cock fighting
-
పందెం కోళ్లతో ఖాకీల కష్టాలు
ఒక చోట క్రికెట్ బెట్టింగ్ జరుగుతుంటుంది. సమాచారం అందుకున్న పోలీసులు దాడి చేసి, బుకీలతో పాటు అక్కడ దొరికిన సామగ్రిని స్వాధీనం చేసుకుంటారు. ఒక ఇంట్లో కొందరు పేకాట ఆడుతూ ఉంటారు. పోలీసులు పేకతో పాటు నగదు, తదితరాలను కూడా స్వాధీనం చేసుకుంటారు. సంక్రాంతి రోజుల్లో కోడి పందేలు జరుగుతుంటాయి. పోలీసులు దొరికిన పందెంరాయుళ్లను అదుపులోకి తీసుకుని, వారి వద్ద దొరికిన నగదుతో పాటు కోళ్లనూ స్వాధీనం చేసుకుంటారు..సాధారణంగా ఏ కేసులో అయినా పోలీసులు తాము అరెస్టు చేసిన నిందితులను కోర్టులో హాజరుపరచే సమయంలో వారి నుంచి స్వాధీనం చేసుకున్న నగదును, వస్తువులను కోర్టుకు అప్పగిస్తారు. కోడి పందేల కేసుల్లో కోళ్లను ఏం చేస్తారనేది ఆసక్తికర అంశం. ఈ కోళ్లను కొన్నాళ్ల వరకు కాచుకోవాల్సి ఉంటుంది. సంక్రాంతి రోజుల్లో జరిగే కోడి పందేలన్నీ రాజకీయ నాయకులు, పోలీసుల కనుసన్నల్లోనే జరుగుతాయి. న్యాయస్థానాలు ప్రశ్నించినప్పుడో, మరేదైనా జరగరానిది జరిగినప్పుడో చూపించుకోవడానికి రికార్డుల కోసం పోలీసులు అప్పుడప్పుడు కొన్నిచోట్ల దాడులు చేస్తుంటారు. కోడి పందేలు ఆడుతున్న వారిని, పందేలకు సిద్ధమవుతున్న వారిని అరెస్టు చేసి, వారి నుంచి కత్తులు, నగదుతో పాటు కోళ్లను స్వాధీనం చేసుకుంటుంటారు. . పందెంరాయుళ్లను కోర్టులో హాజరుపరచే పోలీసులు కోళ్లను స్వాధీనం చేసుకున్న విషయాన్ని న్యాయస్థానం దృష్టికి తీసుకువెళ్లి, దానికి ఆధారంగా కొన్ని ఫొటోలను సమర్పిస్తారు. న్యాయస్థానం నిందితులను బెయిల్పై వదలడమో, రిమాండ్కు పంపడమో చేస్తుంది. ఆపై విషయం కోళ్ల దగ్గరకు వస్తుంది. ఆ కోళ్లను గతంలో సేఫ్ కస్టడీలో ఉంచాలంటూ పోలీసులనే ఆదేశించేది. దీంతో పోలీసులు వాటిని ఠాణాల్లోనో లేదా సమీపంలో ఉన్న ఖాళీ ప్రదేశాల్లోనే కట్టేసి మేపుతుండే వాళ్లు. అక్కడే కొన్ని రోజుల పాటు తమ సంరక్షణలో ఈ కోళ్లు ఉండాల్సి రావడం, అవి కోర్టు ప్రాపర్టీ కావడంతో తాత్కాలిక భద్రత ఏర్పాట్లు చేసేవాళ్లు.ప్రతి రోజూ వాటికి తిండి గింజలు, నీళ్లు తదితరాలు అందిస్తూ జాగ్రత్తగా కాచుకునేవారు. ఈ విధానంలో అనేక ఇబ్బందులు వస్తుండటంతో కోర్టు కొన్నాళ్లుగా ఈ విధానాన్ని మార్చింది. కోళ్లను స్వాధీనం చేసుకున్న వెంటనే, వాటిని విక్రయించడానికి అనుమతి కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేస్తున్నారు. ఆ కోళ్లను స్థానికంగా ఉండే పెంపకందారులకు, చికెన్ షాపుల నిర్వాహకులకు అప్పగించి ఎన్ని, ఏ రకానికి చెందినవో సూచిస్తూ రసీదు తీసుకుంటారు. వారి నుంచి వాంగ్మూలం కూడా నమోదు చేసుకుని, కోర్టుకు సమర్పిస్తారు. అలా ఓ సంరక్షకుడికి అప్పగిస్తున్న సమయంలో ఆ కోళ్లను తిరిగి పందేలకు వినియోగించకుండా స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడంతో పాటు ఆ కోణంలో మరికొన్ని చర్యలు కూడా తీసుకుంటారు. గేమింగ్ యాక్ట్ ప్రకారం నమోదయ్యే ఈ కేసు దర్యాప్తు పూర్తయ్యాక న్యాయస్థానంలో నిందితులపై అభియోగపత్రాలు దాఖలు చేస్తారు. ఆ సమయంలోనే కోళ్ల విక్రయానికి అనుమతిచ్చే న్యాయస్థానం ఓ రేటును ఖరారు చేస్తుంది. ఈ ధరకు కోళ్లను అప్పటి వరకు వాటి సంరక్షణ చూసిన వారికే అమ్మేసి, అలా వచ్చిన మొత్తాన్ని కోర్టులో జమ చేస్తారు. ఈ క్రతువులోనూ ఇటీవల కాలంలో కొన్ని సవాళ్లు ఎదురవుతున్నాయి. ఇలా కోర్టులో జమ చేసిన మొత్తం కేసు విచారణ ముగిసి, ఫలితం తేలే వరకు బ్యాంకు ఖాతాలోనే ఉంటుంది. సరైన సాక్ష్యాధారాలు లేకనో, మరో కారణంగానో కేసు వీగిపోతే ఆ మొత్తం ఆరోపణలు ఎదుర్కొన్న నిందితులకు, కేసు నిరూపితమై వారికి శిక్షపడితే కోర్టుకు వెళ్లిపోతుంది. ఇక్కడే కొన్ని సాంకేతిక సమస్యలు వస్తున్నాయి. కేసు వీగిపోయినప్పుడు కొందరు పందెంరాయళ్లు పోలీసుల వద్ద కొత్త మెలికలు పెడుతున్నారు. తమ కోళ్లు తమకు కావాలంటూ వాదిస్తున్నారు. ఈ పరిణామాలను పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానాలు ఇటీవల ఒక కొత్త విధానాన్ని మొదలెట్టాయి. స్వాధీనం చేసుకున్న కోళ్లను మళ్లీ పందేలకు ఉపయోగించకుండా షరతులు వి«ధిస్తూ, నిందితులకే అప్పగించాలని చెబుతున్నాయి. కేసు విచారణ ముగిసి, వారిపై నేరం నిరూపణ అయితే మాత్రం అప్పుడు న్యాయస్థానం ఆ కోళ్లకు రేటు కట్టి, నిర్దేశిత మొత్తాన్ని వారి నుంచి వసూలు చేసేలా చర్యలు తీసుకుంటున్నాయి.ఈ పందెం కోళ్లు తమ స్వాధీనంలో ఉన్నన్నాళ్లూ పోలీసులు ఒక రకంగా కంటిమీద కునుకు లేకుండా గడిపాల్సిన పరిస్థితే! ఈ కేసులో అరెస్టు చేసిన నిందితులను మరుసటి రోజు కోర్టులో హాజరుపరచడంతో పాటు కోళ్లను సంరక్షకుడికి అప్పగించే వరకు పోలీసులదే బాధ్యత. ఆలోపు ఆ కోళ్లకు ఏమైనా జరిగితే పోలీసులకు కొత్త పని వచ్చిపడుతుంది. వారి అధీనంలో ఉండగా అనారోగ్య, అనివార్య కారణాలతో ఒక్క కోడిపుంజు చనిపోయినా లేదా తప్పించుకుని పోయినా, దానికి సంబంధించి మరో కేసు నమోదు చేయాలి. చనిపోయిన కోడి కళేబరానికి ప్రభుత్వ పశువైద్యుడితో పోస్టుమార్టం చేయించాలి. తర్వాత అధికారికంగా ఖననమో, దహనమో చేయించడమూ అనివార్యం. ఈ తంతులు పక్కాగా చేయడంతో పాటు ఆ రికార్డులను కోర్టులో దాఖలు చేయడం తప్పనిసరి. ఈ వ్యవహారంలో కొసమెరుపు ఏమిటంటే, ఇలాంటి పందెం కోళ్లను కోర్టు అనుమతి తర్వాత సంరక్షకులు ఎక్కువగా చికెన్ పకోడీ సెంటర్లకు విక్రయించడం లేదా తామే పకోడీ చేసుకోవడం చేస్తుంటారు. డ్రైఫ్రూట్స్, పళ్లు వంటి పౌష్టికాహారం తిని పెరిగే ఈ కోళ్లతో చేసే కూర కంటే పకోడీనే బాగుంటుందని వాళ్లు చెబుతుంటారు. -
అమెరికాలోనూ కోడిపందేలు
సంక్రాంతి అంటేనే కోడిపందేలకు పెట్టింది పేరు. అందులోనూ గోదావరి జిల్లా ప్రాంతాల్లో ఎక్కడ చూసినా కోడిపందేల కోలాహలమే కనిపిస్తుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సంబరాల పేరిట కోడిపందేలను ప్రభుత్వం నిషేధించినా, ‘తగ్గేదే లే’ అంటూ ఈ పందేలు ఏటా జరుగుతూనే వస్తున్నాయి. ఇప్పుడు ఈ కోడిపందేల కోలాహలం అమెరికాకూ వ్యాపించింది. తాజాగా అమెరికాలో ఇద్దరు కోడిపందెం రాయుళ్లను కెంటకీ స్టేట్ పోలీసులు అరెస్టు చేశారు.వారి దగ్గర ఉన్న కోళ్లను స్వాధీనం చేసుకుని, రెండేళ్ల జైలు శిక్ష విధించడంతో ఇప్పుడు ఇది వైరల్గా మారింది. మన దేశంలో జరిగే కోడిపందేల్లాగానే అమెరికాలోనూ కోడిపందేలు జరుగుతుంటాయి. బరిలోకి దించే పుంజులపై పందెం రాయుళ్లు, అలాగే పుంజుల పెంపకందారులు భారీగా పందేలు కాస్తుంటారు. పందేల కోసం పుంజులను సుమారు ఏడాది పాటు పుష్టిగా పెంచుతారు. పందెంకోళ్లకు పెట్టే ఆహారానికి, వాటి ఆరోగ్యానికి భారీగా ఖర్చు చేస్తుంటారు. ఏది ఏమైనా కత్తులతో కుత్తుకలు తెగేలా సాగే పుంజుల పోరాటాలు ఏ దేశంలో జరిగినా, చూడటానికి వచ్చే వారి సంఖ్య మాత్రం తగ్గటం లేదు. -
వైరల్: కోడిపందాల్లో లేడీ బౌన్సర్లు
సాక్షి, పశ్చిమగోదావరి జిల్లా: ఇటీవల కాలంలో బౌన్సర్ల ఏర్పాటు సాధారణంగా మారింది. అయితే, తాడేపల్లిగూడెం పట్టణంలో నిర్వాహకులు ఓ అడుగు ముందుకేశారు. పందెం బరుల వద్ద లేడీ బౌన్సర్ల(Lady Bouncers)ను ఏర్పాటు చేయడం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. గూడెంలో కోడిపందాలు(Cockfighting) జోరుగా సాగుతుండగా, రద్దీని కంట్రోల్ చేసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.కాగా, సంక్రాంతి సంబరాల ముసుగులో కూటమి నేతలు బరితెగించారు. భీమవరంలో పందెం బరి వద్ద మూడు రోజుల నుంచి క్యాసినో నిర్వహిస్తున్నారు. సినిమా సెట్టింగ్ల మాదిరిగా షెడ్లు వేసి జూద క్రీడలను నిర్వహిస్తున్నారు. పందెం రాయుళ్లును ఆకర్షించేందుకు ఇతర రాష్ట్రాల నుంచి మహిళా నిర్వాహకులను కూడా కూటమి నేతలు రప్పించారు. పోలీసులు మాత్రం అటువైపు తొంగిచూడటం లేదు. యథేచ్ఛగా కాసులు వేట సాగిస్తూ సామాన్యులు జేబులు గుల్ల చేస్తున్నారు.మరో వైపు, కోడి పందెం బరిలో ఏకంగా కోటీ 25 లక్షల పందెం కాయడం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ క్రమంలో బరిలోకి దిగిన గుడివాడ ప్రభాకర్ రావు నెమలి పుంజు విజేతగా నిలిచింది. ఈ పందెనికి బెట్టింగ్ రాయుళ్లు భారీగా పందేలు వేసుకున్నారు. తాడేపల్లిగూడెంలోని పైబోయిన వెంకట్రామయ్య కోడి పందెల బరిలో కోటి 25 లక్షల రూపాయలు పందెం కాయడం చర్చనీయాంశంగా మారింది.కుక్కుట శాస్త్ర ప్రకారం కోటి రూపాయల పందేనికి ముహూర్తం ఫిక్స్ చేశారు నిర్వాహకులు. గుడివాడ ప్రభాకర్ రావు నెమలి పుంజు, రత్తయ్య రసంగి పుంజు ఈ బరిలోకి దిగాయి. కోటి 25 లక్షలతో రెండు పుంజులను పందెంలోకి దింపారు నిర్వాహకులు. ఇక, కోటి రూపాయల పందెం వీక్షించడానికి ప్రజలు, పందెం రాయుళ్లు భారీగా తరలివచ్చారు. ఈ పందేనికి భారీగా బెట్టింగులు కాసిన పందెం రాయుళ్లు. బరిలో హోరాహోరీగా సాగిన బరిలో గుడివాడ ప్రభాకర్ (నెమలి పుంజు)విజేతగా నిలిచింది. దీంతో, గెలిచిన వారు సంబరాలు చేసుకున్నారు.ఇదీ చదవండి: అన్నదాత ఇంట కానరాని సంక్రాంతి -
కత్తులు దూసిన కోళ్లు
సాక్షి అమరావతి/నెట్వర్క్: సంక్రాంతి తొలిరోజునే రాష్ట్రవ్యాప్తంగా కోడి పందేల జాతర మొదలైంది. ఉమ్మడి గోదావరి జిల్లాల్లో హైటెక్ హంగులు.. మినీ స్టేడియంలను తలపించిన బరుల్లో కోళ్లు కత్తులు దూశాయి. భారీ టెంట్లు.. వీవీఐపీ, వీఐపీ, సామాన్య జనానికి వేర్వేరుగా ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటు చేశారు. పందేలను తిలకించేందుకు వీలుగా కుర్చీలు.. సోఫాలు.. ఎయిర్ కూలర్లతో సౌకర్యవంతమైన ఏర్పాట్ల నడుమ ఫ్లడ్ లైట్ల వెలుగుల మధ్య పందేలు సాగాయి.ప్రత్యేక ఎంట్రీ పాస్లు ఇచ్చి.. పందేల్లో తలపడిన కోళ్లు ప్రేక్షకులకు కన్పించేల భారీ ఎల్ఈడీ స్క్రీన్ల లైవ్ ఇచ్చారు. ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాలతోపాటు కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లోను పెద్దఎత్తున కోడి పందేలు సాగాయి. గతానికి మించిన భారీ ఏర్పాట్లతో కోళ్ల సమరం సాగింది. ఈ ఏడాది కోడి పందేల జాతర రాయలసీమ జిల్లాలకు పాకింది. గోదావరి జిల్లాల్లో ఇలా.. ఏలూరు జిల్లా పెదవేగి మండలం దుగ్గిరాలలో జాతీయ రహదారి పక్కనే రూ.కోటి ఖర్చుతో కోడి పందేల బరిని మినీ స్టేడియాన్ని తలదన్నేలా నిర్మించారు. అక్కడ కోడి పందేలు వేసేవారికి.. వాటిని చూసేవారికి ప్రత్యేకంగా టోకెన్లు జారీ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం సమీపంలోని గొల్లవానితిప్ప–డేగాపురం వద్ద హైటెక్ హంగులతో ఏర్పాటు చేసిన భారీ బరిలో కోడి పందేలు మొదలయ్యాయి. పందేలరాయుళ్లు విశ్రాంతి తీసుకునేందుకు వీలుగా బరులకు సమీపంలోనే కార్వేన్లు, రెస్ట్రూమ్ల సౌకర్యాలు కల్చించారు. బౌన్సర్లతో ప్రైవేటు సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు.ఉండి నియోజకవర్గంలోని పెదఅమిరం, సీసలి, మహాదేవపట్నం, ఆకివీడులో బరులను సినిమా సెట్టింగులను తలపించేలా తీర్చిదిద్దారు. ఇక్కడ ఓ బరిలో పందేలను ప్రారంభించేందుకు గోల్డ్ కాయిన్ తయారు చేయించి హెడ్ అండ్ టాస్ వేశారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో సుమారు 350 బరుల్లో కోడిపందేలు పోటాపోటీగా నిర్వహించారు. కోడిపందేలు, గుండాట కలిపి తొలిరోజు సుమారు రూ.250 కోట్లకు పైగా పందేలు జరిగాయని అంచనా. ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు పర్యవేక్షణలో ఐ.పోలవరం మండలం మురమళ్లలో 10 ఎకరాల లే–అవుట్లో భారీగా కోడిపందేలు, గుండాటలు నిర్వహించారు. కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ప్రాతినిధ్యం వహిస్తున్న రామచంద్రపురం నియోజకవర్గంలో 15 బరుల్లో సుమారు రూ.3 కోట్ల పందేలు జరిగాయని అంచనా. డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో 30 బరులు ఏర్పాటు చేశారు. కరపలో మూడు రోజులపాటు నిర్వహించే 60 పందేల్లో ఎక్కువ పందేలు గెలిచిన వారికి బహుమతిగా రూ.25 లక్షల విలువైన తార్ జీపు, గురజనాపల్లి, గొర్రిపూడి బరుల్లో నాలుగు రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్లను విజేతలకు బహుమతిగా ఇచ్చేందుకు సిద్ధం చేశారు. బరిలోకి గుంటూరు ఉమ్మడి గుంటూరు జిల్లాలోనూ భారీ ఏర్పాట్ల నడుమ కోడి పందేలు, జూద జాతరకు సోమవారమే శ్రీకారం చుట్టారు. బాపట్ల జిల్లా రేపల్లె, వేమూరు నియోజకవర్గాల్లో భారీ ఎత్తున పందేలు మొదలయ్యాయి. మంతెనవారిపాలెంలో 40 ఎకరాల్లో భారీ బరి ఏర్పాటు చేశారు. మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రాతినిధ్యం వహిస్తున్న రేపల్లె నియోజకవర్గంలోని తూర్పుపాలెం వద్ద 30 ఎకరాల్లో 6 బరులు ఏర్పాటయ్యాయి.వేమూరు నియోజకవర్గ పరిధిలోని కొల్లూరు బోస్నగర్, అనంతవరం, జంపని, చుండూరు మండలం కేఎన్ పల్లి, భట్టిప్రోలు మండలం పల్లకోన ప్రాంతాల్లో బరులు ఏర్పాటు చేశారు. ప్రకాశం జిల్లాలో పందేలు తొలిరోజే జోరందుకున్నాయి. సంతనూతలపాడు మండలం వడ్డెపాలెం పరిసరాల్లో సోమవారం కోడి పందేలు జరిగాయి. ఒంగోలు పాతపాడు, కొత్తపట్నం మండలం మడనూరు, గామళ్లపాడులో పందేలు మొదలయ్యాయి. ‘సీమ’లోనూ కాలు దువ్విన కోడి⇒ ఎకరాల్లో ప్రత్యేక బరి ఏర్పాటు చేశారు. ఇక్కడ కోడి పందేలు, క్యాసినో, కోత ముక్క ఆడించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. విజయవాడ సమీపంలోని రామవరప్పాడు, ఎనికేపాడు, అంబాపురంలోనూ భారీ బరులు ఏర్పాటయ్యాయి. పెనమలూరు పరిధిలోని ఈడుపుగల్లు, గొడవర్రు, ఉప్పులూరు, పెద్దపులిపాకలో కోడి పందేలు జరిగాయి. నందిగామ, పామర్రు గుడివాడ, జగ్గయ్యపేట, పెడన, తిరువూరు, మచిలీపట్నం, మైలవరం నియోజకవర్గాల్లో భారీగా బరుల్లో కోడిపందేలు సాగుతున్నాయి. -
చచ్చినా.. తగ్గేదే లే!
సాక్షి, భీమవరం: తెలుగు నేలపై సంక్రాంతి సీజన్ అంటే పందెంకోళ్ల పౌరుషం గుర్తొస్తుంది. పందెంలో గెలిచినా.. ఓడినా మాంసాహార ప్రియులు పుంజులను లొట్టలేసుకుని లాగిస్తుంటారు. పందెంలో ఓడిపోయిన, చనిపోయిన పుంజును తూర్పు గోదావరి జిల్లాలో ‘కోస’ అని పశ్చిమ గోదావరిలో ‘కోజ’ అని వ్యవహరిస్తారు. వీటి మాంసానికి ఎంతో డిమాండ్ ఉంది. ఏనుగు చచ్చినా బతికినా విలువ తగ్గదన్నట్టు పందెం పుంజైనా, పోరాటంలో మరణించిన ‘కోజ’ అయినా ధర వేలల్లో ఉంటుంది. బరువును బట్టి ఇవి రూ.4 వేల నుంచి రూ.10 వేల వరకు పలుకుతాయి.పుష్టికరమైన ఆహారం..పందెం కోడిని మేపినట్లు మేపామనే సామెతను బట్టి పందెం పుంజులను ఎంత శ్రద్ధగా పెంచుతారో అర్థం చేసుకోవచ్చు. శక్తి కోసం నాటు పుంజులకు ఉడకబెట్టిన మటన్, డ్రై ఫ్రూట్స్, కోడి గుడ్లు, వెల్లుల్లి లాంటి బలవర్థకమైన ఆహారాన్ని నెలల తరబడి అందిస్తారు. శరీరంలో కొవ్వు చేరకుండా తేలిగ్గా ఎగిరేందుకు వాటితో ఈత, నడక వ్యాయామాలు చేయిస్తారు. ప్రత్యేకంగా పెంచిన ఈ తరహా పుంజులు రంగు, ఎత్తు, పోరాట పటిమను బట్టి రూ.50 వేల నుంచి లక్షల్లో ధర పలికితే మిగిలినవి రూ.20 వేల నుంచి రూ.50 వేల వరకు ఉంటాయి. ప్రత్యేకమైన రుచి.. పందెంకోళ్లను మటన్, బాదం, జీడిపప్పు, పిస్తా లాంటి ఖరీదైన మేతతో పుష్టిగా మేపి వ్యాయామాలు చేయించడం వల్ల వాటి శరీరంలో కొవ్వు లేకుండా కండ ఎక్కువగా ఉంటుంది. పందెంలో ప్రత్యర్థి పుంజుపై గెలుపు కోసం సర్వశక్తులూ ఒడ్డిన సమయంలో రక్తం మరింత వేడెక్కి ప్రత్యేకమైన రుచి వస్తుందని మాంసాహార ప్రియుల నమ్మకం. అందుకోసమే ఎంత ఖరీదైనా వెనుకాడకుండా వీటిని కొనుగోలు చేసి ఆరగిస్తారు. బంధుమిత్రులకు వండి పెట్టి.. కొందరు పందేలరాయుళ్లు ‘కోజ’లను తమ వెంట తీసుకెళ్లిపోతే మరి కొందరు బరి బయటే అమ్మేస్తుంటారు. పుంజు బరువును బట్టి ధర పలుకుతుంది. ప్రత్యేకంగా వీటిని నిప్పులపై కాల్పించుకుని దగ్గరుండి కావాల్సిన సైజుల్లో ముక్కలు కొట్టించి మాంసాన్ని తీసుకువెళుతుంటారు. వీటిని కొనేందుకే కొందరు బరుల వద్దకు వస్తుంటారంటే అతిశయోక్తి కాదు. పందెం పూర్తి కాగానే పరుగులు తీస్తుంటారు.పండుగ నాడు ఇంటికి వచ్చిన బంధుమిత్రులకు ‘కోజ’ పుంజులను వండి పెట్టి ఆనందంగా గడుపుతారు. తెలిసిన వారికి మాంసాన్ని పంపేందుకు ఆసక్తి చూపుతారు. పందెం అనంతరం ‘కోజ’ను తమకే ఇవ్వాలని పందేలరాయుళ్లకు ముందుగానే చెబుతారు. ‘పెద్దలకు’ కానుకగా.. సంక్రాంతి సమయంలో సామాన్యులే కాకుండా కొందరు నాయకులు, ఉద్యోగులు సైతం తమ పైవారికి ‘కోజ’లను కానుకగా పంపించి ప్రసన్నం చేసుకుంటారు. పందేల నిర్వాహకులు ఒక్కో బరి నుంచి 25కిపైగా ‘కోజ’లను సేకరించి రాజకీయ నాయకులతో పాటు పోలీస్, రెవెన్యూ, పంచాయతీ, అగ్నిమాపక శాఖ అధికారులకు పంపిస్తుంటారు. స్టేషన్ మామూళ్ల విషయాన్ని పక్కనపెడితే తమకు ఎన్ని ‘కోజ’లు పంపాలో పోలీసులు ముందే ఇండెంట్ పెడతారని పందేలరాయుళ్లు అంటుంటారు. కోట్లు కురిపిస్తున్న ‘కోజ’ ‘కోజ’ల రూపంలో పండుగ మూడు రోజులూ ఒక్కొక్క బరి వద్ద రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు వ్యాపారం జరుగుతుంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా చిన్నా పెద్దా కలిపి దాదాపు 80 కోడిపందేల బరులు ఏర్పాటు కానుండగా ‘కోజ’లపై రూ.5 కోట్లకు పైగా వ్యాపారం జరుగుతుందని అంచనా. -
పశ్చిమ గోదావరి జిల్లాలో టీడీపీ నేతల బరితెగింపు
-
సంక్రాంతి స్పెషల్: 'పందెం కోడి' వామ్మో ఇంత రేటా?
‘ఎత్తర కోడి తిప్పర మీసం’ అని సంక్రాంతి వస్తే బరిలోకి దిగుతారు పందెం రాయుళ్లు. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో సంక్రాంతికి కోళ్ల పందేలు జరపడం ఆనవాయితీ. అయితే పోటీలో గెలిచేందుకు కోళ్లను సాకే తీరు అంతే వినూత్నం. ఈ సంవత్సరం సంక్రాంతి పుంజు ఒక్కోటి రెండున్నర లక్షలు పలుకుతోంది. పందెం కోళ్ల కబుర్లకోసం నెటిజన్లు చెవి కోసుకుంటున్నారు కూడా. మగకోళ్లు మాత్రమే ఎందుకు కొట్టుకుంటాయి? ఆడకోళ్లు సమర్థమైన కోడి పుంజునే ఎంచుకుంటాయి కాబట్టి. ఇతర మగకోళ్లను తరిమికొట్టి ఆడకోళ్లకు చేరువ కావాలి కాబట్టి. ఆడకోళ్లను, వాటి గుడ్లను రక్షించడానికి శక్తి కావాలి కాబట్టి. క్రీస్తు పూర్వం నుంచే కోడి పందాలు ప్రపంచదేశాల్లో ఉన్నాయి. మన దేశంలో కూడా ఉన్నాయి. కుమారస్వామి పతాకంపై కూడా కోడిపుంజు ఉంటుంది. కోడి పుంజులకు వాటి ఈకల రంగును బట్టి, జాతిని బట్టి రకరకాల పేర్లు ఉంటాయి. కాకి, డేగ, నెమలి, పింగళి, పూల, మైల, కౌజు, సేతు, సేవల, నల్లబోర, ఎర్రపొడ.. ఇలా. కోడి పందేల పండితులు, పెంచే ఆసాములు దూరం నుంచి చూసి కూడా ఏ పుంజు ఏ జాతికి చెందిందో చెప్పేయగలరు. పందేల వేళ దేని మీద దేన్ని వదలాలో ఒక లెక్క ఉంటుంది. కోడి పుంజుల పంచాంగం, జాతకాలు ఉంటాయంటే నమ్ముతారా మీరు? ఉన్నాయి. కుక్కుట శాస్త్రమే ఉంది. పల్నాటి యుద్ధం కోడి పందేల ఆనవాయితీని మరవనీకుండా చేస్తూనే ఉంది. కోడి పందేల కోసం సంవత్సరం మొత్తం ఎదురు చూసే వారు.. కోడి పందేల సమయంలోనే సంవత్సరానికి సరిపడా ఆదాయం గడించేవారు గోదావరి జిల్లాల్లో ఉన్నారు. పందెం కోళ్లను పెంచి అమ్ముతారు. ప్రస్తుతం ఒక్కో కోడి రెండున్నర లక్షల ధర పలుకుతోంది. ఇవి బాగా పోరాడటానికి గతంలో ఏం చేసేవారోగాని ఇప్పుడు వయాగ్రా, శిలాజిత్ వంటివి కూడా పెడుతున్నారని తాజా వార్తలు. లోకల్ బ్రీడ్స్లో మోసాలు ఉంటాయని థాయ్లాండ్, ఫిలిప్పైన్స్ నుంచి కూడా పుంజులను తెప్పించుకుంటున్నారు. అయితే అదంత సులువు కాదు. కోడి పందేలకు తర్ఫీదు ఇచ్చే గురువులు వేరే ఉంటారు. వీరు అక్టోబర్ నుంచి పుంజులకు శిక్షణ మొదలెట్టి జనవరికి పూర్తి చేస్తారు. వీటికి తినిపించే తిండి అమోఘం కాబట్టి వీటి రుచి అమోఘమని ఓడిన వాటిని ఎగరేసుకుపోయేవారూ ఉన్నారు. థాయ్లాండ్లో ఇలాంటి పోటీల్లో ఓడిన కోడిని 20 లక్షలకు కూడా కొన్న సందర్భాలున్నాయి. ఈసారి మనవాళ్లు ఎంతకు కొంటారో చూడాలి. ఇవి చదవండి: మొగలిపువ్వంటీ మొగుడ్నీయవే : నాలుగు రోజుల ముచ్చట -
కోడిపందేల కట్టడికి పటిష్ట చర్యలు..‘బరి’తెగిస్తే ఖబడ్దార్
సాక్షి, భీమవరం(ప.గో. జిల్లా): సంక్రాంతి పండగకు సంప్రదా యం పేరుతో జరిగే కోడిపందేల కట్టడికి పోలీసుశాఖ పకడ్బందీ ఏర్పాట్లు చేస్తోంది. పండగ మూడు రోజులపాటు నిర్వహించే కోడి పందేలు, జూదాలను అడ్డుకోవడంపై జిల్లా ఎస్పీ యు.రవిప్రకాష్ ప్రత్యేక దృష్టి సారించారు. ఈ మేరకు గత 15 రోజులుగా జిల్లావ్యాప్తంగా గ్రామాలు, పట్టణాల్లో పందేలకు బరులు ఏర్పాటుచేసే ప్రాంతాలను పరిశీలించడంతో పాటు నిర్వాహకులతో మాట్లాడటం, జూదాలు నిర్వహించిన వారిని ముందుస్తు బైండోవర్ చేయడం, కోడి కత్తులు తయారీ, కట్టేవారిపై ప్రత్యేక నిఘా పెట్టి అదుపులోనికి తీసుకుని కేసులు నమోదు చేయడం, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (సెబ్), పోలీసు సిబ్బంది ఆధ్వర్యంలో పందేల వల్ల కలిగే అనర్థాలను విస్తృతంగా ప్రచారం చేయడం వంటి చర్యలు చేపట్టారు. ఇప్పటివరకు సుమారు 2,100 కేసులు నమోదుచేసి కత్తులు తయారుచేసేవారిని 155 మంది గుర్తించి 50 కత్తులను సీజ్ చేశారు. గ్రామస్తుల సహకారంతో కట్టడి సంక్రాంతి జూదాలను కట్టడి చేయడానికి పోలీసుశాఖ గ్రామస్థాయి కమిటీల సమన్వయంతో పనిచేస్తోంది. ప్రతి గ్రామంలో వలంటీర్లు, సచివాలయ పోలీసు సిబ్బంది అందుబాటులో ఉండటంతో ముందుస్తుగా బరులను సిద్ధం చేస్తున్న ప్రాంతాలపై సమాచారం సేకరిస్తున్నారు. గతంలో పందేలు వేసిన బరుల స్థల యజమానులకు ముందస్తు నోటీసులిచ్చి పందేలు నిర్వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. విస్తృత తనిఖీలు గ్రామాల్లో పందేలు నిర్వహించే అవకాశం ఉన్న ప్రాంతాల్లో పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. పందేలను సిద్ధం చేస్తున్న బరులను, పందేలకు అనువుగా ఉన్న స్థలాలను ట్రాక్టర్లతో దున్నించి ధ్వంసం చేయిస్తున్నారు. అలాగే గతంలో పందేలు నిర్వహించిన జూదరులను హెచ్చరించడంతో పాటు అనర్థాలపై పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. ప్రత్యేక నిఘా ఏటా జిల్లావ్యాప్తంగా మూడు రోజులుపాటు కోడి పందేలు జరుగుతున్నాయి. ప్రధానంగా భీమవరం, కాళ్ల, యలమంచిలి, మొగల్తూరు, పెంటపాడు, త ణుకు, పెనుగొండ, అత్తిలి, వీరవాసరం, పాలకొల్లు, పోడూరు, ఆకివీడు మండలాల్లో భారీ పందేలు జరుగుతుండటంతో పోలీసు అ«ధికారులు ఆయా ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా పెట్టారు. కఠిన చర్యలు సంక్రాంతికి సంప్రదాయం పేరుతో కోడిపందేలు, జూదాలు ని ర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే సుమారు 2 వేల మందికి పైగా కేసులు నమోదు చేశాం. జూదాల వల్ల కలిగే అనర్థాలను విస్తృతంగా ప్రచారం చేస్తున్నాం. పండగలకు ఆనందంగా చేసుకునేలా అవగాహన కల్పిస్తున్నాం. – యు.రవిప్రకాష్, ఎస్పీ, భీమవరం -
కోళ్లు లాక్కున్నందుకు టీడీపీ ఎమ్మెల్యే దౌర్జన్యం.. !
సాక్షి, అనంతపురం : కోడి పందేలను అడ్డుకునేందుకు యత్నించిన పోలీసులపై గుంతకల్లు టీడీపీ ఎమ్మెల్యే జితేంద్ర గౌడ్ అధికార జులుం ప్రదర్శించారు. వివరాలు.. పందేలు నిర్వహించనున్నారనే పక్కా సమాచారంతో పోలీసులు బుధవారం అంకాలమ్మ గుడి వద్దకు చేరుకున్నారు. పందేలకు సిద్ధంగా ఉన్న నాలుగు కోళ్లను స్వాధీనం చేసుకుని జీపులో వేసుకుని వెళ్లారు. దీంతో విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే జితేంద్ర గౌడ్ వారి జీపును చేజ్ చేశారు. పోలీసుల జీపునకు అడ్డం తిరిగి వీరంగం సృష్టించారు. ఏఎస్సై తిరుపాల్పై దౌర్జన్యం చేశారు. కోళ్లు లాక్కుని పందెం రాయుళ్లకు అప్పగించారు. ఇష్టమొచ్చినట్టు పనిచేస్తే ఊరుకోనని పోలీసులను అసభ్య పదజాలంతో దూషించారు. ప్రజల సమక్షంలో ఎమ్మెల్యే పరుష పదజాలంతో తిట్టడంతో పోలీసులు తీవ్ర అవమానానికి గురయ్యారు. ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. కోడి పందాళ్లో పలువురికి గాయాలు.. గుడివాడ : అధికార పార్టీ నాయకుల అండదండలతో గుడివాడలో కోడిపందేలు జోరుగా సాగుతున్నాయి. వలంటీర్గా ఉండి పందేలను వీక్షిస్తున్న ఓ వ్యక్తిపై టీడీపీ కార్యకర్తలు దురుసుగా ప్రవర్తించడంతో ఘర్షణ చెలరేగింది. ఇరువర్గాలవారు దాడి చేసుకోవడంతో పలువురికి గాయాలయ్యాయి. వారిని గుడివాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గత రెండు రోజులుగా టీడీపీ నాయకులు కోడి పందేలు నిర్వహిస్తున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని కొందరు విమర్శిస్తున్నారు. -
వారిపై కేసులు నమోదు చేయండి
సాక్షి, హైదరాబాద్: సంక్రాంతి సందర్భంగా కోడి పందేలు నిర్వహించిన టీడీపీ ఎమ్మెల్యే సత్యప్రసాద్, ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యేలు దేవినేని మల్లికార్జునరావు, ముమ్మనేని వెంకట సుబ్బయ్యలపై కేసులు నమోదు చేయాలని హైకోర్టు చెరుకుపల్లి పోలీసులను ఆదేశించింద ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ కొంగర విజయలక్ష్మిలతో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులిచ్చింది. టీడీపీ నేతలపై ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదంటూ దాఖలైన మరో పిటిషన్పై కూడా ధర్మాసనం స్పందించింది. ఈ వ్యాజ్యంలో ప్రతివాదులుగా ఉన్న ప్రజాప్రతినిధులపై ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని, కేసు నమోదు చేసేలా ఆదేశాలు జారీ చేయాలంటూ న్యాయవాది భానుప్రకాశ్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. -
భలే భలే...కోజా!
సాక్షి, నిడదవోలు: సంక్రాంతి సీజన్లో భోజన ప్రియులకు నోరూరించే పందెం కోడికి (కోజా)కు ప్రతీ ఏటా యమ డిమాండ్ ఉంటుంది. రేటు ఎంతైనా దీన్ని కొనడానికి ఆశక్తి చూపుతారు. సాధారణ రోజుల్లో నాటు కోడి పుంజుకు ఉన్న ధరక 4 రెట్లు అధనంగా కోజా సైజును బట్టి 3 వేల రూపాయల నుంచి 6 వేలకు ధర పలుకుంది. అమ్మడానికి ఎవరైనా ముందుకు వస్తే కొనడానికి జనాలు ఎగబడుతున్నారు. పందెంలో ఓడిపోయిన కోడి పుంజును కోజా అంటారు. దీని రుచికి భోజన ప్రియులు దాసోహమవుతారు. ఎంతైనా వెచ్చించి కోజాను కొనుగోలు చేస్తారు. కొందరైతే కోజాను తినకపోతే అసలు సంక్రాంతి పండుగ చేసుకున్నట్లుగా భావించరు. దూర ప్రాంతాల నుండి సంక్రాంతికి గ్రామాలకు ఇంటికి వచ్చే ముందు ముఖ్యంగా కోజా గురించి ఆరా తీస్తారు. బంధువులు ముందు పరువు దక్కించుకోవడం కోసం ఎంతకైనా కోజాను కొనడానికి వెనకాడరు. పందెం రాయుళ్ళు రకరకాల పదార్ధాలతో పందెం కోళ్ళను పెంచుతారు. నాటు కోళ్ళను సంవత్సరం నుంచి ప్రత్యేక శ్రధ్ధ తీసుకుంటారు. ఇలాంటి పుంజులు కోసి కూర వండుకుని తింటే అహా..ఏమి రుచి అనకమానరు. ఎంతటి వారయినా కోజా రుచికి దాసోహం కాక తప్పదు. -
పెద్దపల్లి టు కోనసీమ
► పెద్ద సంఖ్యలో తరలుతున్న పుంజులు ►పందెం కోళ్లకు అక్కడ మంచి డిమాండ్ ►జిల్లాలో విరివిగా పెంపకం పెద్దపల్లి : కోడి పందేలపై జిల్లా ప్రజలకు పెద్దగా ఆసక్తి లేకపోయినా గ్రామీణ ప్రాంతాల్లో పందెం కోళ్లు మా త్రం విరివిగా పెంచుతున్నారు. వీటిని కోనసీమ జిల్లాలతోపాటు మహారాష్ట్రకు తరలిస్తున్నారు. పెద్దపల్లి పట్టణంతోపాటు కాల్వశ్రీరాంపూర్, ఎలిగేడు, ధర్మా రం మండలాల్లోని పలు గ్రామాల్లో నాటుకోళ్లు పెంచుతున్నవారు పందెం కోళ్లనూ పెంచుతున్నారు. గతంలో ఇక్కడ పెంచిన పందెం కోళ్లను సంక్రాంతి సందర్భం గా శివపల్లి, బెల్లంపల్లి, చందోలి, శ్రీరాంపూర్లోసాగే పందేలకు తీసుకెళ్లేవారు. రెండేళ్లుగా ఈ ప్రాం తంలో పందేలపై నిషేధం విధించారు. అయినా పందెం కోళ్ల పెంపకం మాత్రం నిరాటంకంగానే కొనసాగుతోంది. నాటుకోళ్లు(పెరటికోళ్లు) పెంచుకునేవారు వాటితోపా టు పందెం కోళ్లను పెంచుతున్నారు. నాటుకోళ్లకు కిలో చొప్పున మామూలు ధర ఉండగా, పందెం కోళ్లకు మం చి డిమాండ్ ఉంటుంది. ఒక్కో కోడిపుంజు పెంపకం కోసం సాధారణంగా వాడే విత్తనాలు కాకుండా బా దాం, ఖాజు లాంటి విలువైన పోషక పదార్థాలు వాడడంతో ఏడాదిలోనే పందెం కోడి నాలుగైదు కిలోలకు చేరుకుంటుంది. ఒక్క పుంజు ఖరీదు రూ.2 వేల నుంచి 5 వేలు పలుకుతోంది. రహస్యంగా వ్యాపారులు ఈ ప్రాంతం నుంచి సేకరించిన పందెం కోళ్లను సంక్రాంతి సీజన్ సమయంలో కోనసీమ ప్రాంతంలో జరిగే పోటీ ల్లో పాల్గొనే పందెంరాయుళ్లకు విక్రయిస్తున్నారు. స్థాని కంగా లభిస్తున్న కోళ్లకు కోనసీమ ప్రాంతంలో రూ.10వేల వరకు ధర పలుకుతుందని చెబుతున్నారు. అలాగే చంద్రాపూర్ ప్రాంతంలోనూ ఇదే ధర ఉంటుం దని అంటున్నారు. దీంతో పందెం కోళ్ల పెంపకంపై శ్రద్ధచూపేవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. పం దెం కోడి పిల్ల ఖరీదు రూ. 300 నుంచి రూ.500 వరకు ఉంటుంది. దీనిని పెద్ద సనుగు అంటూ విక్రయిస్తుంటారు. ఏడాదిలో పెట్టిన పెట్టుబడి పదింతలవుతుంది. దీంతో నాటుకోళ్లు రెండు గంపలుగా పెంచడం కన్నా నాలుగు పందెం కోళ్లను పెంచితే రెట్టింపు లాభం వస్తుందని పెంపకందారులు అంటున్నారు. -
కోడి పందేలు నిర్వహించడానికి వీల్లేదు
- సంక్రాంతి పోటీలకు హైకోర్టు బ్రేక్ - నిబంధనల అమలుకు జిల్లా కలెక్టర్లు, ఎస్పీలే బాధ్యత వహించాలి సాక్షి, హైదరాబాద్: కోడి పందేల నిర్వహణకు ఉమ్మడి హైకోర్టు బ్రేక్ వేసింది. సంక్రాంతి సందర్భంగా రాష్ట్రంలో ఎక్కడా కోడి పందేలు నిర్వహించడానికి వీల్లేదని హైకోర్టు తేల్చి చెప్పింది.ఈ పందేలకు ప్రజా ప్రతినిధులు హాజరవుతుండటాన్ని హైకోర్టు తీవ్రంగా ఆక్షేపించింది. చట్టాలను చేసే వారే వాటిని ఉల్లంఘిస్తూ, ఇతరులకూ చట్ట ఉల్లంఘనలకు పాల్పడే ధైర్యాన్నిస్తున్నారని ఘాటుగా వ్యాఖ్యానించింది. కోడి పందేలు జరగకుండా చూసేందుకు ముఖ్యంగా తూర్పు , పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో సంయుక్త పరిశీలన బృందాలను ఏర్పాటు చేయాలని అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించింది. ఈ బృందంలో ఎస్ఐ స్థాయికి తగ్గని అధికారి, తహసీల్దార్, జంతు సంక్షేమ బోర్డు ప్రతినిధి లేదా స్వచ్ఛంద సంస్థ సభ్యుడుగానీ ఉండాలంది. వీటిని జనవరి 7, 2017లోపు ఏర్పాటు చేయాలని, ఈ బృందానికి ఇద్దరు కానిస్టేబుళ్లు, ఓ ఫోటోగ్రాఫర్ సహకారం అందించేలా చూడాలంది.కోళ్ల పందేలకు ఉద్దేశించిన ఏ ప్రాంతాన్నైనా సందర్శించేందుకు ఈ బృందాలకు అధికారం ఉందన్న హైకోర్టు, పందేలకు సిద్ధం చేసిన కోళ్లను, డబ్బును జప్తు చేయవచ్చునంది. జంతు హింస నిరోధకచట్టం, ఏపీ గ్యాంబ్లింగ్ చట్ట నిబంధనల పూర్తిస్థాయి అమలుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లు, ఎస్పీలను ఆదేశించింది. నిబంధనల అమలులో లోపం జరిగితే అందుకు వారు వ్యక్తిగతంగా బాధ్యత వహించాల్సి ఉంటుందని హైకోర్టు తేల్చి చెప్పింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 6కు వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ అంబటి శంకర నారాయణల ధర్మాసనం సోమవారం తీర్పు వెలువరించిం ది. పందేలకు వ్యతిరేకంగా పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన నరహరి జగదీష్ కుమార్, కాకినాడకు చెందిన యానిమల్ రెస్క్యూ ఆర్గనైజేషన్ దాఖలు చేసిన పిల్లను, పందేలకు అనుమతివ్వాలని పారిశ్రామిక వేత్త రఘురామకృష్ణంరాజు దాఖలు చేసిన పిటిషన్లపై ధర్మాసనం తీర్పు వెలువరించింది. -
కోడి పందేల స్ధావరంపై పోలీసుల దాడి
మేడ్చల్: హైదరాబాద్ శివార్లలో కోడిపందేల స్థావరంపై ఎస్ఓటీ పోలీసులు సోమవారం దాడి చేశారు. మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లింగాపూర్ తండాలో కొంతకాలంగా కోడి పందేలు నిర్వహిస్తున్నారు. దీనిపై పక్కా సమాచారంతో పోలీసులు ఓ ఫాంహౌజ్పై దాడి చేసి కోడిపందాలు నిర్వహిస్తున్న 8 మందిని అరెస్టు చేశారు. వారి నుంచి 8 సెల్ఫోన్లు, 4 కోళ్లు, 8 కత్తులతో పాటు రూ.25,230 నగదు స్వాధీనం చేసుకున్నారు. ఫాంహౌజ్ యాజమన్యంతో పాటు పందేలకు పాల్పడిన వారిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
కోడిపందాల్లో ఘర్షణ : నలుగురికి గాయాలు
-
కోడిపందాల్లో ఘర్షణ : నలుగురికి గాయాలు
విజయవాడ : కృష్ణాజిల్లా ఆగిరిపల్లి మండలం కృష్ణవరంలో శనివారం ఉద్రిక్తత నెలకొంది. కోడిపందాల నేపథ్యంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘర్షణలో నలుగురు యువకులు గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రులను సగ్గూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అయితే నలుగురు యువకులు తీవ్రంగా గాయపడటంతో మెరుగైన వైద్య చికిత్స కోసం నూజివీడు ప్రభుత్వాసుపత్రికి తరలించాలని వైద్యులు సూచించారు. దాంతో వారిని నూజివీడు తరలించారు. ఈ ఘర్షణపై సమాచారం అందుకున్న ఆగిరిపల్లి పోలీసులు కృష్ణవరం చేరుకున్నారు. ఘర్షణపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అందులో భాగంగా పోలీసులు కృష్ణవరంలో పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు. -
కోడిపందాలను ప్రారంభించిన 'ఎమ్మ్ల్యే'
-
కోడిపందాలపై దాడులు : పలువురు అరెస్ట్
నెల్లూరు : నెల్లూరు జిల్లా మనుబోలు మండలం చెరుకుమోడిలో కోడి పందాలపై పోలీసులు మంగళవారం దాడి చేశారు. ఈ సందర్భంగా పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి భారీగా నగదు, 9 సెల్ ఫోన్లు, 5 బైకులు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్కు తరలించారు. పోలీసులు వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
గదుల్లేవంటూ చేతులెత్తేసిన హొటళ్లు
-
హాట్టాపిక్గా మారిన కోడిపందాల వ్యవహారం
-
పందెం ఉందా ?..లేదా ?..
-
ముందు నుయ్యి..వెనుక గొయ్యి!
-
'పశ్చిమ'లో పందెం కోళ్ల పంచాయతీ!
పశ్చిమ గోదావరి జిల్లాలో పందెం కోళ్ల పంచాయతీ మొదలైంది. రాబోయే సంక్రాతి పండుగకు కోడి పందాల కోసం తెలుగు తమ్ముళ్లు తీవ్ర యత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే పశ్చిమ గోదావరి ఎస్పీ బదిలీ చేయాలని టీడీపీ నేతలు పట్టుబడుతున్నట్లు సమాచారం. ఒకవేళ ఎస్పీ ఉంటే తమ పందాలకు ఆటంకం కలుగుతుందనే యోచనలో తెలుగు తమ్ముళ్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ పందెం కోళ్ల పంచాయతీని ఏకంగా చినబాబు వద్దకు తీసుకొచ్చారని.. అయితే ఈ అంశం ఆయనకు మరింత తలనొప్పిగా మారిందని అంటున్నారు. ఇదిలా ఉండగా ఎస్పీ బదిలీపై కొంతమంది బీజేపీ నేతలు, టీడీపీ నేతలు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. కోడి పందాల కోసం ఎస్పీని బదిలీ చేస్తే ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని వారు పేర్కొన్నట్లు తెలుస్తోంది. -
ఆ కోళ్లకు జీడిపప్పుతో గుడ్ మార్నింగ్!
సంక్రాంతి వస్తోందంటే చాలు.. కోడిపందాల జోరు బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ పందేల్లో తలపడే కోళ్లకు ఎక్కడలేని డిమాండ్ ఉంటుంది. పౌరుషం రావడం కోసం రకరకాల ఆహారాలు పెడతారు. మరి అలాంటి కోళ్ల రేట్లు కూడా మామూలుగా ఉండవు కదా. అందుకే విశాఖ జిల్లా నక్కపల్లిలో ఓ యువకుడు ఈ కోళ్ల పెంపకాన్నే వృత్తిగా పెట్టుకున్నాడు. అతడిపేరు నూకనాయుడు. వివిధ జాతులకు చెందిన కోళ్లను పెంచుతూ వాటిని పందెంకోళ్లుగా తీర్చి దిద్దుతున్నారు. వాటికి జీడిపప్పుతో గుడ్మార్నింగ్ చెప్పి.. తర్వాత బాదం పప్పు, పిస్తా పప్పు, ఉడకపెట్టిన గుడ్లు, జొన్నలు, రాగులు ఇలా ప్రొటీన్ ఫుడ్డునే ఆహారంగా ఇస్తున్నాడు. ఇంటర్మీడియట్ చదివిన నూకనాయుడు... స్వయం ఉపాధిగా ఈ కోళ్ల పెంపకాన్ని ఎంచుకున్నాడు. డ్రైఫ్రూట్స్ పెట్టి పెంచుతున్న ఈ కోళ్లను... సైజును బట్టి 5 వేల నుంచి 50వేల రూపాయల వరకు అమ్ముకుంటున్నారు. సంక్రాంత్రి దగ్గరపడటం.. కోడిపందాలు జోరందుకోవడంతో నూకనాయుడు కోళ్లకు గిరాకీ పెరుగుతోంది. ధర ఎంతైనా సరే... ఇలాంటి పుంజులే కావాలంటున్నారు పందెంరాయుళ్లు.