cogress
-
బీఆర్ఎస్కు ఎగ్జిట్ పోల్స్ షాక్ !
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియలో కీలకమైన పోలింగ్ ఘట్టం ముగిసింది. పోలింగ్ ముగిసిన వెంటనే ప్రముఖ మీడియా, సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్స్ను వెల్లడించాయి. మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ అధికార బీఆర్ఎస్ పార్టీకి షాక్ ఇచ్చాయి. 90 శాతం ఎగ్జిట్ పోల్స్ గులాబీ పార్టీకి ఈ ఎన్నికల్లో నెగెటివ్ ఫలితాలే రానున్నాయని ప్రెడిక్ట్ చేశాయి. ఇదే సమయంలో ఒకటి రెండు సీట్లు అటుఇటుగా కాంగ్రెస్ పార్టీ మ్యాజిక్ ఫిగర్కు దగ్గరగా రానుందని చాలా వరకు సర్వేలు తెలిపాయి. బీజేపీకి 10 దాకా, ఎంఐఎంకు మళ్లీ 6 లేదా 7 సీట్లు రానున్నాయని వెల్లడించాయి. బీఆర్ఎస్కు 48 సీట్లే: సీఎన్ఎన్ న్యూస్ 18 ప్రముఖ మీడియా సంస్థ సీఎన్ఎన్ న్యూస్ 18 ఎగ్జిట్ పోల్స్లో బీఆర్ఎస్కు 48 సీట్లే వస్తాయని తెలిపింది. కాంగ్రెస్కు 56, బీజేపీకి 10 సీట్లు రానున్నాయని వెల్లడించింది. కాంగ్రెస్కు మ్యాజిక్ ఫిగర్ : ఆరా మస్తాన్ సర్వే తెలంగాణ ఎన్నికలపై ఇప్పటివరకు పక్కాగా సర్వేలు విడుదల చేసిన ఆరా మస్తాన్ ప్రీ పోల్ సర్వే కూడా బీఆర్ఎస్కు 41-49 సీట్లే రానున్నాయని తెలిపింది. కాంగ్రెస్కు ఏకంగా 58-67 సీట్లు రానున్నాయని వెల్లడించింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఆరా మస్తాన్ సర్వే బీఆర్ఎస్దే విజయం అని చెప్పింది. ఆరా చెప్పినట్లుగానే బీఆర్ఎ్స్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. చాణక్య స్ట్రాటజీస్లో బీఆర్ఎస్కు 30 సీట్లే.. చాణక్యస్ట్రాటజీస్ ఎగ్జిట్ పోల్లో బీఆర్ఎస్ ఘోర పరాజయం పాలవనుందని వెల్లడించింది. ఈ సర్వే బీఆర్ఎస్కు 22 నుంచి 30 సీట్లు మాత్రమే వస్తాయని తెలిపింది. కాంగ్రెస్కు సీట్లు 78 వరకు వెల్లవచ్చని పేర్కొంది. బీఆర్ఎస్దే హ్యాట్రిక్ : పల్స్ టుడే పల్స్ టుడే ఎగ్జిట్ పోల్ బీఆర్ఎస్కు 71 సీట్ల దాకా రావచ్చని తెలిపింది. ఈ సర్వేలో కాంగ్రెస్ 38 సీట్ల దగ్గరే ఆగిపోవచ్చని పేర్కొంది. ఈ సర్వేతో పాటు పొలిటికల్ గ్రాఫ్, థర్డ్ విజన్లాంటి సంస్థలు బీఆర్ఎస్ మ్యాజిక్ ఫిగర్ ఈజీగా చేరుకుంటుందని తెలిపింది. మెజారిటీ పోల్స్లో వెనుకబడ్డ కారు సుమారు ఇరవై దాకా సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ చేయగా వాటిలో 15కుపైగా సర్వేలు ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ది వెనుకంజేనని వెల్లడించాయి. కొన్ని సంస్థలు మాత్రమే మళ్లీ బీఆర్ఎస్దే అధికారం అని తెలిపాయి. చాలా వరకు ఎగ్జిట్ పోల్స్ బీఆర్ఎస్, కాంగ్రెస్ కంటే వెనుకబడిందని చెప్పడంతో తుది ఫలితాల్లో ఇదే నిజమయ్యే ఛాన్స్ లేకపోలేదని రాజకీయ పండితులు అభిప్రాయడుతున్నారు. ఎగ్జిట్ పోల్స్ను తారుమారు చేసిన చరిత్ర బీఆర్ఎస్ది : కేటీఆర్ కాగా, ఎగ్జిట్పోల్స్ రిలీజ్ అయిన తర్వాత మీడియా సమావేశంలో మాట్లాడిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ మాత్రం ఎగ్జిట్ పోల్స్ రబ్బిష్ అని కొట్టి పారేయడం విశేషం. తమ పార్టీకి ఎగ్జిట్ పోల్స్ తప్పని రుజువు చేసే చరిత్ర ఉందన్నారు. ఎగ్జిట్ పోల్స్ తప్పయితే క్షమాపణ చెప్తారా అని ఎదురు ప్రశ్నించారు. 3వ తేదీన బీఆర్ఎస్ హ్యాట్రిక్ కొట్టడం పక్కా అని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ఎగ్జిట్ పోల్స్ పూర్తి పట్టిక కోసం.. -
ఫిరాయింపు: మంత్రులుగా ప్రమాణ స్వీకారం
పనాజీ: గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ తన కేబినెట్లోని నలుగురు మంత్రులపై వేటు వేశారు. వారి స్థానంలో ముగ్గురు ఫిరాయింపు ఎమ్మెల్యేలకు, మరో కాంగ్రెస్ నాయకుడి భార్యకు మంత్రి పదవులు కేటాయించారు. పదిమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బుధవారం బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. వీరిలో ముగ్గురిని మంత్రులుగా నియమించారు. ఇక, కాంగ్రెస్ మాజీ నాయకుడు అటనాషియో మాన్సెరేట్కు కేటాయించిన మంత్రి పదవిని చివరి నిమిషంలో ఆయన భార్య జెన్నీఫర్కు కేటాయించారు. నిన్నటివరకు కాంగ్రెస్ నాయకుడిగా, రాష్ట్ర ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రకాంత్ కవ్లేకర్ తాజా మంత్రివర్గ విస్తరణతో ఉప ముఖ్యమంత్రిగా మారారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఫిరాయింపులో కీలక పాత్ర పోషించిన కవ్లేకర్కు పట్టణాభివృద్ధి శాఖతోపాటు డిప్యూటీ సీఎం హోదా కట్టబెట్టారు. మరో కాంగ్రెస్ ఫిరాయింపు ఎమ్మెల్యే ఫిలిప్ నేరి రోడ్రిగ్స్తోపాటు నిన్నటి వరకు డిప్యూటీ స్పీకర్గా ఉన్న మైఖేల్ లోబ్కు కూడా మంత్రి పదవులు దక్కాయి. నలుగురు మంత్రుల తొలగింపు వెనుక చాలా కారణాల ఉన్నాయని, అన్ని విధాలుగా ఆలోచించే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని గోవా సీఎం సావంత్ తెలిపారు. 10మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పార్టీ శాసనసభా పక్షాన్ని బీజేపీలో విలీనంచేయడంతో 40 మంది సభ్యులన్న గోవా అసెంబ్లీలో కమలం పార్టీ బలం 27కు పెరిగింది. కాంగ్రెస్ సభ్యుల సంఖ్య ఐదుకు పడిపోయింది. ఇక, బీజేపీ సభ్యులైన విజయ్ సర్దేశాయ్, వినోదా పాలియోన్కర్, బీజేపీ మిత్ర పక్షమైన గోవా ఫార్వర్ఢ్ పార్టీ ఎమ్మెల్యే జయేష్ సల్గాకోకర్, స్వతంత్ర ఎమ్మెల్యే రోహన్ ఖౌంటేలు తమ మంత్రి పదవులు కోల్పోయారు. -
‘టైం, ప్లేస్ చెప్పు.. వచ్చేందుకు నేను రెడీ’
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ఏర్పాటులో కాంగ్రెస్ పాత్రపై బహిరంగ చర్చకు సిద్ధామా అని టీఆర్ఎస్ ఎంపీ వినోద్కి ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎంపీ మధుయాష్కి సవాల్ విసిరారు. టైమ్ ,ప్లైస్ చెప్పు ఎక్కడికైనా వచ్చేందుకు రెడీ అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆజాద్ వ్యాఖ్యలపై టీఆర్ఎస్ ఎంపీ వినోద్ సోయిలేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రాలను ఏర్పాటు చేసే అధికారం పార్లమెంట్కు ఉంటుందన్న సోయి కూడా వినోద్కు లేదని ఎద్దేవా చేశారు. ప్రజల త్యాగాలను గుర్తించే సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చిందన్నారు. రెండు ఎంపీ స్థానాలతో తెలంగాణ తెచ్చామంటే.. ఇప్పుడు ఇంత మంది ఎంపీలు ఉండి మైనార్టీ రిజర్వేషన్లు ఎందుకు సాధించలేకపోతున్నారని ప్రశ్నించారు. తెలంగాణ కాంగ్రెస్ ఇవ్వలేదంటే టీఆర్ఎస్ నేతలు పురుగులు పడి చస్తారన్నారు. వినోద్, అతని తమ్ముడు, కేసీఆర్ కుటుంబ ఆస్తుల వివరాలు ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ చెప్పిన అబద్దాలకు మోసపోయి ప్రజలు టీఆర్ఎస్కు అధికారం ఇచ్చారన్నారు. 2019లో సైలెంట్ విప్లవం రాబోతుందని, టీఆర్ఎస్ను బొందపెట్టి కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని మధుయాష్కి ధీమా వ్యక్తం చేశారు. -
గుజరాత్లో ముగిసిన రెండవ విడత పోలింగ్
-
గుజరాత్లో ముగిసిన రెండవ విడత పోలింగ్
సాక్షి, గుజరాత్: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల రెండో దశ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. 80 శాతానికి పైగా ఓటింగ్ నమోదైంది. మొత్తం 93 నియోజక వర్గాల్లో ఈసీ పోలింగ్ నిర్వహించారు. రెండో దశలో ఉప ముఖ్యమంత్రి నితిన్ పటేల్ (మెహ్సానా), అల్పేశ్ ఠాకూర్ (కాంగ్రెస్), జిగ్నేశ్ మేవానీ (వడగావ్), సురేశ్ పటేల్ (మణినగర్) వంటి ప్రముఖులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. ప్రధాని మోదీ, బీజేపీ చీఫ్ అమిత్ షా, పార్టీ అగ్రనేత ఎల్కే అద్వానీ, కేంద్ర మంత్రి అరుణ్జైట్లీ (గుజరాత్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉన్నందున), డిప్యూటీ సీఎం నితిన్ పటేల్, మాజీ సీఎం ఆనందీబెన్ పటేల్ వంటి ప్రముఖులు ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. -
వాద్రా లావాదేవీలపై కాంగ్రెస్, బీజేపీ వాగ్యుద్ధం
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ అల్లుడైన రాబర్డ్ వాద్రా భూముల లావాదేవీల్లో అక్రమాలేవీ లేవని హర్యానా ప్రభుత్వం నిర్ధారించడంలో కోడ్ ఉల్లంఘన జరగలేదని ఎన్నికల కమిషన్ పేర్కొనడంతో ఈ అంశంపై గురువారం కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం మెుదలైంది. ఇందుకు సంబంధించి హర్యానా ప్రభుత్వంపై ఆరోపణలు చేసిన ప్రధాని నరేంద్ర మోదీతోపాటు, బీజేపీకూడా క్షమాపణ చెప్పాల్సిందేనని కాంగ్రెస్ గురువారం డిమాడ్ చేసింది. ప్రధాని మోదీ, హూడా ప్రభుత్వంపై బాధ్యతారహితమైన ఆరోపణలు చేశారంటూ కాంగ్రెస్ ప్రతినిధి ఆనంద శర్మ విమర్శించారు. వాద్రా భూలావాదేవీలపై హూడా ప్రభుత్వం ఎన్నికల కమిషన్కు పూర్తి వాస్తవాలు సమర్పించలేదని బీజేపీ ఆరోపించింది. -
కాంగ్రెస్ ఉపాధి...‘కల్పనే’!
కేంద్ర ప్రభుత్వం వద్ద 10 కోట్ల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు తగిన ఆలోచనలు, పథకాలు ఏవీ లేవు. ఇలాంటి మాటలు చెవికింపుగా ఉంటాయి. అందుకే చిదంబరం, జైరాం రమేశ్ వంటి వారు ఇలాంటి కబుర్లు చెబుతుంటారు. వాస్తవానికి గత ఐదేళ్లలో యూపీఏ సర్కార్ కోటి కొత్త ఉద్యోగాలు మాత్రమే ఇవ్వగలిగింది. సార్వత్రిక ఎన్నికల్లో ఓటర్లను ఆకర్షించేందుకు ‘కొత్త ఆలోచనల’తో కాంగ్రెస్ పార్టీ ఇటీవలే తన మేనిఫెస్టోను ప్రకటించింది. దేశాన్ని మరింత ముందుకు తీసుకుపోతామని కూడా కాంగ్రెస్ నాయకులు హామీలు గుప్పించారు. అయితే గతంలో చేసిన వాగ్దానాలను ఎందుకు నెరవేర్చలేకపోయారో మాత్రం వారు సమాధానమివ్వలేకపోయారు. ప్రపంచ ఆర్థిక సంక్షోభ ప్రభావంతో గత ఐదేళ్లుగా వృద్ధిరేటు దిగజారుతున్నప్పుడు సమీప భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందని ప్రజలను నమ్మబలికించేందుకు కాంగ్రెస్ ఎందుకు ఆపసోపాలు పడుతోంది? ఎన్నికలొస్తే రాజకీయ పార్టీలు మేనిఫెస్టోల పేరిట ఎంతో హడావుడి చేస్తాయి. పోలింగ్ అయ్యాక వాటి సంగతి మర్చిపోతాయి. తమిళనాడులో గతంలో డీఎంకే పార్టీ ఓటర్లకు ‘అన్నీ ఉచితం’ అంటూ ఊరించింది. వంటసామాన్లు, మిక్సర్లు, ఫ్యాన్లు, టీవీలు వంటివి ఇచ్చింది. కాని ప్రజలు తెలివైనవారు. డీఎంకే పార్టీ పట్ల కృతజ్ఞత చూపకపోగా తమను అవినీతిలో భాగస్వామ్యం చేసిందని, అస్తవ్యస్త పరిపాలన సాగించిందని భావించారు. దాని ఫలితంగా 2011 ఏప్రిల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు డీఎంకేను చిత్తుచిత్తుగా ఓడించారు. సాధారణంగా తాము అధికారంలోకి రాలేమని భావించినప్పుడు పార్టీలు అసాధ్యమైన వాగ్దానాలు చేస్తాయి. మామూలుగా పార్టీలు నగదు బహుమతులు, కులపరంగా రిజర్వేషన్లు వంటి హామీలు ఇస్తుంటాయి. ఇలాంటి వాగ్దానాలు చేసిన తర్వాత సమర్థవంతమైన, నిజాయితీవంతమైన ప్రభుత్వాన్ని నడపడం సాధ్యం కాదు. సామాజిక న్యాయం పేరిట రాజకీయ పార్టీలు వాగ్దానాల సంతర్పణ చేస్తుంటాయి. ఇలా అలవికాని వాగ్దానాలను గుప్పించడం భావ్యమా? 2009 ఎన్నికలలో తామిచ్చిన వాగ్దానాలలో 90 శాతం హామీలను నెరవేర్చామని కాంగ్రెస్ నేతలు ఇప్పుడు చెప్పుకుంటున్నారు. దాదాపు 90 శాతం వాగ్దానాలను యూపీఏ ప్రభుత్వం అమలు చేసిందని ప్రజలు భావిస్తుంటే పోల్ సర్వేలలో కాంగ్రెస్ ఎందుకు వెనుకబడి ఉందో చెప్పాలి? ఎంత సుదీర్ఘమైన మేనిఫెస్టోను ఓటర్ల ముందు ఉంచితే ఓట్ల డబ్బాలలో అంత భారీగా ఓట్లు రాలుతాయని కాంగ్రెస్ నాయకత్వం భావిస్తున్నట్టు కనిపిస్తోంది. ఎన్నికలవేళ పాత మేనిఫెస్టోను ప్రకటించడం కాదు, దానిలో చేసిన వాగ్దానాలను తు.చ. తప్పకుండా అమలు చేయడం అత్యంత ప్రధానమని కాంగ్రెస్ నాయకత్వం గుర్తించాలి. కాంగ్రెస్లో ఇలాంటి పనులు చేసే నాయకులు లేరు. సమీప భవిష్యత్తులో 8 శాతం వృద్ధి రేటు సాధిస్తామని కాంగ్రెస్ నాయకులు చెపుతున్నారు. అయితే గత ఐదేళ్లలో ఈ లక్ష్యాన్ని సాధించకపోవడానికి గల కారణాలను పార్టీ వివరించలేదు. ఇక మతకలహాల వ్యతిరేక బిల్లు విషయానికి వస్తే.... దీనిపై అన్ని పార్టీలూ తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నాయి. తమ పార్టీలో మెజారిటీ మతస్తులకు దీనిపై అభ్యంతరాలు ఉన్నాయని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. అనేక కారణాల వల్ల కేంద్రం దీన్ని ఇంతవరకూ పార్లమెంట్లో ప్రవేశపెట్టలేదు. ఊరించే ఉద్యోగాలు! పది కోట్ల మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్న వాగ్దానం వివాదాస్పదంగా మారింది. ఇదెలా సాధ్యమని అనేకమంది నిపుణులు ప్రశ్నిస్తున్నారు. ఉపాధి మార్కెట్లోకి ఏటా రెండు కోట్లమంది యువతీయువకులు వస్తున్నారు. ప్రతి ఒక్కరికీ ఉపాధి కల్పిస్తామని ప్రభుత్వం హామీ ఇస్తోంది. ఒకవేళ ఇది సాధ్యమైతే ప్రభుత్వం గత ఐదేళ్లు కలుపుకొని ఒక కోటి ఉద్యోగాలను ఎందుకు ఇవ్వలేకపోయింది? ఏమీ పనిచేయని వారికి కూడా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద రోజుకు రూ.120 చొప్పున చెల్లించిన ‘ఘనత’ ఈ సర్కారుది. ఇలాంటి పథకాల వల్ల కొత్త ఉద్యోగాలు ఏవీ రావు. ప్రభుత్వం వద్ద 10 కోట్ల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందు కు తగిన ఆలోచనలు, పథకాలు ఏవీ లేవు. ఇలాంటి మాటలు చెవికింపుగా ఉంటాయి. అందుకే చిదంబరం, జైరాం రమేశ్ వంటి వారు ఇలాం టి కబుర్లు చెబుతుంటారు. వాస్తవానికి గత ఐదేళ్లలో యూపీఏ సర్కార్ ఒక కోటి కొత్త ఉద్యోగాలు మాత్రమే ఇవ్వగలిగింది. పది కోట్ల ఉద్యోగాలను ఎలా సృష్టిస్తామో, ధరలను ఎలా అదుపు చేయగలమో కాంగ్రెస్ నేతలు ఈ మేనిఫెస్టోలో చెప్పలేకపోయారు. ఈ రెండూ ఒకదానితో మరొకటి ముడిపడి ఉంటాయి. గత పదేళ్లలో దాదాపు రెండు లక్షలమందిదాకా రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని అనధికార అంచనా. వ్యవసాయ సంక్షోభం, రైతుల దీనావస్థ గురించి కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో అసలు ప్రస్తావన చేయలేదు. చిత్తశుద్ధిలేని అవినీతి పోరు అవినీతిని అంతమొందించేందుకు ఇప్పుడు ఉన్న చట్టాలు చాలవన్నట్టు ఇంకా అనేక కొత్త చట్టాలు తీసుకువస్తామని కాంగ్రెస్ వాగ్దానం చేసింది. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్కు పాత్ర ఉన్న ఆదర్శ్ కుంభకోణం, రైల్వే పోస్టులు అమ్ముకున్న మాజీ రైల్వే మంత్రి పవన్ బన్సల్ అవినీతి గురించి తీసుకున్న చర్యల గురించి ఏమీ వివరణ ఇవ్వలేదు. పెపైచ్చు కాంగ్రెస్ అవినీతి కళంకిత చవాన్కు నాందేడ్ లోక్సభ టికెట్ మళ్లీ ఇవ్వడం కొసమెరుపు. మావోయిస్టులను అణచివేస్తామని, పోలీసు వ్యవస్థను ఆధునీకరిస్తామని కూడా కాంగ్రెస్ హామీ ఇచ్చింది. అగ్రవర్ణాలలో పేదలకు ఉద్యోగాలలో రిజర్వేషన్ ఇచ్చే ప్రతిపాదనను కాంగ్రెస్ వ్యతిరేకిస్తోంది. ఇది దేశంలో వివిధ కులాల మధ్య విభేదాలను మరింత పెంచేందుకు దారితీయవచ్చని భావిస్తున్నారు. ఓటు బ్యాంకు సృష్టించుకోవాలన్న వ్యూహంలో ఉన్న కాంగ్రెస్ తమను ఉద్దేశపూర్వకంగా విస్మరించిందని మధ్యతరగతి ప్రజలు భావిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు సీరియస్గా ఆలోచించుకోవల్సిన సమయం ఆసన్నమయ్యింది. పూర్వాశ్రమంలో ఒక టీ స్టాల్ నడుపుకున్న ఒక సాదాసీదా వ్యక్తి (నరేంద్ర మోడీ) తమకు సవాలు విసరగలిగే స్థాయికి ఎదగడం గురించి ఆలోచించాలి. అంతేకాదు... మోడీ సర్కారును ఏర్పాటు చేస్తారా, చేయరా అన్న మాట అటుంచితే భవిష్యత్తులో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయలేని పరిస్థితులు ఆయన సృష్టించడం గురించి కూడా వారు ఆలోచిం చాలి. కాంగ్రెస్ నాయకత్వం ఇప్పటికైనా తన మేనిఫెస్టోను పక్కన పెట్టి, టీవీ షోలు, ప్రచారానికి దూరంగా ఉండి, తన తప్పిదాలను అంగీకరించి ప్రజాపాలన అసలు కిటుకు ఏమిటో తెలుసుకోవాలి. నిజాయితీ పాలన అందించిన రోజున పాలకులు చేసిన తప్పులను మన్నించేందుకు ప్రజలు సదా సిద్ధంగా ఉంటారు. కాని మీడియా ప్రచారపటాటోపం, ప్రాపగాండా ద్వారా కాంగ్రెస్ ఎన్నికల వైతరణి దాటాలనుకుంటోంది. అదే ఆ పార్టీ చేస్తున్న తప్పు. పెంటపాటి పుల్లారావు, (వ్యాసకర్త రాజకీయ విశ్లేషకులు) -
దొందూ దొందే
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : అవినీతిని అంతమొందించడంలో రాష్ట్రంలో ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ వినూత్న పంథాలో నడుస్తుందనే తమ అంచనాలు తలకిందులయ్యాయని విశ్రాంత లోకాయుక్త సంతోష్ హెగ్డే ఆవేదన వ్యక్తం చేశారు. గతంలోని బీజేపీ సర్కారుకు, ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి మధ్య పెద్దగా తేడా లేదని నిష్టూరమాడారు. నగరంలోని విక్రమ్ ఆస్పత్రిలో గురువారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ‘రోగుల భద్రతా పుస్తకాన్ని’ ఆవిష్కరించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ అవినీతిపరులపై కఠిన చర్యలు తీసుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని విమర్శించారు. అవినీతి అధికారులపై చర్యలు తీసుకోవడానికి ప్రస్తుత ప్రభుత్వం నుంచి అనుమతి లభించక పోవడంపై ఇప్పటి లోకాయుక్త భాస్కర రావు అసంృప్తి వ్యక్తం చేయడంపై స్పందిస్తూ, ఆయన విశేషాధికారులను కోరుకోవడం లేదని అన్నారు. అవినీతి అధికారులపై దర్యాప్తునకు ప్రభుత్వ అనుమతితో సంబంధం లేకుండా న్యాయ స్థానాలకు వదిలి వే యడం మంచిదని అభిప్రాయపడ్డారు. సర్కారు అనుమతితో నిమిత్తం లేకుండా అవినీతి అధికారులపై దర్యాప్తును సాగించడానికి అవకాశం కల్పించాలని అరిచి మొత్తుకుంటున్నా, ఏ ప్రభుత్వానికీ పట్టడం లేదని ఆయన తీవ్ర అసంృప్తి వ్యక్తం చేశారు. వైద్య రంగమూ వ్యాపారమయం అంతకు ముందు పుస్తకావిష్కణ కార్యక్రమంలో ప్రసంగించిన ఆయన విద్యా రంగం మాదిరే వైద్య రంగం కూడా వ్యాపారమయమైందని వాపోయా రు. యువత దురాశను విడనాడి, మానవతా ృక్పథంతో వ్యవహరించాలని హితవు పలికారు. రా ష్ర్ట, కేంద్ర ప్రభుత్వాలు ప్రజలకు ఉత్తమ ఆరోగ్య సేవలను అందించడంలో విఫలమయ్యాయని ఆ రోపించారు. జనాభాకు అనుగుణంగా ఆస్పత్రులు లేవని, ఉన్న ఆస్పత్రుల్లోనూ సరైన సదుపాయాలు లేవని విమర్శించారు. ప్రభుత్వం ఉత్తమ వైద్య సే వలు అందించి ఉంటే, ప్రజలు ప్రైవేట్ ఆస్పత్రుల వైపు వచ్చే వారు కారని, తద్వారా వైద్య రంగం వ్యాపారమయం కాకుండా ఉండేదని అభిప్రాయపడ్డారు. 1956లో తాను బెంగళూరుకు వచ్చినప్పుడు ఎన్ని ప్రభుత్వ ఆస్పత్రులు ఉండేవో.. ఇప్పుడూ అన్నే ఉన్నాయని ఆయన తెలిపారు. -
ఫలితాల తర్వాత ఆలోచనలో రాహుల్