cm position
-
‘మహా’ సీఎం పదవి.. ఫడ్నవీస్ ఆసక్తికర కామెంట్స్
ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి కూటమి ఘన విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఫడ్నవీస్, అజిత్ పవార్, ఏక్నాథ్ షిండే కూటమి మహారాష్ట్రలో 288 స్థానాల్లో ఏకంగా 233 చోట్ల విజయాన్ని అందుకుంది. అయితే, అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించినప్పటికీ మహా సీఎం ఎవరు? అనే సస్పెన్స్ ఇంకా కొనసాగుతూనే ఉంది. కూటమిలో ఎవరికి వారే తామే సీఎం రేసులో ఉన్నామని చెబుతున్నారు. ఈ క్రమంలో దేవేంద్ర ఫడ్నవీస్ కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం ఎవరు అనేది త్వరలోనే చెబుతామని చెప్పారాయన.తాజాగా సీఎం పదవిపై ఫడ్నవీస్ స్పందిస్తూ.. ముఖ్యమంత్రి ఎవరు అనే విషయంపై మహాయుతిలోని మూడు పార్టీలు చర్చలు జరుగుతున్నాయి. త్వరలోనే దీనిపై సమాధానం చెబుతాం. మూడు పార్టీలు నేతలు కలిసి సీఎంను ఎంపిక జరుగుతుంది. ముఖ్యమంత్రి పదవి విషయంలో తొందరపాటు ఏమీ లేదు. గతంలో ఉత్తరప్రదేశ్ సీఎం పదవి విషయంలో కూడా ఇలాగే జరిగింది. ఫలితాలు వెలువడిన రెండు వారాల తర్వాత సీఎంను ఎంపిక చేసినట్టు గుర్తు చేశారు.మరోవైపు.. మహాయుతి కూటమి నేతలు ముఖ్యమంత్రి పదవితో సహా మంత్రి పదవులపై కూడా ఫోకస్ పెట్టారు. మూడు పార్టీల నేతలు తమకు మంత్రి పదవులు కావాలని ఆశిస్తున్నారు. దీనిపై కూడా ఒక అంగీకారానికి రావాల్సి ఉంది. అయితే, మహారాష్ట్రలో సీఎంతో పాటు 43 మంది మంత్రులు ఉండే అవకాశం ఉందనే చర్చ నడుస్తోంది. ఎన్నికల్లో 132 స్థానాల్లో బీజేపీ విజయం సాధించడంతో మంత్రి పదవుల్లో సగం వరకు కాషాయ పార్టీకే దక్కే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మిగిలిన పదవులను శివసేన, ఎన్సీపీ పంచుకునే ఛాన్స్ ఉంది.ఇదిలా ఉండగా.. మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి కూటమి విజయం సాధించినప్పటికీ ఇంకా ముఖ్యమంత్రి ఎవరు? అనేది తేలకపోవడంతో ప్రతిపక్ష నేతలు విమర్శలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి సీటుపై పోటీ నెలకొందని ఎద్దేవా చేస్తున్నారు. కూటమిలో సీఎం ఎవరో తేల్చుకోలేకపోతున్నారని కామెంట్స్ చేస్తున్నారు. -
సీఎం రేసులో నేనెందుకు ఉండకూడదు?
న్యూఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ మెజారిటీ సాధిస్తే హరియాణా సీఎం రేసులో తాను కూడా ఉంటానని సీనియర్ నాయకురాలు, ఎంపీ కుమారి సెల్జా స్పష్టం చేశారు. వ్యక్తిగతంగా, సామాజికవర్గంగా ప్రజలకు ఆకాంక్షలు ఉంటాయని పేర్కొన్నారు. హరియాణా అసెంబ్లీ ఎన్నికలు అక్టోబరు ఒకటో తేదీన జరగనున్న విషయం తెలిసిందే. సార్వత్రిక ఎన్నికల్లో సిర్సా నుంచి లోక్సభకు ఎన్నికైన దళిత నాయకురాలు సెల్జా రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేయాలనుకుంటున్నట్లు సంకేతాలిచ్చారు. రాష్ట్రంలో పనిచేయాలనేది తన అభిమతమని, ఈ విషయంలో పార్టీ అధిష్టానం తుది నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. హరియాణా కాంగ్రెస్ భూపిందర్ సింగ్ హుడా, సెల్జా వర్గాలుగా చీలిపోయింది. ఇది కాంగ్రెస్ అవకాశాలను దెబ్బతిస్తోందనే వాదనను సెల్జా కొట్టిపారేశారు. ఎన్నికలు వచి్చనపుడు అందరం కలిసికట్టుగా కాంగ్రెస్ శిబిరంగా బరిలోకి దిగుతామని చెప్పారు. “్ఙనేను చాలా వాస్తవిక దృక్పథంతో ఉంటాను. ముక్కుసూటిగా సమాధానాలు చెబుతాను. ఏ సంస్థలో తీసుకొన్నా ఆధిపత్య పోరాటం ఉంటుంది. ఆకాంక్షలు, పార్టీ కోసం శ్రమించడం, స్థానాన్ని పదిలపర్చుకునే ప్రయత్నం.. అన్నీ ఉంటాయి. అయితే పార్టీ అభ్యర్థులను ప్రకటించే వరకే ఇవన్నీ. తర్వాత అందరూ ఒక్కటై క్షేత్రస్థాయిలోకి వెళ్లడమే’ అని సెల్జా చెప్పుకొచ్చారు. ఎన్నికల తర్వాత ఇతర పారీ్టలతో కూటమి కట్టే అవకాశాలపై మాట్లాడుతూ.. హరియాణాలో హంగ్ రానేదాదని, కాంగ్రెస్ అద్భుత మెజారిటీ సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకం అవుతున్నామని, ప్రజలంతా బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నారని అన్నారు. అధికారంలో లేనపుడు సీఎం అభ్యర్థిని ప్రకటించి ఎన్నికలకు వెళ్లే సంప్రదాయం కాంగ్రెస్ పారీ్టలో లేదన్నారు. -
జార్ఖండ్ కొత్త సీఎం ఎవరు?
రాంచీ: జార్ఖండ్ ప్రజలు బీజేపీకి స్పష్టమైన మెజారిటీతో విజయం కట్టబెట్టడంతో ప్రభుత్వం ఏర్పాటుకు ఆ పార్టీ సంప్రదింపులు ప్రారంభించింది. అయితే, సీఎం పదవి ఎవరిని వరించబోతోందన్నది ఆసక్తికరంగా మారింది. ప్రధానంగా రఘువర్దాస్, సరయూరాయ్, మాజీ సీఎం అర్జున్ముండా సీఎం పదవి కోసం పోటీపడుతున్నట్లు తెలుస్తోంది. బుధవారం ఢిల్లీలో జరిగే బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో జార్ఖండ్ సీఎం అభ్యర్థిపై నిర్ణయం తీసుకోనున్నారు. సీఎం పీఠానికి అర్జున్ ముండా పేరుపై జార్ఖండ్ రాజకీయ వర్గాల్లో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే, ఎన్నికల్లో ఓడిపోవడం ముండాకు ప్రతికూలంగా మారనుంది. ప్రజలు తిరస్కరించిన వారికి బదులు కొత్తవారితో ప్రయోగం చేసేందుకు బీజేపీ సుముఖంగా ఉన్నట్లు వార్తలొస్తున్నాయి. ఇదే నిజమైతే ముండాకు సీఎం చాన్స్ లేనట్లే. ఇక, రఘువర్దాస్ 2010లో జార్ఖండ్ ఉపముఖ్యమంత్రిగా పనిచేశారు. బీజేపీ అధ్యక్షుడు అమిత్షాకు సన్నిహితుడు కావడం ఆయనకు కలిసొచ్చే అంశం. జంషెడ్పూర్ ప్రజల మద్దతును చూసి గర్విస్తున్నానని, జార్ఖండ్ ప్రజలకు సేవ చేసేందుకు తానెప్పుడూ వారికి అందుబాటులో ఉంటానని రఘువర్దాస్ ప్రకటించడం చూస్తే సీఎం పీఠంపై ఆయన ఆశలు పెట్టుకున్నట్లు తెలుస్తోంది. సరయూరాయ్కు ఆర్ఎస్ఎస్ మద్దతు సానుకూలాంశం. ఈ నేపథ్యంలో సీఎం పీఠం ఎవరికి దక్కుతుందన్నది బుధవారం తెలియనుంది. -
ముఖ్యమంత్రి పదవి నుంచి వైదొలగనున్న జయలలిత
-
సీఎం పీఠంపై డీకే కన్ను
సాక్షి, బళ్లారి : సీఎం పీఠంపై మంత్రి డి.కె.శివకుమార్ కన్ను పడిందని బీజేపీ ఎమ్మెల్సీ కేఎస్ ఈశ్వరప్ప అన్నారు. ఉప ఎన్నికల్లో భాగంగా తాలూకాలోని సంజీవరాయనకోట తదితర ప్రాంతాల్లో బీజేపీ అభ్యర్థి ఓబులేసు తరుఫున ఆయన గురువారం ఇంటింటి ప్రచారం చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ... బళ్లారి ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించుకుని, సోనియాగాంధీ వద్ద తన గొప్పలు చెప్పుకోవడం ద్వారా సిద్ధరామయ్యను సీఎం పదవి నుంచి తప్పించి, ఆ స్థానాన్ని తాను కైవసం చేసుకునేందుకు డీకేసీ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఇందులో భాగంగానే బీజేపీ కార్యకర్తలకు, ఓటర్లకు డబ్బు ఎరగా చూపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.