consume
-
ప్రపంచంలో అత్యధికంగా ఇష్టపడే మాంసం ఏదో తెలుసా!
ఆరోగ్యంగా ఉండాలంటే ఓన్లీ శాకాహారమే కాక కొద్ది మొత్తంలో మాంసకృత్తులతో కూడిన ఆహారం తీసుకోవడం మంచిది. శరీరానకి అన్ని రకాల విటమిన్లు, ప్రోటీన్లు పుష్కలంగా లభించాలంటే తప్పనిసరిగా మాంసాహారం కూడా తీసుకోవాలసిందే. కొన్ని ప్రాంతాల్లో వివిధ జంతువుల మాంసాన్ని ఇష్టంగా తింటారు. ఇక మన దేశంలో కోడి, గొర్రె మాంసం ఎక్కువగా తింటారు. అయితే ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా తినే జంతు మాంస ఏదో తెలిస్తే షాకవ్వుతారు. ముఖ్యంగా మన భారత్లో ఏం తింటారో వింటే నోట మాట రాదు. ఇంతకీ ప్రపంచవ్యాప్తంగా ఏ జంతు మాంసాన్ని అత్యధికంగా ఇష్టపడుతున్నారంటే.. గత కొన్నేళ్ల నుంచి ప్రపంచవ్యాప్తంగా మాంసాహార వినియోగం విపరీతంగా పెరిగింది. దీని రుచి బాగా ఎక్కువ ఉండటంతో అత్యధిక మంది వీటినే ఇష్టంగా ఆస్వాదిస్తున్నారు. అన్ని వనరులు అందుబాటులో ఉండటం కారణంగా కూడా ఈ మాంస వినియోగం ఎక్కువయ్యిందని చెప్పొచ్చు. ఇక 2017 లెక్కల ప్రకారం మాంసం వినియోగం ఏకంగా 330 మిలియన్ టన్నులు ఉంది. ప్రజల ఆదాయం పెరగడంతో పాటు ఆరోగ్యంపై స్ప్రుహ కూడా ఎక్కువగా ఉండటంతో మాంసం వినియోగం పెరిగిందనే చెప్పొచ్చు. కొన్ని దేశాల్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నా.. మాంసం వినియోగం మాత్రం తగ్గడం లేదు. అయితే సంపన్న దేశాల్లో మాంసం ఎక్కువగా వినియోగిస్తుండగా, పేద దేశాల్లో వినియోగం తక్కువగానే ఉంది. ప్రపంచ వ్యాప్తంగా ఏ జంతువు మాంసం ఎక్కువగా ఇష్టపడుతున్నారో గమనిస్తే..పోర్క్ మాంసానికే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని తెలుస్తోంది. ఒక సర్వే ప్రకారం..ప్రపంచంలో అత్యధికంగా ప్రజలు ఇష్టపడే మాంసాల్లో ఈ పోర్కే తొలి స్థానంలో నిలవడం విశేషం. ఆ తరువాత స్థానంలో చికెన్నును ఎక్కువగా ఇష్టపడుతున్నట్లు వెల్లడయ్యింది. భారత్లో కూడా చికెన్ వినియోగం ఎక్కువగా ఉంటుంది. ఆ తరువాత మూడో స్థానంలో గొడ్డు మాంసం ఎక్కువగా వినియోగిస్తున్నారు. దీని ధర తక్కువగా ఉండడంతో చాలా మంది దీనికి మొగ్గు చూపిస్తున్నారు. మేకలు నాలుగో స్థానంలో ఉన్నప్పటికీ ఎక్కువగా ఆసక్తి చూపడం లేదు. ఐదో స్థానంలో టర్కీ కోడి ఉంది. దీనిని ఎక్కువగా ఉత్తర అమెరికా, మెక్సికోలో ఎక్కువగా వాడుతారు. ప్రపంచంలో బాతు మాంసం ఆరో స్థానంలో నిలిచింది. దీనిని చైనా, అమెరికాలో ఎక్కువగా వినియోగిస్తారు. ఏడో స్థానంలో గేదె మాంసం ఉంది. దీనిని ఆసియాలోని కొన్ని దేశాల్లో ఎక్కువగా తింటారు. కుందేలు మాంసం 8వ స్థానంలో నిలిచింది. దీనిని చైనా, ఉత్తర కొరియాలో ఎక్కువగా తింటారు. తొమ్మిదో స్థానంలో జింక ఉండగా..జపాన్ లో ఈ మాంసాన్ని ఎక్కువగా వినియోగిస్తున్నారు. కాగా, అత్యంత తక్కువ మాంసం వినియోగిస్తున్న దేశంగా భారత్ నిలవడం విశేషం. ఇక్కడ మాంసాహారం కంటే శాఖాహారానికే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. మరో సర్వే ప్రకారం మూడింటరెండు వంతుల మాంసాహారం వినియోగిస్తున్నారని తేలినా.. సగటు వినియోగంతో పోలిస్తే తక్కువగానే ఉంది. ఎందుకంటే ఇక్కడ ఆధ్యాత్మిక భావాలు, సంప్రదాయాలు పట్టింపులు ఎక్కువగా ఉండడం వల్ల అంత తొందరగా మాంసాహారం జోలికి వెళ్లరు. (చదవండి: చల్లటి నీరు అరుదైన గుండె వ్యాధికి దారితీస్తుందా? ఓ బాడీబిల్డర్ చేదు అనుభవం) -
ఆరోగ్యవంతమైన వ్యక్తికి రోజూకి..అది జస్ట్ ఐదు గ్రాములేనా..?
రోడ్డు పక్కన వేడివేడి పకోడీ, మిరపకాయ బజ్జీ, సమోసా మొదలుకుని మంట కింద మసాలా దాకా. ఇలా బయట ఏం తిన్నా మనలో చాలామందికి కాస్త ఉప్పు గట్టిగా పడాల్సిందే. ఇంట్లో కూడా కూరలు మొదలుకుని తెలుగు వారికే ప్రత్యేకమైన నానా రకాల పచ్చళ్ల దాకా అన్నింట్లోనూ ఉప్పు కాస్త ఎక్కువగా వేయనిదే ముద్ద దిగని వాళ్లు చాలామందే ఉన్నారు. ఇలా సగటు భారతీయుడు రోజూ ఎడాపెడా ఉప్పు తినేస్తున్నాడట. ఈ క్రమంలో నిర్ధారిత మోతాదును ఎప్పుడో దాటేశాడని తాజా అధ్యయనం ఒకటి తేల్చింది...ఆరోగ్యవంతుడైన వ్యక్తి ఆహారంలో రోజుకు 5 గ్రాములు, అంతకంటే తక్కువ ఉప్పు తీసుకోవాలి. కానీ భారతీయులు మాత్రం రోజుకు ఏకంగా 8 గ్రాములు లాగించేస్తున్నారు! జర్నల్ నేచర్ పోర్టుఫోలియో తాజాగా జరిపిన అధ్యయనంలో ఈ మేరకు తేలింది. ఇలా చేశారు... జాతీయ అంటేతర వ్యాధుల పర్యవేక్షణ సర్వేకు సేకరించిన శాంపిల్నే ఈ సర్వేకు ఆధారంగా తీసుకున్నారు. వారిలో 3,000 మంది వయోజనులను రాండమ్గా ఎంచుకున్నారు. ఉప్పులో కీలకంగా ఉండే సోడియం మోతాదు వారి మూత్రంలో ఏ మేరకు ఉందో పరిశీలించారు. అంతర్జాతీయ ప్రమాణాలతో దాన్ని పోల్చి చూశారు. వారందరూ మోతాదుకు మించి చాలా ఎక్కువగా ఉప్పు తీసుకుంటున్నట్టు తేలింది! సర్వేలో చాలా ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి... అన్ని సామాజిక వర్గాల వారూ ఉప్పు చాలా ఎక్కువగా తింటున్నారు. అయితే ఈ విషయంలో మహిళలతో పోలిస్తే పురుషులదే పైచేయి. మహిళలు రోజుకు 7.9 గ్రాముల ఉప్పు తింటుంటే పురుషులు 8.9 గ్రాములు లాగిస్తున్నారు! ఉద్యోగులు 8.6 గ్రాములు, పొగ తాగేవారు 8.3 గ్రాములు, హై బీపీ ఉన్నవారు 8.5 గ్రాముల ఉప్పు తింటున్నారని తేలింది. ఇక ఊబకాయులైతే ఏకంగా రోజుకు 9.3 గ్రాముల ఉప్పు తినేస్తున్నారు. వీరితో పోలిస్తే నిరుద్యోగులు, పొగ తాగని వారు, బీపీ, ఊబకాయం లేనివారు ఉప్పు తక్కువ తీసుకుంటున్నట్టు తేలడం విశేషం! సోడియం కథా కమామిషు... నరాలు, కండరాల పనితీరుకు సోడియం చాలా అవసరం. అలాగని ఒంట్లో దాని స్థాయి మితిమీరకూడదు కూడా. ఒక వ్యక్తి రోజుకు 5 గ్రాముల కంటే తక్కువ సోడియం తీసుకోవాలి. అంతకంటే ఎక్కువైతే హైబీపీ, హైపర్ టెన్షన్ వంటివాటికి దారితీస్తుంది. సోడియం పరిమాణం తక్కువగా ఉన్న ఉప్పు తినడం ఆరోగ్యవంతులకు మంచిదే. కానీ షుగర్ పేషెంట్లు, హృద్రోగులు తదితరులకు రక్తంలో హెచ్చు పొటాషియం హైపర్ కలేమియాకు దారి తీస్తుంది. దానివల్ల కండరాలు బలహీనపడతాయి. అంతేగాక పల్స్, గుండె కొట్టుకునే వేగం కూడా పడిపోతాయి! సోడియం ఎక్కువగా ఉండే తిండి హై బీపీ, హైపర్ టెన్షన్ రిస్కును బాగా పెంచుతుందని ఈ అధ్యయనం మరోసారి తేల్చింది. అవి చివరికి గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్ వంటివాటికి దారితీసి ప్రాణాంతకంగా మారతాయి. అందుకే ఆరోగ్యవంతులైనా, మరొకరైనా ఆహారంలో ఉప్పు మోతాదు వీలైనంత తగ్గించడమే మంచిది.ళీ ‘మనమంతా ఆహారంలో ఉప్పును రోజుకు కనీసం 1.2 గ్రాముల మేరకు తగ్గిస్తే చాలు. హైబీపీ కేసులు సగానికి సగం తగ్గిపోతాయి! కనుక ఆహారంలో ఉప్పును తగ్గించుకోవాల్సిన ఆవశ్యకతపై అందరిలోనూ, ముఖ్యంగా భారతీయుల్లో అవగాహన పెరిగేలా ప్రచార తదితర కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం చాలా ఉంది’ – డాక్టర్ ప్రశాంత్ మాథుర్, అధ్యయనకర్త, డైరెక్టర్, ఐసీఎంఆర్– నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్, ఇన్ఫర్మాటిక్స్ అండ్ రీసెర్చ్ – సాక్షి, నేషనల్ డెస్క్ -
తేనె మంచిదని ఎక్కువగా తీసుకుంటున్నారా..?
తేనె ఆరోగ్యానికి చాలామంచిదని తినే ఆహరంలో ఏదో ఒక రూపంలో తీసుకుంటుంటారు చాలామంది. కానీ తేనెని ఇలా ఎక్కువగా తీసుకుంటే ప్రాణాలకే ప్రమాదం అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఇది మంచిగా తీసుకుంటే ఆరోగ్యానికి ఎంత మంచిదే ఎక్కువగా తీసుకుంటే అంతే హానికరం అని చెబుతున్నారు. ఈ తేనెను కొన్ని పదార్థాలతో కలిసి తీసుకొవద్దని హెచ్చరిస్తున్నారు కూడా. ముందుగా ఈ తేనె ఏవిధంగా ఆరోగ్యానికి హనికరమో చూద్దాం! తేనె వల్ల కలిగే దుష్ప్రయోజనాలు: పుప్పొడి గింజలు శరీరంపై పడితే అలెర్జీ ఉన్నవారు అస్సలు తేనెను తీసకోకూడదు. దీని వల్ల అలర్జీ మరింత పెరిగే ప్రమాదం ఉంది. అలాగే తేనె అధికంగా తీసుకోవడం వల్ల ఫుడ్ పాయిజనింగ్ అయ్యే అవకాశం ఉంది. దీంతో కడుపు నొప్పి, విరేచనాలు, వాంతుల వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. అదే చిన్న పిల్లలకు అయితే బోటులిజం అనే కండరాల బలహీనత లేక పక్షవాతం వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. ఇది ఎక్కువగా తీసుకుంటే కడుపు నొప్పి రావడం, పొట్టకు సంబంధించిన సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. తేనెలో ఉండే ఫ్రక్టోజ్ చిన్న ప్రేగు శోషక సామర్థా్యన్ని తగ్గిస్తుంది. దీంతో కడుపులో లేనిపోని సమస్యలు వచ్చే ప్రమాదం పొంచి ఉంది. రక్తంలో చక్కెర స్థాయిలు ఒక్కసారిగాపెరగవచ్చు. అందువల్ల మధుమేహ రోగులు తేనెను తీసుకోకపోవడమే మంచిది. తేనెను ఇలా అస్సలు తీసుకోవద్దు! ►తేనె దేశీయ నెయ్యితో సమాన పరిమాణంలో అస్సలు తీసుకోవద్దు. ఇది అత్యంత విషం. ►గర్భధారణ సమయంలో, పాలిచ్చే తల్లులు తేనెను ఎక్కువగా అస్సలు తీసుకోకూడదు ►చాలా వేడి నీటిలో తేనె ఎప్పుడు తాగకూడదు. గోరువెచ్చని నీటిలో కలుపుకోవాలే గానీ అలా అస్సలు తాగొద్దని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. (చదవండి: పరగడుపునే ఆ నీళ్లు తాగితే..బరువు తగ్గడం ఖాయం!) -
అతనికి ఆహారం తినడమే వికారం..17 ఏళ్లుగా పెప్సీ ఒక్కటే..
ఇంతవరకు ఎందరో వింత వ్యక్తులను వారి ఆహారపు అవాట్లను చూశాం. అవన్నీ ఒక ఎత్తు అయితే ఇతను వాటన్నింటికీ విభిన్నంగా ఉన్నాడు ఇరాన్కు చెందని ఓ వ్యక్తి. అతనికి 'ఆకలి' అనేదే తెలియదట. జూన్ 2006 నుంచి తినడమే మానేశాడు. ఐతే అతను ఎలా బతుకుతున్నాడు అనే సందేహం అందరి మదిలోనూ మెదిలే ప్రశ్న.. కానీ అతను ఇప్పటికీ నిక్షేపంగా ఉన్నాడు. ఎలాంటి అనారోగ్య సమస్య లేదు. అసలేం జరిగిందంటే..ఇరాన్కి చెందిన ఘోలమ్రేజా అర్దేషిరి జూన్ 2006 నుంచి ఆహారం తినడం మానేశాడు. అలా అని అతనికి ఏదైన ప్రమాదం లేదా ఏదైనా జరగకూడని సంఘటన వల్లో అతను ఇలా చేయడం లేదు. ఎలాంటి కారణం లేకుండానే అకస్మాత్తుగా తినడం మానేశాడు. తనకొక వింత అనుభూతి కలిగిందని. అలా అనిపించినప్పుడల్లా పిచ్చెక్కిపోతుందని, ఏం చేయాలో తెలియనంత బాధగా ఉంటుందని చెబుతున్నాడు అర్దేషిరి. తన నోటిలో ఏదో వెంట్రకలాంటి వస్తువు ఉన్న ఫీలింగ్ వస్తుందట. దాని తల భాగం తన గొంతులోనూ మిగతా భాగం పొట్టలో ఉండి అడ్డుపడి, ఊపిరాడనట్లు అనిపిస్తుందట. ఆ బాధ మాటల్లో చెప్పలేనంటున్నాడు. ఈ విషయమై అనేక మంది వైద్యులను సంప్రదించాడు కానీ ఎవ్వరూ తన సమస్యను నిర్ధారించ లేకపోయారని చెబుతున్నాడు అర్దేషిరి. ఐతే తాను బాగా అలసిపోయినప్పుడూ పెప్సీ వంటి శీతల పానీయాన్ని తాగుతుంటాడు. రోజుకి మూడు లీటర్లు పెప్సీ డ్రిండ్ తీసుకుంటాడు. ఒక్కొసారి రాత్రిళ్లు కేవలం నాలుగు గంటలు మాత్రమే నిద్రపోతానని చెబుతున్నాడు. అయితే తనకు ఇదేమి షాకింగ్ లేదని ఇప్పటికీ ఈ వింత అనుభూతి గల కారణం మాత్రం ఎవ్వరికీ తెలియలేదని చెబతున్నాడు. అంతేకాదండోయో ఆర్దేషిరి 17 ఏళ్లుగా పెప్సీ ఒక్కటే తాగుతున్నాడు, ఇంకేమి తీసుకోడు. అతని జీవనోపాధి ఫైబర్ గ్లాస్లు రిపేర్ చేయడం. ఐతే అతని ముందేవరు కుటుంబసభ్యులు భోజనం చేయరట. ఎందుకంటే ఎవ్వరైనా తన ముందు భోజనం చేస్తుంటే వికారంగా ఉంటుందట అందుకని ఎవ్వరూ అర్దేషిరి ఎదుట భోజనం చేయరు. విచిత్రమేమిటంటే ఆ వింత అనుభూతి తప్ప ఏ అనారోగ్య సమస్య లేకపోవడం కొసమెరుపు. (చదవండి: మరోసారి ఇమ్రాన్ ఖాన్ అరెస్టుకు యత్నం) -
ఇంటి నుంచి కిడ్నాప్ చేసి.. అమానుషంగా ప్రవర్తించారు!
జైపూర్: దళితులు,వెనుక బడిన వర్గాలపై అఘాయిత్యాలు.. వివక్షతలను నిరోధించడానికి ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తీసుకొచ్చిన ఇప్పటికి కొన్నిచోట్ల దారుణాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా, రాజస్తాన్లో జరిగిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాలు.. రాజస్తాన్లోని చురులోని రుఖాసర్ గ్రామానికి చెందిన.. 25 ఏళ్ల రాకేష్ మేఘ్వాల్ని కొంత మంది వ్యక్తులు అతని ఇంటి నుంచి అర్ధరాత్రి కిడ్నాప్ చేశారు. ఆ తర్వాత అతని పట్ల అమానుషంగా ప్రవర్తించారు. వారంతా కలిసి మద్యం సేవించారు. ఆ తర్వాత.. అదే బాటిల్లో మూత్రవిసర్జన చేసి బాధితుడితో బలవంతంగా తాగించారు. అయితే, వీరిమధ్య పాతకక్ష్యల నేపథ్యంలో ఈ విధంగా ప్రవర్తించినట్లు తెలుస్తోంది. ఈ సంఘటన జనవరి 26 న జరిగింది. బాధితుడిని రాత్రి 11ల ప్రాంతంలో.. బలవంతంగా కిడ్నాప్ చేసి పొలాల్లోనికి తీసుకెళ్లారు. ఆ తర్వాత అక్కడ మద్యం తాగారు. బాధితుడిని విచక్షణ రహితంగా కొట్టి, అతనిచేత మూత్రం తాగించారు. వారి ఆధీపత్యం చూపించుకోవడానికి ఇలా క్రూరంగా ప్రవర్తించినట్లు తెలుస్తోంది. మేఘ్వాల్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఉదంతం వెలుగులోనికి వచ్చింది. బాధితుడి ఫిర్యాదు మేరకు ఎనిమిది మందిపై కేసు నమోదు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం.. ఉమేష్, బీర్బల్ అనే ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు. మిగతా నిందితులు పరారీలో ఉన్నట్లు గుర్తించారు. వీరిని గాలించడం కోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపినట్లు రతన్గఢ్ సర్కిల్ అధికారి హిమాన్షు శర్మ తెలిపారు. Rajasthan | A Dalit man was allegedly abducted, beaten, & forced to drink urine by some men in Churu. Two people have been arrested& other accused will be arrested soon: Jagdish Prasad Bohra, Addl Superintendent of police, Churu The incident took place on Jan 26, police said pic.twitter.com/nWanMTDkoy — ANI (@ANI) January 30, 2022 చదవండి: రాహుల్కు.. హర్సిమ్రత్ కౌర్ బాదల్ చురకలు.. అలాంటి ప్రచారాలు మానుకోవాలి -
గర్భిణులకు కాఫీ సేఫేనా?
ఉదయాన్నే కాస్తంత టీ లేదా కాఫీ కడుపులోకి వెళ్లందే మన రోజువారీ దినచర్య మొదలవదంటే అతిశయోక్తి కాదు. అంతలా ఇవి ప్రతి ఇంట్లోనూ భాగమయ్యాయి. కొందరైతే రోజుకు నాలుగైదు సార్లు ఇంకా చెప్పాలంటే అంతకంటే ఎక్కువగానే టీ/కాఫీ సేవిస్తుంటారు. తలనొప్పి అనిపించినా, అలసటగా ఉన్నా కాస్త టీ/కాఫీని సేవిస్తే వాటి నుంచి విముక్తి లభించినట్లుంటుదని భావించడమే దీనికి కారణం. అయితే, ’అతి సర్వత్ర వర్జయేత్’ అనే నానుడి ప్రకారం ఏదయినా సరే మితంగా తీసుకుంటేనే ఆరోగ్యం. ఆ స్థాయి దాటిందంటే సమస్యలు తప్పవు. ఇటీవల కాలంలో చాలామంది దృష్టికి వచ్చిన తాజా పుకారు.. ’’గర్భిణులు కాఫీ తాగకూడదు!’. మరి ఇది నిజమేనా? వైద్య నిపుణులు ఏమంటున్నారు? చూద్దాం.. కాఫీని కొకోవా, కాఫీ చెట్ల గింజల నుంచి తీసిన పొడితో తయారుచేస్తారనే విషయం తెలిసిందే. ఈ విత్తనాల్లో కెఫేన్ అధికంగా ఉంటుంది. ఇది నాడీ వ్యవస్థ చురుగ్గా వ్యవహరించడంలో తోడ్పడుతుంది. అందువల్లే కాఫీని శక్తిని అందించే, ఉత్తేజపరిచేదిగా భావిస్తారు. కాఫీలోని కెఫేన్ మన ఆహారనాళంలో త్వరగా జీర్ణమై కలసిపోవడం వల్లే ఇలా జరుగుతున్నట్లు వైద్య నిపుణులు కనుగొన్నారు. అయితే, గర్భిణులు కాఫీ తాగినప్పుడు వారిలో కెఫేన్ జీర్ణమవడానికి చాలా సమయం పడుతుంది. ఈ సమయంలోనే అది గర్భస్త శిశువు రక్తప్రవాహంలోకి చేరుతుంది. ఇక్కడ అది విచ్ఛిన్నమవడం అసాధ్యం. ఫలితం గా పుట్టబోయే చిన్నారులు తక్కువ బరువు కలిగిఉండడం, పెరుగుదల లోపించడం, గర్భస్రావం జరగడం, కొన్ని సార్లు చిన్నారులు అసాధారణ బరువు తో పుట్టడం వంటివి సంభవిస్తాయి. నిజానికి గర్భంపై కెఫేన్ వ్యతిరేక ఫలితాలు చూపడానికి ఇతమిత్ధంగా ఇప్పటికీ కారణాలు తెలియదు. అలాగే దీని ప్రభావం ఒక్కొక్కరిలో ఒక్కోలా ఉండడమూ వైద్యనిపుణులు గమనించారు. రోజుకు 200 మిల్లీ గ్రాములు.. గర్భిణులు కాఫీ తాగొద్దా అంటే మాత్రం నిస్సందేహంగా తాగొచ్చంటున్నారు ది అమెరికన్ కాలేజ్ ఆఫ్ ఆబ్స్ట్రెస్టీషియన్స్ అండ్ గైనకాలజిస్ట్స్(ఏసీఓజీ) వైద్యులు. కానీ ఎట్టిపరిస్థితుల్లోనూ రోజువారీ కెఫెన్ పరిమాణం 200 మిల్లీగ్రాములకు మించకూడదని చెబుతున్నారు. ఆ స్థాయిని మించితే మాత్రం గర్భంలోని శిశువుపై దుష్పరిణామాలు చూపించే ప్రమాదముందంటున్నారు. సాధారణంగా ఒక కప్పు(240 ఎంఎల్) కాఫీలో 96 మిల్లీగ్రాముల కెఫేన్ ఉంటుంది. దీని ప్రకారం ఎక్కువ నివేదికలు చెప్పేదేంటంటే రోజుకు గర్భిణులు 2 కప్పుల(475 గ్రాముల) కాఫీకి మించి తాగకూడదు. డికాఫ్ కాఫీ ప్రత్యామ్నాయమా? డికాఫ్ కాఫీ అంటే కెఫీన్ను తొలగించి చేసిన కాఫీ. అయితే, ఇందులో 100 శాతం కెఫేన్ తొలగింపు సాధ్యం కాదు. 97శాతం వరకు కెఫేన్ తొలగించవచ్చు. ఆ ప్రకారం ఒక కప్పు(240ఎంఎల్) డికాఫ్ కాఫీలో కేవలం 2.4 మిల్లీగ్రాముల కెఫేన్ మాత్రమే ఉంటుంది. కాబట్టి డికాఫ్ కాఫీని రోజుకు మూడు, నాలుగుసార్లు తాగిన గర్భిణులపై దుష్ప్రభావం చూపదని వైద్య పుణులు అంటున్నారు. అలాగే సాధారణ కాఫీతోపాటు డార్క్ చాకొలెట్, ఎనర్జీ డ్రింక్స్, కోలా, హాట్ చాకొలెట్ వంటి వాటిలో కెఫేన్ పరిమాణం ఎక్కువ కాబట్టి వాటి జోలికి వెళ్లవద్దని సూచిస్తున్నారు. అయితే, వీటన్నింటికీ డికాఫ్ కాఫీ ప్రత్యామ్నాయంగా ఎంచుకునే కంటే గర్భిణులు పూర్తిగా కెఫెన్కు దూరమవడమే మంచిదంటున్నారు. ఇంకా చెప్పాలంటే వారికి గర్భిణులకు సురక్షితమైన హెర్బల్, ఫ్రూట్ టీలు, నిమ్మరసం, తేనె కలిపిన వేడినీరు, పసుపు కలిపిన పాలు తాగడం మేలని సూచిస్తున్నారు. -
కొంపముంచిన టమాటా రైస్
సాక్షి, బెంగళూరు: గుడిలో పంచిపెట్టిన ప్రసాదం భక్తుల పాలిట యమపాశమైంది. కర్నాటక, చామరాజ్ నగర్ జిల్లాలోని సులివాడి గ్రామంలో శుక్రవారం ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా మారమ్మ దేవాలయం శంకుస్థాపన సందర్బంగా భక్తులకు పంపణీ చేసిన ప్రసాదం విషపూరితం కావడంతో దాన్ని స్వీకరించిన పదకొండు మంది భక్తులు మృత్యువాత పడ్డారు. దాదాపు 72మందికి పైగా తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. వీరిలో 12 మంది ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. ఈ ఘటనపై జిల్లా ఆరోగ్య అధికారి ప్రసాద్ అందించిన సమాచారం ప్రకారం ప్రసాదం తిన్నవెంటనే భక్తులు వాంతులు, తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడ్డారు. వెంటనే స్పందించిన స్థానిక అధికారులు, పోలీసులు బాధితులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. ప్రసాదంలో విషం కలిసి వుంటుందనే అనుమానాలను ఆరోగ్య అధికారి వ్యక్తం చేశారు. ఘటనాస్థలంలో సేకరించిన ప్రసాదం శాంపిళ్లను పరీక్షల నిమిత్తం పంపించినట్టు తెలిపారు. అలాగే ప్రసాదంలో కిరోసిన్ కలిసిన వాసన వచ్చినట్టుగా బాధితులు చెప్పారన్నారు. చనిపోయినవారిలో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నట్టు చెప్పారు. తమకు పంచిపెట్టిన టమాటో రైస్ వాసన వచ్చిందని, అయితే క్యూలో ముందున్న వాళ్లు ప్రసాదం తిన్న వెంటనే వాంతులు చేసుకున్నారని, దీంతో కొంతమంది తినకుండా పారేయడంతో క్షేమంగా బయటపడ్డారని భక్తుడు మురుగప్ప తెలిపారు. అటు ప్రసాదంలో విషం కలిపారన్న ఆరోపణలపై పోలీసులు ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. మరోవైపు ఈ ఘటనపై రాష్ట్ర ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి తీవ్ర దిగ్ర్భాంతిని వ్యక్తం చేశారు. చనిపోయినవారికి 5లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించారు. అలాగే తక్షణమే సంబంధిత చర్యలు చేపట్టాల్సిందిగా అధికారులను ఆదేశించారు. -
కూలీలను కాటేసిన కల్తీ మద్యం
-
25మందిని కాటేసిన కల్తీ మద్యం
ముంబయి: కాయాకష్టం చేసుకొని మురికి వాడల్లో బతికే అమాయక కూలీలను కల్తీమద్యం కాటేసింది. మత్తులో తూలడానికి తాగిన మద్యం వారి ప్రాణాలు తీసింది. ముంబయిలో కల్తీ మద్యం తాగి 25మంది ప్రాణాలు కోల్పోయారు. సుబర్బన్ మలాద్ వద్ద గల లక్ష్మీనగర్ మురికి వాడలో ఈ ఘటన చోటుచేసుకుంది. వీరితోపాటు చాలామంది ప్రాణాపాయ స్థితిలో ఉండి వైద్య సహాయం పొందుతున్నారు. గత రాత్రి 7.30గంటల ప్రాంతంలో వారంతా మద్యం సేవించగా ఒక్కసారి అస్వస్థతకు గురయ్యారు. ఆస్పత్రికి తరలిస్తుండగానే పలువురు మరణించారు. వీరందరిని శాతాబాయి, బీఎంసీ తదితర ప్రముఖ ఆస్పత్రులకు తరలించి వైద్యం అందిస్తున్నారు. మద్యం షాపు నడుపుతున్న రాజు లంగడా అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.