Esther
-
మండే కండలు
తల్లిదండ్రులు లేరు. అండ దండలు లేవు. నానమ్మ నేటికీ పల్లెలో ఆకుకూరలు అమ్ముతుంది. కాని 24 ఏళ్ల ఎస్తేర్ రాణి గుంటూరు జిల్లా వేమూరు నుంచి బయలుదేరి ఆంధ్రప్రదేశ్లో మొదటి మహిళా బాడీబిల్డర్ అయ్యింది. ఇటీవల చెన్నైలో జరిగిన‘మిస్టర్ అండ్ మిస్ హిందూస్తాన్’ పోటీలో గోల్డ్మెడల్ సాధించింది. హైదరాబాద్లో జిమ్ ట్రయినర్గా ఉద్యోగం చేస్తున్న ఎస్తేర్ ఏ సాయం అందక గుండె మండుతోందని అంటున్నది.ఎస్తేర్ 2021లో గుంటూరు జిల్లా వేమూరు నుంచి హైదరాబాద్ వచ్చింది. కేవలం ఇంటర్ వరకూ చదువుకుంది. ఏదో ఒక పని చేయాలనుకుంటే ఏం చేయాలో తెలియలేదు. ఆమెకు సిటీలో ఎవరూ తెలియదు. స్కూల్లో కాలేజీలో అథ్లెటిక్స్లో మంచి ్రపావీణ్యం ఉంది. హామర్ త్రోలో నేషనల్స్ వరకూ వెళ్లింది. ఆ ఫిట్నెస్ వల్ల జిమ్లో పనికి కుదిరి ట్రయినర్గా మారింది. ‘‘కొద్దిపాటి జీతం. గుర్తింపు లేని పని. ‘ఏదైనా సాధించాలనే నా తపనకు ఆ పని సరిపోలేదు. ఆ సమయంలోనే మహిళా బాడీ బిల్డర్ల మీదకు నా దృష్టి వెళ్లింది. జాతీయస్థాయి కాంపిటీషన్లలో ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక్కరు కూడా లేకపోవడాన్ని గమనించాను. ఇదే ఎందుకు నేను సాధించకూడదు అని భావించి ఎవరికీ చెప్పకనే ఎవరి అంగీకారం లేకనే నాకై నేనుగా కృషి చేసి ఎదిగాను’ అంటుంది ఎస్తేర్.అన్నీ ఆటంకాలేమహిళా బాడీగార్డ్ కావాలంటే పర్సనల్ ట్రయినర్ ఉండాలి. అందుకు నెలకు పది వేల నుంచి భారీ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అదీగాక నిర్దిష్ట డైట్ తీసుకోవాలి. రోజుకు కనీసం 7 గంటలు వర్కవుట్స్ చేయాలి. అవన్నీగాక మహిళలు బాడీ బిల్డింగ్ చేసే సమస్యలు అనేకం ఉంటాయి. ‘అయినా సరే అప్పుచేసి కండలు పెంచాను. రెండేళ్లలోనే తగినట్టుగా తయారయ్యి మొన్నటి సెప్టెంబర్లో వరల్డ్ ఫిట్నెస్ ఫెడరేషన్ (డబ్లు్య.ఎఫ్.ఎఫ్) నిర్వహించిన నేషనల్స్ బాడీబిల్డింగ్ పోటీల్లో ‘స్పోర్ట్స్ మోడల్’ కేటగిరీలో ద్వితీయస్థానంలో రజత పతకం సాధించాను.ఆ ఉత్సాహంతోనే ఈనెల 9,10 తేదీల్లో చెన్నైలోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో డబ్లు్య.ఎఫ్.ఎఫ్ నిర్వహించిన ‘మిస్టర్ అండ్ మిస్ హిందూస్తాన్ ’ బాడీబిల్డింగ్ ఫిట్నెస్ చాంపియన్ షిప్ అండ్ మోడల్స్’ పోటీల్లో ‘మిస్ ఫిగర్’ కేటగిరీలో ప్రథమ స్థానంలో బంగారు పతకం గెలుచుకున్నాను. నా కేటగిరిలో దేశవ్యాప్తంగా పోటీ ఉన్నా నాకు స్వర్ణం రావడం మర్చిపోలేను’ అంటుంది ఎస్తేర్.దొరకని సాయంబాడీ బిల్డింగ్లో నిరంతర సాధన ఉండాలి. రోజుకు తీసుకునే ఆహారానికే 1500 నుంచి రెండు వేలు ఖర్చు అవుతుంది. ‘ఉద్యోగం చేస్తే సాధన మిస్ అవుతుందని ఫ్రీలాన్స్ జిమ్ ట్రయినర్గా పని చేస్తున్నాను. ఆసియా స్థాయి, ప్రపంచ స్థాయి బాడీ బిల్డింగ్ చాంపియన్షిప్ వరకూ వెళ్లాలని నా కల. ఊళ్లో మా నానమ్మ నేటికీ ఆకుకూరలు అమ్ముతుంది. మాకు సరైన తిండి లేదు. నా తమ్ముడు ఇంకా సెటిల్ కాలేదు. మహిళా బాడీ బిల్డింగ్ అంటే ఎన్నో సవాళ్లు.బంధువులు అందరూ నన్ను నిరోధించారు. అబ్బాయిగా మారిపోయానని సందేహించారు. ఇలా అయితే ఎవరు పెళ్లి చేసుకుంటారన్నారు. కాని నా గెలుపులను చూసి వారు ఇప్పుడు సంతోషిస్తున్నారు. మన సమాజంలో స్త్రీ తన శరీరాన్ని సరైన వస్త్రధారణలో ఉంచుకోవాలి. అందుకే ఎక్కువమంది స్త్రీలు ఆ రంగంలోకి రారు. ఏదైనా సాధించాలని వచ్చిన నావంటి వారిని ఎంకరేజ్ చేయడం ప్రభుత్వ బాధ్యత. అందరికీ అదే నా విన్నపం’ అంది ఎస్తేర్. – బి.ఎల్.నారాయణ, సాక్షి, తెనాలి‘మహిళా బాడీబిల్డింగ్లో ఉత్తర భారతదేశం వారు ముందంజలో ఉన్నారు. మనకు ప్రతిభ ఉన్నా పైస్థాయిలో మనల్ని ముందుకు తీసుకెళ్లేవారు లేరు. మçహారాష్ట్ర, హర్యాణ మహిళా బాడీబిల్డర్లు ఎంతో సౌకర్యంగా కెరీర్లో రాణిస్తున్నారు’ – ఎస్తేర్ -
ఏపీ పథకాలు బాగున్నాయ్..
సాక్షి, అమరావతి: సుస్థిర ఆర్థిక ప్రగతి లక్ష్యాల వైపు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం అడుగులు వేస్తోందని నోబెల్ బహుమతి గ్రహీత, ఎంఐటీ ప్రొఫెసర్, ప్రపంచ ప్రఖ్యాత ఆర్థికవేత్త ప్రొఫెసర్ ఎస్తర్ డుఫ్లో అభినందించారు. పేదరికాన్ని నిర్మూలించి ప్రజల జీవన స్థితిగతులను పెంపొందించడంపై రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేస్తామని ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం పేదల కోసం అమలు చేస్తున్న పథకాలు ఎంతో బాగున్నాయని ప్రశంసించారు. వివిధ అంశాలపై సీఎంజగన్ దార్శనికత, పరిజ్ఞానం, అంకితభావం తమను ఆకట్టుకున్నట్లు చెప్పారు. సోమవారం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్తో ప్రొఫెసర్ ఎస్తర్ డుఫ్లో బృందం సమావేశమై పలు అంశాలపై చర్చించింది. వ్యవసాయం, విద్య, ఆరోగ్యం, గృహ నిర్మాణం, మహిళా సాధికారిత తదితర అంశాల్లో ప్రభుత్వం చేపట్టిన విప్లవాత్మక చర్యలు, అమలు చేస్తున్న కార్యక్రమాలను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ వారికి వివరించారు. గదిలో కాదు.. జనం మధ్యలో తిరిగి సీఎం జగన్ సుదీర్ఘ పాదయాత్రతో క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలు తెలుసుకుని, వాటిని అర్థం చేసుకుని పథకాలను రూపొందించారని ఎస్తర్ డుఫ్లో పేర్కొన్నారు. ఒక గదిలో కూర్చుని సీఎం ఈ పథకాలకు రూపకల్పన చేయలేదని, అలా చేస్తే అవి కేవలం థియరిటికల్గా ఉంటాయని వ్యాఖ్యానించారు. సంతృప్త స్థాయిలో పథకాలను అమలు చేస్తూ అర్హులు ఎవరూ మిగిలిపోకూడదంటూ ముఖ్యమంత్రి జగన్ తీసుకుంటున్న చొరవ ఆయన గొప్ప ఆలోచనా థృక్పథాన్ని వెల్లడిస్తోందని చెప్పారు. పేదరికాన్ని నిర్మూలించాలనే ఆయన అంకితభావాన్ని వెల్లడిస్తోందన్నారు. నగదు బదిలీ పథకాల్లో భాగంగా నేరుగా మహిళల ఖాతాల్లోకి పారదర్శకంగా జమ చేయడం, గృహ నిర్మాణంలో మహిళలకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా అన్ని రకాలుగా కుటుంబం సుస్థిరమవుతుందని తెలిపారు. క్షేత్రస్థాయిలో పరిశీలించి సూచనలు.. సుస్థిర ఆర్థిక ప్రగతి కోసం నిర్దేశించుకున్న లక్ష్యాల సాధనలో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల అమలు తీరు, దాని ప్రభావంపై అధ్యయనం నిర్వహించి సలహాలను కోరడం సీఎం దార్శనికతకు నిదర్శనమని తెలిపారు. పాదయాత్రలో ప్రజల కష్టాలను చూసి సీఎం జగన్ పథకాలను ప్రవేశపెట్టినందున ఏం చేయాలన్న దానిపై తాము పెద్దగా దృష్టి పెట్టాల్సిన అవసరం లేదని, క్షేత్రస్థాయిలో పరిశీలించి బలోపేతం కోసం సూచనలు చేస్తామని చెప్పారు. గత 15 ఏళ్లుగా ‘జె–పాల్’ 20 రాష్ట్రాల్లో పని చేస్తోందని, ఆంధ్రప్రదేశ్లో పైలట్ ప్రాజెక్టు కింద ఇప్పటికే కొన్ని అంశాల్లో పని చేస్తున్నట్లు తెలిపారు. సీఎస్ను కలసిన బృందం ముఖ్యమంత్రితో సమావేశం అనంతరం ఎస్తర్ డుఫ్లో బృందం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ సమీర్ శర్మ, వివిధ శాఖల ఉన్నతాధికారులను కలుసుకుంది. సుస్థిర ఆర్థిక ప్రగతి లక్ష్యాలు, ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సీఎస్ వివరించారు. జె–పాల్ (ది అబ్దుల్ లతీఫ్ జమీల్ పావర్టీ యాక్షన్ ల్యాబ్)కు ఎస్తర్ డుఫ్లో డైరెక్టర్గా, సహ వ్యవస్థాపకురాలిగా వ్యవహరిస్తున్నారు. దక్షిణాసియాకు సంబంధించి జె–పాల్ తరఫున సైంటిఫిక్ డైరెక్టర్గా ఉన్నారు. ఎగ్జిక్యూటివ్ మెంబర్గా వ్యవహరిస్తున్నారు. సమావేశంలో ఎస్తర్ డుఫ్లోతో పాటు బృందం సభ్యులు శోభిని ముఖర్జీ, కపిల్ విశ్వనాథన్, అపర్ణ కృష్ణన్, కునాల్ శర్మ తదితరులు పాల్గొన్నారు. చదవండి: సంక్షేమ స్ఫూర్తి.. పంజాబ్లోనూ ఏపీ తరహా పథకం.. -
ఎస్తేర్ ‘జిమ్’దాబాద్.. ఏపీ తొలి మహిళా బాడీబిల్డర్
సృష్టికి మూలం స్త్రీ. ప్రతి మగాడి గెలుపు వెనుక ఓ మహిళ ఉంటుందంటారు. కానీ ఈ వనితల విజయం వెనుక వారి స్వయంకృషి ఉంది. అచెంచల ఆత్మవిశ్వాసం.. మొక్కవోని దీక్ష.. కఠోర సాధనతో వీరు తాము అనుకున్న లక్ష్యం సాధించారు. అవరోధాలను అవకాశాలుగా మలుచుకుని శక్తిసామర్థ్యాలకు పదునుపెట్టారు. ఉరిమే ఉత్సాహంతో ముందుకురికారు. జయభేరి మోగించి విజయతీరాలు చేరారు. తమ రంగాల్లో అనితరసాధ్యమైన ప్రతిభ కనబరిచారు. మహిళా లోకం సగర్వంగా తలెత్తుకునేలా.. కృషితో నాస్తి దుర్భిక్షం అని నిరూపించారు. చదవండి: ఇదేం కోడిగుడ్డు? వింత ఆకారాన్ని చూసేందుకు ఎగబడుతున్న జనం తెనాలి(గుంటూరు జిల్లా): రావూరి ఎస్తేరు రాణి.. ఈమె జీవితం వడ్డించిన విస్తరి కాదు.. చిన్నప్పుడే అమ్మానాన్నలకు దూరమయ్యారు. పేదరికం శాపంలా వెంటాడుతున్నా.. మొక్కవోని ధైర్యంతో ముందుకు సాగారు. జిమ్ ట్రైనర్గా ఉపాధి పొందుతూనే బాడీబిల్డర్గానూ రాణించారు. రాష్ట్ర తొలి మహిళా బాడీ బిల్డర్గా గుర్తింపు పొందారు. ఫలితంగా ఈనెల 11న సిక్కింలో జరగనున్న నేషనల్ ఫెడరేషన్ కప్ పోటీలకు ఏపీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఎస్తేరురాణి సొంతూరు తెనాలి సమీపంలోని వేమూరు. నాలుగున్నరేళ్ల వయసులోనే తల్లిదండ్రులను కోల్పోయిన ఆమెను, ఆమె తమ్ముడినీ నాయనమ్మ చేరదీసింది. ఇద్దరినీ చదివించింది. గుంటూరు ఏసీ కాలేజీలో ఇంటర్ వరకు చదివిన ఎస్తేరు రాణి పొట్టకూటి కోసం హైదరాబాద్ వెళ్లారు. అక్కడ ఇంటికి దగ్గర్లో ఉన్న జిమ్కు వెళ్లి వర్కవుట్స్ చేసేవారు. కొద్దినెలల్లోనే అక్కడ జిమ్ ట్రైనర్గా మారారు. ఆ తర్వాత శరీర సౌష్టవ పోటీలకు సిద్ధం కావాలని నిర్ణయించుకున్నారు. కఠోర సాధనతో ఏడాదిన్నరలోపే అనుకున్న లక్ష్యాన్ని సాధించారు. నేషనల్ ఫెడరేషన్ కప్ పోటీల్లో పాల్గొనేందుకు గత జనవరిలో రాజమహేంద్రవరంలో నిర్వహించిన ఎంపిక పోటీల్లో సత్తాచాటారు. ఏపీ నుంచి జాతీయ పోటీల్లో పాల్గొనబోతున్న తొలి బాడీ బిల్డర్గా గుర్తింపు పొందారు. ప్రముఖుల ప్రోత్సాహం ఎస్తేరురాణికి ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్కుమార్ రూ.లక్ష, అడిషనల్ డీజీపీ శ్రీధర్, సునీల్ కలిసి రూ.50 వేలు చొప్పున సాయాన్ని సమకూర్చారు. వెన్నుతట్టి ప్రోత్సహించారు. నిత్యం ఆరు గంటల కఠోర సాధన ఎస్తేరురాణి రోజూ ఆరు గంటలు కఠోర సాధన చేస్తారు. ఈ సాధన ఫలించాలంటే రోజూ కిలో చికెన్, ఇరవై గుడ్లు మెనూలో ఉండాలి. వచ్చే జీతం సరిపోకపోయినా.. కొందరి సాయంతో మొక్కవోని దీక్షతో ముందుకు సాగుతున్నారు. నేషనల్స్లో పతకం సాధించి ఉద్యోగం పొందాలనేదే లక్ష్యమని ఎస్తేరు రాణి చెబుతున్నారు. ప్రతిభా ‘మాధవీ’యం తెనాలి: చుండూరు మండలం మోదుకూరుకు చెందిన ఇంజినీరింగ్ ప్రొఫెసర్ గాలి మాధవీలతకు ప్రతిష్టాత్మక గౌరవం లభించింది. భారత స్వాతంత్య్ర అమృతోత్సవాల సందర్భంగా కేంద్ర ప్రభుత్వం సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, ఆర్ట్స్, మేనేజ్మెంట్ విభాగాల్లో జాతీయ స్థాయిలో అత్యుత్తమ సేవలందించిన 75 మంది మహిళల జాబితాను ప్రకటించింది. అందులో మాధవీలతకు స్థానం లభించింది. భారత ప్రభుత్వ ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ ప్రొఫెసర్ కె.విజయరాఘవన్, బ్రిటిష్ హై కమిషనర్ అలెక్స్ ఎల్లిస్ ఈ నెల 3న ఈ జాబితాను ప్రకటించారు. వీరి స్ఫూర్తిదాయక సేవలను ‘షి ఈజ్ 75 విమెన్ ఇన్ స్టీమ్’ పేరుతో పుస్తక రూపంలో తీసుకురానున్నారు. నేటి తరానికి స్ఫూర్తినిచ్చేందుకు వీరి వీడియోలను ప్రదర్శిస్తారు. సదస్సులో వీరిని పరిచయం చేస్తారు. ఆ జాబితాలో ప్రముఖ పారిశ్రామికవేత్తలు, సైంటిస్ట్లు, కళాకారులు, సమాజ సేవకులు, మానవతావాద డాక్టర్ల సరసన చుండూరు మండలం మోదుకూరుకు చెందిన కనకారెడ్డి, శివలీల కోడలు మాధవీలతకు స్థానం లభించింది. సాధారణ రైతు కుటుంబం నుంచి.. ప్రకాశం జిల్లా ఏడుగుండ్లపాడు గ్రామం మాధవీలత స్వస్థలం. 1971లో సాధారణ రైతు కుటుంబంలో అన్నపూర్ణమ్మ, వెంకారెడ్డి దంపతులకు జని్మంచారు. జేఎన్టీయూ, కాకినాడలో ఇంజినీరింగ్ పూర్తిచేసి, స్వగ్రామంలో తొలి ఇంజినీరుగా గుర్తింపును పొందారు. ఎన్ఐటీ, వరంగల్లో ఎంటెక్, ఐఐటీ మద్రాస్లో పీహెచ్డీ చేశారు. ప్రస్తుతం బెంగళూరులోని సర్వోత్తమ విశ్వవిద్యాలయం ఐఐఎస్సీలో సివిల్ ఇంజినీరింగ్ విభాగంలో ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. ఇదే విశ్వవిద్యాలయంలోని సెంటర్ ఫర్ సస్టైనబుల్ టెక్నాలజీస్ విభాగానికి చైర్పర్సన్గా మాధవీలత సైన్స్ని, టెక్నాలజీని గ్రామీణాభివృద్ధికి చేరువచేసే ప్రాజెక్టులకు నాయకత్వం వహిస్తున్నారు. భారతదేశంలో జమ్ములో గల చీనాబ్ నదిపై రూ.1000 కోట్ల వ్యయంతో నిర్మాణంలో ఉన్న ప్రపంచంలోని అతి ఎత్తయిన రైల్వే బ్రిడ్జి డిజైన్, నిర్మాణంలో మాధవీలత ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు. వ్యక్తిగత విషయానికొస్తే గృహిణిగా, అమ్మగా తన పాత్రపోషిస్తూనే వృత్తిపరంగానూ రాణిస్తున్న మాధవీలత అభిరుచిలోనూ తనదైన శైలి కబరుస్తుంటారు. కవితలనూ రాస్తుంటారు. ‘ఆశా’వహ దృక్పథంతో.. గుంటూరు వెస్ట్: ఆశావహ దృక్పథమే ఆమెను ముందుకు నడిపింది. పరిస్థితులకు ఎదురీదుతూనే ఆమె అంచెలంచెలుగా ఎదిగారు. రూ.200తో వ్యాపారం మొదలు పెట్టి రూ.40లక్షల టర్నోవర్కు చేర్చారు. ఆమె పేరు ఆశా సేకూరు. ఊరు గుంటూరు. సహజసిద్ధ ఉత్పత్తుల తయారీతో సమున్నత ప్రగతి సాధించారు. ఇప్పుడు విదేశాలకూ తన ఉత్పత్తులను ఎగుమతి చేస్తూ మరికొందరికి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న ఆశా విజయగాథ ఆమె మాటల్లోనే.. ఆలోచనాత్మకంగా ముందడుగు.. 2008లో విజయ్ ప్రసాద్తో పెళ్లయింది. నేను గర్భిణిగా ఉండగా ఆయన నడిపే యానిమేషన్ స్టుడియో ఆర్థిక ఇబ్బందులతో మూతపడింది. ఎనిమిదో నెలలోనే కూతురు తన్వీ పుట్టింది. సమస్యలు ఒక్కసారిగా చుట్టుముట్టాయి. అయినా బెదిరి పోలేదు. ఆ సమయంలో పాప రంగు రావాలని కొన్ని లోషన్స్ వాడాను. అవి వికటించి ర్యాషెస్ వచ్చాయి. అమ్మమ్మకు చెబితే వంటగదిలో లభించే కొన్ని వస్తువులతో సున్నిపిండి చేసి ఇచ్చింది. ఇది పాపకు బాగా పనిచేసింది. అప్పుడే సహజసిద్ధ ఉత్పత్తులు తయారు చేయాలనే ఆలోచన వచ్చింది. సున్నిపిండి తయారీకి కేవలం రూ.200 ఖర్చయింది. ఆచరణ ఇలా.. ఆ తర్వాత పాప శరీరానికి బాదం ఆయిల్ మంచిదని రూ.5.000 వెచ్చించి చత్తీస్గఢ్ నుంచి ఆయిల్ ఎక్స్్రస్టేట్ మిషన్ కొన్నాను. కేజీ బాదం పప్పును పిండితే కేవలం 150 గ్రాములే వచ్చింది. దానిలో మరికొన్ని వస్తువులు కలిపి పాపకు వాడాను. బాగా పనిచేసింది. ఆ తర్వాత సహజసిద్ధ ఉత్పత్తుల తయారీలో ఆయుర్వేదిక్ కాస్మొటాలజీ, ఆర్గానిక్, ఇతర సర్టిఫికేట్ కోర్సులు చేశా. సొంతంగా సహజసిద్ధ సౌందర్య ఉత్పత్తులు తయారు చేసి మొదట నా బిడ్డకు వాడేదాన్ని. వాటి ఫలితాల ఆధారంగా తన్వీ నేచురల్స్ పేరిట సంస్థ స్థాపించి మార్కెటింగ్ చేయడం మొదలు పెట్టా. ప్రస్తుతం 25 రకాల వస్తువులు తయారు చేస్తున్నా. సంస్థ టర్నోవర్ ఇప్పుడు రూ.40లక్షలు. విదేశాలకూ ఉత్పత్తులు ఎగుమతి చేస్తున్నా. ప్రస్తుతం 600 మంది రెగ్యులర్ వినియోగదారులు ఉన్నారు. యువతకూ ఉత్పత్తుల తయారీలో శిక్షణ ఇవ్వాలని నిర్ణయించుకున్నాను. నా అనుభవాలు వారికి మార్గదర్శకంగా ఉంటాయని భావిస్తున్నాను. -
దేవుని ప్రణాళికలను నెరవేర్చడమే ఆశీర్వాదం
సూర్యుని చూడలేకపోయినా, సూర్యుని ‘నీడ’ లో సేదదీరగలం. అలాగే దేవుణ్ణి ప్రత్యక్షంగా చూడకున్నా, దేవుని నీడను, కృపను, ముఖ్యంగా ఆయన అదృశ్యహస్తపు మహాశక్తిని ఎస్తేరు తన జీవితంలో అడుగడుగునా అనుభవించింది. ఎస్తేరు ఒక సాధారణ యువతి, బబులోనులో యూదుబానిస, తనవాళ్లంటూ లేక మొర్దేకై అనే బంధువు వద్ద ఆశ్రయం పొందిన అనాథ. కాకపోతే ఎస్తేరు పుష్కలంగా దైవభయమున్న అసమానమైన సౌందర్యవతి. బబులోను మహారాణి వష్తి పదవీచ్యుతురాలైనపుడు, వందలాదిమంది లో అనామకురాలైన ఎస్తేరు ఆ పదవికి ఎంపికై, బబులోను సామ్రాజ్యానికి మహారాణి కావడం వెనుక దేవుని అదృశ్య హస్తం స్పష్టంగా కనిపిస్తుంది. తాను మహారాణినయ్యానంటూ ఆమె ఎప్పుడూ విర్రవీగలేదు. కాని, బైబిల్ భాషలో చెప్పాలంటే, తగిన సమయంలో దేవుడు తనను హెచ్చిస్తాడన్న విశ్వాసంతో బలిష్టమైన ఆయన చేతికింద దీనమనసుతో, దైవభయంతో ఆమె జీవించింది(1పేతురు 4:6). అయితే తల్లిగర్భంలో ఆకృతిని కూడా పొందక మునుపే ఎస్తేరు పట్ల సంసిద్ధమైన దేవుని అనాది సంకల్పం అమలయ్యే రోజొకటి రానే వచ్చింది. యూదులకు బద్ధశత్రువులైన అమాలేకీయుల అగగు అనే రాజు సంతతికి చెందిన హామాను(1సమూ 15:8) తాను ప్రధానమంత్రి కాగానే, బబులోను సామ్రాజ్యంలోని యూదులందరి ఊచకోతకు ముహూర్తం కూడా నిర్ణయించాడు. ఎస్తేరు పెంపుడు తండ్రి మొర్దేకై ఆ సమాచారాన్ని ఎస్తేరుకు చేరవేసి, చక్రవర్తిని కలిసి ఆ తాకీదును రద్దుచేయించమన్నాడు. ఎస్తేరు యూదురాలన్న విషయం అత్యంత రహస్యం. అందువల్ల ఇపుడా విషయం తెలిస్తే చక్రవర్తి అహేష్వేరోషు ఆమెకు మరణదండన విధించవచ్చు. పైగా ఆహ్వానం లేకుండా చక్రవర్తి సన్నిధికి వెళ్లిన వారికి, ఆయన ప్రసన్నుడైతే తప్ప, విధిగా మరణ దండన విధించాలన్న చట్టం ఉంది. సమస్య ఒక మహాపర్వతం లాగా ఎదురైతే, ఎంత భక్తి ఉన్నా ప్రాణభయానిదే పై చెయ్యి అవుతుంది. ఎస్తేరు ప్రాణభయాన్ని వ్యక్తం చేయగా, మొర్దేకై ‘నీవు మౌనం వహిస్తే, దేవుని తన ప్రజలకు మరో విధంగా సహాయం చేస్తాడు. కాని ఈ సమయం కోసమే నిన్నింతగా హెచ్చించిన దేవుని సంకల్పాన్ని నీవు నిర్వీర్యం చేస్తున్నావేమో చూసుకో!!’ అంటూ సరైన సమయంలో, సరైన హెచ్చరిక చేశాడు. ఆ వెంటనే నేను నశిస్తే నశిస్తాను, కాని దేవుని ప్రజల్ని కాపాడుతానని ఎస్తేరు తీర్మానించుకొని, తన కోసం ప్రార్ధించమంటూ మొర్దేకైని, తన యూదుప్రజలను వేడుకొంది. వాళ్ళ ప్రార్ధనా బలంతో, కొండంత విశ్వాసంతో ఎస్తేరు చక్రవర్తి సన్నిధికి వెళ్లగా, ఆయన ప్రసన్నుడై ఆమె కోరినట్టే తాకీదును రద్దు చేసి, యూదుల్ని సంహరించాలనుకున్న హామానును, అతని కుటుంబాన్నంతటినీ నాశనం చేశాడు. అలా ఎస్తేరు తన ప్రాణాలకు తెగించి, తన వాళ్ళైన వేలాది మంది ప్రాణాలు కాపాడింది. దీనంతటిలో ఎస్తేరుది ప్రత్యక్షపాత్ర కాగా, మొర్దేకైది పరోక్షమైనదైనా అత్యంత ప్రధానమైన పాత్ర. ఒకానొక కీలకమైన దశలో, ఎస్తేరును దేవుని ఆలోచనతో అనుసంధానం చేసి, ఆమెను కార్యోన్ముఖురాలిని చేశాడతను. ఈ మొర్దేకై పాత్రను విశ్వాసుల కుటుంబాల్లో తల్లిదండ్రులు, చర్చిల్లో పాస్టర్లు నిర్వహించాలి. ఒకప్పుడు తల్లిదండ్రులకు పిల్లలు భయపడేవాళ్లు. ఇపుడు తల్లిదండ్రులే పిల్లలకు భయపడే ఆధునిక విష సంస్కృతి వ్యాపిస్తోంది. పిల్లలకు ‘ఇది తప్పు’ అని తల్లిదండ్రులు చెప్పడమే తప్పైపోయిన ‘భ్రష్ట యుగం’ మనది. ఇప్పటి పాస్టర్లు బైబిల్లో మర్మాలు, కొత్త కొత్త విషయాలు గొప్పగా చెబుతారు. కాని ‘తప్పును తప్పు’ అని ధైర్యంగా చెప్పే పరిస్థితే లేదు.‘కరెక్షన్’ అంటే ‘దిద్దుబాటు’ లేని కుటుంబాలు, చర్చీలే సమాజాన్ని ఛిద్రం చేస్తాయి. పూర్వం నిరక్షరాస్యులైన తల్లిదండ్రులు తమ కుటుంబాల్ని ఎంతో గొప్పగా నిర్మించుకొని పిల్లల్ని ప్రయోజకుల్ని చేస్తే, ఎంతో చదువున్న నేటి తరం తల్లిదండ్రులు పిల్లల్ని ప్రయోజకుల్ని చెయ్యలేక గాలికొదిలేస్తున్నారు. ‘నేనొక పల్లెటూరివాణ్ణి, నాది నిరక్షరాస్య నేపథ్యం’ అంటూ డప్పు కొట్టుకోవడం కాదు, ఈ నాటి ఉన్నతస్థితిలో దేవునికి, నీ వాళ్లకు ఏం చేశావన్న ప్రశ్నకు జవాబుందా? ఇళ్లలో, చర్చిల్లో ఎస్తేరులు, మొర్దేకైలు లేక విశ్వాసులు, వాళ్ళ పిల్లల జీవితాల్లో దేవుని ప్రణాళికలు నెరవేరకపోతే, అదొక మహా సంక్షోభం. – రెవ.డా.టి.ఎ.ప్రభుకిరణ్ -
రాజమౌళి శిష్యుడి నయనం
ప్రముఖ దర్శకుడు రాజమౌళి వద్ద ‘ఈగ, మర్యాద రామన్న, మగధీర’ చిత్రాలకు అసిస్టెంట్గా పనిచేసిన క్రాంతికుమార్ వడ్లమూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘నయనం’. ఎస్తేర్, నోయల్, శ్రీ మంగం, అర్జున్ ఆనంద్ ప్రధాన పాత్రల్లో రామ్ కేతు, కృష్ణమోహన్, శ్రీరామ్ కందుకూరి, నరేన్ లేబాకు నిర్మించిన ఈ సినిమా టైటిల్ లోగోని నిర్మాత రాజ్ కందుకూరి విడుదల చేశారు. ‘‘సస్పెన్స్, థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కించిన చిత్రమిది. టైటిల్కి మంచి రెస్పాన్స్ వస్తోంది’’ అన్నారు క్రాంతికుమార్. నిర్మాతల్లో ఒకరైన శ్రీరామ్ కందుకూరి మాట్లాడుతూ– ‘‘దీపావళికి టీజర్ను, నవంబర్లో సినిమా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. -
సవాల్లాంటి పాత్ర
నోయల్, ఎస్తేర్, శ్రీ, అర్జున్ మీనన్ ప్రధాన పాత్రల్లో సస్పెన్స్ థ్రిల్లర్ కథాంశంతో ఓ నూతన చిత్రం తెరకెక్కుతోంది. క్రాంతి వడ్లమూడి దర్శకత్వంలో లావోస్ మోషన్ పిక్చర్స్ పతాకంపై కృష్ణమోహన్, నరేన్, శ్రీరామ్ కందుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రం తొలి షెడ్యూల్ పూర్తి చేసుకుంది. హీరో శ్రీ బర్త్ డేని షెడ్యూల్ చివరి రోజున యూనిట్ సభ్యులు నిర్వహించారు. ‘‘త్వరలో రెండో షెడ్యూల్ ప్రారంభిస్తాం’’ అని నిర్మాతలు అన్నారు. ‘‘ క్రాంతి నా కోసం ఈ చిత్రంలో సవాల్ అనిపించే పాత్ర డిజైన్ చేశారు. ఈ పాత్రలో నన్ను కొత్తగా ఆవిష్కరిస్తు న్నారు’’ అని శ్రీ చెప్పారు. ఈ చిత్రానికి కెమెరా: చేతన్ మధురాంతకం, సంగీతం: గీతా పూనిక్. -
గోవధకిస్తున్న ప్రాధాన్యత మహిళలకివ్వడం లేదు
-
జల్సా చేద్దాం!
‘‘టైటిల్కి తగ్గట్టుగానే ఇందులో నాది జల్సారాయుడిలాంటి పాత్ర. ప్రతిక్షణం జల్సా చేద్దానుకునే మనస్తత్వం నాది. దర్శకుడు చెప్పిన కథ నాకు విపరీతంగా నచ్చింది. కథాకథనాలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి’’ అని శ్రీకాంత్ చెప్పారు. శ్రీకాంత్, ఎస్తేర్, ప్రాచి సిన్హా కాంబినేషన్లో సీహెచ్ సుధీర్ రాజు దర్శకత్వంలో కొలన్ వెంకటేశ్ నిర్మిస్తోన్న ‘జల్సారాయుడు’ చిత్రం ఇటీవలే తొలి షెడ్యూలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ -‘‘అక్టోబర్ మొదటివారంలో రెండో షెడ్యూలు మొదలుపెడతాం. ఇందులో శ్రీకాంత్ పాత్ర చాలా కొత్తగా, కలర్ఫుల్గా, జోష్గా ఉంటుంది’’ అని తెలిపారు. ఇందులో ప్రతి ఫ్రేమ్ కలర్ఫుల్గా ఉంటుందని, చక్రి సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని దర్శకుడు చెప్పారు. ఈ చిత్రానికి మాటలు: విక్రమ్రాజ్, కెమెరా: కె. బుజ్జి. -
నిర్మాతల్ని ఆకట్టుకుంటున్న ఎస్తేర్
-
సిక్కోల్లో భీమవరం బుల్లోడు సందడి
శ్రీకాకుళం కల్చరల్ : ‘భీమవరంబుల్లోడు’ సినిమా యూనిట్ సోమవారం శ్రీకాకుళం పట్టణంలోని కిన్నెర హాల్లో సందడి చేసింది. సినీ ప్రేక్షకులను అలరించింది. సినిమాల్లోని కొన్ని డైలాగ్లు చెబుతూ, పాటలకు డ్యాన్స్ చేస్తూ హీరో, హీరోరుున్లు సునీల్, ఎస్తేరులు ఉర్రూతులూగించారు. అనంతరం సునీల్ మాట్లాడుతూ సినిమాను ఆదరించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. సినిమాలో పాటలు, కథ ఎలా ఉందని అడిగారు. హీరోయిన్ ఎస్తేరు మాట్లాడుతూ మంచి హిట్ ఇచ్చినందుకు ఎంతో ఆనందంగా ఉందన్నారు. మ్యూజిక్ డెరైక్టర్ అనూప్ రూబెన్స్ పలు గీతాలను ఆలపించారు. వీరితో పాటుగా నటులు సత్యం రాజేష్, పృధ్విరాజ్, థియోటర్ మేనేజర్ వరప్రసాద్లు పాల్గొన్నారు. తెలుగు ‘గోవిందా’ కావాలనుంది హిందీ హీరో గోవిందా వలే తెలుగు గోవింద కావాలని ఉందని భీమవరం బుల్లోడు హీరో సినీల్ అన్నారు. స్థానిక కిన్నెర థియేటర్లో నిర్వహించిన సక్సెస్ మీట్లో విలేకరులతో కాసేపు ముచ్చటించారు. హిందీలో గోవిందా ఇటు కమెడియన్గా, అటు హీరోగా చేసిన సక్సెస్ చూసిన తరువాత ఈ కోరిక కలిగిందన్నారు. తడాఖాలాంటి సినిమాలో నటించే అవకాశం వస్తే తప్పక నటిస్తానన్నారు. హీరోగా అయితే డైటింగ్ చేసి స్లిమ్స్గా ఉండేందుకు ప్రయత్నించాలన్నారు. హీరో ఛాన్సుకన్నా కమెడియన్గా చేయడం చాలా ఇష్టమన్నారు. ఇక్కడి ప్రేక్షకుల ఆదరణ చాలా బాగుందన్నారు. కవి దూర్జటి రచించిన ‘భక్త కన్నప్ప’ సినిమాలో నటిస్తున్నానని తెలిపారు. అలాగే, నల్లమల బుజ్జి, మోహన్లు నిర్మిస్తున్న మరో రెండు సినిమాల్లో నటిస్తున్నట్టు వెల్లడించారు. సేవా కార్యక్రమాలు చేయడమంటే చాలా ఇష్టమన్నారు. అందు లో చుదువుకోసం సహాయం చేసేం దుకు ఎప్పుడూ ముందుంటానన్నా రు. రాజకీయాలంటే ఇష్టంలేదన్నా రు. ఈ సినిమాకు మాటల రచయిత అయిన సీపాన సురేష్ మీజిల్లా వాడేనని తెలిపారు. అందుకే విజయోత్సవాన్ని ఇక్కడి నుంచి ప్రారంభించామన్నారు. హిందీ సినిమాలో అవకాశం వస్తే నటిస్తానని, కానీ తెలుగు సినీ పరిశ్రమను విడిచిపెట్టనన్నారు. శ్రీధర్కు సత్కారం భీమవరం బుల్లోడు సినిమా మాటల రచయిత జిల్లాకు చెందిన సీపాన శ్రీధర్ను స్నేహితులు శంకర తరఫున హీరో సునీల్ దుశ్శాలువతో, దండతో సత్కరించారు. ఈ సందర్భంగా శ్రీధర్ మాట్లాడుతూ తన స్వగ్రామం టెక్కలి అన్నారు. తల్లిదండ్రులు రమణమ్మ, సత్యనారాయణ ఆశీస్సులతో సినిమా ఇండస్ట్రీకి వెళ్లానన్నారు. తను బీఈ చదివానని, సినిమా హిట్ కావడం చాలా ఆనందంగా ఉందన్నారు. -
భీమవరం బుల్లోడు