child labourers
-
ఆపరేషన్ ముస్కాన్కు సమాయత్తం
సాక్షి, హైదరాబాద్: బాలకార్మికులు, వెట్టిచాకిరీ, యాచన చేసే చిన్నారులు, అదృశ్యమైన బాలలను గుర్తించేందుకు ఆపరేషన్ ముస్కాన్ పేరిట జూలై 1 నుంచి ప్రత్యేక డ్రైవ్ నిర్వహించనున్నారు. రాష్ట్ర మహిళా భద్రత విభాగం ఆధ్వర్యంలో స్థానిక పోలీసులతో కూడిన యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ సిబ్బందితోపాటు కార్మికశాఖ, మహిళా శిశుసంక్షేమశాఖ, పాఠశాల విద్య, ప్రజారోగ్య, లీగల్ సరీ్వస్ అథారిటీతోపాటు ఎన్జీవోలు ఈ స్పెషల్ డ్రైవ్లో పాల్గొంటాయి. మొత్తం 120 సబ్ డివిజనల్ కమిటీలు ఈ స్పెషల్ డ్రైవ్ను ఈనెల 31 వరకు కొనసాగించనున్నాయి. నెలపాటు నిర్వహించే ఆపరేషన్ ముస్కాన్కు సంబంధించి సన్నాహక సమావేశాన్ని శనివారం నిర్వహించారు. ఇందులో అన్ని భాగస్వామ్య విభాగాల అధికారులు పాల్గొని క్షేత్ర స్థాయి అధికారులకు తగు సూచనలు ఇచ్చారు.తప్పిపోయిన చిన్నారుల జాడ కనిపెట్టేందుకు తెలంగాణ పోలీసులు వినియోగిస్తున్న దర్పణ్ పరిజ్ఞానాన్ని సైతం ఈ డ్రైవ్లో అధికారులు వినియోగించనున్నారు. ఈ యాప్ ద్వారా క్షేత్రస్థాయిలో గుర్తించే చిన్నారుల వివరాలు నమోదు చేయడంతోపాటు అదృశ్యమైన చిన్నారుల కేసుల గణాంకాలను సరిపోల్చి చూస్తారు. ఇలా చేయడంతో ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలోని అదృశ్యమైన చిన్నారుల కేసులు సైతం పరిష్కారమయ్యే అవకాశం ఉంటుందని అధికారులు తెలిపారు. -
World Day Against Child Labour 2024: వెట్టిని జయించి..పది పూర్తి చేసి
‘బడీడు పిల్లల్ని పనిలో పెట్టుకోవడం నేరం’.. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన బాల కార్మిక నిర్మూలన చట్టం ప్రధాన సారం ఇదే. కానీ ఇప్పటికీ పిల్లలతో వెట్టిచాకిరీ చేయిస్తున్న ఘటనలు నిత్యం వెలుగు చూస్తూనే ఉన్నాయి. పిల్లలతో పని చేయిస్తున్న ఘటనలను బాధ్యతగల పౌరులో, సామాజిక కార్యకర్తలో ఇచ్చే ఫిర్యాదులపై అధికారులు స్పందించి రెస్క్యూ ఆపరేషన్ చేసి వారిని పునరావాస కేంద్రాలకు పంపించడం చూస్తూనే ఉంటాం. సరిగ్గా కర్ణాటక రాష్ట్రం కోలార్ జిల్లా టేకల్ తాలూకాలోని ఓబట్టు గ్రామంలో ఆరేళ్ల క్రితం చేసిన రెస్కూ ఆపరేషన్ ఎంతో మంది పిల్లలను పుస్తకాల బాట పట్టించింది.ఓ క్వారీలో పది కుటుంబాలను వెట్టిచాకిరీ చేయిస్తున్న దారుణంపై స్పందించిన కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం వారికి విముక్తి కలిగించి సొంత రాష్ట్రానికి పంపింది. అలా వచ్చిన కుటుంబాలు మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని మోతీనగర్లో జీవనం సాగిస్తున్నాయి. ఆ ఆపరేషన్ తర్వాత ఆయా కుటుంబాల్లోని పిల్లలను వివిధ ప్రభుత్వ విద్యా సంస్థల్లో చేర్పించారు. ఆ క్రమంలో చదువును సాగించిన వారిలో ఇద్దరు అక్కాచెల్లెళ్లు పదోతరగతి పాసై పైచదువుల కోసం ఉత్సాహంతో ముందుకెళ్తున్నారు. వారి కుటుంబంలో పదోతరగతి చదివిన తొలితరం కూడా అదే. బుధవారం అంతర్జాతీయ బాలకార్మిక వ్యతిరేక దినోత్సవం నేపథ్యంలో ప్రత్యేక కథనం.సాక్షి, హైదరాబాద్: ఉపాధి కోసం కర్ణాటక రాష్ట్రం టేకల్ తాలూకా ఓబట్టు గ్రామంలోని ఓ క్వారీలో పనిలో చేరింది అనూష, నందిని కుటుంబం. తల్లిదండ్రులు మంజుల, శ్రీనివాస్ నిరక్షరాస్యులు. వారికి తెలిసిందల్లా కూలి పనిచేయడం. క్వారీ యజమాని చెప్పిన మాయమాటలకు నమ్మి తెల్లకాగితాలపై వేలిముద్రలు పెట్టి అక్కడ బాండెడ్ లేబర్గా మారిపోయారు. రోజుకు 14 గంటల పాటు పని చేస్తూ చిత్రవధను అనుభవించారు.తల్లిదండ్రులకు సహాయంగా పిల్లలు సైతం చేతులు కలిపేవారు. అక్కడ జరుగుతున్న తంతును గుర్తించిన ఓ సామాజిక కార్యకర్త జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేయడంతో 2018లో యంత్రాంగం చేసిన రెస్క్యూ ఆపరేషన్ ద్వారా విముక్తి పొందారు. ఆ తర్వాత శ్రీనివాస్ కుటుంబం పొట్ట చేతపట్టుకుని మహబూబ్నగర్ టౌన్కు వచ్చి గుడిసె వేసుకుని కూలి పనితోనే జీవనం సాగిస్తూ వచ్చింది. ఈ సమయంలోనే పిల్లలకు మెరుగైన జీవితం ఇవ్వాలనే ఆలోచనతో బడికి పంపాలని శ్రీనివాస్ నిర్ణయించుకున్నారు. ఆర్థిక పరిస్థితి సహకరించకపోవడంతో ఇతరుల సాయంతో రంగారెడ్డి జిల్లా మహేశ్వరం కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో అనూష, నందినిలను చేరి్పంచారు. ఇప్పుడు ఇద్దరు పిల్లలు పదోతరగతి పాసయ్యారు. పై చదువులు చదువుకుంటాననే ఆసక్తి వెలిబుచ్చుతూ స్పూర్తిదాయకంగా నిలిచారు.వాళ్లు చదువుకోకున్నా మమ్మల్ని మాత్రం చదివిస్తున్నారు: నందినిమాకు ఇల్లు లేదు. క్వారీ ప్రాంతంలో పుట్టి, అక్కడే పెళ్లి చేసుకుని ప్రసవించింది మా అమ్మ. ఒక క్వారీ నుండి మరో క్వారీకి మారుతూ జీవించారు. ఎందుకంటే వారికి తెలిసిన ఏకైక జీవితం అదే. వారికి ఆధార్ కార్డు గురించి తెలియదు. ఓటు వేయడం కూడా తెలియదు. అయినప్పటికీ బాండెడ్ లేబర్ నుంచి విముక్తి పొందిన తర్వాత మమ్మల్ని చదివించాలనే ఆలోచన వచ్చింది. పది పూర్తి చేసినందుకు మాకు ఎంతో సంతోషంగా ఉంది.నర్సు ఉద్యోగం చేస్తా: అనూషకోవిడ్–19 సమయంలో మా ఇబ్బందులు చెప్పుకునేందుకు మాటలు లేవు. హాస్టల్ నుంచి ఇంటికి వెళ్లిపోయాక ఏమీ అర్థం కాకపోయేది. ఇల్లు లేకపోవడంతో పుస్తకాల బ్యాగులు ఎక్కడ దాచుకోవాలో అర్థం కాలేదు. చాలా ఇబ్బంది పడ్డాం. ఇప్పుడు పదోతరగతి పాసవడం ఆనందంగా ఉంది. మా చదువు ఇంతటితో ఆగదు. నర్సు కోర్సు పూర్తి చేయాలని మేమిద్దరం లక్ష్యంగా నిర్ణయించుకున్నాం. -
పని నుంచి బడికి..
రాష్ట్ర వ్యాప్తంగా బాల కార్మికులుగా మగ్గుతున్న అనేక మంది పిల్లలను సీఐడీ అధికారులు గుర్తించి వారిని మళ్లీ బడిలో చేర్పిస్తున్నారు. ‘ఆపరేషన్ స్వేచ్ఛ’ కార్యక్రమం బాల కార్మికుల జీవితాల్లో మళ్లీ విద్యా వెలుగులు తీసుకువస్తోంది. సాక్షి, అమరావతి: అనంతపురం జిల్లా కేంద్రానికి చెందిన చెందిన నాని.. ఏడో తరగతి తర్వాత చదువు మానేశాడు. కుటుంబ ఆర్థిక సమస్యల కారణంగా ఓ బైక్ మెకానిక్ షాపులో పనికి చేరాడు. రెండేళ్ల పాటు ఆ షాపులోనే సహాయకుడిగా పనిచేశాడు. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలకు ‘ఆపరేషన్ స్వేచ్ఛ’ పేరిట అవగాహన కార్యక్రమాలను చేపడుతున్న సీఐడీ అధికారులు.. నానిని చూశారు. అతని ఇంటికి వెళ్లి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. చదువు ఆవశ్యకతను వివరించారు. పిల్లల చదువుల కోసం ప్రభుత్వం అందిస్తున్న వివిధ సంక్షేమ పథకాల గురించి వివరించారు. చదువుకుంటే ఉజ్వల భవిష్యత్ ఉంటుందని వారికి అవగాహన కల్పించారు. నానిని అదే బడిలో 8వ తరగతిలో చేర్చించారు. ప్రస్తుతం నాని తోటి పిల్లలతో కలిసి చక్కగా చదువుకుంటున్నాడు. ఇక తాను పనికి వెళ్లనని, బాగా చదువుకుని ఉద్యోగం చేస్తానని ఆత్మ విశ్వాసంతో చెబుతున్నాడు. బాల కార్మికుల నుంచి మళ్లీ విద్యార్థులుగా.. సామాజికబాధ్యత కింద బాల కార్మిక వ్యవస్థ నిర్మూల కోసం సీఐడీ చేపట్టిన ‘ఆపరేషన్ స్వేచ్ఛ’ సాధించిన విజయమిది. ఇలా ఒక్క నాని మాత్రమే కాదు.. రాష్ట్ర వ్యాప్తంగా బాల కార్మికులుగా మగ్గుతున్న అనేక మంది పిల్లలను సీఐడీ అధికారులు గుర్తించి వారిని మళ్లీ బడిలో చేర్పిస్తున్నారు. బాల కార్మికులుగా కష్టాల కడలిలో ఈదుతున్న వారిని సీఐడీ అధికారులు గుర్తించి సురక్షితంగా చదువుల తల్లి ఒడిలోకి చేర్చారు. ఆపరేషన్ స్వేచ్ఛ కార్యక్రమం బాల కార్మికుల జీవితాల్లో మళ్లీ విద్యా వెలుగులు తీసుకొస్తోంది. ఆపరేషన్ స్వేచ్ఛ కార్యక్రమాన్ని సీఐడీ విభాగం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇందుకోసం 26 జిల్లాల్లో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. సీఐడీ అధికారులతో పాటు మహిళా–శిశు సంక్షేమ శాఖ, బాలల సంక్షేమ కమిటీలు, వివిధ సామాజిక సేవా సంస్థల ప్రతినిధులతో జిల్లా స్థాయిల్లో కమిటీలను నియమించింది. ఈ ఏడాది మొత్తం నాలుగు దశల్లో 66 రోజుల పాటు ఆపరేషన్ స్వేచ్ఛ పేరిట ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించింది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను సద్వినియోగం చేసుకుంటూ క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటించి బాల కార్మికులను గుర్తించింది. ప్రధానంగా బాల కార్మికులను ఎక్కువుగా పనిలో పెట్టుకునే ఇటుక బట్టీల తయారీ, హోటళ్లు, వివిధ పారిశ్రామిక యూనిట్లు, కిరాణా దుకాణాలు, మెకానిక్ షెడ్లు, ఇతర చోట్ల విస్తృతంగా తనిఖీలు నిర్వహించింది. ఆపరేషన్ స్వేచ్ఛ కార్యక్రమం ద్వారా మొత్తం 1,506 మంది బాల కార్మికులను గుర్తించింది. వారిలో బాలురు 1,299 మంది ఉండగా.. బాలికలు 207 మంది ఉన్నారు. మొత్తం బాల కార్మికుల్లో ఇతర రాష్ట్రాలకు చెందిన 609 మందిని వారి సొంత రాష్ట్రాలకు పంపించి తల్లిదండ్రుల చెంతకు చేర్చింది. మన రాష్ట్రానికి చెందిన 897 మంది బాల కార్మికుల తల్లిదండ్రులతో చర్చించి వారికి అవగాహన కల్పించి.. ఆ పిల్లలను మళ్లీ బడుల్లో చేర్పించింది. బాల కార్మికులుగా మారడానికి కారణాలు తల్లిదండ్రులు లేకపోవడం:36 మంది పరీక్షల్లో ఫెయిల్ కావడం29 మంది పేదరికం: 984 మంది ఇతర కారణాలు:457 మంది మళ్లీ బడిలో చేరిన బాల కార్మికులు సామాజికవర్గాలవారీగా.. ఎస్సీ259 మంది ఎస్టీ131 మంది బీసీ719 మంది మైనార్టీ190 మంది ఓసీ 207 మంది మళ్లీ బడిలో చేర్పించే నాటికి బాల కార్మికులుగా పనిచేస్తున్నవారు.. ఇటుక బట్టీల్లో 138 మంది హోటళ్లలో 117 మంది పారిశ్రామిక యూనిట్లలో 143 మంది ఇతర చోట్ల 1108 మంది బాల కార్మికులుగా చేరేనాటికి వారి చదువులు ఇలా.. నిరక్ష్యరాస్యులు264 మంది అయిదో తరగతిలోపు 270 మంది అయిదు నుంచి పదో తరగతి 792 మంది చెప్పలేనివారు 180 మంది సామాజిక, ఆర్థిక దృక్కోణంలో విశ్లేషణ.. బాల కార్మికులను గుర్తించి కేవలం మళ్లీ బడుల్లో చేర్చడమే కాదు.. ఈ సమస్య మూలాలను గుర్తించి శాశ్వత పరిష్కారం దిశగా సీఐడీ కార్యాచరణ చేపట్టింది. అందుకోసం బాల కార్మికుల సామాజిక, ఆర్థిక అంశాలపైనా విస్తృతంగా అధ్యయనం చేస్తోంది. తద్వారా బాల కార్మిక వ్యవస్థను సమూలంగా పెకలించి వేసి బడి ఈడు పిల్లలు అందరూ కచ్చితంగా బడుల్లోనే ఉండేలా కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తున్నారు. బాల కార్మిక వ్యవస్థ నుంచి విముక్తి కల్పించిన బాలల వివరాలిలా ఉన్నాయి.. సమన్వయంతో సత్ఫలితాలు బాల కార్మికుల వ్యవస్థను నిర్మూలించడానికి అన్ని విద్య, మహిళా–శిశు సంక్షేమ, గ్రామ, వార్డు సచివాలయాలు, ఇతర శాఖల సమన్వయంతో కార్యాచరణ చేపట్టాం. ఇతర రాష్ట్రాలకు చెందినవారిని ఆయా రాష్ట్రాలకు సురక్షితంగా చేరుస్తున్నాం. మన రాష్ట్రానికి చెందిన బాల కార్మికుల అవగాహనను పరీక్షించి తదనుగుణంగా తగిన తరగతిలో చేర్పిస్తున్నాం. మళ్లీ వారు పనిలోకి వెళ్లకుండా.. శ్రద్ధగా చదువుకునే వ్యవస్థను కల్పిస్తున్నాం. – కేజీవీ సరిత, ఎస్పీ, మహిళా భద్రత విభాగం, సీఐడీ సామాజిక బాధ్యతకు పెద్దపీట వేస్తున్న సీఐడీ సీఐడీ విభాగం అంటే కేవలం కేసుల దర్యాప్తు, నేర నియంత్రణ మాత్రమే కాదు. సీఐడీకి అంతకుమించి విస్తృత పరిధి ఉంది. అందులో ప్రధానమైనది సామాజిక బాధ్యత. అందుకే బాల కార్మికుల వ్యవస్థ నిర్మూలన కోసం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆపరేషన్ స్వేచ్ఛ కార్యక్రమం సత్ఫలితాలనిస్తోంది. సీఐడీలో ప్రత్యేకంగా సామాజిక విభాగం కింద ఇలాంటి కార్యక్రమాలను మరింత విస్తృతంగా చేపడతాం. – సంజయ్, సీఐడీ అదనపు డీజీ -
పిల్లల అక్రమ రవాణా ముఠా అరెస్టు
సాక్షి, హైదరాబాద్: బాలకార్మికులుగా మార్చేందుకు తరలిస్తున్న పిల్లలను రాష్ట్ర మహిళా భద్రత విభాగం యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ కాపాడింది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో జీఆర్పీ (గవర్నమెంట్ రైల్వే పోలీస్), ఆర్పీఎఫ్, బచ్పన్ బచావో ఆందోళన్ ఎన్జీఓతో కలసి చేపట్టిన ఈ ఆపరేషన్లో మొత్తం 26 మంది చిన్నారులను కాపాడినట్టు రాష్ట్ర మహిళా భద్రత విభాగం అదనపు డీజీ శిఖాగోయల్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. పశ్చిమ బెంగాల్, జార్ఖండ్ రాష్ట్రాలకు చెందిన 13 నుంచి 18 ఏళ్ల మధ్య వయసు పిల్లలను ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్లో విజయవాడ నుంచి సికింద్రాబాద్కు తరలిస్తున్నట్టు సమాచారం అందడంతో అధికారులు ఆ పిల్లలను రక్షించేందుకు ఆపరేషన్ చేపట్టారు. వీరందరినీ హైదరాబాద్లోని వివిధ కర్మాగారాల్లో పనిచేయించేందుకు తీసుకువస్తున్నట్టు అధికారులకు తెలిసింది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో మాటు వేసిన పోలీసులు మొత్తం ఎనిమిది మంది ముఠా సభ్యులను అరెస్టు చేశారు. వీరిపై ఐపీసీ సెక్షన్ 374, 341ల కింద సికింద్రాబాద్ జీఆర్పీ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. పట్టుబడిన నిందితులను పశ్చిమ బెంగాల్కు చెందిన రంజాన్ మోల్లా, షేక్ సైదులు, ప్రియారుల్షేక్, జాకీర్ అలీ, సురోజిత్ సంత్రా, జార్ఖండ్కు చెందిన పింటుదాస్, హైదరాబాద్ చార్మినార్కు చెందిన సుసేన్ తుడు, అబ్దుల్ అల్మాని మోండేల్గా గుర్తించారు. కాపాడిన 26 మంది పిల్లలను సైదాబాద్లోని ప్రభుత్వ హోమ్కు పంపినట్టు అధికారులు తెలిపారు. పిల్లల అక్రమ రవాణా ముఠా సభ్యులను పట్టుకున్న సిబ్బందిని అదనపు డీజీ శిఖాగోయల్ అభినందించారు. -
Joshi Anumuthu: అప్పుడు కన్నీళ్లు తాగి ఆకలి తీర్చుకున్నాడు.. ఇప్పుడు ఎందరికో ఆసరా..!
మెరుపు మెరిస్తే, వాన కురిస్తే, ఆకసమున హరివిల్లు విరిస్తే...ఆనందించే బాల్యం కాదు అతనిది. మెరుపు మెరిస్తే భయం... వానొస్తుందని, వాన కురిస్తే భయం... ఇంట్లో ఉండలేమని... ఎందుకంటే అది పేరుకే ఇల్లు. పేదవాడి ఇల్లు. ఇంటి పై కప్పుకు అన్నీ చిల్లులే! ఆకసమున హరివిల్లు సంగతి సరే... మరి తన ఆకలి సంగతి ఏమిటి? చదవండి: Mental Health: టీనేజర్స్ మానసిక ఆరోగ్యంపై సోషల్ మీడియా బ్యాడ్ ఎఫెక్ట్..! ఎన్నో కష్టాలకు ఎదురీది పెద్ద చదువు చదువుకున్నాడు పుదుచ్చేరికి చెందిన అనుముతు. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పూర్తయింది, ఆ తరువాత తనకు ఇష్టమైన ఫొటోగ్రఫీ కోర్స్ చేశాడు. సంతోషంగా ఉంది, గర్వంగా ఉంది! అంతమాత్రాన నడిచొచ్చిన దారిని మరవలేదు. తాను ఎదుర్కొన్న కష్టాలు ఎక్కడో ఒకచోట ఎవరో ఒకరు ఎదుర్కొంటూనే ఉంటారు. వారికి అండగా నిలవాలనుకున్నాడు. కష్టాలు దాటి ముందుకు వెళ్లినవాడు కష్టపడుతున్న వారి కోసం వెనక్కి తిరిగి చూసుకున్నాడు. తల్లి కడుపుమాడ్చుకుని మరీ.. అనుమతు తండ్రి వడ్రంగి. తాను ఏడుసంవత్సరాల వయసులో ఉన్నప్పుడు తండ్రి చనిపోయాడు. ఇక కష్టాలు మొదలయ్యాయి. ‘మేమున్నాం’ అని ధైర్యం చెప్పే చుట్టాలు,పక్కాలు లేరు. తల్లీకొడుకులు కలిసి కూలీ పనులకు వెళ్లేవాళ్లు. కూలి ఉన్నరోజు తిండి. లేకపోతే పస్తులు. ఎప్పుడైనా ఇంట్లో ఒక్కరు తినడానికి మాత్రమే చాలినంత ఉంటే ‘నాకు ఆకలిగా లేదు. నువ్వు తిను నాయనా’ అనేది తల్లి! చదవండి: Fenty's Fortune: మీకేమైనా తెలుసా... వాట్స్ మై నేమ్? నా జీవితం స్థిరపడింది.. నాలాంటి వాళ్లకోసం.. ఎన్ని కష్టాలు పడుతున్నా బాగా చదువుకోవాలనే కోరిక మాత్రం బలంగా ఉండేది అనుమతులో. ఇది గమనించిన ఒక పూజారి అనుమతును చదివించే బాధ్యతను తీసుకున్నాడు... అలా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశాడు అనుమతు. ‘ఇక నా జీవితం స్థిరపడింది. వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు’ అనుకోలేదు. తనవంతుగా సమాజానికి తిరిగి ఇవ్వాలనే ఉద్దేశంతో రకరకాల స్వచ్ఛంద సంస్థలతో కలిసి పనిచేశాడు. ఆ తరువాత తానే స్వయంగా ‘స్నేహన్’ పేరుతో ఒక స్వచ్ఛంద సంస్థను ప్రారంభించాడు. అందుకే ఆ సంస్థ ఏర్పాటు.. ఆటోరిక్షా నడిపే సురేష్కు చూపు దెబ్బతింది. కంటి ఆపరేషన్ చేసుకోవడం తప్పనిసరి. లేకపోతే ఆటో నడపలేడు. నడపకుంటే ఇల్లు గడవడం కష్టం. ఇలాంటి క్లిష్ట సమయంలో సురేష్కు కంటి ఆపరేషన్ చేయించి అతని జీవితం గాడిన పడడానికి సహాయపడ్డాడు. కొందరు యువకులతో ఒక బృందాన్ని తయారు చేశాడు. ఈ బృందంలోని సభ్యులు రైల్వేస్టేషన్, పార్క్, దేవాలయం, ఫ్లై ఓవర్ల దగ్గర ఆకలితో ఉన్న వ్యక్తులకు భోజనం, టీ, బిస్కెట్లు అందిస్తారు. వారికి ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉంటే చికిత్స చేయిస్తారు. వారికి ఉపాధి చూపి.. నగరంలో యాచన చేసే చాలామంది యాచకులతో అనుమతు మాట్లాడాడు. కొందరు గతం చెప్పుకోవడానికి ఇష్టపడలేదు. తాము యాచించిన సొమ్మును రౌడీలు బెదిరించి తీసుకుంటున్నారని కొందరు ఫిర్యాదు చేశారు... ఇలా ఎంతకాలమని యాచిస్తారు? వీరికి ఏదైనా ఉపాధి చూడాలి అనుకున్నాడు అనుమతు. తిరువనంతపురంలోని కంతరి లీడర్షిప్ ప్రోగాంలో చేరి శిక్షణ తీసుకున్నాడు. ఈ శిక్షణ ఫలితంగా ఉపాధి అవకాశాలకు సంబంధించిన ప్రాథమిక విషయాలు అర్థం అయ్యాయి. ఫలితంగా 75 మందికి పైగా ఉపాధి మార్గాలు చూపించగలిగాడు. ఇలా.. సోషల్ సర్వీస్ కాటన్తో రకరకాల సంచుల తయారీ కోసం పేద మహిళలకు శిక్షణ ఇప్పించాడు. ఒకవైపు వీరికి ఉపాధి అవకాశం కలిపిస్తూనే, ‘స్నేహన్’ బ్రాండ్తో రూపొందించిన ఉత్పత్తులను అమ్మడం ద్వారా వచ్చిన డబ్బులు, ఫొటోగ్రఫీ ద్వారా వచ్చిన డబ్బును సేవాకార్యక్రమాలకు వినియోగిస్తున్నాడు. ‘షెల్టర్హోమ్’ ఒకటి నిర్మించాలని, సేవాకార్యక్రమాలను మరింత విస్తృతం చేయాలనే ప్రణాళికలను రూపొందించుకుంటున్నాడు. చదవండి: బ్రేక్ ఫాస్ట్ మానేస్తున్నారా? ఈ సమస్యలు పొంచి ఉన్నట్లే!! -
'పాట్నా'లో స్వస్థలాలకు బయలుదేరిన బాలకార్మికులు
సికింద్రాబాద్ : వెట్టి చాకిరీ నుంచి విముక్తి లభించిన 60 మంది బాలకార్మికులు ఆదివారం పాట్నా ఎక్స్ప్రెస్లో స్వస్థలాలకు బయల్దేరి వెళ్లారు. పాతబస్తీలోని పలు ప్రాంతాల్లో గత నెల రెండో వారంలో పోలీసులు నిర్వహించిన దాడుల్లో వివిధ కార్మాగారాల్లో పనిచేస్తున్న దాదాపు 60 మంది బాలురను పోలీసులు రక్షించారు. అనంతరం వారిని ప్రభుత్వ సంరక్షణ కేంద్రంలో ఆశ్రయం కల్పించారు.ఆదివారం బిహార్ వెళ్లేందుకు వారిని సికింద్రాబాద్ స్టేషన్లో ఉన్నతాధికారులు వారిని పాట్నా ఎక్స్ప్రెస్ ఎక్కించారు. -
బాలకార్మికులకు విముక్తి
అడ్డగుట్ట (హైదరాబాద్) : పది నెలల నుంచి వెట్టి చాకిరీ చేస్తున్న నలుగురు బాల కార్మికులకు అధికారుల చొరవతో విముక్తి లభించింది. వివరాల్లోకి వెళితే.. బీహార్ రాష్ట్రం పాట్నాకు చెందిన పదిహేడేళ్లలోపు నలుగురు బాలురు గత పది నెలలుగా లింగంపల్లి ప్రాంతం చందానగర్లోని ఓ రబ్బర్ కంపెనీలో కార్మికులుగా పని చేస్తున్నారు. ఆ కంపెనీ యజమాని దీపక్ వారితో వెట్టి చాకిరీ చేయిస్తున్నాడు. అన్నం కూడా సరిగా పెట్టేవాడు కాదు. దీంతో బాధితులు సోమవారం రాత్రి అక్కడి నుంచి తప్పించుకుని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు చేరుకున్నారు. మంగళవారం ఉదయం అక్కడ తిరుగుతున్న వీరిని గమనించిన దివ్యదిశ చైల్డ్ హెల్ప్ డెస్క్ సభ్యులు ఆ పిల్లలను చేరదీశారు. వారిని చైల్డ్ హెల్ప్ డెస్క్ కార్యాలయానికి తీసుకువెళ్లి భోజనం పెట్టి పూర్తి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం వారిని సైదాబాద్లోని గవర్న్మెంట్ హాస్టల్లో చేర్పించారు. -
వెట్టి చాకిరి నుండి చిన్నారులకు విముక్తి!