Ashoke Pandit
-
అంత ప్రచారం అవసరమా?
పణజి: బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ కు మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం కల్పించడాన్ని సెన్సార్ బోర్డు సభ్యుడు, ఫిల్మ్ మేకర్ అశోక్ పండిట్ ఆక్షేపించారు. 2002 హిట్ అండ్ రన్ కేసులో సల్మాన్ ఖాన్ కు జైలు శిక్ష పడిన నేపథ్యంలో మీడియా పుంఖాను పుంఖాలుగా కథనాలు ప్రచారం చేయడాన్ని ఆయన తప్పుబట్టారు. గత మూడు రోజులుగా దేశంలో సల్మాన్ ఖాన్ కేసు మినహా ఏమీ జరగనట్టుగా మీడియా కథనాలు ప్రచారం చేసిందని, ఇది మంచి పద్ధతి కాదన్నారు. ఇది పరిణామం కూడా కాదని పేర్కొన్నారు. శుక్రవారం 'వుమన్ ఎకనామిక్ ఫోరం'లో మాట్లాడుతూ... బాలీవుడ్ లో ఎక్కువ మంది నిర్మాతలు నష్టాల్లోనే ఉన్నారని వెల్లడించారు. హైప్ కోసం బాక్సాఫీస్ రికార్డులు అంటూ హంగామా చేస్తున్నారని పండిట్ తెలిపారు. -
'నిహలానీ నిరంకుశుడు'
న్యూఢిల్లీ: భారత చలన చిత్ర సెన్సార్ బోర్డులో వైరుధ్యాలు బట్టబయలయ్యాయి. నిర్మాత అశోక్ పండిట్ సెన్సార్ బోర్డు చైర్మన్ పహ్లాజ్ నిహలానీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆయన క్రూరుడని, నిరంకుశ పాలన చేస్తారని వర్ణించారు. ఇదే బోర్డులోని మరో సభ్యుడు చంద్రప్రకాశ్ ద్వివేది కూడా బోర్డులోని పాలన యంత్రాంగం సరిగా లేదని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. నిహలానిపై విమర్శలకు ఫేస్బుక్ను సాధనంగా వాడుకున్న పండిట్.. నిహలాని నియంతృత్వానికి అనుష్కశర్మ నటించిన ఎన్ హెచ్ 10 బాధితురాలిగా మిగిలిందన్నారు. ఈ చిత్రంలో కొన్ని సీన్లు తొలగించాలని సెన్సార్ బోర్డు షరతులు విధించడంతో ఆ చిత్రం విడుదల వారంపాటు ఆగి ఈ శుక్రవారం విడుదల కానుంది. ఈ చిత్రం విషయంలో బోర్డు క్రూరంగా వ్యవహరించిందని పండిట్ విమర్శించారు.