీందర్ సంధులతో కూడిన భారత స్క్వాష్ జట్టు ఈ మేరకు పాక్ టీమ్ను ఓడించి చైనాలో త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించింది. కాగా భారత్ ఇప్పటి వరకు 10 స్వర్ణాలు, 13 రజత, 13 కాంస్య పతకాలు గెలిచింది. చదవండి: WC 2023: బహుశా నాకు ఇదే చివరి వరల్డ్కప్ కావొచ్చు: టీమిండియా స్టార్ A Glorious Gold 🥇by the 🇮🇳 #Squash men's Team! Team 🇮🇳 India defeats 🇵🇰2-1in an nail-biter final ! What a great match guys! Great work by @SauravGhosal , @abhaysinghk98 , @maheshmangao & @sandhu_harinder ! You guys Rock💪🏻#Cheer4India 🇮🇳#JeetegaBharat#BharatAtAG22… pic.twitter.com/g4ArXxhQhK — SAI Media (@Media_SAI) September 30, 2023 A game for the Indian history in Squash.....!!!! 🇮🇳 They won the Gold in Asian Games by beating Pakistan in the final. pic.twitter.com/qOuI1Dyjoh — Johns. (@CricCrazyJohns) September 30, 2023 -
ఐఐటీ విద్యార్థులు.. పచ్చని కూరగాయలు పండిస్తున్నారు
బంజరు భూములలో కూడా బంగారాన్ని పండించవచ్చని నిరూపిస్తున్నారు ఐఐటీ–బాంబే గ్రాడ్యుయేట్స్ అభయ్ సింగ్, అమిత్ కుమార్లు. వివిధ రకాల వాతావరణ పరిస్థితులను తట్టుకునే క్లైమెట్ ప్రూఫ్ చాంబర్స్ ద్వారా రసాయన రహిత కూరగాయలను పచ్చగా పండిస్తున్నారు. ‘ఇకీ ఫుడ్స్’ స్టార్టప్తో ఈ మిత్రద్వయం అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది... అభయ్ సింగ్, అమిత్ కుమార్లు ఐఐటీ–బాంబేలో బెస్ట్ ఫ్రెండ్స్. చాలామంది స్నేహితులలాగా సినిమాలు, క్రికెట్ గురించి కంటే పర్యావరణం, వ్యవసాయానికి సంబంధించిన విషయాలు ఎక్కువగా మాట్లాడుకునేవారు. ‘కాలేజి రోజుల నుంచి సంప్రదాయానికి భిన్నంగా ఆలోచించడం మా అలవాటు. రకరకాల ప్రాజెక్ట్ల గురించి మాట్లాడుకునే వాళ్లం. క్లాస్ పూర్తయిన తరువాత ఎన్నో విషయాలపై మేధోమథనం చేసేవాళ్లం చదువుకున్నామా? ఉద్యోగాలు చేశామా? అని కాకుండా సమాజం కోసం మా వంతుగా ఏదైనా చేయాలనుకునే వాళ్లం. మన దేశంలో ఎంతో మంది వ్యవసాయరంగంలో పనిచేçస్తున్నారు. వారి కోసం ఏదైనా చేయాలనుకునేవాళ్లం. ఏదైనా సాధించాలనే తపన పుట్టినప్పుడు ఆత్మవిశ్వాసం మొదలవుతుంది. అది అనేక రకాలుగా శక్తిని ఇచ్చి ముందుకు నడిపిస్తుంది. మా విషయంలోనూ ఇదే జరిగింది’ అంటాడు అమిత్. వ్యవసాయ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన అమిత్, అభయ్లు ఆ రంగానికి సంబంధించిన రకరకాల ప్రయోగాలు చేస్తూ స్థిరమైన, అనుకూలమైన, అందుబాటులో ఉండే సాంకేతికతను రైతులకు దగ్గర చేయాలనేది లక్ష్యంగా నిర్ణయించుకున్నారు. ‘జనాభా పెరుగుదల దృష్ట్యా మన దేశంలో ఆహార కొరత ఏర్పడనుంది. ఆహారంలో పోషక విలువలు కోల్పోనున్నాం. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆహారం అందరికీ అందుబాటులో ఉండేలా, ఆరోగ్యానికి మేలు చేసేలా, వేగంగా ఉత్పత్తి చేసేలా కొత్త ఆవిష్కరణలు చేయాలనుకున్నాం’ అంటాడు అభయ్. తాము చర్చించుకున్న విషయాలను దృష్టిలో పెట్టుకొని ‘ఇకీ ఫుడ్స్’ అనే అంకురాన్ని ప్రారంభించారు. ‘ఇకీ ఫుడ్స్’ మొదలు పెట్టినప్పుడు మొదటి మూడు సంవత్సరాలు పరిశోధన, అభివృద్ధిపై ఎక్కువ దృష్టి పెట్టారు. వీరు సృష్టించిన సాంకేతికత ఎనభై శాతం నీటి వృథాను ఆరికడుతుంది. సంప్రదాయ పద్ధతుల్లో కంటే 75 శాతం వేగవంతమైన వృద్ధిరేటు ఉంటుంది. వివిధ రకాల వాతావరణ పరిస్థితులను తట్టుకునే క్లైమెట్ ప్రూఫ్ చాంబర్స్ ద్వారా రసాయనరహిత కూరగాయలను పండిస్తున్నారు. గత సంవత్సరం తమ టెక్నాలజీకి సంబంధించిన పేటెంట్ రైట్స్ పొందారు. ‘ఎన్నో రకాల వ్యవసాయ పద్ధతులు ఉన్నా అవసరాలకు తగిన పద్ధతులు కనిపించడం లేదు. దీన్ని దృష్టిలో పెట్టుకొని వేగవంతమైన ఉత్పత్తి విధానాలకు ప్రాధాన్యత ఇచ్చాం. మట్టి నుంచి మొక్క మొలకెత్తడానికి నీరు. ఆక్సిజన్, పోషకాలు, సపోర్ట్ అవసరం అవుతాయి. ఈ నాలుగు ఆధారాలతో మట్టితో పని లేకుండా మొక్కలను సృష్టించాలనుకున్నాం. డెబ్బైశాతం తేమ ఉన్న గదిలో అవసరమైన పోషక మూలాలను స్ప్రే చేసి ప్రయోగాలు మొదలు పెట్టాం’ అంటాడు అమిత్. సంపన్న దేశాల వ్యవసాయ క్షేత్రాల హైడ్రోపోనిక్స్ సిస్టమ్లో ఉపయోగించే కూలర్లు, చిల్లర్లు, బ్లోయర్లు, ప్లాస్టిక్ ఎన్క్లోజర్లకు ఈ మిత్రద్వయం దూరంగా ఉండాలనుకుంటోంది. సౌరశక్తిలోని అద్భుతాన్ని ఉపయోగించుకొని సంప్రదాయ పద్ధతుల్లో కంటే ఎక్కువ దిగుబడి సాధించాలనుకుంటోంది. రాజస్థాన్లోని కోట కేంద్రంగా పని చేస్తున్న ‘ఇకీ ఫుడ్స్’ స్టార్టప్ ‘కంట్రోల్డ్ ఎన్విరాన్మెంట్ అగ్రికల్చర్’ను తన నినాదంగా, విధానంగా ఎంచుకుంది. రాబోయే రోజుల్లో మధ్యప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్రలలో ‘ఇకీ ఫుడ్స్’ క్షేత్రాలకు శ్రీకారం చుట్టడానికి రెడీ అవుతున్నారు అమిత్, అభయ్లు. ఇకిగై అంటే... ఇకిగై అనేది జపనీస్ కాన్సెప్ట్. ఆరోగ్యవంతమైన. శక్తివంతమైన జీవన విధానాన్ని ప్రతిఫలించే మాట. జపనీస్ పదాలు ఇకీ (జీవితం), కై (ఫలితం, ఫలం) నుంచి పుట్టింది. స్ఫూర్తిదాయకమైన ‘ఇకిగై’ కాన్సెప్ట్ నుంచి తమ స్టార్టప్కు ‘ఇకీ ఫుడ్స్’ అని నామకరణం చేశారు అమిత్, అభయ్లు. కొత్త ఆలోచనలు వృథా పోవు. కాస్త ఆలస్యమైనా మంచి ఫలితం దక్కుతుంది. – అమిత్ కుమార్, ఇకీ–ఫుడ్స్, కో–ఫౌండర్ -
కర్రతో సిబ్బందిని చితకబాదిన కలెక్టర్
బహ్రెయిచ్: జిల్లా కలెక్టర్గా ఉన్నతమైన హోదాలో ఉన్న వ్యక్తి తన సిబ్బందిపై దాడి చేశారు. తన ఇంట్లో రెండు చెట్లు కనిపించకపోయేసరికి అక్కడ పనిచేసే ఉద్యోగులను బాధ్యులుగా భావించి చితకబాదారు. అనంతరం వారిని విధుల నుంచి సస్పెండ్ చేశారు. ఉత్తరప్రదేశ్లోని బహ్రెయిచ్ జిల్లా కలెక్టర్ అభయ్ సింగ్పై ఈ ఆరోపణలు వచ్చాయి. ఆయన దౌర్జన్యాన్ని నిరసిస్తూ బాధితులు కలెక్టరేట్ వద్ద ధర్నా చేశారు. అభయ్సింగ్ అధికార నివాసంలో మంగళవారం రాత్రి రెండు చెట్లను నరికేశారు. ఈ విషయం తెలియగానే అభయ్ సింగ్ కోపోద్రిక్తుడయ్యారు. ఆయన ఓ కర్ర తీసుకుని అక్కడ విధులు నిర్వహిస్తున్న ప్లాటూన్ కమాండర్ హరిశ్చంద్ర శర్మ, హోంగార్డులు దర్బరీలాల్, శివకుమార్, మహ్మద్ కమరుద్దీన్, ధర్మరాజ్లను చితకబాదారు. కాగా బాధితులు ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేయలేదు. -
టోల్ ప్లాజా వద్ద ఎమ్మెల్యే అనుచరుల వీరంగం
బారాబంకీ : ములాయం సింగ్ యాదవ్ జన్మదిన వేడుకల ఆర్బాటం నేపథ్యంలో... దేశవ్యాప్తంగా నిరసన ఎదుర్కొంటున్న సమాజ్ వాదీ పార్టీ, తాజాగా మరో వివాదంలో చిక్కుకుంది. అధినేత జన్మదిన వేడుకల సంబరాల్లో మునిగిపోయిన పార్టీ ఎమ్మెల్యే అభయ్సింగ్ అనుచరులు పట్టపగలు టోల్గేట్ సిబ్బందిపై విచక్షణా రహితంగా దాడికి దిగారు. రాంగ్ రూట్ లో వస్తున్నారన్న టోల్టేగ్ సిబ్బందిపై దాడిచేసి తీవ్రంగా కొట్టారు. ఎమ్మెల్యే అనుచరులు దాడి చేస్తున్న దృశ్యాలు దేశవ్యాప్తంగా ప్రసారమవడంతో ఆ పార్టీ ఇరుకున పడింది. బారాబంకీలోని అహ్మద్పూర్లో శుక్రవారం చోటుచేసుకున్న ఈ ఘటనపై పోలీసులు ఇప్పటిదాకా కేసు కూడా నమోదు చేయకపోవడం విమర్శలకు తీవిస్తోంది. ఎమ్మెల్యే అనుచరుల దాడిలో టోల్గేట్ సిబ్బందిలో ఒకరు తీవ్రంగా గాయపడినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. మరోవైపు ఈ సంఘటన జరిగిన సమయంలో ఎమ్మెల్యే కారులోనే ఉన్నారని, అయినా ఆయన కారు దిగి రాలేదని తెలుస్తోంది. -
స్పందించాల్సిన పని లేదు
న్యూఢిల్లీ: నిషేధిత భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) అధ్యక్షుడు అభయ్ సింగ్ చౌతాలా తనపై చేసిన వ్యక్తిగత వ్యాఖ్యలపై స్పందించాల్సిన అవసరం లేదని ప్రఖ్యాత షూటర్ అభినవ్ బింద్రా స్పష్టం చేశాడు. ఐఓఏలో అవినీతిపరులకు చోటుండకూడదనే ఐఓసీ ప్రయత్నాలకు మద్దతుగా బింద్రా పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ షూటర్ చొరవపై ఆగ్రహంగా ఉన్న చౌతాలా వ్యక్తిగత దూషణకు దిగారు. చార్జిషీట్ దాఖలైన వ్యక్తులు ఎన్నికల్లో పోటీ చేయరాదనుకుంటే ముందుగా 2009లో చెక్ బౌన్సింగ్ కేసులో అరెస్టయిన తన తండ్రిని ఇంటి నుంచి వెళ్లగొట్టాలని పరుషంగా వ్యాఖ్యానించారు. ‘చౌతాలా చేసిన వ్యాఖ్యలపై మీడియా నా ప్రతిస్పందన కోసం వేచి చూస్తోంది. అయితే వీటిపై నేను స్పందించాల్సిన అవసరం లేదు. భారత క్రీడల్లో అవినీతిని పారద్రోలేందుకు నాతోపాటు మిగిలిన అథ్లెట్లు చేస్తున్న ప్రయత్నాలకు వీరు ఎలాంటి అడ్డంకులు సృష్టించలేరు. ఈ అంశంలో మరింతగా దూసుకెళతాం’ అని బింద్రా తేల్చాడు. మరోవైపు దేశానికి కీర్తిప్రతిష్టలు తీసుకొచ్చిన ఆటగాళ్లను వ్యక్తిగతంగా దూషించడం సరికాదని కేంద్ర క్రీడాశాఖ పేర్కొంది. జాతీయ రైఫిల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రణీందర్ సింగ్, మాజీ అథ్లెట్ అశ్వనీ నాచప్ప కూడా బింద్రాకు మద్దతు పలికారు.