disappoints
-
ఓఎన్జీసీ లాభం డౌన్
న్యూఢిల్లీ: ఇంధన రంగ ప్రభుత్వ దిగ్గజం ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఓఎన్జీసీ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023–24) రెండో త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. జూలై–సెప్టెంబర్లో నికర లాభం 20 శాతం క్షీణించి రూ. 10,216 కోట్లకు పరిమితమైంది. గతేడాది (2022–23) ఇదే కాలంలో రూ. 12,826 కోట్ల నికర లాభం ఆర్జించింది. చమురు ఉత్పత్తితోపాటు ధరలు తగ్గడం ప్రభావం చూపింది. ఈ ఏడాది క్యూ1 (ఏప్రిల్–జూన్)లోనూ నికర లాభం 34 శాతం వెనకడుగు వేయడం గమనార్హం! కాగా.. ప్రతీ బ్యారల్ చమురుకు 84.84 డాలర్లు లభించగా.. గత క్యూ2లో 95.5 డాలర్లు సాధించింది. రష్యా–ఉక్రెయిన్ మధ్య తలెత్తిన యుద్ధం కారణంగా క్యూ1లో చమురు ధరలు పెరిగినప్పటికీ తిరిగి క్యూ2లో కొంతమేర నీరసించాయి. ఫలితాల నేపథ్యంలో ఓఎన్జీసీ షేరు 0.6% నీరసించి రూ. 196 వద్ద ముగిసింది. -
పీసీసీ పదవి దక్కనందుకు జానారెడ్డి అసంతృప్తి
న్యూఢిల్లీ: తెలంగాణ పీసీసీ చీఫ్ పదవి దక్కకపోవడంపై సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి కే జానారెడ్డి నిరాశకు గురయ్యారు. జానారెడ్డి కాంగ్రెస్ పెద్దలను కలసి అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణకు కొత్తగా పీసీసీని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్యను అధ్యక్షుడిగా నియమించిన సంగతి తెలిసిందే. వర్కింగ్ ప్రెసిడెంట్గా మాజీ మంత్రి ఉత్తమకుమార్ రెడ్డికి అవకాశమిచ్చింది. ఇక సీమాంధ్ర పీసీసీ చీఫ్గా రఘువీరా రెడ్డి, ప్రచార కమిటీ చైర్మన్గా కేంద్ర మంత్రి చిరంజీవిలను నియమించారు. తెలంగాణ పీసీసీ చీఫ్గా జానా రెడ్డి పేరు చివర వరకు వినిపించింది. ఓ దశలో ఆయననే నియమించినట్టు వార్తలు వచ్చాయి. అయితే, చివర్లో అధిష్టానం పొన్నాల వైపు మొగ్గుచూపడంతో జానా అసంతృప్తికి గురయ్యారు.