BrahMos missile
-
‘పాకిస్తాన్ వద్దే కాదు.. చైనాకు కూడా ఆ సామర్థ్యం లేదు’
వాషింగ్టన్: ప్రపంచ దేశాల్లో అత్యంత శక్తిమంతమైన రక్షణ వ్యవస్థ కల్గిన దేశాల జాబితాలో భారత్ కు ప్రత్యేక స్థానం ఉందనే విషయం ఆపరేషన్ సిందూర్ తో మరోసారి నిరూపితమైంది. అత్యంత శక్తిమంతమైన ఆర్మీ కల్గిన దేశాల జాబితాలో భారత్ది నాల్గో స్థానం. ఇక్కడ చైనా కంటే భారత్ ఒక స్థానం కిందే ఉంది. టాప్ 5లో ఉన్న దేశాల్లో అమెరికా, రష్యా, చైనా, భారత్, దక్షిణకొరియాలు ఉన్నాయి. అయితే పాకిస్తాన్తో ఉద్రిక్త పరిస్థితుల నడుమ భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ తో భారత్ బలం మరింత పెరిగిందని అంటున్నారు యుద్ధ రంగ నిపుణులు. అది కూడా అమెరికాకు చెందిన యుద్ధ రంగ నిపుణుడు రిటైర్డ్ కల్నల్ జాన్ స్పెన్సాన్ ఈ వ్యాఖ్యలు చేశారు.పాకిస్తాన్తో యుద్ధంలో భారత్ యుద్ధ నైపుణ్యంలో తిరుగులేదని నిరూపించుకుందన్నారు. అటు ఎఫెన్స్, ఇటు డిఫెన్స్ అయినా భారత్ శక్తి అమోఘమని కొనియాడారు. ఇక్కడ ప్రధానంగా భారత్ కు చెందిన బ్రహ్మోస్ క్షిపణిపై ప్రశంసలు కురిపించారు. భారత్ రక్షణ అమ్ముల పొదిలో ఉన్న బ్రహ్మోస్ పని తీరును ఎంత పొగిడినా తక్కువే అంటూ కితాబిచ్చారు. బ్రహ్మోస్ తరహా క్షిపణులు అటు పాకిస్తాన్ లోనే కాదు, చైనాకు కూడా లేవని బల్లగుద్దీ మరీ చెప్పారు. చైనా, పాకిస్తాన్ రక్షణ వ్యవస్థలో భారత్ లో ఉన్న బ్రహ్మోస్ తో సరిపోల్చే క్షిపణులు కానీ ఆయుధ సామాగ్రి గానీ లేవన్నారు జాన్ స్పెన్సార్.. ఈ విషయాల్ని జాతీయ మీడియా సంస్థ ఇండియా టుడేకు ఇచ్చిన ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు జాన్ స్పెన్సార్.‘ చైనా వైమానికి రక్షణ వ్యవస్థలు కానీ పాకిస్తాన్ రక్షణ వ్యవస్థలు కానీ భారతదేశ రక్షణ వ్యవస్థలతో పోలిస్తే చాలా తక్కువ సామర్థ్యం కల్గి ఉన్నాయి. భారత్ బ్రహ్మోస్ క్షిపణి.. చైనా, పాకిస్తాన్ రక్షణ వ్యవస్థల్లో ఉన్న దానికంటే అధికరెట్లు బలంగా ఉంది. పాకిస్తాన్ లో ఉగ్ర స్థావరాలను, ఎయిర్ బేస్ లను భారత్ సునాయాసంగా ఛేదించడంలో బ్రహ్మోస్ కీలక పాత్ర పోషించింది. ఇక్కడ భారత్ క్లియర్ మెస్సేజ్ ఇచ్చింది. పాకిస్తాన్ లోని ఏ ప్రదేశాన్నైనా సునాయాసంగా ఛేదించగలదనే సందేశాన్ని భారత్ చాలా క్లియర్ గా పంపింది’ అని ఆయన పేర్కొన్నారు.ఇది కూడా చదవండి: మోస్ట్ పవర్ ఫుల్ ఆర్మీ కల్గిన దేశాలు ఇవే.. -
లాస్ట్ పంచ్.. బ్రహ్మోస్ మిస్సైల్ తో దెబ్బ అదుర్స్..
-
‘బ్రహ్మోస్’ దెబ్బకే... పాక్ దిగొచ్చిందా?!
జైపూర్/ లఖ్నవూ/ న్యూఢిల్లీ: సరిహద్దులపై ఎడాపెడా దాడులకు తెగబడ్డ పాక్ బ్రహ్మాస్త్రం దెబ్బకు దిగొచ్చిందా? అంటే అవుననే సమాధానమే వస్తోంది. అత్యంత శక్తిమంతమైన సూపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణి బ్రహ్మోస్ను పాక్ మీదికి భారత్ ప్రయోగించినట్టు వెలుగులోకి వచ్చింది. రాజస్తాన్లోని బికనీర్లో పాక్ సరిహద్దు ప్రాంతంలో బ్రహ్మోస్ బూస్టర్, నోస్క్యాప్ లభించడం దీన్ని ధ్రువీకరిస్తోంది. ఉగ్రసంస్థ జైషే మహ్మద్ మూలాలను పెకలిస్తూ పాక్లోని బహావల్పూర్లో ఉన్న దాని ప్రధాన స్థావరంపై మే 7 అర్ధరాత్రి దాటాక భారత క్షిపణులు విరుచుకుపడటం తెలిసిందే. బ్రహ్మోస్ బూస్టర్, నోస్ క్యాప్ దొరికింది బహావల్పూర్ ఉన్న దిశలోనే. బ్రహ్మోస్ను ప్రయోగించాక దాన్నుంచి విడివడే అనుబంధ భాగాల శకలాలతో అవి దాదాపుగా పోలుతున్నాయి. కనుక ఆ గగనతలం గుండానే బ్రహ్మోస్ దూసుకుపోయి ఉంటుందని భావిస్తున్నారు. బహావల్పూర్లోని జైషే భవనాలను కూల్చేందుకు శక్తిమతమైన క్షిపణులను ప్రయోగించినట్లు భారత్ ఇప్పటికే ప్రకటించడం తెలిసిందే. వాటిలో బ్రహ్మోస్ కూడా ఉందన్న వార్తలకు ఇది కూడా బలం చేకూరుస్తోంది. ఈ మేరకు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. యుద్ధంలో బ్రహ్మోస్ను వాడటం ఇదే తొలిసారి. అయితే దాని వినియోగాన్ని కేంద్రం ధుృవీకరించడం లేదు.బ్రహ్మోస్ దెబ్బ పాక్కు తెలుసు: యోగి ‘‘బ్రహ్మోస్ క్షిపణి సత్తా ఆపరేషన్ సిందూర్తో ప్రపంచానికి తెలిసి వచ్చింది. ఇంకా ఎవరికైనా తెలియాలంటే తాజాగా ఆ దెబ్బను రుచిచూసిన పాక్ను అడిగి తెలుసుకోవచ్చు’’ అని యూపీ ముఖ్య మంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు. లఖ్నవూలో బ్రహ్మోస్ ఏరోస్పేస్ ఇంటిగ్రేషన్ అండ్ టెస్టింగ్ కేంద్రం ప్రారం¿ోత్సవంలో ఆయన మాట్లాడారు. ‘‘ఉగ్రవాదాన్ని అంతంచేయనంత వరకు ఆ సమస్యకు పరిష్కారం లభించదు. మోదీ నాయకత్వంలో ఉగ్రవాదాన్ని శాశ్వతంగా అణచివేయాల్సిన తరుణమొచ్చింది. ఉగ్రవాదం కుక్కతోక వంటిది. దాన్నెప్పటికీ సరిచేయలేం. ఉగ్రవాదులకు వాళ్ల బాషలోనే బుద్ధిచెప్పాలి’’ అన్నారు. సైనిక సందేశం బ్రహ్మోస్: రాజ్నాథ్ భారత సాయుధ బలగాల సామర్థ్యానికి బ్రహ్మోస్ నిలువెత్తు నిదర్శనమని రక్షణ మంత్రి రాజ్నాథ్సింగ్ వ్యాఖ్యానించారు. ఆదివారం లఖ్నవూలో నూతన బ్రహ్మోస్ ఏరోస్పేస్ ఇంటిగ్రేటెడ్ అండ్ టెస్టింగ్ కేంద్రాన్ని ఆయన వర్చువల్గా ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ‘‘నేషనల్ టెక్నాలజీ డే (ఆదివారం) రోజే బ్రహ్మోస్ తయారీ కేంద్రాన్ని ప్రారంభించుకుంటున్నాం. ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన, వేగవంతమైన సూపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణుల్లో బ్రహ్మోస్ ఒకటి. ఇది శక్తిమంతమైన ఆయుధం మాత్రమే కాదు, మన సాయుధ బలగాల అమేయ సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటే ఒక సందేశం. శత్రువులకు సింహస్వప్నం. సరిహద్దుల పరిరక్షణలో మన అంకితభావాన్ని ఈ క్షిపణి చాటిచెబుతుంది’’ అన్నారు. రూ.300 కోట్లతో నిర్మించిన ఈ తయారీ కేంద్రంలో మ్యాక్ 2.8 వేగంతో 290 నుంచి 400 కి.మీ. దూరంలోని లక్ష్యాలను ఛేదించే బ్రహ్మోస్ క్షిపణుల తయారు చేయనున్నారు. -
బ్రహ్మోస్ క్షిపణి పనితీరు ఎలా ఉంటుందో పాక్ కు అడగండి
-
పాక్ ను వణికించిన BRAHMOS
-
పాక్ వైమానిక కీలక స్థావరాలను లక్ష్యంగా విరుచుకుపడ్డ బ్రహ్మోస్
-
బ్రహ్మోస్ పనీతీరు ఎలా ఉంటుందో పాక్కు తెలుసు: సీఎం యోగి
లక్నో: భారత్ (India), పాకిస్థాన్ (Pakistan) దేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ రక్షణ మంత్రి (Defence Minister) రాజ్నాథ్ సింగ్ (Rajnath Singh) యూపీ (Uttarpradesh)లోని లక్నోలో బ్రహ్మోస్ క్షిపణి (BrahMos missile) తయారీ కేంద్రాన్ని ప్రారంభించారు. ‘ఉత్తరప్రదేశ్ డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్’లో ఈ కేంద్రాన్ని నిర్మించారు. రాజ్నాథ్ సింగ్ వర్చువల్ విధానంలో ఈ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో యూపీ సీఎం యోగి పాల్గొన్నారు. ఈ యూనిట్కు 80 హెక్టార్ల భూమిని యూపీ సర్కార్ ఉచితంగా ఇచ్చింది. ఈ సందర్భంగా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ.. ఇదే రోజున మన శాస్త్రవేత్తలు పోఖ్రాన్లో అణు పరీక్షలు చేశారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఢిల్లీలో ఉండాల్సి వచ్చింది. నేను లక్నో ఎందుకు రాలేదో మీ అందరికీ తెలుసు. ఇంత తక్కువ సమయంలో ఈ యూనిట్ సిద్ధం చేసిన వారికి అభినందనలు. 40 నెలల్లోనే ఈ ప్రొడక్షన్ యూనిట్ను పూర్తి చేశారు అని ప్రశంసించారు. ఆపరేషన్ సిందూర్ ద్వారా ఉగ్రవాదులకు గట్టి జవాబు ఇచ్చాం. కేవలం పాక్ సరిహద్దే కాదు, రావల్పిండిపైనా దాడి చేశాం. బ్రహ్మోస్ క్షిపణితో శత్రువుకు మన శక్తి తెలియజేశాం. ఆపరేషన్ సిందూర్తో ప్రజలను ఎక్కడా టార్గెట్ చేయలేదు. ఉగ్రవాదాన్ని సహించబోమని ఆపరేషన్ సిందూర్తో ప్రధాని మోదీ స్పష్టం చేశారు. ఆలయాలు, గురుద్వారాలపై పాక్ సైన్యం దాడి చేస్తే.. మన సైన్యం ఆ దాడులను ధీటుగా తిప్పికొట్టింది. యూరి, పుల్వామా, పహల్గాం దాడుల తర్వాత ప్రతీసారి మన శక్తిని ప్రపంచానికి చూపించాం’ అని అన్నారు. #WATCH | Defence Minister Rajnath Singh says, "At the inauguration of BrahMos Integration & Testing Facility Center today, I feel delighted to speak with you. I wanted to attend in person. But you know why I couldn't come. Looking at the situation we are facing, it was important… pic.twitter.com/rlRSOXXfQZ— ANI (@ANI) May 11, 2025అంతకుముందు.. ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ..‘ఆపరేషన్ సిందూర్ సమయంలో మీరు బ్రహ్మోస్ క్షిపణిని ఒకసారి చూసి ఉంటారు. పాకిస్తాన్పై బ్రహ్మోస్ను ప్రయోగించాం. బ్రహ్మోస్ క్షిపణి పనితీరు ఎలా ఉంటుందో పాకిస్తాన్ను అడగండి. బ్రహ్మోస్ పనితీరును ప్రపంచమంతా చూసింది. ఉగ్రదాడి ఏదైనా యుద్ధంగానే పరిగణించాలి. భవిష్యత్తులో జరిగే ఏ ఉగ్రవాద చర్యనైనా యుద్ధ చర్యగా పరిగణిస్తామని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. ఉగ్రవాదాన్ని పూర్తిగా అణిచివేయనంత వరకు ఉగ్రవాద సమస్య పరిష్కారం కాదు. ఉగ్రవాదాన్ని పూర్తిగా అణిచివేయాలంటే, మనమందరం ప్రధాని మోదీ నాయకత్వంలో ఏకగ్రీవంగా పోరాడాలి. ఉగ్రవాదం ప్రేమ భాషను ఎప్పటికీ అంగీకరించదు. దానికి దాని స్వంత భాషలోనే సమాధానం చెప్పాలి. ఆపరేషన్ సిందూర్ ద్వారా భారతదేశం మొత్తం ప్రపంచానికి సందేశం ఇచ్చింది’ అని అన్నారు.#WATCH | Lucknow | UP CM Yogi Adityanath says, "You must have seen a glimpse of the BrahMos missile during Operation Sindoor. If you didn't, then just ask the people of Pakistan about the power of the BrahMos missile. PM Narendra Modi has announced that any act of terrorism going… pic.twitter.com/lv2LzYNcXs— ANI (@ANI) May 11, 2025ఇక, ఇక్కడ.. ఏడాది నుంచి 100 బ్రహ్మోస్ క్షిపణులు తయారుచేసేలా ఈ ప్రొడక్షన్ యూనిట్ను డిజైన్ చేశారు. రూ.300 కోట్ల వ్యయంతో దీన్ని నిర్మించారు. భారత్, రష్యాల సంయుక్త వెంచర్ అయిన బ్రహ్మోస్ ఏరోస్పేస్ అభివృద్ధి చేసిన ఈ బ్రహ్మోస్ క్షిపణి 290 నుంచి 400 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను చేధించగలదు. ఈ క్షిపణిని ఫైర్ అండ్ ఫర్గెట్ గైడెన్స్ సిస్టమ్తో భూ ఉపరితలం నుంచి, సముద్ర తలం నుంచి, గగనతలం నుంచి ప్రయోగించవచ్చు. కొత్తగా ప్రారంభమవుతున్న ఈ క్షిపణి తయారీ కేంద్రం నుంచి 100 నుంచి 150 కొత్త తరం బ్రహ్మోస్ క్షిపణులను తయారు చేయనున్నారు. ఈ కొత్త తరం బ్రహ్మోస్ క్షిపణులు ఏడాదిలోగా డెలివరీకి సిద్ధం కానున్నాయి. ఈ న్యూజనరేషన్ బ్రహ్మోస్ క్షిపణి పరిధి 300 కిలోమీటర్లు. దీని బరువును తగ్గించారు. ప్రస్తుత బ్రహ్మోస్ క్షిపణి బరువు 2900 కిలోలు కాగా, న్యూ బ్రహ్మోస్ క్షిపణి బరువు 1290 కిలోలు. ధ్వని వేగం కంటే మూడు రెట్లు ఎక్కువ వేగంతో ఇది ప్రయాణించగలదు. -
బ్రహ్మోస్ మిసైల్తో పాక్ను దారికి తెచ్చిన భారత్?
ఢిల్లీ: బ్రహ్మోస్ మిసైల్తో పాకిస్థాన్ను భారత్ దారికి తెచ్చింది. పాకిస్తాన్ వైమానిక దళం (PAF) కీలక స్థావరాలను లక్ష్యంగా చేసుకొని బ్రహ్మోస్-ఏ (ఎయిర్-లాంచ్డ్) క్రూయిజ్ క్షిపణులను భారత్ ప్రయోగించింది. బ్రహ్మోస్ మిసైల్తో పాక్ ఎనిమిది సైనిక స్థావరాలను భారత్ ధ్వంసం చేసింది.అణు ఆయుధ కేంద్రాలను భారత్ టార్గెట్ చేసుకోవచ్చనే భయంతో అమెరికా ద్వారా కాల్పుల విరమణ ప్రతిపాదన పాక్ చేసింది. మే 10న తెల్లవారు జామున, భారత వైమానిక దళం రావల్పిండి సమీపంలోని చక్లాలా, పంజాబ్ ప్రావిన్స్లోని సర్గోధా వద్ద బ్రహ్మోస్-ఏ క్షిపణులతో దాడులు చేసింది.కాగా, యుద్ధ విరమణకు కొద్ది గంటల ముందు దాయాదికి మన సైన్యం ఘనంగా లాస్ట్ పంచ్ ఇచ్చింది. ఏకంగా ఆరు కీలక పాకిస్థానీ వైమానిక స్థావరాలను నేలమట్టం చేసింది. వాటితో పాటు మరో రెండుచోట్ల రాడార్ వ్యవస్థలను కూడా ధ్వంసం చేసింది. శుక్రవారం అర్ధరాత్రి దాటాక వాటిపై అత్యంత కచ్చితత్వంతో కూడిన వైమానిక దాడులతో పాక్కు కోలుకోలేని నష్టం మిగిల్చింది.అత్యాధునిక వైమానిక స్థావరాలతో సహా పాక్లో ఏ ప్రాంతమూ సురక్షితం కాదని మరోసారి రుజువు చేసింది. ఎనిమిది కీలక సైనిక స్థావరాలపై జరిగిన దాడుల్లో ఏ ఒక్కదాన్నీ పాక్ సైన్యం కనీస స్థాయిలో కూడా అడ్డుకోలేకపోయింది. పాక్ భద్రత అక్షరాలా గాల్లో దీపమేనని మరోసారి తేలిపోయింది. -
ఫైటర్ జెట్ నుంచి దూసుకెళ్లిన ‘బ్రహ్మోస్’ మిసైల్
న్యూఢిల్లీ: సరిహద్దు వివాదాలు పెరుగుతున్న వేళ రక్షణ రంగ సామర్థ్యాన్ని మెరుగుపరిచే మరో కీలక ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తి చేసింది భారత్. బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ ఎక్స్టెండెడ్ రేంజ్ వెర్షన్ను సుఖోయ్-30 యుద్ధ విమానం నుంచి పరీక్షించింది భారత వాయుసేన. గగనతలం నుంచి దూసుకెళ్లిన ఈ బ్రహ్మోస్ క్షిపణి 400 కిలోమీటర్ల దూరంలోని నిర్దేశిత లక్ష్యాన్ని ఛేదించింది. ‘సూపర్ సోనిక్ క్రూయిజ్ మిసైల్ బంగాళకాతంలో నిర్దేశిత లక్ష్యాన్ని విజయవంతంగా ఛేదించింది. ఈ విజయవంతమైన ప్రయోగంతో భూతల, సముద్రంలోని సుదూర లక్ష్యాలపై కచ్చితమైన దాడులు చేయగల సామర్ధ్యాన్ని వైమానిక దళం సాధించింది. సుఖోయ్-30ఎంకేఐతో ఎక్స్టెండెడ్ రేంజ్ వర్షన్ మిసైల్ను జత చేయడం ద్వారా భారత వైమానిక దళానికి వ్యూహాత్మక బలాన్ని చేకూర్చింది. భవిష్యత్తులో ఎదురయ్యే యుద్ధాల్లో పైచేయి సాధించే అవకాశాన్ని కల్పించింది.’ - భారత రక్షణ శాఖ బ్రహ్మోస్ క్షిపణి ప్రయోగానికి సంబంధించిన వీడియోను భారత వాయుసేన ట్విట్టర్లో షేర్ చేసింది. ఎయిర్ఫోర్స్, నేవీ, డీఆర్డీఓ, హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్, బ్రహ్మోస్ ఏరోస్పేస్ సంయుక్త భాగస్వామ్యంతో ఈ ప్రయోగం విజయవంతమైనట్లు భారత వాయుసేన తెలిపింది. మరోవైపు.. యుద్ధ విమానం నుంచి క్షిపణులను పరీక్షించడం ఇదే తొలిసారి కాదు. ఈ ఏడాది మే నెలలోనూ ఇలాంటి పరీక్షలు నిర్వహించారు. 290 కిలోమీటర్ల రేంజ్ నుంచి 350 కిలోమీటర్లుకు పెంచిన మిసైల్ను సుఖోయ్ ఫైటర్ నుంచి ప్రయోగించి విజయం సాధించింది వాయుసేన. The IAF successfully fired the Extended Range Version of the Brahmos Air Launched missile. Carrying out a precision strike against a Ship target from a Su-30 MKI aircraft in the Bay of Bengal region, the missile achieved the desired mission objectives. pic.twitter.com/fiLX48ilhv — Indian Air Force (@IAF_MCC) December 29, 2022 ఇదీ చదవండి: కోవిడ్ కొత్త వేరియంట్ల పుట్టుకకు కేంద్రంగా చైనా.. నిపుణుల ఆందోళన -
పాకిస్తాన్లోకి భారత క్షిపణులు మిస్ఫైర్.. ముగ్గురు అధికారులపై వేటు
సాక్షి,న్యూఢిల్లీ: పాకిస్తాన్లోకి పొరపాటున బ్రాహ్మోస్ క్షిపణులను ప్రయోగించిన ముగ్గురు వాయుసేన అధికారులను విధుల నుంచి తొలగించింది కేంద్రం. ఈ ఏడాది మార్చిలో జరిగిన ఈ ఘటనపై న్యాయ విచారణ అనంతరం మంగళవారం అధికారికంగా ఆదేశాలు జారీ చేసింది. కేంద్రం విధుల నుంచి తొలగించిన అధికారుల్లో ఓ గ్రూప్ కెప్టెన్, వింగ్ కమాండర్, స్క్వాడ్రన్ లీడర్ ఉన్నారు. భారత వాయుసేన తాజాగా చెప్పిన వివరాల ప్రకారం ఈ ముగ్గురు అధికారులు స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్(SOP)లో చేసిన పొరపాటు వల్లే క్షిపణులు ప్రమాదవశాత్తు పాకిస్తాన్ భూభాగంలో పడ్డాయి. మార్చి 9న జరిగిన ఈ ఘటన అనంతరం బ్రాహ్మోస్ క్షిపుణులు తమ భూభాగంలో పడ్డాయని పాకిస్తాన్ భారత్కు సమన్లు పంపి నిరసన వ్యక్తం చేసింది. అయితే సాంకేతిక లోపం వల్లే క్షిపణులు పొరపాటున పాక్లో పడినట్లు భారత్ వివరణ ఇచ్చింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదనే విషయాన్ని ప్రస్తావించింది. చదవండి: ‘రాజీ’ ఎరుగని బీజేపీ ఎమ్మెల్యే.. ఏడికైతే ఆడికైతది.. తగ్గేదెలే! -
అణ్వస్త్ర సత్తా చాటేందుకే బ్రహ్మోస్ తయారీ
లక్నో: ప్రపంచంలోని ఏ దేశమూ భారత్పై దాడికి దిగే సాహసం చేయకూడదనే బ్రహ్మోస్ అణ్వస్త్ర క్షిపణులను తయారుచేస్తున్నామని రక్షణ మంత్రి రాజ్నాథ్ స్పష్టంచేశారు. లక్నోలో రక్షణ సాంకేతికత, ప్రయోగ కేంద్రం, నూతన బ్రహ్మోస్ ఆయుధ కర్మాగారాలకు రాజ్నాథ్ శనివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘భారత్ బ్రహ్మోస్ సహా ఇతర ఆయుధాలను తయారుచేస్తోందంటే అర్ధం.. ఇతర దేశాలపై దాడికి సిద్ధమైందని కాదు. కయ్యానికి కాలు దువ్వేందుకు ప్రయత్నించే దేశాలకు భారత తన అణ్వస్త్ర సామర్థ్యాన్ని చాటిచెప్పేందుకే ఇలా క్షిపణులను తయారుచేస్తోంది. భారత్కు చెడు చేయాలని పొరుగుదేశం(పాక్) ఎందుకు అనుక్షణం పరితపిస్తోందో నాకైతే అర్ధంకాలేదు’ అని రాజ్నాథ్ అన్నారు. బ్రహ్మోస్ యూనిట్ కోసం అడిగిన వెంటనే 200 ఎకరాల స్థలం కేటాయించారని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ను రాజ్నాథ్ అభినందించారు. ఈ రెండు యూనిట్లను డీఆర్డీవో నెలకొల్పుతోంది. యూనిట్లో బ్రహ్మోస్ కొత్త తరం వేరియంట్ క్షిపణులను రూపొందిస్తారు. ఏడాదికి దాదాపు వంద క్షిపణులను తయారుచేస్తారు. -
‘బ్రహ్మోస్’ పరీక్ష విజయవంతం
న్యూఢిల్లీ: సూపర్సోనిక్ క్రూయిజ్ మిస్సైల్ బ్రహ్మోస్ను ఆదివారం భారత వైమానిక దళం(ఐఏఎఫ్) విజయవంతంగా పరీక్షించింది. స్టెల్త్ డెస్ట్రాయర్ ‘ఐఎన్ఎస్ చెన్నై’నుంచి ప్రయోగించిన ఈ క్షిపణి అరేబియా సముద్రంలోని లక్ష్యాన్ని అత్యంత కచ్చితత్వంతో ఛేదించిందని అధికారులు తెలిపారు. ‘సముద్ర జలాలపై లక్ష్యాలను ఛేదించగలిగే సత్తా ఉన్న బ్రహ్మోస్ యుద్ధ నౌక అజేయశక్తిని మరింత ఇనుమడింపజేసిందని, భారత నేవీ వద్ద ఉన్న మరో ప్రమాదకర అస్త్రాల్లో ఒకటిగా మారిందని రక్షణ శాఖ తెలిపింది. భారత్–రష్యా ఉమ్మడి భాగస్వామ్యంలో రూపొందిన బ్రహ్మోస్ క్షిపణులను జలాంతర్గాములు, యుద్ధనౌకలు, విమానాలతో పాటు నేలపై నుంచి కూడా ప్రయోగించే వీలుంది. ఈ ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తి చేసిన రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ(డీఆర్డీవో), బ్రహ్మోస్ ఏరోస్పేస్, భారత నేవీని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అభినందించారు. క్షిపణి ప్రయోగంలో పాలుపంచుకున్న శాస్త్రవేత్తలు, సిబ్బందిని డీఆర్డీవో చైర్మన్ జి.సతీశ్ రెడ్డి కూడా అభినందించారు. మన సైనిక పాటవం బ్రహ్మోస్ క్షిపణితో మరింత పెరుగుతుం దన్నారు. సరిహద్దుల్లో చైనాతో ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో.. భారత్.. నేలపై నుంచి నేలపైకి బ్రహ్మోస్ను, యాంటీ రేడియేషన్ క్షిపణి రుద్రం–1ను, లేజర్ గైడెడ్ యాంటీ ట్యాంక్ మిస్సైల్ను, అణు సామర్థ్యం ఉన్న శౌర్య క్షిపణులను విజయవంతంగా పరీక్షించింది. -
'శౌర్యం' చూపుతున్న భారత క్షిపణి
సాక్షి, బాలాసోర్: గత వారం రోజులుగా డీఆర్డీవో వరుస క్షిపణులను ప్రయోగిస్తోంది. అధునాతన వర్షన్తో శౌర్యా అణు సామర్థ్యం గల బాలిస్టిక్ క్షిపణిని డీఆర్డీఓ శనివారం విజయవంతంగా పరీక్షించింది. భారత్- చైనా ఎల్ఏసీ వద్ద ఉధృత పరిస్థితులు నెలకొంటున్న నేపథ్యంలో ఈ క్షపణిని పరీక్షించడం ప్రాధాన్యం సంతరించికుంది. ఈ క్షపణి దాదాపు 800 కిలోమీటర్ల మేర లక్ష్యాన్ని ఛేదించే సామర్థ్యం కలదు. ఈ క్షిపణి ఆపరేట్ చేసేందుకు సులువుగా, తేలిగ్గా ఉంటుందని.. లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో చివరి దశకు చేరుకునే సరికి హైపర్సోనిక్ వేగంతో దూసుకెళ్తుందని అధికార వర్గాలు వెల్లడించాయి. వరుస పరీక్షలతో డీఆర్డీవో దూకుడు.. డీఆర్డీవో వరుస క్షిపణి పరీక్షలతో దూసుకెళ్తోంది. 'లేజర్ గైడెడ్ యాంటీ ట్యాంక్' క్షిపణిని మంగళవారం విజయవంతంగా పరీక్షించారు. గత పదిరోజుల వ్యవధిలో రెండో క్షిపణిని పరీక్షించిండం విశేషం. మహారాష్ర్టలోని అహ్మద్నగర్లో ఈ క్షిపణిని అభివృధి చేశారు. దీని రేంజ్ ఐదు కి.మి ఉంటుందని.. వివిధ లాంచ్ప్యాడ్స్ ద్వారా ప్రయోగించవచ్చని రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. బ్రాహ్మోస్... డీఆర్డీవో విజయవంతంగా ప్రయోగించిన మరో ఆయుద్ధం.. 'బ్రాహ్మోస్ సూపర్సోనిక్ క్రూజ్ క్షపణి'. 400 కి.మి రేంజ్తో లక్ష్యాన్ని ఛేదించగల శక్తి బ్రాహ్మోస్ ప్రత్యేకం. డీఆర్డీవో పీజే-10 ప్రాజెక్ట్ ద్వారా ఈ పరీక్ష నిర్వహించారు. ఇటువంటి క్షపణిని పరీక్షించడం ఇది రెండోసారి. -
బ్రహ్మోస్ బూస్టర్ సక్సెస్
సాక్షి, హైదరాబాద్: బ్రహ్మోస్ క్షిపణిలో అమర్చే కీలకమైన స్వదేశీ తయారీ బూస్టర్ పరీక్ష విజయవంతమైంది. ఈ బూస్టర్తోపాటు ఎయిర్ఫ్రేమ్ సెక్షన్, మరికొన్ని ఇతర భాగాలనూ పూర్తిగా భారత్లోనే తయారుచేశారు. వీటిని అమర్చిన బ్రహ్మోస్ క్షిపణిని బుధవారం ఉదయం 10.30 గంటలకు ఒడిశాలోని బాలాసోర్ పరీక్ష కేంద్రం నుంచి ప్రయోగించారు. క్షిపణి లక్ష్యాన్ని చేరుకోవడంతోపాటు ధ్వని వేగం కంటే 2.8 రెట్ల ఎక్కువ వేగంతో ప్రయాణించినట్లు రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ(డీఆర్డీవో) ఒక ప్రకటనలో తెలిపింది. ప్రయోగం విజయవంతం కావడంతో ఇకపై బ్రహ్మోస్ క్షిపణి వ్యవస్థకు కావాల్సిన బూస్టర్లు, ఇతర పరికరాలను దేశీయంగానే తయారుచేసుకొనే వీలు కలుగుతుందని డీఆర్డీవో చైర్మన్ జి.సతీశ్రెడ్డి తెలిపారు. డీఆర్డీవో, బ్రహ్మోస్ బృందాలను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అభినందించారు. -
సుఖోయ్కి బ్రహ్మోస్ జత కలిస్తే..
తంజావూర్: హిందూ మహా సముద్ర జలాలపై పట్టు సాధించేందుకు తంజావూరు బేస్ స్టేషన్గా భారత వాయు సేన (ఐఏఎఫ్) బ్రహ్మోస్ క్షిపణులను అమర్చిన సుఖోయ్ యుద్ధవిమానాలను ప్రారంభించింది. టైగర్షార్క్ 222 స్క్వాడ్రన్కు చెందిన సుఖోయ్30 ఎంకేఐ యుద్ధ విమానాలు దక్షిణ భారత జలాలపై ఆధిపత్యం సాధిస్తాయని ఐఏఎఫ్ పేర్కొంది. ఇక దక్షిణ భారత్లో తంజావూర్ వ్యూహాత్మక స్థావరంగా మారనుందని పేర్కొంది. భారత్–రష్యాల సంయుక్త కృషితో తయారైన బ్రహ్మోస్ క్షిపణులకు సుఖోయ్లు తోడై అత్యంత శక్తిమంతంగా మారాయని ప్రారంభోత్సవం సందర్భంగా చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్ చెప్పారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ 300 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను ఈ క్షిపణులు సులువుగా టార్గెట్ చేయగలవు. ఈ విమానాలు ఒక్కసారి ఇంధనం నింపుకుంటే 1500 కిలోమీటర్ల పరిధిలో నిరంతరాయంగా పనిచేసే సామర్థ్యం వీటి సొంతం. -
బ్రహ్మోస్ క్షిపణి పరీక్ష విజయవంతం
న్యూఢిల్లీ: సూపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణి బ్రహ్మోస్ ఏరియల్ వెర్షన్ను విజయవంతంగా పరీక్షించినట్లు భారత వైమానిక దళం (ఐఏఎఫ్) బుధవారం వెల్లడించింది. సుఖోయ్ యుద్ధ విమానం ఎస్యు–30 ఎంకేఐ ద్వారా ఈ పరీక్ష నిర్వహించారు. 2.5 టన్నుల బరువుండి, ఆకాశం నుంచి భూ ఉపరితలంపైకి ప్రయోగించే ఈ క్షిపణి దాదాపు 300 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదు. తద్వారా ఐఏఎఫ్ యుద్ధ సామర్థ్యాలను కూడా ఇది పెంచుతుందని మిలిటరీ అధికారులు చెప్పారు. బ్రహ్మోస్ క్షిపణి 2.8 మ్యాక్ వేగంతో ప్రయాణిస్తుంది. ‘విమానం నుంచి ఈ క్షిపణిని ఏ సమస్యలూ లేకుండా ప్రయోగించగలిగాం. నిర్దేశించిన మార్గంలో అది ప్రయాణించి లక్ష్యాన్ని ఛేదించింది’ అని ఐఏఎఫ్ అధికార ప్రతినిధి గ్రూప్ కెప్టెన్ అనుపమ్ బెనర్జీ చెప్పారు. -
బ్రహ్మోస్కు పోటీగా చైనా కొత్త క్షిపణి
బీజింగ్: భారత్, రష్యాలు సంయుక్తంగా అభివృద్ధి చేసిన బ్రహ్మోస్ క్షిపణికి పోటీగా చైనాలోని ఓ మైనింగ్ సంస్థ సూపర్సోనిక్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించినట్లు అక్కడి ప్రభుత్వ మీడియా పేర్కొంది. ఈ క్షిపణిని చైనా మిత్రదేశం పాకిస్తాన్ కొనుగోలు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఉత్తర చైనాలోని ఓ రహస్య ప్రాంతంలో సోమవారం గువాంగ్డాంగ్ హోంగ్డా బ్లాస్టింగ్ కంపెనీ ఈ క్షిపణి పరీక్ష జరపగా, అన్ని వ్యవస్థలూ సక్రమంగా పనిచేస్తున్నట్లు తేలిందంటూ గ్లోబల్ టైమ్స్ ఓ కథనాన్ని ప్రచురించింది. హెచ్డీ–1 అని పేరుపెట్టిన ఈ క్షిపణిని హోంగ్డా సంస్థ తన సొంత ఖర్చుతో అభివృద్ధి చేస్తోంది. ప్రభుత్వం ఆమోదించాక హోంగ్డా కంపెనీ ఈ క్షిపణిని ఇతర దేశాలకు అమ్మనుంది. -
‘బ్రహ్మోస్’లో శత్రు గూఢచారి!
నాగ్పూర్: ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన సూపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణి ‘బ్రహ్మోస్’కు సంబంధించిన రహస్య సమాచారాన్ని పాకిస్తాన్ నిఘా సంస్థ ఐఎస్ఐకి చేరవేస్తున్న గూఢచారిని అధికారులు సోమవారం అరెస్ట్ చేశారు. నాగ్పూర్లోని డీఆర్డీవోలో ఉన్న ‘బ్రహ్మోస్ క్షిపణి పరిశోధన కేంద్రం’లో నిశాంత్ అగ్రవాల్ గత నాలుగేళ్ల నుంచి ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. ఈ నేపథ్యంలో బ్రహ్మోస్ క్షిపణికి సంబంధించిన కీలక సమాచారాన్ని పాకిస్తాన్ నిఘా సంస్థ ఐఎస్ఐతో పాటు మరికొన్ని దేశాలకు నిశాంత్ చేరవేసినట్లు భారత్ నిఘా వర్గాలు గుర్తించాయి. దీంతో సోమవారం ఉదయం 5.30 గంటలకు నిశాంత్ నివాసానికి చేరుకున్న మిలటరీ ఇంటెలిజెన్స్ అధికారులు, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ సంయుక్త బృందం అతడిని అరెస్ట్ చేసింది. అనంతరం సాయంత్రం వరకూ ఆ ఇంట్లో సోదాలు కొనసాగాయి. ఈ తనిఖీల్లో నిశాంత్ ల్యాప్టాప్లో బ్రహ్మోస్తో పాటు క్షిపణి వ్యవస్థలకు సంబంధించి కీలకమైన సమాచారం లభ్యమైందని ఉత్తరప్రదేశ్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ ఐజీ అసీమ్ అరుణ్ తెలిపారు. పక్కా సమాచారంతోనే నిశాంత్ ఇంటిపై దాడి చేసి అరెస్ట్ చేశామని వెల్లడించారు. పాకిస్తాన్కు చెందిన కొందరు వ్యక్తులతో నిశాంత్ ఫేస్బుక్ ద్వారా మాట్లాడుతున్నట్లు గుర్తించామన్నారు. నిందితుడిపై అధికారిక రహస్యాల చట్టం కింద కేసు నమోదుచేసినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ కేసులో విచారణ కొనసాగుతోందని అసీమ్ అరుణ్ వెల్లడించారు. రెండు నెలల క్రితం వివాహం చేసుకున్న నిశాంత్.. ఇక్కడి వార్ధా రోడ్డులో అద్దె ఇంటిలో ఉంటున్నాడు. ఈ విషయమై ఇంటి యజమాని మనోహర్ కాలే మాట్లాడుతూ.. దాదాపు ఏడాదికాలంగా నిశాంత్ తమ ఇంటిలో అద్దెకు ఉంటున్నాడని తెలిపారు. అద్దెకు దిగేందుకు ఆధార్ కార్డు కాపీతో పాటు డీఆర్డీవో జారీచేసిన సర్టిఫికెట్ను సమర్పించాడన్నారు. ఆధార్ కార్డులోని వివరాల ప్రకారం ఉత్తరాఖండ్లోని రూర్కీ నిశాంత్ స్వస్థలమని వెల్లడించారు. భారత్కు చెందిన డీఆర్డీవో, రష్యాకు చెందిన మిలటరీ ఇండస్ట్రియల్ కన్సార్టియం(ఎన్పీవోఎం) సంయుక్తంగా ఏర్పాటుచేసిన బ్రహ్మోస్ ఏరోస్పేస్ ‘బ్రహ్మోస్ క్షిపణి’ని తయారుచేసింది. బ్రహ్మోస్ విశేషాలు బ్రహ్మోస్ క్షిపణి తయారీ కోసం భారత్, రష్యా ప్రభుత్వాలు 1998, ఫిబ్రవరి 12న ఒప్పందం చేసుకున్నాయి. భారత్లోని బ్రహ్మపుత్ర, రష్యాలోని మోస్కోవా నదుల పేరు మీదుగా ఈ క్షిపణికి బ్రహ్మోస్ అని నామకరణం చేశారు. ఈ క్షిపణిని ట్రక్కులు, యుద్ధనౌకలు, జలాంతర్గాములు, విమానాల ద్వారా ప్రయోగించవచ్చు. గతేడాది నవంబర్లో సుఖోయ్–30 యుద్ధవిమానం నుంచి ఈ క్షిపణిని విజయవంతంగా పరీక్షించారు. 8.4 మీటర్ల పొడవు, 3,000 కేజీల బరువున్న ఈ క్షిపణి 200 కిలోల అణ్వాయుధాలు లేదా సంప్రదాయ వార్హెడ్ను మోసుకుపోగలదు. మొబైల్ లాంఛర్లు, యుద్ధనౌకలు, సబ్మెరైన్ల ద్వారా ప్రయోగించే బ్రహ్మోస్ 450 కి.మీ, యుద్ధవిమానాల ద్వారా ప్రయోగించే బ్రహ్మోస్ 400 కి.మీ దూరంలోని లక్ష్యాలను తుత్తునియలు చేయగలదు. -
తిరుగులేని బ్రహ్మోస్
బాలాసోర్/న్యూఢిల్లీ: సూపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణి బ్రహ్మోస్ను భారత్ మరోసారి విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని బాలాసోర్ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి సోమవారం క్షిపణిని ప్రయోగించినట్లు రక్షణ శాఖ వెల్లడించింది. ప్రయోగ సమయంలో సముద్రంలో అలలు తొమ్మిది మీటర్ల ఎత్తుకు ఎగిసిపడుతున్నాయని, ప్రతికూల వాతావ రణంలోనూ నిర్దేశించిన మార్గంలో బ్రహ్మోస్ ప్రయాణించిందని, క్షిపణిలోని ముఖ్య భాగాలన్నీ కచ్చితత్వంతో పని చేశాయంది. దీన్నిబట్టి అత్యంత తీవ్రమైన వాతావరణ పరిస్థితుల్లోనూ లక్ష్యాలను బ్రహ్మోస్ ఛేదించ గలదని మరోమారు రుజువైందని పేర్కొంది. క్షిపణి జీవిత కాలాన్ని పెంచే కార్యక్రమంలో భాగంగా ప్రయోగం నిర్వహించామని, త్వరలోనే దీన్ని ఆర్మీకి అప్పగించనున్నామని వెల్లడించింది. ప్రపంచంలో అత్యంత వేగవంతమైన సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణిగా పేరొందిన బ్రహ్మోస్.. 290 కి.మీ. పరిధిలోని లక్ష్యాలను ఛేదించగలదు. -
సుఖోయ్ నుంచి బ్రహ్మోస్ ప్రయోగం సక్సెస్
సాక్షి, న్యూఢిల్లీ : ప్రపంచంలో అత్యంత వేగవంతమైన సూపర్సానిక్ క్షిపణి బ్రహ్మోస్ను బుధవారం భారత వాయుసేనకు చెందిన ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్ సుఖోయ్-30ఎంకేఐ నుంచి విజయవంతంగా ప్రయోగించారు. తొలిసారిగా సుఖోయ్ నుంచి బ్రహ్మోస్ ప్రయోగం విజయవంతం కావడంతో వాయుసేన సైనిక పాటవం నూతన జవసత్వాలను నింపుకున్నట్లైందని అధికారులు తెలిపారు. ఉపరితలం, సముద్ర, గగనతలం నుంచి ప్రయోగించేందుకు వీలున్న ప్రపంచశ్రేణి బ్రహ్మోస్ 2.5 టన్నుల బరువుతో సుఖోయ్ నుంచి ప్రయోగానికి అనువుగా రూపొందింది. డీఆర్డీఓ, రష్యాకు చెందిన ఎన్పీఓఎమ్ జాయింట్ వెంచర్తో ఈ అత్యాధునిక ఆయుధం భారత్ అమ్ములపొదిలో చేరింది. కాగా, బ్రహ్మోస్ క్షిపణిని విజయవంతంగా సుఖోయ్ నుంచి ప్రయోగాత్మకంగా పరీక్షించడం ద్వారా భారత్ చరిత్ర సృష్టించిందని రక్షణ మంత్రి కార్యాలయం ట్వీట్ చేసింది. -
డెడ్లీ కాంబినేషన్: సుఖోయ్ నుంచి బ్రహ్మోస్ క్షిపణి పరీక్ష
సాక్షి,న్యూఢిల్లీ: భారత్ అమ్ముల పొదిలో బ్రహ్మాస్ర్తమైన బ్రహ్మోస్ క్షిపణి అత్యాధునిక వెర్షన్ని తొలిసారిగా సుఖోయ్ యుద్ధ విమానం నుంచి ఈవారంలో ప్రయోగాత్మకంగా పరీక్షించనున్నారు. ఈ ప్రయోగం విజయవంతమైతే సర్జికల్ దాడుల్లో ఈ అత్యాధునిక క్షిపణి బ్రహ్మోస్ భారత్కు వెన్నుదన్నుగా నిలుస్తుంది.సుఖోయ్ ఫైటర్ జెట్ నుంచి బ్రహ్మోస్ ప్రయోగం డెడ్లీ కాంబినేషన్గా రక్షణ నిపుణులు అభివర్ణిస్తున్నారు. గగనతల ఉపరితల లక్ష్యాలను ఛేదించే బ్రహ్మోస్ క్షిపణులు ప్రత్యర్థి భూభాగంలోని ఉగ్ర శిబిరాలను గుర్తించి రెప్పపాటులో నాశనం చేయడంతో పాటు అణు బంకర్లు, కమాండ్ కంట్రోల్ సెంటర్లు, సముద్రంపై యుద్ధ విమానాల వంటి సైనిక లక్ష్యాలను అవలీలగా ధ్వంసం చేస్తాయని చెబుతున్నారు. గత పదేళ్లుగా 290 కిమీ దూరంలోని లక్ష్యాలను ఛేదించగల బ్రహ్మోస్ క్షిపణులను సాయుధ దళాలు సమీకరించాయి. మరోవైపు ఆర్మీ, నేవీ, వాయుసేనలు రూ 27,150 కోట్ల విలువైన ఆర్డర్లను ఇవ్వడం బ్రహ్మోస్ పట్ల భారత సేనల ఆసక్తిని స్పష్టం చేస్తున్నాయి. -
'చైనా వార్నింగ్ పట్టించుకోం.. బ్రహ్మోస్ దించుతాం'
న్యూఢిల్లీ: చైనా హెచ్చరికలను భారత్ పక్కన పెట్టింది. తమ దేశ వ్యవహారంలో తలదూర్చవద్దని చైనాకు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. తమ దేశ సరిహద్దు వ్యవహారం తమ ఇష్టమని, తమ భూభాగంలో ఉన్న సమస్యల దృష్ట్యా ఎలాంటి పనైనా చేసుకుంటామని, అది వేరే దేశాలకు సంబంధించినది కానందున ప్రతి అంశాన్ని చెప్పాల్సిన అవసరం లేదని పేర్కొన్నట్లు సమాచారం. ప్రస్తుతం అరుణా చల్ ప్రదేశ్ వద్ద ఉన్న భారత సరిహద్దు ప్రాంతంలో భారత్ బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్షిపణులను విస్తరిస్తున్న విషయం తెలిసిందే. వీటిని ఎక్కడి నుంచైనా ప్రయోగించేందుకు అవకాశం ఉంటుంది. అయితే, చైనా మాత్రం వీటి విషయంలో ఆందోళన వ్యక్తం చేసింది. అయితే, తాము చైనా ప్రభావానికి లోనై ఈ పనిచేయడం లేదని, రక్షణ అనేది తమ వ్యక్తిగత ఆందోళన అయినందున తాము ఈ పనిచేస్తున్నామని చైనాకు వెల్లడించినట్లు ఆర్మీ టాప్ అధికారులు చెప్పినట్లు తెలుస్తోంది. -
సరిహద్దులో క్షిపణిపై చైనా లొడలొడ!
న్యూఢిల్లీ: కొద్దిరోజులుగా ఉద్రిక్తంగా మారిన భారత్- చైనా సరిహద్దు.. క్షిపణి మోహరింపుతో ఒక్కసారిగా వేడెక్కింది. తన అమ్ములపొదిలోని సూపర్ సానిక మిస్సైల్ ' బ్రహ్మోస్' ను భారత్..అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దులో మోహరింపజేసింది. కాగా, ఈ చర్యను చైనా తప్పుపట్టింది. సరిహద్దుల్లో నుంచి క్షిపణిని ఉపసంహరించుకోవాలని కోరింది. ఈ మేరకు చైనా ఆర్మీ(పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ) తన అధికార పత్రిక పీఎల్ఏ డైలీలో వ్యాఖ్యానం రాసింది. బ్రహ్మోస్ వల్ల చైనామోహరింపును వ్యతిరేక సంకేతంగా భావిస్తున్నట్లు పీఎల్ఏ డైలీ పేర్కొంది. తద్వారా ఇరుపక్షాల్లో ఆగ్రహావేశాలు పెరిగే అవకాశం ఉందని, దీని ప్రభావం ఇండో-చైనా సంబంధాలపై పడుతుందని అభిప్రాయపడింది. అయితే భారత్ మాత్రం దీనినొక సాధారణ చర్యగానే పరిగణిస్తోంది. చైనా సరిహద్దులో మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టిసారించిన భారత ప్రభుత్వం పెద్ద సంఖ్యలో యుద్ధట్యాంకులు, విమానాలను ఇప్పటికే అరుణాచల్ కు పంపింపిన సంగతి తెలిసిందే. బ్రహ్మోస్ మోహరింపు కూడా అందులో భాగమేనని రక్షణ శాఖ వర్గాలు పేర్కొన్నాయి. నిజానికి బ్రహ్మోస్ మోహరింపు వల్ల ఎలాంటి ప్రమాదం లేకపోయినప్పటికీ, చైనా తనకు అలవాటైన రీతిగా భారత్ కు వ్యతిరేకంగా వాగుతోందంని విశ్లేషకులు అంటున్నారు. రష్యా సహకారంతో దాదాపు రూ.4,500 కోట్ల వ్యయంతో రూపొందించిన బ్రహ్మోస్ సూపర్ సానిక్ క్రూయిజ్ క్షిపణికి భూ ఉపరితలం నుంచేకాక జలాంతర్గామి, నౌక, విమానాల నుంచి కూడా ప్రయోగించవచ్చు. 300 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని ఛేధించగల బ్రహ్మోస్.. గంటకు 3,400 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోగలదు. -
బ్రహ్మోస్ క్షిపణి పరీక్ష విజయవంతం
న్యూఢిల్లీ : భూ ఉపరితల లక్ష్యాలను ఛేదించే సూపర్సోనిక్ క్షిపణి బ్రహ్మోస్ని భారత్ శుక్రవారం విజయవంతంగా పరీక్షించింది. రాజస్తాన్లోని పోఖ్రాన్ కేంద్రంలో భారత వాయుసేన ఈ పరీక్ష నిర్వహించింది. అనుకున్న లక్ష్యాలను క్షిపణి కచ్చితత్వంతో అధిగమించిందని బ్రహ్మోస్ ఏరోస్పేస్ ప్రకటించింది. లోపరహిత సామర్థ్యాలు కలిగిన ఈ వ్యవస్థ త్రివిధ దళాలకు సాధికారత చేకూర్చనుం ది.మన విమానాల రాకపోకలను పసిగట్టేందుకు శత్రుదేశాలు సరిహద్దుల వెంట ఏర్పాటుచేసిన రాడార్లు, కమ్యూనికేషన్ వ్యవస్థలను కూల్చేసేందుకు ఈ క్షిపణిని భారత వాయుసేన గత ఏడాది తీసుకుంది. -
‘బ్రహ్మోస్’ పరీక్ష సక్సెస్
న్యూఢిల్లీ: నేవీ కొత్త యుద్ధనౌక ‘ఐఎన్ఎస్ కోల్కతా’ నుంచి శనివారం బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్షిపణిని గోవా తీరంలో విజయవంతంగా పరీక్షించారు. ధ్వని కంటే 1.4 రెట్ల వేగం(సెకనుకు 343 మీటర్లు)తో దూసుకెళ్లే ఈ క్షిపణి 290 కి.మీ.ల పరిధిలోని లక్ష్యాలను ధ్వంసం చేయగలదు. ఈ క్షిపణి సైన్యం, నేవీల్లోకి ఇదివరకే చేరింది. యుద్ధవిమానాల నుంచి సైతం దూసుకెళ్లే బ్రహ్మోస్ క్షిపణి తుదిదశ అభివృద్ధిలో ఉంది. ఐఎన్ఎస్ కోల్కతా 2014లో నేవీ అమ్ములపొదికి చేరింది. మిగతా యుద్ధనౌకల ద్వారా ఒకేసారి 8 బ్రహ్మోస్ క్షిపణుల ప్రయోగించేందుకు వీలుండగా..దీన్నుంచి 16 బ్రహ్మోస్లను ప్రయోగించొచ్చు. -
ఆధునిక బ్రహ్మాస్ క్షిపణి పరీక్ష విజయవంతం
బలాసోర్: భారత్ రక్షణ రంగంలో మరో ముందడుగు వేసింది. 290 కిలో మీటర్ల పరిధి గల ఆధునిక బ్రహ్మాస్ సూపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించారు. ఈ క్షిపణి దాదాపు 500 సెకన్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. మంగళవారం ఒడిశా సముద్రతీర ప్రాంతం చాందీపూర్ క్షిపణి పరీక్షా కేంద్రం నుంచి దీన్ని ప్రయోగించినట్టు బ్రహ్మాస్ చీఫ్ శివథాను పెళ్లై చెప్పారు. పర్వతాలలో, భవంతులలో దాక్కున్న శత్రువుల స్థావరాలను వంద శాతం కచ్చితత్వంతో ధ్వంసం చేయగల సామర్థ్యం ఈ క్షిపణి ప్రత్యేకత. 300 కిలోల పేలుడు పదార్థాన్ని మోసుకుపోగల సామర్థ్యం ఉంది. బ్రహ్మాస్, డీఆర్డీఓ వాస్త్రవేత్తలు ఈ ప్రయోగంలో పాల్గొన్నారు. -
‘బ్రహ్మోస్’ పరీక్ష సక్సెస్
న్యూఢిల్లీ: బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణి మరోసారి సత్తా చాటింది. తొలిసారిగా సాల్వో మోడ్ (ఒకేసారి సమాంతరంగా క్షిపణులను ప్రయోగించడం) పద్ధతిలో నిర్వహించిన పరీక్షలో కూడా ఈ క్షిపణి విజయం సాధించింది. అరేబియా సముద్రంలో నేవీ యుద్ధనౌక ఐఎన్ఎస్ త్రిఖండ్పై నుంచి రెండు క్షిపణులతో నిర్వహించిన ఈ పరీక్ష విజయవంతమైందని గురువారమిక్కడ డీఆర్డీవో అధికారులు వెల్లడించారు. భవిష్యత్తులో ఒకేసారి ఎనిమిది క్రూయిజ్ క్షిపణులను కూడా ప్రయోగించనున్నట్లు తెలిపారు. ఘన, ద్రవ ఇంధనంతో నడిచే బ్రహ్మోస్ క్షిపణిని సైన్యం, నేవీల్లో ఇదివరకే ప్రవేశపెట్టారు. ఇది 290 కి.మీ. పరిధిలోని లక్ష్యాలను ఛేదించగలదు. వాయుసేనలో ప్రవేశపెట్టనున్న బ్రహ్మోస్ వెర్షన్కు తుది పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. ఇండో-రష్యన్ కంపెనీ బ్రహ్మోస్ ఏరోస్పేస్ దీనిని అభివృద్ధిపర్చింది. -
‘బ్రహ్మోస్’ పరీక్ష విజయవంతం
న్యూఢిల్లీ: ఆధునీకరించిన ‘బ్రహ్మోస్’ సూపర్సోనిక్ క్షిపణిని సోమవారం భారత సైన్యం విజయవంతంగా పరీక్షించింది. రాజస్థాన్లోని పోఖ్రాన్ ఫైరింగ్ రేంజ్లో కొత్త గెడైన్స్ వ్యవస్థను అమర్చిన ‘బ్రహ్మోస్’ బ్లాక్-3 వేరియంట్ను ఉదయం 10.55 గంటలకు పరీక్షించారు. క్లిష్టమైన లక్ష్యాలను ఛేదించడంలో చేపట్టిన ఈ పరీక్ష విజయవంతమైందని ‘బ్రహ్మోస్’ అధికారులు తెలిపారు. పరీక్ష కోసం లక్ష్యాలుగా ఏర్పాటు చేసిన కాంక్రీట్ నిర్మాణాలను ఈ క్షిపణి ధ్వంసం చేయగలిగిందని చెప్పారు. ‘బ్రహ్మోస్’ క్షిపణి 290 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదు. తనతో 300 కిలోల బరువు గల సంప్రదాయక ఆయుధాలను మోసుకుపోగలదు. లెఫ్టినెంట్ జనరల్ అమిత్ శర్మ సమక్షంలో ‘బ్రహ్మోస్’ అధికారులు ఈ క్షిపణిని పరీక్షించారు. ఆర్మీ, నేవీలలో ‘బ్రహ్మోస్’ క్షిపణిని ఇప్పటికే ప్రవేశపెట్టారు.