elluru
-
మీ బిడ్డ ఎవరికీ భయపడడు.. మీ బిడ్డకు మీరే సైనికులు అని ప్రజల సమక్షంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ స్పష్టీకరణ.. ఇంకా ఇతర అప్డేట్స్
-
ఏలూరు లో సందడిగా కనిపిస్తున్న బాణాసంచా దుకాణాలు
-
కర్కశత్వానికి చిన్నారుల బలి
సాక్షి, ఏలూరు టౌన్(పశ్చిమ గోదావరి): ‘మాయమైపోతున్నడమ్మా మనిషన్న వాడు.. మచ్చుకైన లేడు చూడు.. మానవత్వం ఉన్నవాడు.. నూటికో కోటికో ఒక్కడే ఒక్కడు యాడ ఉన్నడో గానీ.. కంటికి కనరాడు!’ అంటూ ఓ కవి సమాజంలో అమానుషాలను ఎలుగెత్తిచాటాడు. మానవత్వపు ఛాయలు మరుగునపడిపోతూ.. ఆధునిక పోకడలతో క్రూరత్వాన్ని నింపుకుంటున్న మృగాళ్లు సమాజంలో పెరిగిపోతున్నారు. చిన్నారులు, పాఠశాలలకు వెళ్లే విద్యార్థినులపై అఘాయిత్యాలు రోజురోజుకూ పెరిగిపోతూనే ఉన్నాయి. మహిళలను దేవతలుగా కొలిచే పవిత్ర భారతంతో మానవమృగాలు అపవిత్ర కార్యాలకు పాల్పడుతున్నాయి. తల్లిగా.. చెల్లిగా.. చెలియగా.. సగభాగంగా ప్రేమ, ఆప్యాయత, అనురాగాలను పంచాల్సిన వేళ కర్కశత్వంతో నిండు జీవితాలను బలితీసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. అభం శుభం తెలియని పసితనం.. ముద్దులొలికే మాటలతో మురిపిస్తూ మైమరపించిన చిన్నారుల నుంచి బాలికలు, యువతులు, మహిళలు ఇలా ఎవరికీ రక్షణ లేని పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇంటి నుంచి బయటకు వెళితే తిరిగి వస్తారా? అనే భయం వెంటాడుతోంది. ఆడపిల్లలుగా పుట్టటమే శాపమా అనే బాధ వారి మనసులను కలచివేస్తోంది. పసిపిల్లలపైనా లైంగిక దాడులు పెరిగిపోవటం సమాజంలో నైతిక విలువలు ఎలా మంటకలిసిపోతున్నాయో అద్దంపడుతున్నాయి. వావీవరసలు మరచి మృగాల్లా మారుతూ మానవ సంస్కృతికే మాయని మచ్చలా చెలరేగిపోతున్నారు. చిన్నారులపై అత్యంత పాశవికంగా అఘాయిత్యాలకు పాల్పడుతూ తల్లిదండ్రుల గుండెల్లో తీరని విషాదాన్ని నింపుతున్నారు. పేగు బంధాన్ని మరిచి.. పేగు బంధాన్ని మరిచాడు.. సభ్య సమాజం సిగ్గుపడేలా కన్నకూతురినే కాటేశాడు.. తల్లికి చెబితే చంపేస్తానని బెదిరించాడు.. కొంతకాలం తన కామవాంచను తీర్చుకుంటూ తనలోని కర్కశత్వాన్ని చూపించాడు. 12 ఏళ్ల చిన్నారిపై ఓ మృగాడు అఘాయిత్యానికి పాల్పడుతున్న సంఘటన బుట్టాయగూడెంలో చోటుచేసుకుంది. బాలిక నుంచి భయంకరమైన చేదు నిజాన్ని తెలుసుకున్న తల్లి తల్లడిల్లిపోయింది.. ఇలాంటి నీచుడిని కటకటాల వెనక్కి నెట్టాలని నిర్ణయించుకుంది. పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మనుమరాలి వయసున్న బాలికపై వృద్ధుడు లైంగిక దాడికి యత్నించాడు. నైతిక విలువలకు తిలోదకాలిస్తూ ఇలాంటి కీచకపర్వాలు కొనసాగుతూనే ఉన్నాయి. పుస్తకాల కోసం తన స్నేహితురాలి ఇంటికి సైకిల్పై వెళుతున్న బాలికను 60 ఏళ్ల వృద్ధుడు అటకాయించాడు. ఆ బాలికపై అఘాయిత్యం చేసేందుకు నిర్జన ప్రదేశంలో షెడ్డులోకి లాక్కెళ్లాడు. బాలిక గట్టిగా కేకలు వేయటంతో చుట్టుపక్కల వారు వస్తున్నారనే భయంతో శివయ్య అనే వృద్ధుడు ఉడాయించాడు. పోలవరం మండలం కొత్త పట్టిసీమ గ్రామంలో 12 ఏళ్ల బాలికపై అఘాయిత్యానికి యత్నించిన అతడిపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు 2015 జూన్ 18న ఏలూరు రూరల్ మండలం వెంకటాపురం పంచాయతీ ఇందిరాకాలనీలో ఘోరం జరిగింది. ఏడేళ్ల చిన్నారి తన తల్లి గుడ్లు తీసుకురామ్మా అంటే కిరాణా కొట్టుకు వెళ్ళి రాక్షసుడి కబంధ హస్తాల్లో చిక్కుకుంది. ముక్కుపచ్చలారని చిన్నారి పసిమొగ్గను చిదిమేసిన మృగాడు ఇంట్లోని ట్రంకు పెట్టెలో కుక్కేశాడు. తల్లి గుండెలు అవిసేలా రోధిస్తూ ఎంత వెతికినా చిన్నారి ఆచూకీ దొరకలేదు. ఇంటి పక్కన ఉన్న కిరాణా కొట్టు సురేష్పై అనుమానం ఉన్నా బాలిక ఆచూకీ మాత్రం లభించలేదు. చివరికి సురేష్ తండ్రే వచ్చి మీ పాప మృతదేహం మా ఇంటిలోని ట్రంకు పెట్టెలో ఉంది.. బట్టల కోసం వెతుకుతుంటే కన్పించిందని చిన్నారి తల్లి్లదండ్రులకు చెప్పడంతో ఓ రాక్షసుడి అకృత్యం బయటపడింది. 2015 అక్టోబర్ 23న అభం శుభం తెలియని చిన్నారిపైన, ఆమె తల్లిపైన అత్యాచారానికి ఒడిగట్టాడు ఓ మృగాడు. మద్యం మత్తులో విచక్షణ కోల్పోయిన ఈ ఉన్మాది వీరిని, అడ్డువచ్చిన బాలిక తండ్రిని హతమార్చేందుకు విఫలయత్నం చేశాడు. ఇంటి వెనుక ఉన్న గడ్డివాముకు నిప్పుపెట్టి అందులో బాలికను పడవేసి సజీవదహనం చేసేందుకు యత్నించాడు. ఈ ఘటన ద్వారకాతిరుమల మండలం హనుమాన్గూడెం గ్రామంలో 2015 అక్టోబర్ 23న జరిగింది. 2017 మేలో నిడదవోలు మండలం డి.ముప్పవరం గ్రామ శివారున చెరకుతోటలో ఓ యువతి అత్యాచారానికి గురైంది. తెల్లవారితే ఇంట్లో ఆయువతికి పెళ్లి జరగాల్సి ఉండగా అదే గ్రామానికి చెందిన యువకుడు అత్యాచారానికి ఒడిగట్టాడు. యువతి బహిర్భూమికి వెళ్లగా ఐదుగురు వ్యక్తులు ఆమెను బలవంతంగా చెరకు తోటలోకి లాక్కుపోయారు. వారిలో ఒక యువకుడు ఆ యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బంధువులు గ్రామశివారున ఉన్న పొలాల వెంట యువత కోసం వెతకగా ఓ చెరకు తోటలో యువతి అపస్మారక స్థితిలో పడి కనిపించింది. 2017లో నిడదవోలు మండలం పురుషోత్తపల్లి గ్రామంలో 7వ తరగతి చదువుతున్న బాలికపై అదే గ్రామానికి చెందిన యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. స్కూల్ ఆవరణలో ఆధ్యాత్మిక సభలకు వచ్చిన బాలికను యువకుడు మాయమాటలు చెప్పి పొలాల్లోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక తల్లిదండ్రులు గ్రామ పెద్దలతో పంచాయతీ చేసుకుని పోలీసులకు ఫిర్యాదు చేయకుండా ఉండిపోయారు. 2017 జూలై 30న బుట్టాయగూడెం మండలం ముప్పినవారిగూడెం గ్రామంలో 13 ఏళ్ల మైనర్ బాలికపై అదే గ్రామానికి చెందిన తాడిచర్ల పోతురాజు అత్యాచారానికి పాల్పడ్డాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. 2018 ఏప్రిల్ 29న పోలవరం మండలం గాజులగొంది గ్రామంలో 5 ఏళ్ల మైనర్ గిరిజన బాలికపై అదే గ్రామానికి చెందిన నేరం శేఖర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. పోలీసులు కేసు నమోదు చేశారు. మానసిక, శారీరక అసమతుల్యత మనిషిలో టెస్టోస్టిరాన్, మెదడులో హార్మోన్ల అసమతుల్యత కారణంగా విపరీతమైన లైంగిక కోరికలు ఉంటాయి. ఇటువంటి వ్యక్తులు వావీవరసలు, నైతిక విలువలు, పరిసరాలు ఇవేమీ పట్టించుకోకుండా లైంగిక దాడులకు తెగబడుతూ ఉంటారు. వీటిని మానసిక రుగ్మతగానే పరిగణించాల్సి ఉంటుంది. ఇక వ్యక్తి చిన్ననాటి నుంచీ పెరిగిన పరిస్థితులు, వాటి ప్రభావం కూడా మానసిక స్థితిపై ఆధార పడుతుంది. ఎదుటివారి ఇష్టాలతో ప్రమేయం లేకుండా ప్రవర్తిస్తూ ఉంటారు. బాలికలను ఒంటరిగా వదిలివెళ్లకూడదు, ఎప్పుడూ చిన్నారులను పర్యవేక్షిస్తూ ఉండాలి. ఎప్పుడైనా బాలలు డిప్రెషన్, అనాలోచితంగా, మౌనంగా ఉంటే వెంటనే వారితో ప్రేమగా మాట్లాడుతూ వారి సమస్యను తెలుసుకునే ప్రయత్నం చేయాలి. సున్నితమైన మనస్తత్వంతో పిల్లలను పెంచటం సరికాదు, సమాజం పట్ల అవగాహన కల్పించేలా తల్లిదండ్రి బాధ్యత వహించాలి. –అక్కిశెట్టి రాంబాబు, సైకాలజిస్ట్, తణుకు లైంగిక విద్యపై అవగాహన కల్పించాలి మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా చెడు ప్రభావాలకు లోనవుతూ ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడుతూ ఉంటారు. వెబ్సైట్లు, సోషల్మీడియా ప్రభావం ప్రస్తుతం అధికంగా ఉంది. విద్యార్థి దశ నుంచే లైంగిక విద్యపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. బాలికలు, యువతులు, మహిళలపై లైంగిక దాడులకు పాల్పడే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటున్నాం. యువతులకు రక్షణ కల్పించేందుకు శక్తి టీమ్లను ఎస్పీ నవదీప్సింగ్ గ్రేవల్ ఏర్పాటుచేశారు. ఎక్కడైనా ఆకతాయిలు ఈవ్టీజింగ్, ఇతరత్రా ఇబ్బందులకు గురిచేస్తే వెంటనే శక్తి టీమ్లకు సమాచారం ఇవ్వచ్చు. పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థినులకు అవగాహన సదస్సులు సైతం నిర్వహించేందుకు పోలీసు శాఖ చర్యలు తీసుకుంటుంది. తల్లిదండ్రులు కూడా పిల్లల పట్ల బాధ్యతగా ఉండాలి. వారు ఏదైనా దారితప్పితే ఆ ప్రభావం పిల్లలపై పడుతుంది. –పైడేశ్వరరావు, మహిళా స్టేషన్ డీఎస్పీ, ఏలూరు జీవనశైలిలో విపరీత మార్పులు సమాజంలో మారుతున్న ఆధునిక పరిస్థితుల ప్రభావం ప్రజలపై తీవ్రంగా పడుతుంది. జీవన శైలిలోనూ మార్పులు వస్తున్నాయి. మహిళలు, చిన్నారులపై అత్యాచారాలు, హత్యలకు పాల్పడటం మానసిక రుగ్మతగానే చూడాల్సి ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో సామాజిక మాధ్యమాలు, ఆధునిక పోకడలు, యువతను పెడదారి పట్టిస్తున్నాయి. వారిలో మానసిక పరివర్తన తీసుకురావడంతోనే మార్పు వస్తుంది. అవసరమైతే అటువంటి వారికి నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో వైద్య చికిత్స అందించాల్సి ఉంటుంది. కొందరిలో శారీరకంగా వచ్చే మార్పులు కాగా, కొందరిలో సామాజికంగా వారు పెరిగిన వాతావరణం కూడా కారణం కావచ్చు. కొందరు పెద్ద వయసున్న వ్యక్తులు కూడా ఇటువంటి మానసిక వ్యాధితో బాధపడుతూ ఉంటారు. –డాక్టర్ హరికృష్ణ, మానసిక వైద్యనిపుణులు -
జన్మభూమిలో మహిళ ఆత్మహత్యాయత్నం
-
అవినీతి అనకొండ సోనియా
ధ్వజమెత్తిన చంద్రబాబు కాంగ్రెస్ను గెలిపిస్తే ఊరికో అవినీతి అనకొండ నన్ను చూసే మోడీ గుజరాత్ను అభివృద్ధి చేశారు ఏలూరు: యూపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీ అవినీతి అనకొండ అని టీడీపీ అధినేత ఎన్.చంద్రబాబునాయుడు విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పశ్చిమగోదావరి జిల్లా తణుకు, గోపాలపురం, ఏలూరు నియోజకవర్గాల్లో బుధవారం ఆయన రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పలు చోట్ల ప్రసంగిస్తూ... కాంగ్రెస్ను మళ్లీ గెలిపిస్తే సోనియాగాంధీ ఊరికో అవినీతి అనకొండను తయారు చేస్తారని ఎద్దేవా చేశారు. హైదరాబాద్ను తాను అభివృద్ధి చేయడం చూశాకే.. బీజేపీ ప్రధాన మంత్రి అభ్యర్థి నరేంద్రమోడీ గుజరాత్లో అభివృద్ధి చేశారని చెప్పుకొచ్చారు. జాతి, దేశం కోసమే ఎన్డీయేతో పొత్తు తప్ప స్వప్రయోజనం కోసం కాదన్నారు. దేశమంతటా కాంగ్రెస్ వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని, ఆ పార్టీని భూస్థాపితం చేయాలని పిలుపునిచ్చారు. తనపై ఎలాంటి అవినీతి కేసులు లేవని, తన రాజకీయ జీవితంలో ఏనాడు జైలుకి వెళ్లలేదని చెప్పారు. జైలుకెళ్లొచ్చిన వ్యక్తి నీతులు చెబుతున్నారని, కొంతమంది బుద్ధిలేని నాయకులు ఆ పార్టీలో చేరుతున్నారని విమర్శించారు. తాను అధికారంలోకి వస్తే జిల్లాలో పోర్టులు, 10 లేన్ల జాతీయ రహదారులు, అసవరమైతే సముద్రం పక్కన మరో రోడ్డు మార్గం ఏర్పాటు చేస్తామని చెప్పారు. రుణమాఫీ చేస్తామని, 9 గంటలు ఉచిత విద్యుత్ ఇస్తామని, సీమాంధ్రను సింగపూర్లా మారుస్తానని హామీలు గుప్పించారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలిస్తామని ఆయన చెప్పారు. చంద్రబాబు ఎదుట ఆశావహుల నిరసన: విశ్వసనీయత, నీతి ఉంటే పార్టీ కోసం కష్టపడిన వారికి అసెంబ్లీ టికెట్లు ఇవ్వాలంటూ తాడేపల్లిగూడెం, కొవ్వూరు, పాలకొల్లు, కృష్ణాజిల్లా అవనిగడ్డ నియోజకవర్గాల ఆశావహుల అనుచరులు తణుకులో చంద్రబాబు ఎదుట ప్లకార్డులు ప్రదర్శించి నిరసన వ్యక్తం చేశారు. తమ నాయకుడికే టికెట్టు ఇవ్వాలంటూ నివాదాలు చేశారు. వారి నిరసనలను బాబు కనీసం పట్టించుకోకుండా వెళ్లిపోయారు. కేవలం రెండు కిలోమీటర్ల రోడ్షో చేసిన బాబు తణుకు నరేంద్ర సెంటర్లోనూ, దేవరపల్లి వద్ద జాతీయ రహదారి పక్కన, ఏలూరు ఫైర్స్టేషన్ సెంటర్లోను ప్రసంగించారు. కానీ ఎక్కడా పట్టుమని 100మంది కూడా లేకపోవడం గమనార్హం. -
చంద్రబాబు పిరికివాడు: కిరణ్
ఏలూరు: తెలుగు జాతి కలిసుండాలని నోటితో చెప్పలేని పిరికివాడు చంద్రబాబు అని మాజీ ముఖ్యమంత్రి, జై సమైక్యాంధ్ర పార్టీ అధ్యక్షుడు ఎన్.కిరణ్కుమార్రెడ్డి విమర్శించారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో ఆదివారం ఆయన రోడ్షో నిర్వహించారు. ఈ సందర్భంగా పలుచోట్ల ప్రసంగించిన ఆయన టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుపై నిప్పులు చెరిగారు. తన లేఖవల్లే రాష్ట్ర విభజన జరిగిందని తెలంగాణకు వెళ్లినప్పుడు, ఎలా విభజిస్తారంటూ ఆంధ్రాకు వచ్చినప్పుడు రెండు నాల్కల ధోరణి అవలంబించిన చంద్రబాబు అసెంబ్లీలో 40 రోజులు చర్చ జరిగితే రాష్ట్రం సమైక్యంగా ఉండాలని ఏనాడైనా చెప్పారా? రాష్ట్రాన్ని విభజించుకోమని కేంద్రానికి రెండు లేఖలు రాసిన వ్యక్తిని మీరు నమ్ముతారా? అని ప్రజలను ప్రశ్నించారు. అది కేసీఆర్ ఆఫీస్లో కొళాయి కాదు కైకలూరు, న్యూస్లైన్: నదీ జలాల విడుదల అంశం టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ పార్టీ కార్యాలయంలో కొళాయి లాంటిది కాదని మాజీ ముఖ్యమంత్రి, జై సమైక్యాంధ్ర అధ్యక్షుడు నల్లారి కిరణ్కుమార్రెడ్డి వ్యాఖ్యానించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కృష్ణా జిల్లా కైకలూరు నియోజకవర్గంలో ఆదివారం నిర్వహించిన రోడ్ షోలో కేసీఆర్, చంద్రబాబులపై ఆయన ధ్వజమెత్తారు. సీమాంధ్రకు నీటి విడుదలను ఆపే సత్తా కేసీఆర్కు లేదన్నారు. -
కాంగ్రెస్ను వీడిన వారంతా ద్రోహులే..
పసీసీ అధ్యక్షుడు రఘువీరా ఏలూరు: కాంగ్రెస్ పార్టీని వీడి వెళ్లిన వారందరూ ద్రోహులేనని పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి వివుర్శించారు. కాంగ్రెస్ చేపట్టిన బస్సు యాత్ర ఆదివారం ఏలూరు, విజయువాడల్లో సాగింది. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యకర్తల సవూవేశాల్లో రఘువీరా మాట్లాడుతూ ఇప్పటి వరకు పదవులు అనుభవించిన కేంద్రమంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు రాత్రికి రాత్రి జంప్ జిలానీలుగా మారుతున్నారని వివుర్శించారు. మంత్రిగా కూడా చేయని కిరణ్కుమార్రెడ్డిని ముఖ్యమంత్రిని చేస్తే ఆయన పార్టీని వదిలిపెట్టి వెళ్లారని ఎద్దేవా చేశారు. కేంద్రవుంత్రి చిరంజీవి వూట్లాడుతూ రాష్ట్ర విభజన నేపథ్యంలో మళ్లీ ప్రజారాజ్యం పార్టీ పెడితే చాంపియన్గా ఉండవచ్చని పలువురు తనకు చెప్పారన్నారు. ప్రజారాజ్యం పార్టీలో సామాజిక న్యాయం పేరుతో బీసీలకు, మైనారిటీలకు, ఎస్సీలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చినా తగిన ంత ఆదరణ దక్కలేదని, అందుకే మహాశక్తిగా ఉన్న కాంగ్రెస్ పార్టీలో చేరానని చెప్పారు. మహాకూటమిలో కలిసి తప్పు చేశానని, బీజేపీ మతతత్వ పార్టీ అని చెప్పిన చంద్రబాబు అదే పార్టీతో ఇప్పుడు ఎలా పొత్తు పెట్టుకుంటున్నారని ప్రశ్నించారు. జై సమైక్యాంధ్ర పార్టీ స్థాపన కోసం కిరణ్కుమార్రెడ్డి కాంగ్రెస్ను నిస్సహాయ స్థితిలోకి నెట్టారని చెప్పారు. అవసాన దశలో ఉన్న కాంగ్రెస్కు అంద రూ అండగా నిలవాలని కోరారు. మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ మాట్లాడుతూ తాను జీవితాంతం కాంగ్రెస్లోనే ఉంటానని చెప్పారు. కేంద్రమంత్రులు పళ్లంరాజు, పనబాక లక్ష్మి, కిల్లి కృపారాణి, జేడీ శీలం, టీటీడీ చైర్మన్ కనుమూరి బాపిరాజు, మాజీమంత్రులు వట్టి వసంత్కుమార్, కోండ్రు మురళి, దేవినేని నెహ్రూ తదితరులు పాల్గొన్నారు. -
నేడు వైఎస్సార్ జనభేరి
చరిత్ర సృష్టించిన ఓదార్పు యాత్రకు మూడేళ్ల క్రితం ఏలూరు నగరంలో శ్రీకారం చుట్టిన వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ‘వైఎస్సార్ జనభేరి’ పేరిట ఎన్నికల శంఖారావాన్ని కూడా ఇక్కడి నుంచే పూరించనున్నారు. జనభేరి మొదటి సభను శనివారం తిరుపతిలో నిర్వహించగా, రెండో సభను సోమవారం ఏలూరు నగరంలో ఏర్పాటు చేశారు. ఈ సభ కోసం అల్లూరి సీతారామరాజు స్టేడియంలో ముమ్మర ఏర్పాట్లు చేశారు. 4వ తేదీన నిడదవోలులో నిర్వహించే జనభేరి బహిరంగ సభలోనూ వైఎస్ జగన్ పాల్గొంటారు. అదేరోజు గోపాలపురం నియోజకవర్గంలో రోడ్ షో నిర్వహిస్తారు. రెండు రోజులపాటు జిల్లాలో జరిగే జననేత జగన్ పర్యటనకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు విసృ్తత ఏర్పాట్లు చేస్తున్నారు. ముస్తాబైన ఏఎస్సార్ స్టేడియం జనభేరి నిర్వహించేందుకు అల్లూరి సీతారామరాజు స్టేడియంలో అన్ని ఏర్పాట్లు చేశారు. భారీ వేదికను నిర్మించడంతోపాటు మహిళలు కూర్చునేందుకు ముం దు భాగాన కుర్చీలు వేశారు. సభకు కనీసం లక్ష మంది హాజరు కానుండటంతో అందుకు అవసరమైన ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నగర నేతలు నాలుగు రోజుల నుంచి ఈ పనుల్లోనే నిమగ్నమై ఉన్నారు. ఏలూరు పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తలు సభను విజయవంతం చేసేందుకు శ్రమిస్తున్నారు. పార్లమెంటరీ నియోజకవర్గ పార్టీ పరిశీలకులు తోట చంద్రశేఖర్, మాజీ ఎమ్మెల్యే ఆళ్ల నాని సభా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. చంద్రశేఖర్ ఏడు నియోజకవర్గాల నేతలు, కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించారు. సభా ప్రాంగణ ఏర్పాట్లను ఆయన ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు ఆళ్ల నాని పార్టీ క్రమశిక్షణా సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఇందుకూరి రామకృష్ణంరాజు తదితర నేతలతో కలసి స్టేడియంను పరిశీలించారు. జనభేరి నేపథ్యంలో స్టేడియం పరిసరాలతోపాటు నగరం మొత్తం వైఎస్సార్ సీపీ ఫ్లెక్సీలతో నిండిపోయింది. మరోవైపు ఈనెల 4వ తేదీన నిడదవోలు జనభేరి, గోపాలపురంలో రోడ్ షోకు సంబంధించి అక్కడి నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గ పార్టీ పరిశీలకులు బొడ్డు అనంత వెంకటరమణ చౌదరి, నిడదవోలు, గోపాలపురం సమన్వయకర్తలు ఎస్.రాజీవ్కృష్ణ, తలారి వెంకట్రావు విస్తృత ఏర్పాట్లు చేయిస్తున్నారు. ఓదార్పు నుంచి జనభేరి వరకూ.. దివంగత మహానేత రాజశేఖరరెడ్డి మరణాన్ని తట్టుకోలేక గుండెపగిలి చనిపోయిన వారి కుటుంబాలను పరామర్శించేందుకు చేపట్టిన ఓదార్పు యాత్రకు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏలూరులోనే శ్రీకారం చుట్టారు. 2010 ఏప్రిల్లో జిల్లాలో నాలుగు రోజులపాటు పగలూ రాత్రి యాత్రలో పాల్గొన్నారు. ఈ యాత్రకు కనీవినీ ఎరుగని స్పందన లభించింది. గ్రామాల్లో జనం అర్ధరాత్రి వేళ కూడా కూడా జగన్ కోసం వేచి ఉండి మరీ అప్పట్లో ఓదార్పుయాత్రను చేశారు. ఆ తర్వాత 2011 ఫిబ్రవరిలో పోలవరం ప్రాజెక్టు సాధన కోసం అమలాపురం నుంచి పోలవరం వరకూ హరితయాత్ర పేరుతో వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్వహించిన పాదయాత్రకూ జనం నీరాజనాలు పలికారు. 2012లో పోలవరం, నరసాపురం ఉప ఎన్నికల సమయంలో రెండు విడతలుగా ఆయన ఆ నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటించారు. ఆ తర్వాత గత ఏడాది నవంబర్లో తుపానుకు దెబ్బతిన్న నరసాపురం, పాలకొల్లు ప్రాంతా ల్లో పర్యటించి రైతులను పరామర్శిం చారు. జననేత ప్రతి పర్యటనకూ జిల్లా ప్రజలు నీరాజనాలు పలికారు. తాజాగా వైఎస్ జగన్ చేపట్టిన రెండు జనభేరి సభలను అదే రీతిలో విజయవంతం చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. -
జగన్ దీక్ష విజయవంతం కావాలని ప్రార్ధనలు
-
సాక్షి చైతన్యపథం - ఏలూరు