Top Stories
ప్రధాన వార్తలు
![AP Govt U Turn On Thalliki vandanam Scheme](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/12/chandrababu4.jpg.webp?itok=XEMuTtVY)
‘తల్లికి వందనం’పై కొత్త డ్రామా.. కూటమి సర్కార్ యూ టర్న్!
సాక్షి, విజయవాడ: ఏపీలో తల్లికి వందనం పథకంపై కూటమి సర్కార్ మరో డ్రామాకు తెర లేపింది. ‘సాక్షి’ దెబ్బకు జీవో-29పై విద్యాశాఖ కార్యదర్శి తాజాగా మరో ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా జీవో-29 కేవలం ఆధార్ కోసమేనంటూ ప్రకటనలో తెలిపింది.ఇక, తాజా ప్రకటనలోనూ ప్రతీ విద్యార్థికి రూ.15వేలు ఇస్తామని విద్యాశాఖ చెప్పకపోవడం గమనార్హం. అయితే, ప్రజల్లో కూటమి సర్కార్ తీరుపై విమర్శలు రావడంతోనే విద్యాశాఖ యూటర్న్ తీసుకున్నట్టు సమాచారం. నేడు.. జీవో-29లో తాజాగా తల్లికి వందనం, స్కూల్ కిట్ పథకాల నిబంధనలను విద్యాశాఖ కార్యదర్శి పేర్కొన్నారు.ఈ నిబంధనల్లో తల్లికి ఏడాదికి రూ.15వేలు మాత్రమే ఇస్తామని జీవోలో ప్రభుత్వం పేర్కొంది. కానీ, విద్యాశాఖ మాత్రం తల్లికి వందనం జీవో ఇవ్వలేదని చెప్పడం విశేషం. కాగా, తాజాగా వివరణ సందర్భంగా కూడా పిల్లలందరికీ రూ.15వేలు ఇస్తామని చెప్పలేదు. ఇదిలా ఉండగా.. జీవో-29 తల్లికి వందనం జీవో అని నిన్న(గురవారం) టీడీపీ అంగీకరించిన విషయం తెలిసిందే. ఇదే సమయంలో టీడీపీ ఓవరాక్షన్ కూడా చేసింది. ఇంగ్లీష్ చదవడం నేర్చుకోండని టీడీపీ అధికారిక ట్విట్టర్ ఖాతాల్లో పోస్టు చేసింది. ఇప్పుడు అదే పోస్టును సోషల్ మీడియా నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.
![Ponnavolu Strongly Condemns Raghu Rama Case Against YS Jagan](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/12/Ponnavolu-Sudhakar-Reddy.jpg.webp?itok=8oae2bho)
జగన్పై ద్వేషంతోనే ఈ తప్పుడు కేసు: పొన్నవోలు
గుంటూరు,సాక్షి: మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఒక ప్లాన్ ప్రకారమే తప్పుడు కేసు నమోదు చేశారని, దీని వెనుక పెద్ద కుట్రే ఉందని మాజీ అడిషనల్ అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ మండిపడ్డారు. రఘురామ రాజు ఆరోపణలపై, కేసును పోలీసులు స్వీకరించిన పరిణామాలపై పొన్నవోలు శుక్రవారం సాయంత్రం తాడేపల్లిలో మీడియాతో మాట్లాడారు.‘‘మాజీ సీఎం వైఎస్ జగన్ తోపాటు మరికొందరు అధికారులపై టీడీపీ ప్రభుత్వం తప్పుడు కేసులు పెట్టింది. కేవలం దురుద్దేశంతో, రాజకీయ కక్షతోనే ఈ కేసు పెట్టారు. వ్యక్తిగత ద్వేషంతోనే రఘురామ కృష్ణంరాజు ఈ పని చేశారు. అరెస్ట్ చేశాక తనని కస్టడీలో వేధించినట్లు ఆయన ఫిర్యాదు చేశారు. కానీ, అయన్ని అరెస్టు చేసిన విషయంలో ఎలాంటి తప్పు జరగలేదు. తనపై మాస్క్ పెట్టుకున్న గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేసినట్టు రఘురామ మెజిస్ట్రేట్కు ఇచ్చిన వాంగ్మూలంలో స్వయంగా చెప్పారు. ఇప్పుడేమో కేసులో ఏకంగా మాజీ సీఎం జగన్ పేరు రాశారు. కేవలం జగన్ పై రఘరామ ద్వేషం పెంచుకుని మూడేళ్ల తర్వాత ఈ కేసు పెట్టారు. అధికారులు పీవీ సునీల్, సీతారాంజనేయులు తనపై దాడి చేస్తే అప్పట్లోనే కోర్టులో ఎందుకు చెప్పలేదు?. .. డాక్టర్లు కూడా రఘురామ ఒంటిపై కొట్డిన గాయాలు లేవని చెప్పారు. అయినాసరే అత్యంత దారుణంగా ఇప్పుడు తప్పుడు కేసు పెట్టారు. రఘురామ జూన్ 11వ తేదీన ఫిర్యాదు చేస్తే.. 10వ తేదీనే పోలీసులు ఎలా లీగల్ ఒపీనియన్ కి రాశారు?. ఒక ప్లాన్ ప్రకారం తప్పుడు కేసు నమోదు చేయటానికి చేసిన కుట్ర అనటానికి ఇంకేం నిదర్శనం కావాలి? అని పొన్నవోలు అన్నారు. పైగా.. ఒక కేసులో 77 రోజుల తర్వాత ఇచ్చిన సాక్ష్యాన్నే చెల్లదని సుప్రీంకోర్టు చెప్పిందని, మరి మూడేళ్ల తర్వాత రఘురామ కేసులో జగన్, ఇతర అధికారులపై ఎలా కేసు నమోదు చేస్తారు? అని పొన్నవోలు నిలదీశారు. రాష్ట్రంలో అత్యంత దారుణంగా హత్యలు జరిగినా పోలీసులు కేసు నమోదు చేయని పరిస్థితి చూస్తున్నాం అని ఆవేదన వ్యక్తం చేశారాయన.ఎవర్నో ఇబ్బందులు పెట్టాలన్న కక్ష్యతోనే ఇలాంటి తప్పుడు కేసు పెట్టారని, ఇలాంటి తప్పుడు ఒరవడినే అవలంభిస్తే రాబోయే రోజుల్లో కర్మ ఫలితం అనుభవించాల్సి వస్తుందని అన్నారాయన. ‘‘రెడ్ బుక్ రాసుకుని అధికారాన్ని విచ్ఛిన్నం చేయాలని చూడవద్దు. అదే జరిగితే అధికారులు ఎవరూ సరిగా ఉద్యోగం చేయలేరు. కాబట్టి ఇలాంటి తప్పుడు కేసులు మానుకోవాలి అని పొన్నవోలు హితవు పలికారు.
![Emergency Day June 25 To Be Observed As Samvidhaan Hatya Diwas](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/12/Emergency_Day_June25.jpg.webp?itok=dGq0gdfY)
జూన్ 25 సంవిధాన్ హత్యా దివస్.. కేంద్రం సంచలన ప్రకటన
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ప్రతి ఏడాది జూన్ 25వ తేదీని సంవిధాన్ హత్యా దివస్(రాజ్యాంగాన్ని హత్య చేసిన రోజు)గా జరపాలని నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా తన ఎక్స్ ద్వారా ప్రకటన చేశారు.1975లో ఆ తేదీన అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీ విధించారు. ఆ రోజులకు నిరసనగా ఇక నుంచి సంవిధాన్ హత్యా దివస్ నిర్వహించాలని బీజేపీ నేతృత్వంలోని కేంద్రం నిర్ణయించింది. రాజ్యాంగాన్ని లెక్క చేయకుండా ప్రజల్ని వేధించినందుకు ఈ పేరుతో దినోత్సవం జరుపుతామని అమిత్ షా తెలిపారు. ఎమర్జెన్సీలో కష్టాల పాలైన వారిని స్మరించుకునే విధంగా సంవిధాన్ హత్య దివస్ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.25 जून 1975 को तत्कालीन प्रधानमंत्री इंदिरा गाँधी ने अपनी तानाशाही मानसिकता को दर्शाते हुए देश में आपातकाल लगाकर भारतीय लोकतंत्र की आत्मा का गला घोंट दिया था। लाखों लोगों को अकारण जेल में डाल दिया गया और मीडिया की आवाज को दबा दिया गया। भारत सरकार ने हर साल 25 जून को 'संविधान… pic.twitter.com/KQ9wpIfUTg— Amit Shah (@AmitShah) July 12, 2024‘‘1975 జూన్ 25న అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ తన నియంతృత్వ పాలనతో దేశంలో అత్యయిక స్థితి విధించి ప్రజాస్వామ్యం గొంతు నులిమేశారు. ఎలాంటి కారణం లేకుండా లక్షలాది మందిని జైల్లో పెట్టారు. మీడియా గళాన్ని అణగదొక్కారు. ఆ చీకటి రోజులకు నిరసనగా ఇక నుంచి ఏటా జూన్ 25ను ‘సంవిధాన్ హత్య దివస్’గా నిర్వహించాలని నిర్ణయించాం. ఎమర్జెన్సీ సమయంలో ప్రజలు అనుభవించిన వేదనను, దాన్ని ఎదిరించి నిలబడిన యోధులను ఆ రోజున గుర్తుచేసుకుందాం’’ అని ఎక్స్ ఖాతాలో సందేశం ఉంచారాయన. సంవిధాన్ హత్యా దివస్పై మోదీ స్పందనఎమర్జెన్సీ నిరసన దినోత్సవ ప్రకటనపై ప్రధాని మోదీ స్పందించారు. ‘‘నాటి ప్రభుత్వం రాజ్యాంగాన్ని అణగదొక్కి ఎలాంటి పాలన సాగించిందో ఈ సంవిధాన్ హత్య దివస్ మనకు గుర్తుచేస్తుంది. దేశ చరిత్రలో కాంగ్రెస్ రాసిన చీకటి దశ కారణంగా నష్టపోయిన ప్రతి ఒక్కరినీ స్మరించుకునే రోజు అది’’ అని ప్రధాని పేర్కొన్నారు. 25 जून को #SamvidhaanHatyaDiwas देशवासियों को याद दिलाएगा कि संविधान के कुचले जाने के बाद देश को कैसे-कैसे हालात से गुजरना पड़ा था। यह दिन उन सभी लोगों को नमन करने का भी है, जिन्होंने आपातकाल की घोर पीड़ा झेली। देश कांग्रेस के इस दमनकारी कदम को भारतीय इतिहास के काले अध्याय के रूप… https://t.co/mzQFdQOxZW— Narendra Modi (@narendramodi) July 12, 2024విమర్శలకు తావిచ్చిన చీకటి రోజులు రాష్ట్రపతి దేశవ్యాప్త ఎమర్జెన్సీని విధిస్తున్నట్లు 1975 జూన్ 25వ తేదీ అర్ధరాత్రి ఆనాటి ప్రధాని ఇందిరాగాంధీ ఆకాశవాణి ద్వారా ప్రకటించారు. రాయ్బరేలీ నుంచి లోక్సభకు ఆమె ఎన్నిక చెల్లదని అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై షరతులతో కూడిన స్టే ఉత్తర్వును సుప్రీంకోర్టు వెలువరించిన కాసేపటికే ఇందిర ఈ నిర్ణయం తీసుకున్నారు. అది సంచలనాత్మకం కావడంతోపాటు రాజకీయంగా ఇప్పటికీ తీవ్ర విమర్శలకు తావిస్తున్న విషయం తెలిసిందే. పత్రికాస్వేచ్ఛపై కోత సహా అనేక రకాలుగా ఆంక్షలకు కారణమైన ఎమర్జెన్సీని ముగిస్తూ.. ఎన్నికలు నిర్వహించబోతున్నట్లు 1977 జనవరి 18న ఇందిర ప్రకటించారు. ఆ ఏడాది మార్చి 16 నుంచి 20 వరకు ఎన్నికలు నిర్వహించి, 21న ఎమర్జెన్సీని ఎత్తివేశారు.
![Puja Khedkar May Face Sacking And Also Face Criminal Charges](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/12/pooja-khedkar-iSSUE.jpg.webp?itok=__WiKPJJ)
పూజా ఖేద్కర్పై మరొకటి! ఆరోపణలు నిజమని తేలితే..
ముంబై: వివాదాస్పద ట్రెయినీ ఐఏఎస్ పూజా ఖేద్కర్ కెరియర్ చిక్కుల్లో పడింది. అధికార దుర్వినియోగానికి పాల్పడటంతోపాటు, యూపీఎస్సీకి తప్పుడు అఫిడవిట్ సమర్పించారన్న ఆరోపణలు రావడంతో కేంద్రం ఏకసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. అయితే ఆ ఆరోపణలు నిజమని తేలితే పూజా ఖేద్కర్ను సర్వీసు నుంచి తొలగించే అవకాశం ఉంది.డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ అదనపు కార్యదర్శి మనోజ్ ద్వివేదీ ఇప్పటికే దర్యాప్తు ప్రారంభించారు. రెండు వారాల్లో ఆయన ఆమె వ్యవహారంపై ఓ నివేదిక ఇవ్వనున్నారు. ఒకవేళ ఆ దర్యాప్తులో ఆరోపణలు నిజమని తేలితే పూజా ఖేద్కర్ను సర్వీసు నుంచి తొలగించే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. అంతేకాకుండా నిజాలు దాచిపెట్టి, తప్పుడు మార్గంలో ఉద్యోగంలో చేరినందుకు ఆమెపై క్రిమినల్ చర్యలు కూడా తీసుకోవచ్చని తెలిపాయి. మరోవైపు.. తాజాగా ఆమెపై మరో ఆరోపణ వెలుగులోకి వచ్చింది. తన విచారణలో మనోజ్ ద్వివేదీ, నవీ ముంబై పోలీసుల నుంచి ఓ నివేదిక తీసుకున్నారు. ఓ దొంగతనం కేసులో నిందితుడ్ని విడిచిపెట్టాలంటూ ఆమె పోలీసులకు హుకుం జారీ చేశారామె. మే 18వ తేదీన నవీ ముంబై డీసీపీకి ఫోన్ చేసిన ఖేద్కర్.. తాను ఫలానా అని పరిచయం చేసుకున్నారు. ఇనుప సామాన్లు దొంగిలించిన కేసులో పోలీసుల అదుపులో ఉన్న వ్యక్తిని విడుదల చేయాలని ఆమె ఆదేశాలు జారీ చేశారు. ఆ నిందితుడు అమాయకుడని, పైగా అతనిపై ఆరోపణలు తీవ్ర స్థాయివేం కాదని ఆమె ఫోన్లో చెప్పారు. అయినప్పటికీ ఆ పోలీసులు ఆ కాల్ను పట్టించుకోలేదు. అయితే ఆ ఫోన్ కాల్ పూజా ఖేద్కర్ నుంచే వచ్చిందా? లేదంటే ఆమె పేరుతో ఎవరైనా అలా చేశారా? అనేది ద్వివేదీ కమిటీ నిర్ధారించుకోవాల్సి ఉంది. ఇదిలా ఉంటే..పుణేలో సహాయ కలెక్టర్గా విధులు నిర్వర్తిస్తున్న ఖేద్కర్పై ఆరోపణలు రావడంతో ఆమెను వాసిమ్కు బదిలీ చేసిన సంగతి తెలిసిందే. తన ప్రైవేటు ఆడీ కారుకు సైరన్, మహారాష్ట్ర ప్రభుత్వ స్టిక్కర్, వీఐపీ నంబర్ ప్లేట్లను అనుమతి లేకుండా వాడటంతో మొదలైన వివాదం.. తీగ లాగితే డొంక కదిలినట్లుగా ట్రాఫిక్ ఉల్లంఘనలు, సెటిల్మెంట్లు, ఇతర అధికారులపై ఒత్తిడి చేయడం ఇలా ఒక్కొక్కటీ బయటపడ్డాయి. చివరికి ఆమె యూపీఎస్సీ అభ్యర్థిత్వంపైనా అనుమానాలు రేకెత్తాయి. తనకు కంటితో పాటు మానసిక సమస్యలు ఉన్నట్లు యూపీఎస్సీకి సమర్పించిన అఫిడవిట్లో ఖేద్కర్ పేర్కొన్నారు. 2022 ఏప్రిల్లో తొలిసారి దిల్లీలోని ఎయిమ్స్లో వైద్య పరీక్షలకు పిలువగా ఆమె కొవిడ్ సాకుగా చూపించి వెళ్లలేదు. ఆ తర్వాత కూడా కొన్ని నెలలపాటు వైద్య పరీక్షలకు హాజరుకాలేదు. చివరికి ఆరోసారి పిలుపురాగా.. పాక్షికంగా పరీక్షలు చేయించుకున్నారు. దృష్టి లోపాన్ని అంచనా వేసే కీలకమైన ఎమ్మారై పరీక్షకు ఆమె హాజరు కాలేదు. కానీ, ఆమె సివిల్ సర్వీసెస్ అపాయింట్మెంట్ ఏదోరకంగా పూర్తయింది. ఆ తర్వాత కమిషన్ ఆమె ఎంపికను ట్రైబ్యూనల్లో సవాలు చేసింది. 2023 ఫిబ్రవరిలో ఆమెకు వ్యతిరేకంగా తీర్పు వచ్చింది. అయినా.. తన నియామకాన్ని కన్ఫర్మ్ చేసుకుంది. ఇక పూజా ఓబీసీ ధ్రువీకరణ పత్రాలపైనా వివాదాలున్నాయి. దాని ఆధారంగానే ఆమెకు 841వ ర్యాంక్ వచ్చినా ఐఏఎస్ హోదాను పొందగలిగింది. ఈ నేపథ్యంలో కేంద్రం ఏర్పాటుచేసిన దర్యాప్తు కమిటీ నివేదిక కీలకంగా మారింది. ఆ నివేదికను బట్టే ఖేద్కర్పై చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
![ENG VS WI 1st Test: Jimmy Anderson Says Goodbye To Test Cricket After 21 Years Of Long Dominance](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/12/and.jpg.webp?itok=Df_K07yC)
21 ఏళ్ల సుదీర్ఘ కెరీర్కు ఘనంగా వీడ్కోలు పలికిన ఆండర్సన్
దిగ్గజ ఫాస్ట్ బౌలర్, ఇంగ్లండ్ ప్లేయర్ జిమ్మీ ఆండర్సన్ 21 ఏళ్ల సుదీర్ఘ టెస్ట్ కెరీర్కు ఘనంగా వీడ్కోలు పలికాడు. వెస్టిండీస్తో ఇవాళ (జులై 12) ముగిసిన టెస్ట్ మ్యాచ్ ఆండర్సన్ కెరీర్లో చివరిది. తన చివరి మ్యాచ్ను జిమ్మీ గెలుపుతో ముగించాడు. ఈ మ్యాచ్లో అతను నాలుగు వికెట్లు తీసి ఇంగ్లండ్ విజయంలో కీలకపాత్ర పోషించాడు.JIMMY ANDERSON FINAL MOMENTS ON THE FIELD IN INTERNATIONAL CRICKET. 🫡🌟pic.twitter.com/24uSZqeBOK— Mufaddal Vohra (@mufaddal_vohra) July 12, 2024ఆండర్సన్.. మైదానంలో తన చివరి క్షణాల్లో చాలా ఎమోషనల్ అయ్యాడు. సహచరులు అతన్ని ఘనంగా పెవిలియన్కు సాగనంపారు. లార్డ్స్ స్టేడియం మొత్తం లేచి నిలబడి ఆండర్సన్ను చప్పట్లతో అభినందించింది. ఈ మ్యాచ్ చూసేందుకు వచ్చిన ఆండర్సన్ భార్య, సంతానం కూడా తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ఆండర్సన్ చివరి వికెట్ జాషువ డసిల్వ.THE FINAL WALK OF JIMMY ANDERSON IN INTERNATIONAL CRICKET. 🥹pic.twitter.com/N2GFFDgYYT— Mufaddal Vohra (@mufaddal_vohra) July 12, 202441 ఏళ్ల ఆండర్సన్ తన టెస్ట్ కెరీర్లో 188 మ్యాచ్లు ఆడి 26.45 సగటున 704 వికెట్లు పడగొట్టాడు. 2003లో టెస్ట్ కెరీర్ ప్రారంభించిన ఆండర్సన్ ఆంతకుముందు ఏడాదే వన్డేల్లో అరంగేట్రం చేశాడు. వన్డేల్లో జిమ్మీ 194 మ్యాచ్లు ఆడి 269 వికెట్లు పడగొట్టాడు. ఆండర్సన్ ఇంగ్లండ్ తరఫున టీ20లు కూడా ఆడాడు. పొట్టి ఫార్మాట్లో కేవలం 19 మ్యాచ్లు ఆడిన జిమ్మీ 18 వికెట్లు పడగొట్టాడు. The final Test wicket of Jimmy Anderson.21 Years. 704 Wickets. Legend. 🫡pic.twitter.com/3iK85SYxBO— Mufaddal Vohra (@mufaddal_vohra) July 12, 2024సుదీర్ఘ కెరీర్ లెక్కలేనన్ని మైలురాళ్లను అధిగమించిన ఆండర్సన్ క్రికెట్ చరిత్రలోనే అత్యుత్తమ ఫాస్ట్ బౌలర్గా కీర్తించబడతాడు. టెస్ట్ల్లో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాళ్ల జాబితాలో ఆండర్సన్ మూడో స్థానంలో ఉన్నాడు. మురళీథరన్ (800), షేన్ వార్న్ (708) మాత్రమే ఆండర్సన్ కంటే ఎక్కువ టెస్ట్ వికెట్లు పడగొట్టారు. మూడు ఫార్మాట్లలో చూసినా మురళీథరన్ (1347), షేన్ వార్నే (1001) మాత్రమే ఆండర్సన్ (987) కంటే ఎక్కువ వికెట్లు పడగొట్టారు. దిగ్గజ బౌలర్ రిటైర్మెంట్ సందర్భంగా యావత్ క్రికెట్ ప్రపంచం అభినందనలు తెలుపుతుంది.A lovely tribute video by England Cricket for Jimmy Anderson. 🐐❤️pic.twitter.com/AAHXj4zTJx— Mufaddal Vohra (@mufaddal_vohra) July 12, 2024మ్యాచ్ విషయానికొస్తే.. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా లార్డ్స్ వేదికగా వెస్టిండీస్తో జరిగిన తొలి మ్యాచ్లో ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 114 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ అరంగేట్రం పేసర్ గస్ అట్కిన్సన్ ఆకాశమే హద్దుగా చెలరేగి 12 వికెట్లు పడగొట్టాడు. తొలి ఇన్నింగ్స్లో ఏడు వికెట్లు తీసిన అట్కిన్సన్.. రెండో ఇన్నింగ్స్లో ఐదు వికెట్లతో విజృంభించాడు. అట్కిన్సన్ ధాటికి వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్లో 121 పరుగులకు.. రెండో ఇన్నింగ్స్లో 136 పరుగులకు కుప్పకూలింది.GUARD OF HONOUR FOR JIMMY ANDERSON. 🐐- The greatest ever of England cricket!pic.twitter.com/5ks2Iz8oEy— Mufaddal Vohra (@mufaddal_vohra) July 12, 2024ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ అట్కిన్సన్ (7/45), ఆండర్సన్ (1/26), క్రిస్ వోక్స్ (1/29), స్టోక్స్ (1/14) ధాటికి 121 పరుగులకే చాపచుట్టేసింది. విండీస్ ఇన్నింగ్స్లో మికైల్ లూయిస్ (27) టాప్ స్కోరర్గా నిలిచాడు.అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ 371 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్లో ఐదుగురు బ్యాటర్లు హాఫ్ సెంచరీలు చేశారు. జాక్ క్రాలే 76, ఓలీ పోప్ 57, జో రూట్ 68, హ్యారీ బ్రూక్ 50, జేమీ స్మిత్ 70 పరుగులు చేశారు. విండీస్ బౌలర్లలో జేడన్ సీల్స్ 4, గుడకేశ్ మోటీ, జేసన్ హోల్డర్ తలో 2, అల్జరీ జోసఫ్ ఓ వికెట్ పడగొట్టారు.LORD'S AND FAMILY OF JIMMY ANDERSON GIVING HIM ONE FINAL STANDING OVATION. 🥹❤️ pic.twitter.com/HD3mG7MYK0— Mufaddal Vohra (@mufaddal_vohra) July 12, 2024250 పరుగులు వెనుకపడి సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన విండీస్ను అట్కిన్సన్ మరోసారి దెబ్బకొట్టాడు. ఈ సారి అతను ఐదు వికెట్ల ప్రదర్శనతో (5/61) విజృంభించడంతో విండీస్ 136 పరుగులకు కుప్పకూలింది. ఇంగ్లండ్ బౌలర్లలో అట్కిన్సన్తో పాటు ఆండర్సన్ (3/32), స్టోక్స్ (2/25) రాణించారు. విండీస్ సెకెండ్ ఇన్నింగ్స్లో మోటీ (31 నాటౌట్) టాప్ స్కోరర్గా నిలిచాడు.
![Anant Ambani Radhika Merchant Wedding: More Dishes For Lavish Wedding](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/12/menu.jpg.webp?itok=x9EzN-Hm)
అనంత్ రాధిక వెడ్డింగ్: మెనూలో ఏకంగా పది లక్షలకు పైగా వెరైటీలు..!
రిలయన్స్ ఇండస్ట్రీస్ దిగ్గజం ముఖేశ్ అంబానీ-నీతాల చిన్న కుమారుడు అనంత్ రాధికాల వివాహం ఇవాళే(జూలై 12న) అంగరంగ వైభవోపేతంగా జరుగుతోంది. ఓ పక్క పెళ్లి కోలాహాలంతో వేడుకులు అంబరాన్ని అంటేలా సాగుతున్నాయి. ఈ వేడుకలో సినీ సెలబ్రెటీలు, ప్రముఖులు, రాజకీయనాయకులు వేలాదిగా తరలి వస్తున్నారు. ఆ ఆతిధులకు అందించే ఆతిథ్య మెనూలో ఎన్ని రకాల వంటకాలు ఉన్నాయంటే..ఈ విలాసవంతమైన పెళ్లి మెనూలో అతిథుల కోసం దాదాపు 10 లక్షలకు పైగా వంటకాలు సిద్ధమవుతున్నాయి. టిక్కీ, వడపావో, టోమాటో చాట్, పాలక్ చాట్, పూరీ, గట్టేకి సబ్జీ, పనీర్ కి సబ్జీ, రైతా, వెజ్ పులావ్, ధోక్లా వంటి వివిధ రాష్ట్రాల వంటకాలు కూడా ఉన్నాయి. ఈ వంటకాల్లో ఇండోర్ ఫేమస్ గరడు చాట్ కూడా మెనూలో భాగం కావడం విశేషం. గరడు చాట్ అంటే..?కర్ర పెండలంతో చేసే ఒక విధమైన చాట్. ఇది ఇండోర్లో బాగా ఫేమస్. అక్కడ ఈ గరడు చాట్ తోపాటు షకర్జంద్ చాట్కు కూడా మంచి డిమాండ్ ఉంది. ఇంతకమునుపు ఇటలీలో క్రూయిజ్లో జరిగిన రెండో ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో 1200 మంది అతిథులు హాజరు కాగా, అప్పటి మెనూలో వివిధ దేశాల రెసీపీలతో సహా మొత్తం 40 వెరైటీలు ఉన్నాయి. ఇక ఇవాళ జరుగుతున్న వివాహ ఈవెంట్లో మరింత గ్రాండ్గా వివాహ మెనూ ఉండొచ్చు.(చదవండి: రిచ్ బ్లూ గ్రీన్ లెహంగాలో ఎవర్ గ్రీన్గా ఉన్న నీతా లుక్..!)
![Gambhir Makes Selection Criteria Clear Right After Replacing Dravid As Head Coach](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/12/123_2.jpg.webp?itok=Tl86j54p)
మూడు ఫార్మాట్లలో ఆడాల్సిందే: గంభీర్ వ్యాఖ్యలు వైరల్
‘‘ఒక ఆటగాడు పూర్తి ఫిట్గా ఉంటే మూడు ఫార్మాట్లు తప్పక ఆడాలని నేను విశ్వసిస్తాను. గాయాల బెడద వెంటాడుతుందనే భయంతో ఆటకు దూరంగా ఉండటం నాకు నచ్చదు.గాయపడితే ఏమవుతుంది? తిరిగి కోలుకుంటారు కదా! అంతర్జాతీయ క్రికెట్ ఆడుతున్న టాప్ క్రికెటర్లలో ఎవరిని అడిగినా మూడు ఫార్మాట్లలో ఆడాలని కోరుకుంటున్నామనే చెబుతారు.రెడ్ బాల్ బౌలర్లు లేదంటే వైట్ బాల్ బౌలర్లు అని ముద్ర వేసుకోవడానికి ఎవరు మాత్రం ఇష్టపడతారు. గాయాలన్నవి ఆటగాళ్ల జీవితంలో భాగం. అంతేగానీ వాటి కారణంగా ఏదో ఒక ఫార్మాట్కే పరిమితం కావడం సరికాదు. ఒకవేళ గాయపడ్డా.. పట్టుదలతో కోలుకుని తిరిగి రావడం పెద్ద కష్టమేమీ కాదు.కొంతమందికి విశ్రాంతినిస్తూ ప్రత్యేకంగా చూడటం పట్ల నాకు సదభిప్రాయం లేదు. గాయాలు, పని ఒత్తిడి అంటూ ఆటకు దూరంగా ఉండకూడదు. నిజానికి ప్రొఫెషనల్ క్రికెటర్ల అంతర్జాతీయ కెరీర్ వ్యవధి చాలా తక్కువ. అలాంటపుడు వీలైనన్ని ఎక్కువ మ్యాచ్లు ఆడాలని భావించాలే గానీ.. తప్పుకోకూడదు.ఏ ఆటగాడైనా ఫామ్లో ఉంటే.. మూడు ఫార్మాట్లలో కచ్చితంగా ఆడేందుకు సిద్ధంగా ఉండాలి. శక్తివంచన లేకుండా కృషి చేస్తూ ముందుకు సాగాలి. నేనైతే క్రికెట్ ఆడటం మొదలుపెట్టిన నాటి నుంచే ఫలితాల గురించి పట్టించుకోవడం మానేశాను.వంద శాతం ఎఫర్ట్ పెడుతున్నామా లేదా అన్నదే ముఖ్యం. విలువలతో, క్రీడాస్ఫూర్తితో ఆడితే అంతా సజావుగానే సాగిపోతుందని నమ్ముతాను. మనం నిజాయితీగా ఉన్నంత కాలం ప్రపంచం మొత్తం మనల్ని వ్యతిరేకించినా ఏమీ కాదు. జట్టు ప్రయోజనాలు మాత్రమే అంతిమ లక్ష్యంగా ఉండాలి.నేను క్రికెట్ మైదానంలో దూకుడుగానే ఉండేవాడిని. ఒక్కోసారి ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లతో వాదనకు దిగాల్సి వచ్చేది. అదంతా కేవలం జట్టు ప్రయోజనాల కోసం మాత్రమే.వ్యక్తిగత విజయాలకు నా దృష్టిలో ప్రాధాన్యం లేదు. జట్టే ముందు.. ఆ తర్వాతే మనం. అలాంటపుడే సమష్టిగా రాణించి గెలుపొందగలం. ఇది జట్టుగా ఆడే ఆట కాబట్టి.. జట్టుకే మొదటి ప్రాధాన్యం ఇవ్వాలి’’ అని టీమిండియా కొత్త హెడ్ కోచ్ గౌతం గంభీర్ అన్నాడు.ఫిట్గా ఉన్న ఆటగాళ్లు కచ్చితంగా టెస్టు, వన్డే, టీ20 ఫార్మాట్లలో ఆడాలని పేర్కొన్నాడు. భారత జట్టు ప్రధాన కోచ్గా నియమితుడయ్యే కంటే ముందు స్టార్ స్పోర్ట్స్ షోలో మాట్లాడుతూ ఈ మేరకు గంభీర్ తన అభిప్రాయాలు పంచుకున్నాడు.తాను కోచ్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత అవలంబించబోయే విధానాల గురించి ముందుగానే ఇలా సంకేతాలు ఇచ్చాడు. కాగా గంభీర్ వ్యాఖ్యల నేపథ్యంలో టీమిండియా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా పరిస్థితిపై అభిమానుల్లో చర్చ జరుగుతోంది.గాయాల భయంతో హార్దిక్ ఎన్నో ఏళ్లుగా టెస్టు ఫార్మాట్కు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. సుదీర్ఘకాలంగా అతడు కేవలం వన్డే, టీ20 మ్యాచ్లు మాత్రమే ఆడుతున్నాడు. మరోవైపు.. గంభీర్ వచ్చే కంటే ముందే కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, రవీంద్ర జడేజా అంతర్జాతీయ టీ20లకు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే.చదవండి: టీమిండియా స్టార్ పేసర్ రీ ఎంట్రీపై సందేహాలు! గౌతీ ప్లాన్?
![Police Have Registered Case Against Ys Jagan](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/12/Ys-Jagan.jpg.webp?itok=idwt0Yh8)
వైఎస్ జగన్పై చంద్రబాబు సర్కార్ కక్ష సాధింపు
సాక్షి, విజయవాడ: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై చంద్రబాబు సర్కార్ కక్ష సాధింపు చర్యలకు దిగింది. రఘురామకృష్ణం రాజు ఫిర్యాదును అడ్డం పెట్టుకుని వైఎస్ జగన్పై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది. పోలీసులు కొట్టారంటూ ఫిర్యాదు చేస్తే.. మాజీ ముఖ్యమంత్రిపై కేసు నమోదు చేశారు. పోలీసులు వైఖరిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.మాజీ సీఎం వైఎస్ జగన్తో పాటు సీఐడీ మాజీ డీజీ సునీల్కుమార్పై కూడా కేసు నమోదైంది. రఘురామ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. కస్టడీలో తనపై హత్యాయత్నం చేశారని రఘురామకృష్ణం రాజు ఫిర్యాదు చేశారు. కేసులో ఏ3గా వైఎస్ జగన్ పేరును పోలీసులు నమోదు చేశారు.ఏ1గా సీఐడీ మాజీ డీజీ సునీల్కుమార్, ఏ2గా ఐపీఎస్ అధికారి సీతారామాంజనేయులు, ఏ4గా విజయ్పాల్, ఏ5గా డాక్టర్ ప్రభావతి పేరును పోలీసులు చేర్చారు. మే 14న జరిగిన ఘటనపై.. నిన్న సాయంత్రం ఈ-మెయిల్ ద్వారా రఘురామకృష్ణ ఫిర్యాదు చేశారు. గతంలో సుప్రీంకోర్టు తిరస్కరించిన కేసుకు సంబంధించి రఘురామ మళ్లీ ఫిర్యాదు చేయడం.. ఆపై కేసు నమోదు చేయించడం ద్వారా.. టీడీపీ ప్రభుత్వం కుట్రలకు తెరలేపుతోంది.వారి విజ్ఞతకే వదిలేస్తున్నా.. సీఐడీ మాజీ డీజీ ట్వీట్తనపై కేసు నమోదు చేయడంపై సీఐడీ మాజీ డీజీ స్పందించారు. సుప్రీంకోర్టు తిరస్కరించిన కేసులో కొత్తగా ఎఫ్ఐఆర్ వేయడాన్ని ఏమనాలో వారి విజ్ఞతకే వదిలేస్తున్నా అంటూ సునీల్ ట్వీట్ చేశారు.సుప్రీం కోర్టులో మూడేళ్ళు నడిచి … సాక్షాత్తూ సుప్రీమ్ కోర్ట్ తిరస్కరించిన కేసులో కొత్తగా FIR వేయడాన్ని ఏమనాలో మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను— PV Sunil Kumar (@PV_Sunil_Kumar) July 12, 2024
![Indian 2: Bharateeyudu 2 Movie Review And Rating In Telugu](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/12/bharateeyudu-23.jpg.webp?itok=yqwLIQ_t)
Indian 2 Review: ‘భారతీయుడు 2’ మూవీ రివ్యూ
టైటిల్: భారతీయుడు 2(ఇండియన్ 2)నటీనటులు: కమల్ హాసన్, ఎస్.జె.సూర్య, ప్రియా భవానీ శంకర్, కాజల్ అగర్వాల్, సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్,సముద్రఖని, బాబీ సింహ, బ్రహ్మానందం తదితరులునిర్మాణ సంస్థ: లైకా ప్రొడక్షన్స్, రెడ్ జెయింట్నిర్మాత: సుభాస్కరన్ కథ, దర్శకత్వం: ఎస్.శంకర్సంగీతం: అనిరుధ్ రవిచందర్ఎడిటింగ్: శ్రీకర్ ప్రసాద్సినిమాటోగ్రఫీ: రవి వర్మన్విడుదల తేది: జులై 12, 2024కమల్ హాసన్ నటించిన బెస్ట్ చిత్రాల్లో ‘భారతీయుడు’ ఒకటి. శంకర్ దర్శకత్వం వహించిన ఈ మూవీ 1996లో విడుదలై బాక్సాఫీస్ని షేక్ చేసింది. దాదాపు 28 ఏళ్ల తర్వాత ఈ సినిమాకి సీక్వెల్గా ‘భారతీయుడు 2’ వచ్చింది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ సినిమాపై ఆసక్తిని పెంచేసింది. దానికి తోడు మూవీ ప్రమోషన్స్ కూడా గట్టిగా చేయడంతో ‘భారతీయుడు 2’(Bharateeyudu 2 Review) పై భారీ హైప్ క్రియేట్ అయింది.భారీ అంచనాల మధ్య నేడు(జులై 12) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. భారతీయుడు 2 కథేంటంటే..చిత్ర అరవిందన్(సిద్దార్థ్), హారతి(ప్రియాభవాని శంకర్) ఇంకో ఇద్దరు స్నేహితులు కలిసి సోషల్ మీడియా వేదికగా అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేస్తుంటారు. రాజకీయ నాయకులు, ప్రభుత్వ అధికారులు చేసే అన్యాయాలపై వీడియోలు చేసి బార్కింగ్ డాగ్స్ అనే పేరుతో య్యూట్యూబ్, ఫేస్బుక్ ఇతర సోషల్ మీడియా ఫ్లాట్ఫామ్స్లో షేర్ చేస్తుంటారు. వారి చుట్టు జరిగిన కొన్ని సంఘటనలు చూసి చలించిపోయిన అరవిందన్.. మళ్లీ భారతీయుడు వస్తే బాగుంటుందని భావిస్తాడు. కమ్బ్యాక్ ఇండియా(Comeback India) హ్యాష్ట్యాగ్తో సేనాపతి(కమల్ హాసన్) మళ్లీ ఇండియా రావాలని పోస్టులు పెడతారు. అవికాస్త వైరల్ అయి.. చైనీస్ తైపీలో ఉన్న సేనాపతి అలియాస్ భారతీయుడుకి చేరతాయి. దీంతో సేనాపతి తిరిగి ఇండియా వస్తాడు. ఈ విషయం తెలుసుకున్న సీబీఐ అధికారి ప్రమోద్(బాబీ సింహా).. అతన్ని పట్టుకునేందుకు ప్రయత్నిస్తాడు. కానీ భారతీయుడు గెటప్స్ మారుస్తూ అవినీతికి పాల్పడిన వారిని దారుణంగా హత్య చేస్తుంటారు. భారతీయుడు ఇచ్చిన పిలుపుతో దేశంలోని యువత కూడా అవితీనికి వ్యతిరేకంగా పని చేస్తుంటుంది. ఈ క్రమంలో అరవిందన్ ఫ్యామిలీలో ఓ విషాదం చోటు చేసుకుంటుంది. దానికి కారణంగా భారతీయుడే అని అరవిందన్తో సహా అందరూ నిందిస్తారు. అసలు అరవిందన్ ఇంట్లో చోటు చేసుకున్న ఆ విషాదం ఏంటి? దానికి భారతీయుడు ఎలా కారణం అయ్యాడు? కమ్బ్యాక్ ఇండియా అని భారతీయుడిని ఆహ్వానించిన యువతే.. గోబ్యాక్ ఇండియా అని ఎందుకు నినదించారు? సామాన్యులకు సైతం భారతీయుడుపై ఎందుకు కోపం పెరిగింది? రియల్ ఎస్టేట్ పేరుతో అక్రమంగా భూములను స్వాధీనం చేసుకుంటూ వేలకోట్లు సంపాదించిన సద్గుణ పాండ్యన్(ఎస్ జే సూర్య)..సేనాపతిని చంపేందుకు వేసిన ప్లాన్ వర్కౌంట్ అయిందా? సీబీఐ అధికారులకు దొరికిన సేనాపతి..వారి నుంచి ఎలా తప్పించుకున్నాడు? అసలు సేనాపతి టార్గెట్ ఏంటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. గవర్నమెంట్ ఆఫీసులో పనిచేసే అంటెండర్ దగ్గర నుంచి ఆర్డర్ లిచ్చే అధికారుల వరకు లంచం అనే మాట ఎలా నాటుకుపోయిందో ‘భారతీయుడు’లో కళ్లకు కట్టినట్లు చూపించాడు శంకర్. ఆ సినిమా విడుదలై ఏళ్లు గడుస్తున్నా.. ఆ కథ, అందులోని పాత్రలు మనకు అలా గుర్తిండిపోతాయి. అలాంటి సూపర్ హిట్ సినిమాకు సీక్వెల్ అంటే..కచ్చితంగా అంచనాలు ఓ రేంజ్లో ఉంటాయి. అయితే ఆ అంచనాలకు తగ్గట్లుగా భారతీయుడు 2ని తీర్చిదిద్దలేకపోయాడు శంకర్. స్టోరీ లైన్ మాత్రమే కాదు చాలా సన్నివేశాలు ‘భారతీయుడు’చిత్రాన్నే గుర్తు చేస్తాయి. అయితే అందులో వర్కౌట్ అయిన ఎమోషన్ ఇందులో మిస్ అయింది. ప్రతి సీన్ సినిమాటిక్గానే అనిపిస్తుంది కానీ.. ఎక్కడ కూడా రియాల్టీగా దగ్గరగా ఉండదు. స్క్రీన్ప్లే కూడా చాలా రొటీన్గా ఉంటుంది. పార్ట్ 3 కోసమే అన్నట్లుగా కథను సాగదీశారు. కొన్ని సీన్లు చూస్తే నిజంగానే ఈ చిత్రానికి శంకర్ దర్శకత్వం వహించారా అనే అనుమానం కలుగుతుంది. భారతీయుడులో అవినీతికి పాల్పడిన వారిని సేనాపతి చంపుతుంటే మన రోమాలు నిక్కబొడుచుకుంటాయి. కానీ ఇందులో మాత్రం అలాంటి సీన్లను కూడా చాలా చప్పగా తీసేశాడు. సినిమా నిడివి( 3 గంటలు) కూడా మైనస్సే. కొన్ని సీన్లను తొలగించి.. నిడివిని తగ్గిస్తే బాగుండేది (తొలగించడానికి ఒక్క సీన్ లేదనే పార్ట్ 3 ప్లాన్ చేశామని ఓ ఇంటర్వ్యూలో శంకర్ చెప్పారు..కానీ సినిమా చూస్తే సాధారణ ప్రేక్షకుడు సైతం కట్ చేయాల్సిన సీన్ల గురించి చెప్పగలడు). ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా అంతగా ఆకట్టుకోలేదు. భారతీయుడు సినిమాలాగే ఈ కథ కూడా మొత్తం లంచం చుట్టే తిరుగుతుంది. సినిమా ప్రారంభ సీన్తోనే ఆ విషయం అర్థమైపోతుంది. అవినీతికి వ్యతిరేకంగా చిత్ర అరవిందన్ గ్యాంగ్ చేసే పోరాటం కాస్త ఆసక్తికరంగా అనిపించినప్పటికీ.. అవినీతి జరిగే సీన్లను బలంగా చూపించలేకపోయాడు. ఇక సేనాపతి ఎంట్రీ సీన్తో కథపై ఆసక్తి పెరుగుతుంది. కానీ ఇండియాకు తిరిగి వచ్చిన తర్వాత..కథనం రొటీన్గా సా..గూ..తూ.. చిరాకు తెప్పిస్తుంది. తరువాత ఏం జరుగుతందనే విషయం ముందే తెలిసిపోవడంతో.. కథపై అంత ఆసక్తి కలగదు. ఇంటర్వెల్ బ్యాంగ్ కూడా సింపుల్గానే ఉంటుంది. ఇక సెకండాఫ్లో కథ మరింత సాగదీతగా అనిపిస్తుంది. క్లైమాక్స్లో మర్మకళను ఉపయోగించి సీక్స్ ఫ్యాక్తో కమల్ చేసే యాక్షన్ సీన్ బాగుంటుంది. కానీ ఆ తర్వాత వచ్చే ఛేజింగ్ సీన్ అయితే సాగదీసినట్లుగా అనిపిస్తుంది. ముగింపులో పార్ట్ 3 స్టోరీ ఎలా ఉంటుందో చూపించారు. అది కాస్త ఆసక్తికరంగానే అనిపిస్తుంది. అవినీతిని అంతం చేయాలంటే అది మొదట మన ఇంటి నుంచే ప్రారంభించాలని యూత్కి ఇచ్చిన మెసేజ్ మాత్రం బాగుంది. ఎవరెలా చేశారంటే..వైవిధ్యమైన పాత్రలు పోషించడం కమల్ హాసన్కు కొత్తేమి కాదు. ఎలాంటి పాత్రలో అయినా ఒదిగిపోతుంటాడు. సేనాపతి పాత్రలో కమల్ ఒదిగిపోయాడు. రకరకాల గెటప్స్లో కనిపిస్తూ తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. యాక్షన్ సీన్స్ కూడా అదరగొట్టేశాడు. అయితే ఆయన గొంతే ఒక్కో చోట ఒక్కోలా వచ్చింది. సిక్స్ ఫ్యాక్స్తో కమల్ చేసే యాక్షన్ సీన్కి థియేటర్లో ఈళలు పడతాయి.ఇక హీరో సిద్ధార్థ్కి మంచి పాత్ర దక్కింది. అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేసే చిత్ర అరవిందన్ పాత్రకు న్యాయం చేశాడు. ఎమోషన్ సీన్లలో అదరగొట్టేశాడు. సిద్ధార్థ్ స్నేహితురాలికిగా ప్రియా భవానీ శంకర్ ఆకట్టుకుంది. సిద్ధార్థ్ ప్రియురాలు దిశగా నటించిన రకుల్కి ఈ చిత్రంలో ఎక్కువగా స్క్రీన్ స్పేస్ లభించలేదు. సినిమా మొత్తంలో రకుల్ మూడు, నాలుగు సీన్లలో మాత్రమే కనిపిస్తుంది. సీబీఐ అధికారి ప్రమోద్గా బాబీ సింహా ఉన్నంతగా బాగానే నటించాడు. వ్యాపారీ సద్గుణ పాండ్యన్గా ఎస్ జే సూర్యకి పార్ట్ 3లోనే ఎక్కువ నిడివి ఉన్నట్లు ఉంది. ఇందులో కేవలం మూడు సీన్లలో కనిపించి వెళ్తాడు. ఏసీబీ అధికారిగా సముద్రఖనితో పాటు మిగిలిన నటీనటులు తమ తమ పాత్రల పరిధిమేర నటించారు. టెక్నికల్గా సినిమా పర్వాలేదు.అనిరుధ్ రవిచందర్ నేపథ్య సంగీతం యావరేజ్గా ఉంది. ఇక పాటలు గురించి మాట్లాడుకోవద్దు. ఒక్కటి కూడా గుర్తుంచుకునే విధంగా లేవు. రవి వర్మన్ సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. సినిమాలో సాగదీత సన్నివేశాలు చాలా ఉన్నాయి. వాటిని మరింత క్రిస్పీగా కట్ చేయాల్సింది. నిర్మాణ విలువలు బాగున్నాయి.(Bharateeyudu 2 Telugu Movie Review)-అంజి శెట్టె, సాక్షి వెబ్డెస్క్
![If You Are Preparing For Neet Again Heres Why You Should Choose Aakashs Repeaterxii Passed Courses](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/20/Untitled-2_9.jpg.webp?itok=Yu3M0cnh)
మీరు మళ్లీ NEET లేదా JEE కోసం సిద్ధమవుతున్నట్లయితే, మీరు ఆకాష్ రిపీటర్/XII Passed కోర్సులను ఎందుకు ఎంచుకోవాలి?
NEET/JEE కోసం సన్నద్ధం కావడానికి ఒక సంవత్సరాన్ని వెచ్చించడం అనేది ఏడాది పొడవునా నిబద్ధత కలిగి మరియు మెడిసిన్ లేదా ఇంజినీరింగ్లో కెరీర్పై మీ కలను కొనసాగించడం పట్ల మీకు మక్కువ ఉంటే ఖచ్చితంగా విలువైనది. ఈ పరీక్షలు ఛేదించడానికి చాలా కఠినంగా ఉంటాయని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దీనికి హాజరైన లక్షలాది మంది విద్యార్థులలో మొదటి ప్రయత్నంలోనే కొంత మంది మాత్రమే విజయం సాధిస్తారు. ప్రత్యామ్నాయ కెరీర్ ఎంపికల కోసం వెతకని వారు లేదా తమకు పెద్దగా నచ్చని కాలేజీలలో స్థిరపడని వారు. అయినప్పటికీ, ఒక సంవత్సరం పునరావృతం చేయడానికి మరియు మళ్లీ సిద్ధం కావడానికి వెనుకాడని వారు కూడా చాలా మంది ఉన్నారు.మీరు మీ మొదటి ప్రయత్నంలో NEETని ఛేదించనట్లయితే మరియు మళ్లీ సిద్ధం కావాలని ఆలోచిస్తున్నట్లయితే, మీరు తాజాగా ప్రారంభించి సరైన మార్గ నిర్దేశం చేయడంలో సహాయపడే ఆకాష్ రిపీటర్/XII పాస్ కోర్సులను మీరు తీవ్రంగా పరిగణించాలి.NEET/ JEE 2025 కోసం మీరు ఆకాష్ రిపీటర్/ XII Passed కోర్సును ఎంచుకోవడానికి కారణాలు● ఆకాష్ రిపీటర్ కోర్సులు మీ స్కోర్ను మెరుగుపరచడంలో మీకు సహాయపడటానికి రూపొందించబడ్డాయి మరియు తద్వారా మీ కలల కళాశాలకు ఎంపికయ్యే అవకాశాలను పెంచుతాయిసూర్యాంశ్ K ఆర్యన్ ఆకాష్లో NEET రిపీటర్ క్లాస్రూమ్ విద్యార్థి, అతను NEET 2023లో తన 2వ ప్రయత్నంలో తన స్కోర్లలో గణనీయమైన మెరుగుదలను నమోదు చేసుకున్నాడు మరియు NEET 2022 (592 స్కోర్)లో తన మొదటి ప్రయత్నం కంటే 705 స్కోర్ సాధించగలిగాడు మరియు ప్రస్తుతం AIIMS భోపాల్లో చదువుతున్నాడు. అంజలి కథ కూడా అలాంటిదే. NEET 2022లో 622 స్కోర్ చేసిన తర్వాత, అంజలి ఆకాష్ NEET రిపీటర్ క్లాస్రూమ్ ప్రోగ్రామ్లో చేరింది మరియు 706 స్కోర్ చేయగలిగింది మరియు NEET 2023లో అండమాన్ & నికోబార్ దీవుల టాపర్గా నిలిచింది. అంజలి ప్రస్తుతం MAMC, ఢిల్లీలో చదువుతోంది. ఆకాష్లోని రిపీటర్ సక్సెస్ స్టోరీలు ప్రోగ్రామ్ యొక్క దృఢత్వం మరియు తీవ్రతను తెలియజేస్తాయి, ఇది తమ కలలను సాధించుకోవడానికి తమ విలువైన సమయాన్ని వెచ్చించే విద్యార్థులకు ఆఫర్లో ఉత్తమమైన వాటి కంటే తక్కువ ఏమీ కాకుండా లభించేలా చేస్తుంది.● ఉత్తమ అధ్యాపకులతో అత్యుత్తమ ఫలితాలను అందించడం ద్వారా ఆకాష్ యొక్క 35 ఏళ్ల వారసత్వం నుండి ప్రయోజనం పొందండిఆకాష్ దానితో పాటు, దేశంలోని అత్యుత్తమ అధ్యాపకులలో ఒకరి ద్వారా ఫోకస్డ్ మరియు రిజల్ట్-ఓరియెంటెడ్ టెస్ట్ ప్రిపరేషన్ను అందించే 35 సంవత్సరాల శక్తివంతమైన చరిత్ర కలిగినదిగా పిలవబడింది.. ఆకాష్లోని ఉపాధ్యాయులు అధిక అర్హతలు మరియు అనుభవజ్ఞులు మాత్రమే కాకుండా కోచింగ్ మెథడాలజీలు మరియు విద్యార్థుల మారుతున్న విద్యా అవసరాలకు అనుగుణంగా వారికి సహాయపడే నైపుణ్యాలలో బాగా శిక్షణ పొందారు. ఆకాష్ రిపీటర్/ XII ఉత్తీర్ణత సాధించిన కోర్సులతో, రిపీటర్ విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం మరియు వారి ప్రత్యేక అవసరాలు మరియు సామర్థ్యాలను అర్థం చేసుకోవడంలో నైపుణ్యం కలిగిన అత్యుత్తమ అధ్యాపకుల దగ్గర మీరు నేర్చుకుంటారు, తద్వారా వారి ఎంపిక అవకాశాలను మెరుగుపరుస్తారు.● నిపుణులచే రూపొందించబడిన అధిక నాణ్యత అధ్యయన సామగ్రిఆకాష్లోని ప్రతి అధ్యయన వనరు అన్ని అంశాల సమగ్ర విశ్లేషణను అందించడానికి రూపొందించబడింది, విద్యార్థులు NEET మరియు/లేదా JEEలో పరీక్షించిన కాన్సెప్ట్లపై పూర్తి అవగాహన కలిగి ఉండేలా చూసుకుంటారు. విద్యార్థులు కష్టమైన పాఠాలను సులభంగా గ్రహించడంలో సహాయపడేందుకు వివిధ రకాల అభ్యాస ప్రశ్నలు, ఉదాహరణలు మరియు దృష్టాంతాలను చేర్చడానికి మా నిపుణులు స్టడీ మెటీరియల్ను జాగ్రత్తగా డిజైన్ చేస్తారు.అంతేకాకుండా, తాజా పరీక్షల ట్రెండ్లు మరియు ప్యాటర్న్లకు అనుగుణంగా మా స్టడీ మెటీరియల్ కఠినమైన సమీక్ష మరియు అప్డేట్లను కలిగియున్నది. విద్యార్థులు తమ పరీక్షా సన్నాహక ప్రయాణంలో ముందుకు సాగడానికి అత్యంత సందర్భోచితమైన మరియు నవీనమైన కంటెంట్పై అవగాహణ కలిగి ఉండేలా ఇది దోహదపడుతుంది.● పూర్తి అభ్యాసం కోసం కఠినమైన పరీక్షలు మరియు మూల్యాంకన షెడ్యూల్ఆకాష్లో విద్యార్థులు తమ సన్నద్ధత సమయంలో వారి బలహీనమైన ప్రాంతాలలో గణనీయమైన మెరుగుదలను ప్రదర్శించడంలో సహాయపడే నిర్దిష్టమైన పరీక్ష షెడ్యూల్ను అనుసరిస్తారు. ప్రస్తుతం భోపాల్లోని AIIMSలో ఉన్న ఆకాష్లోని రిపీటర్ క్లాస్రూమ్ విద్యార్థి సూర్యాంశ్ మాటల్లో, “నేను ప్రతిరోజూ ఒక పరీక్ష రాశాను”, పరీక్షలు నా బలమైన మరియు బలహీనమైన ప్రాంతాలను గుర్తించడంలో నాకు సహాయపడాయి.● గరిష్టంగా 90% మొత్తం స్కాలర్షిప్ పొందండిమీ కల కోసం సిద్ధపడడం మరియు అది కూడా రెండవసారి, ఖచ్చింగా సవాలుగా ఉంటుంది, ముఖ్యంగా ఆర్థికంగా. మేము, ఆకాష్ వద్ద, ఆకాష్ ఇన్స్టంట్ అడ్మిషన్ కమ్ స్కాలర్షిప్ టెస్ట్ (iACST)తో మీ కలను సాకారం చేయడానికి మీకు అవకాశాన్ని అందిస్తున్నాము. iACST మీకు 90% మొత్తం స్కాలర్షిప్ను గెలుచుకోవడానికి మరియు ఆకాష్ యొక్క రిపీటర్/ XII ఉత్తీర్ణత సాధించిన కోర్సులతో మీ కెరీర్ లక్ష్యాలను సాధించడానికి తక్షణ అవకాశాన్ని మీకు అందిస్తుంది.మీరు 2025లో NEET లేదా JEEలో మరోసారి మీ అదృష్టం పరీక్షించుకోవాలనుక్నుట్లయితే , మెడిసిన్/ఇంజినీరింగ్లో మీ కలల కెరీర్కు ఒక అడుగు దగ్గరగా తీసుకెళ్లగల సరైన మెంటర్ని మీరు ఎంచుకున్నారని నిర్ధారించుకోండి. ఆకాష్ రిపీటర్ కోర్సుల్లో అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. ఈరోజే నమోదు చేసుకోండి మరియు మొత్తం 90% స్కాలర్షిప్ పొందండి.ఇక్కడ క్లిక్ చేయండి
జియో యూజర్లకు ఊరట.. అందుబాటులోకి చౌక ప్లాన్లు
కృతి శెట్టి స్టైలిష్.. షాలినీ పాండే బ్లాక్ బస్టర్.. అలియా కూల్ లుక్
ఆరోజు ‘మోదీ ముక్తీ దివస్’.. బీజేపీకి జైరాం రమేష్ కౌంటర్
ఏపీ ఎన్నికల ప్రధానాధికారిగా వివేక్ యాదవ్
వరల్డ్ ఛాంపియన్షిప్ ఫైనల్లో పాకిస్తాన్
అంగరంగ వైభవం.. తరలివచ్చిన బిజినెస్ టైకూన్స్
హమాస్, లెబనాన్తో యుద్ధం.. ఇజ్రాయెల్ సంచలన నిర్ణయం!
'ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం' నుంచి విజిల్స్ వేసే సాంగ్ వచ్చేసింది
పిచ్చెక్కించే లుక్లో రోహిత్ శర్మ.. వింబుల్డన్ మ్యాచ్లో ప్రత్యక్షం
పూజా ఖేద్కర్పై మరొకటి! ఆరోపణలు నిజమని తేలితే..
వైఎస్ జగన్పై చంద్రబాబు సర్కార్ కక్ష సాధింపు
మేడం వచ్చాకే రిబ్బన్ కటింగ్
Indian 2 Review: ‘భారతీయుడు 2’ మూవీ రివ్యూ
కోవిడ్ సమయంలో విశాఖలోనే ఉన్నా: చంద్రబాబు
మిస్టరీ గర్ల్తో హార్దిక్ పాండ్యా.. ప్రేమ గురించి నటాషా పోస్ట్
Today Horoscope: ఈ రాశివారికి బంధువర్గంతో విభేదాలనుంచి విముక్తి
మళ్లీ తడబడ్డ బైడెన్.. ట్రంప్కు వైస్ ప్రెసిడెంట్ పదవి
అనంత్ రాధిక వెడ్డింగ్: మెనూలో ఏకంగా పది లక్షలకు పైగా వెరైటీలు..!
ప్రపంచంలోనే బరువైన వ్యక్తి!.. తగ్గాడు కానీ..!
నేపాల్ బస్సు ప్రమాదం.. ఏడుగురు భారతీయుల మృతి
జియో యూజర్లకు ఊరట.. అందుబాటులోకి చౌక ప్లాన్లు
కృతి శెట్టి స్టైలిష్.. షాలినీ పాండే బ్లాక్ బస్టర్.. అలియా కూల్ లుక్
ఆరోజు ‘మోదీ ముక్తీ దివస్’.. బీజేపీకి జైరాం రమేష్ కౌంటర్
ఏపీ ఎన్నికల ప్రధానాధికారిగా వివేక్ యాదవ్
వరల్డ్ ఛాంపియన్షిప్ ఫైనల్లో పాకిస్తాన్
అంగరంగ వైభవం.. తరలివచ్చిన బిజినెస్ టైకూన్స్
హమాస్, లెబనాన్తో యుద్ధం.. ఇజ్రాయెల్ సంచలన నిర్ణయం!
'ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం' నుంచి విజిల్స్ వేసే సాంగ్ వచ్చేసింది
పిచ్చెక్కించే లుక్లో రోహిత్ శర్మ.. వింబుల్డన్ మ్యాచ్లో ప్రత్యక్షం
పూజా ఖేద్కర్పై మరొకటి! ఆరోపణలు నిజమని తేలితే..
వైఎస్ జగన్పై చంద్రబాబు సర్కార్ కక్ష సాధింపు
మేడం వచ్చాకే రిబ్బన్ కటింగ్
Indian 2 Review: ‘భారతీయుడు 2’ మూవీ రివ్యూ
కోవిడ్ సమయంలో విశాఖలోనే ఉన్నా: చంద్రబాబు
మిస్టరీ గర్ల్తో హార్దిక్ పాండ్యా.. ప్రేమ గురించి నటాషా పోస్ట్
Today Horoscope: ఈ రాశివారికి బంధువర్గంతో విభేదాలనుంచి విముక్తి
మళ్లీ తడబడ్డ బైడెన్.. ట్రంప్కు వైస్ ప్రెసిడెంట్ పదవి
అనంత్ రాధిక వెడ్డింగ్: మెనూలో ఏకంగా పది లక్షలకు పైగా వెరైటీలు..!
ప్రపంచంలోనే బరువైన వ్యక్తి!.. తగ్గాడు కానీ..!
నేపాల్ బస్సు ప్రమాదం.. ఏడుగురు భారతీయుల మృతి
Cinema
![Akshay Kumar recalls His Movie Bade Miyan Chote Miyan flop](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/12/aks.jpg.webp?itok=xrmNIkkc)
నా సినిమా ఫ్లాఫ్ అయితే వాళ్లు ఎంజాయ్ చేస్తున్నారు: స్టార్ హీరో
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ తాజాగా సర్ఫీరా మూవీతో ప్రేక్షకులను పలరించాడు. ఈ చిత్రం సూర్య నటించిన సూపర్హిట్ మూవీ సూరారైపోట్రుకు రీమేక్గా తెరకెక్కించారు. ఈ సినిమాకు కూడా సుధా కొంగర దర్శకత్వం వహించారు. జూలై 12న ప్రేక్షకుల ముందుకొచ్చిన సర్ఫీరా మిక్స్డ్ టాక్ను సొంతం చేసుకుంటోంది. ఈ సందర్భంగా అక్షయ్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర కామెంట్స్ చేశారు. మన సినిమాలు ఫ్లాఫ్ అయినప్పుడు ఎలా ఉండాలో అమితాబ్ను చూసి నేర్చుకున్నట్లు వెల్లడించారు. కాగా.. ఏప్రిల్ 10న విడుదలైన బడే మియాన్ చోటే మియాన్ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టిన సంగతి తెలిసిందే. అక్షయ్ కుమార్ మాట్లాడుతూ.. 'ఇండస్ట్రీలో సెలెక్టివ్గా పనిచేసే వ్యక్తులను నేను చూశా. వారి సినిమాలు కూడా కొన్ని ఫ్లాప్ అయ్యాయి. ఇక్కడ సినీ పరిశ్రమలో ఫ్లాప్లు వస్తే మనకు అవకాశాలు ఇవ్వడం మానేస్తారు. కొందరు వ్యక్తులు నా సినిమాల వైఫల్యాలను సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అలా చూడటం వాళ్లకు ఇష్టం. కానీ నేను నా శ్రమను నమ్ముకున్నా. అయితే ఇలాంటి వాటిని తప్పకుండా ఖండించాలి. అయితే నేను అమితాబ్ బచ్చన్ నుంచి ఓ విషయం నేర్చుకున్నా. ఫ్లాఫ్ వచ్చినా మన పనిని మాత్రం ఆపకూడదు. మన పనితో పాటు అదృష్టాన్ని నమ్ముకోవాలని ఆయన సలహా ఇచ్చారు.' అని అన్నారు. అయితే తాను ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఎవరి గురించి చెడుగా మాట్లాడలేదని తెలిపారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఒకరిపై ఒకరు బురద జల్లుకోవడం సాధారణమైపోయిందని స్టార్ హీరో అసహనం వ్యక్తం చేశారు. 'బడే మియాన్ చోటే మియాన్' షూటింగ్ కోసం 80 రోజులు కేటాయించినట్లు అక్షయ్ కుమార్ వెల్లడించాడు. కాగా.. అక్షయ్ నటించిన 'బడే మియాన్ చోటే మియాన్', 'రామ్ సేతు', 'రక్షా బంధన్', 'బచ్చన్ పాండే', 'సెల్ఫీ' బాక్సాఫీస్ వద్ద రాణించలేకపోయాయి.
![Shiva Rajkumar Movie Bhairathi Ranagal First Verdict Out Now](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/12/1_12_1.jpg.webp?itok=3ZSyl2Zg)
హిట్ సినిమాకు ప్రీక్వెల్.. ఫస్ట్ గ్లింమ్స్ విడుదల
కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా తన కొత్త సినిమా నుంచి ఫస్ట్ వెర్డిక్ట్ పేరుతో ఒక వీడియోను పంచుకున్నారు. పాన్ ఇండియా రేంజ్లో శివ రాజ్కుమార్ నటిస్తున్న మోస్ట్ ఎవైటెడ్ సినిమాల్లో 'భైరతి రంగల్' ఒకటి. శ్రీమతి గీతా శివ రాజ్కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా విడుదల చేసిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.'భైరతి రంగల్' సినిమాను స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆగష్టు 15, 2024న విడుదల చేస్తామని గతంలో శివరాజ్కుమార్ ప్రకటించారు. అయితే, తాజాగా విడుదలైన వెర్డిక్ వీడియోలో సెప్టెంబర్లో సినిమా విడుదల చేస్తామని ప్రకటించారు. అందులో శివన్న రగ్గడ్ లుక్లో కనిపస్తున్నారు. కన్నడ సూపర్ హిట్ చిత్రమైన 'ముఫ్తీ'కి 'భైరతి రంగల్' ప్రీక్వెల్గా రానుంది.
![Wait Of Ashwatthama From Kalki AD 2898 Out Now](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/12/ami.jpg.webp?itok=j9wAECgD)
కల్కి సినిమా నుంచి అశ్వత్థామ సాంగ్.. వీడియో వైరల్
ప్రభాస్, దీపికా పదుకొణె జంటగా నటించిన కల్కి 2898 ఏడీ చిత్రం ఇండియన్ బాక్సాఫీస్ వద్ద పలు రికార్డులు క్రియేట్ చేస్తుంది. ఈ సినిమా నుంచి ఇప్పటికే మ్యూజిక్ ఆల్బమ్ను మేకర్స్ విడుదల చేశారు. తాజాగా కల్కి సినిమా నుంచి పాటలను విడుదలను కూడా విడుదల చశారు. 'వెయిట్ ఆఫ్ అశ్వత్థామ' పేరుతో కేశవ, మాధవ పాటను మేకర్స్ విడుదల చేశారు. జూన్ 27న విడుదలైన కల్కి ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.1000 వరకు కలెక్షన్స్ రాబట్టింది. సంతోష్ నారాయాణ్ పాడిన ఈ పాట నెట్టింట తెగ వైరల్ అవుతుంది. వైజయంతీ మూవీస్ బ్యానర్లో నాగ్ అశ్విన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.
![Singer Rema Charges RS 25 Crore To Perform At Anant Amban Wedding](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/12/ani.jpg.webp?itok=GcE8dq9b)
అనంత్- రాధిక వెడ్డింగ్.. ఒక్క పాటకు రూ.25 కోట్లా!
ప్రముఖ వ్యాపారవేత్త ముకేశ్ అంబానీ ఇంట్లో పెళ్లిసందడి నెలకొంది. ఆయన కుమారుడు అనంత్ అంబానీ.. రాధిక మర్చంట్తో మూడుముళ్ల బంధంలోకి అడుగుపెట్టనున్నారు. ముంబయిలో జరుగుతున్న ఈ గ్రాండ్ వెడ్డింగ్కు హాజరయ్యేందుకు సినీతారలు, విదేశాల నుంచి ప్రముఖులు హాజరవుతున్నారు. ఇప్పటికే అతిథులు దాదాపు ముంబయికి చేరుకున్నారు. వీరి పెళ్లి వేడుకల్లో విదేశీ ప్రతినిధులతో పాటు హాలీవుడ్ సినీతారలు సైతం పాల్గొంటున్నారు. ఈ గ్రాండ్ వెడ్డింగ్ జియో వరల్డ్ సెంటర్లో జరగనుంది.ఒక్క పాటకే రూ.25 కోట్లు...అయితే పెళ్లి వేడుకల్లో స్పెషల్ అట్రాక్షన్గా ఉండేందుకు పలువురు అగ్రతారలతో కచేరీలు ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగానే ప్రముఖ నైజీరియన్ సింగర్ రేమాను ప్రదర్శనకు ఆహ్వానించారు. ఈ పెళ్లి వేడుకల్లో అతను ఓ పాటను పాడేందుకు ఏకంగా రూ.25 కోట్ల రూపాయలు వసూలు చేస్తున్నట్లు సమాచారం. అంతే కాకుండా సంగీత్ వేడుకలో ప్రదర్శనకు పాప్ సింగర్ జస్టిన్ బీబర్కు రూ.84 కోట్లు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆయనతో పాటు పంజాబీ గాయకులు బాద్షా, కరణ్ ఔజ్లాకు రూ.4 కోట్ల వరకు ముట్టజెప్పారని టాక్ వినిపిస్తోంది.
Sports
![Who Will Replace India In Champions Trophy 2025, If Team Pulls Out Of Showpiece Event In Pakistan](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/12/ins.jpg.webp?itok=KkJ9r-oW)
Champions Trophy 2025: ఇండియా కాకపోతే శ్రీలంక..!
వచ్చే ఏడాది (2025) పాకిస్తాన్లో జరిగే ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా పాల్గొనే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. పాక్తో సత్సంబంధాలు లేని కారణంగా భారత్ ఈ టోర్నీని బాయ్కాట్ చేసే అవకాశం ఉంది. ఒకవేళ భారత్ ఈ టోర్నీలో పాల్గొనాలని భావిస్తే తటస్థ వేదికపై తమ మ్యాచ్లు నిర్వహించాలని (హైబ్రిడ్ విధానం) ఐసీసీని కోరవచ్చు. అయితే ఈ ప్రతిపాదనకు పాక్ ససేమిరా ఒప్పుకోదు. ఇదివరకే ఓసారి (ఆసియా కప్ 2023) భారత్ ఒత్తిడికి తలొగ్గి హైబ్రిడ్ విధానానికి ఒప్పుకున్న పాక్ ఈ సారి ఖచ్చితంగా నో చెప్పవచ్చు. ఇదే జరిగితే భారత్.. ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి తప్పుకుంటుంది.మెగా టోర్నీ నుంచి టీమిండియా డ్రాప్ అయిన పక్షంలో ఆ స్థానానికి శ్రీలంక అర్హత సాధిస్తుంది. పూర్ ర్యాంకింగ్ (ఛాంపియన్స్ ట్రోఫీకి క్వాలిఫై అవ్వాలంటే కటాఫ్ తేదీలోపు ర్యాంకింగ్స్లో టాప్-8 జట్లలో ఒకటిగా ఉండాలి) కారణంగా శ్రీలంక ఈ టోర్నీకి అర్హత సాధించలేదు.కాగా, వచ్చే ఏడాది ఫిబ్రవరి, మార్చి నెలల్లో జరిగే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఆతిథ్య హక్కులను పాకిస్తాన్ దక్కించుకున్న విషయం తెలిసిందే. వన్డే ఫార్మాట్లో జరిగే ఈ టోర్నీకి ఆతిథ్య దేశ హోదాలో పాక్.. ఆఫ్ఘనిస్తాన్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఇంగ్లండ్, ఇండియా, న్యూజిలాండ్, సౌతాఫ్రికా జట్లు అర్హత సాధించాయి.
![Staff Should Talk to Shami Paras Mhambrey on New Coach Plan For Shami Return](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/12/shami2.jpg.webp?itok=37e8nwzH)
టీమిండియా స్టార్ పేసర్ రీ ఎంట్రీపై సందేహాలు! గౌతీ ప్లాన్?
వన్డే ప్రపంచకప్-2023 తర్వాత టీమిండియాకు దూరమయ్యాడు స్టార్ పేసర్ మహ్మద్ షమీ. చీలమండ గాయం వేధిస్తున్నా పంటిబిగువన నొప్పిని భరించి ఐసీసీ టోర్నీని పూర్తి చేసిన ఈ ఫాస్ట్బౌలర్.. అత్యధిక వికెట్ల వీరుడిగా నిలిచాడు.సొంతగడ్డపై ఈ మెగా ఈవెంట్లో ఫైనల్ వరకు అజేయంగా నిలవడంలో కీలక పాత్ర పోషించి ప్రశంసలు అందుకున్నాడు షమీ. అయితే, వరల్డ్కప్ తర్వాత గాయం తీవ్రత ఎక్కువ కావడంతో సర్జరీ చేయించుకున్నాడు.అయితే, ఈ యూపీ ఎక్స్ప్రెస్ ఇంత వరకు పునరాగమనం చేయలేదు. ఐపీఎల్-2024తో పాటు టీ20 ప్రపంచకప్-2024కు కూడా దూరమయ్యాడు. తాను క్రమక్రమంగా కోలుకుంటున్నానని షమీ సోషల్ మీడియా ద్వారా తెలియజేసినా రీఎంట్రీపై స్పష్టత మాత్రం ఇవ్వలేదు.పూర్తిస్థాయి ఫిట్నెస్ సాధించాడా లేదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఇక టీ20 వరల్డ్కప్ గెలిచిన టీమిండియా తదుపరి ద్వైపాక్షిక సిరీస్లతో పాటు చాంపియన్స్ ట్రోఫీ-2025తో పాటు వరల్డ్ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్పై కన్నేసింది.ఈ ఐసీసీ టోర్నీల్లో రాణించాలంటే సీనియర్ పేసర్ మహ్మద్ షమీ అవసరం ఉందని టీమిండియా బౌలింగ్ మాజీ కోచ్ పారస్ మాంబ్రే అన్నాడు. ఈ విషయంలో కొత్త కోచింగ్ సిబ్బంది చొరవతీసుకోవాలని సూచించాడు.‘‘షమీ తదుపరి ప్రణాళిక ఏమిటో కోచింగ్ స్టాఫ్ అడిగి తెలుసుకోవాలి. అతడిని సంప్రదించి.. ఫిట్గా ఉన్నాడా లేదా? ఇంకెన్నాళ్లు క్రికెట్ ఆడాలనుకుంటున్నాడు? అన్న విషయాలను అడగాలి. అతడికీ వయసు మీద పడుతోంది.అయినా షమీ నుంచి అత్యుత్తమ ప్రదర్శన రాబట్టుకోగలగాలంటే అందుకు తగ్గ వ్యూహాలు రచించాలి. జట్టుకు అదెంతగానో ఉపయోగకరంగా ఉంటుంది. గౌతీ ఆ పని చేస్తాడని నాకు నమ్మకం ఉంది.టెస్టుల్లో అతడిని వాడుకోవాలనుకుంటే ఆస్ట్రేలియాతో సిరీస్ నాటికి పూర్తిస్థాయిలో అతడు ఫిట్నెస్ సాధించేలా శిక్షణ ఇవ్వాలి. అయితే, ఆడేందుకు షమీ శరీరం సహకరిస్తేనే అన్నీ సజావుగా సాగుతాయి.షమీ లాంటి సీనియర్ల విషయంలో యో- యో టెస్టు(ఫిట్నెస్) అవసరం లేదనే అనుకుంటా’’ అని పారస్ మాంబ్రే ది టెలిగ్రాఫ్తో తన అభిప్రాయాలు పంచుకున్నాడు. కాగా టీమిండియా కొత్త కోచ్గా గౌతం గంభీర్ నియమితుడైన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. టీమిండియా పేస్ దళ నాయకుడు జస్ప్రీత్ బుమ్రాతో పాటు షమీ కూడా కొన్నేళ్లుగా ఫాస్ట్ బౌలింగ్ విభాగంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. చదవండి: చరిత్ర సృష్టించిన బెన్ స్టోక్స్.. ఇంగ్లండ్ తొలి ప్లేయర్గా రికార్డు
![Ferguson, Netravalkar Power Washington To Top](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/12/netr.jpg.webp?itok=KRVu4Jty)
నిప్పులు చెరిగిన నేత్రావల్కర్, ఫెర్గూసన్
మేజర్ లీగ్ క్రికెట్లో ఇవాళ (జులై 12) సియాటిల్ ఓర్కాస్, వాషింగ్టన్ ఫ్రీడం జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్లో ఓర్కాస్పై వాషింగ్టన్ ఫ్రీడం 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఓర్కాస్.. వాషింగ్టన్ ఫ్రీడం పేసర్లు సౌరభ్ నేత్రావల్కర్ (3.4-0-18-3), లోకీ ఫెర్గూసన్ (4-0-26-4), మార్కో జన్సెన్ (4-0-28-1), ఇయాన్ హాలండ్ (4-0-34-1) ధాటికి 19.4 ఓవర్లలో 124 పరుగులకే కుప్పకూలింది.ఓర్కాస్ ఇన్నింగ్స్లో కేవలం ముగ్గురు మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. కెప్టెన్ హెన్రిచ్ క్లాసెన్ 51 (30 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లు), డికాక్ 24 (19 బంతుల్లో ఫోర్, 2 సిక్సర్లు), శుభమ్ రంజనే 12 (17 బంతుల్లో) పరుగులు చేశారు.అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన వాషింగ్టన్ ఫ్రీడం.. లహీరు మిలంత (33 నాటౌట్), ఓబస్ పియెనార్ (31 నాటౌట్) రాణించడంతో 18.2 ఓవర్లలో విజయతీరాలకు (127/5) చేరింది. వాషింగ్టన్ ఇన్నింగ్స్లో ట్రవిస్ హెడ్ డకౌట్ కాగా.. స్టీవ్ స్మిత్ 12, రచిన్ రవీంద్ర 26, ముక్తార్ అహ్మద్ 8, మ్యాక్స్వెల్ 10 పరుగులు చేసి ఔటయ్యారు. ఓర్కాస్ బౌలర్లలో నండ్రే బర్గర్ 2, ఇమాద్ వసీం, కెమారాన్ గానన్, హర్మీత్ సింగ్ తలో వికెట్ పడగొట్టారు. ఈ గెలుపుతో వాషింగ్టన్ ఫ్రీడం పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరింది.
![Gambhir Wants Morne Morkel As Team India Bowling Coach, BCCI Yet To Take Final Call](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/12/morne.jpg.webp?itok=9ZqEdkK5)
బౌలింగ్ కోచ్గా మోర్కెల్ కావాలి.. ఎటూ తేల్చని బీసీసీఐ
సహాయ సిబ్బందిని ఎంపిక చేసుకునే విషయంలో పూర్తి స్వేచ్ఛ కావాలని బీసీసీఐతో ముందే ఒప్పందం చేసుకున్న టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్.. తాజాగా తన సపోర్టింగ్ స్టాఫ్ లిస్ట్లో కొత్త పేరును చేర్చాడు. సహాయ కోచ్లుగా అభిషేక్ నాయర్, టెన్ డస్కటే.. ఫీల్డింగ్ కోచ్గా జాంటీ రోడ్స్ పేర్లను ఇదివరకే ప్రతిపాదించిన గంభీర్.. బౌలింగ్ కోచ్గా దక్షిణాఫ్రికా మాజీ పేసర్ మోర్నీ మోర్కెల్ పేరును కొత్తగా తెరపైకి తెచ్చాడు. మోర్నీ మోర్కెల్ గతంలో గంభీర్తో కలిసి లక్నో సూపర్ జెయింట్స్ ఫ్రాంచైజీకి పని చేశాడు. ఈ సాన్నిహిత్యంతోనే గంభీర్ మోర్నీ పేరును ప్రతిపాదించి ఉండవచ్చు. మోర్నీకి ఫాస్ట్ బౌలింగ్ కోచ్గా మంచి ట్రాక్ రికార్డు ఉంది.ఇదిలా ఉంటే, గంభీర్ ఎంపికల విషయంలో బీసీసీఐ ఓ మెలిక పెట్టినట్లు తెలుస్తుంది. సహాయ సిబ్బందిగా భారతీయులనే ఎంపిక చేసుకోవాలని స్పష్టం చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో గంభీర్ ముగ్గురు విదేశీ కోచ్ల పేర్లను ప్రతిపాదించడం చర్చనీయాంశంగా మారింది. బీసీసీఐ.. గంభీర్ ప్రతిపాదనలను ఒప్పుకుంటుందో లేదో మరి కొద్ది రోజుల్లో తేలిపోనుంది.గంభీర్ ప్రతిపాదనలను అటుంచితే.. టీమిండియా ఫీల్డింగ్ కోచ్గా టి దిలీప్ను కొనసాగించాలని బీసీసీఐ భావిస్తున్నట్లు తెలుస్తుంది. బౌలింగ్ కోచ్గా జహీర్ ఖాన్ పేరును పరిశీలిస్తున్నట్లు సమాచారం. మోర్నీ కాకపోతే బౌలింగ్ కోచ్లుగా లక్షీపతి బాలాజీ, వినయ్ కుమార్లలో ఎవరో ఒకరిని ఎంపిక చేయాలని గంభీర్ కోరినట్లు తెలుస్తుంది. గంభీర్ ప్రతిపాదనలు.. సొంత ఛాయిసెస్ నడుమ బీసీసీఐ ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.
Family
![Aalim Hakim Hairdresser Makeover To Ambanis And Their Guests](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/12/Anantambani_Aalim%20Hakim.jpg.webp?itok=wtlxwm-1)
అనంత్ అంబానీ గ్రాండ్ వెడ్డింగ్ : ఆలిమ్ హకీం స్టయిల్స్ మామూలుగా లేవుగా!
హెయిర్ డ్రెస్సర్ అనగానే సెలబ్రిటీలకు గుర్తొచ్చే పేరు ఆలిమ్ హకీమ్. ఆలీం చెయ్యేస్తే మాస్.. క్లాస్ ..అదిరే లుక్స్.. గుర్తు పట్టలేనంత అందంగా తీర్చిదిద్దేంత ప్రతిభ అతని సొంతం. అందుకే సెలబ్రిటీలు, స్టార్లు, గొప్ప గొప్ప బిజినెస్ మేన్లు సెలబ్రిటీ హెయిర్ స్టయిలిష్ట్ ఆలిమ్ హకీమ్. తాజాగా అంబానీ పెళ్లి ఇంట సందడిలో మేజిక్ చేస్తున్నాడు.బాలీవుడ్ ,టాలీవుడ్ , క్రికెట్, బిజినెస్ ఇలా రంగం ఏదైనా టాప్ సెలబ్రిటీలు ఆలిమ్ హకీమ్ కస్టమర్లు. తన హెయిర్ స్టైల్తో స్టైలిష్ లుక్స్ ఇచ్చి అందర్నీ ఆకట్టుకుంటాడు. మహేష్ బాబు,రణవీర్ సింగ్, ధోని, కోహ్లీ లాంటి స్టార్ల లుక్ను అదుర్స్ అనిపించేలా తీర్చిదిద్దిన ఘన ఆయ సొంతం. తాజాగా రిలయన్స్ కుచెందిన కాబోయే వరుడు అనంత్ అంబానీకి రూపును అందంగా తీర్చిదిద్ది మరోసారి వార్తల్లోకి వచ్చాడు.రిలయన్స్ ఫ్యామిలీ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న అనంత్-రాధిక మర్చంట్ వివాహ వేడుకల్లో ఆలిమ్ హకీమ్ హెయిర్ స్టయిలిస్ట్గా తన సత్తా చాటాడు. వరుడు అనంత్ అంబానీ, అలాగే ముఖేష్ అంబానీ పెద్దకుమారుడు ఆకాష్ లుక్ను అద్భుతంగా మార్చేశాడు. ఈ సందర్భంగా ఇన్స్టాలో ఆలిమ్ హకీమ్ అంబానీకి ఫేడ్ కట్తో ఎలా సరికొత్త రూపాన్ని ఇచ్చాడో షేర్ చేశాడు.అంతేనా కాబోయే వరుడు అనంత్ అంబానీకి కూడా అలీమ్ అద్భుతమైన మేకోవర్ ఇచ్చాడు. అనంత్ పొడవాటి గిరజాల జుట్టును కత్తిరించకుండా మేకోవర్ చేయడం హైలైట్గా నిలిచింది. అలాగే పెళ్లికి వచ్చిన అతిథుల కేశాలను అందంగా తీర్చిదిద్దుతున్నాడు. View this post on Instagram A post shared by Eka (@ekalakhani)
![Worlds Heaviest Man Loses Weight But May Never Walk Again](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/12/heavy.jpg.webp?itok=3zf5TPSE)
ప్రపంచంలోనే బరువైన వ్యక్తి!.. తగ్గాడు కానీ..!
ప్రపంచంలోనే అత్యంత బరువైన వ్యక్తిగా పేరు తెచ్చుకున్న వ్యక్తి వాకింగ్ కూడా చేయలేడు. ఎవరో ఒకరు సాయం లేనిదే వాకింగ్ చేయడం సాధ్యం కాదు. అయినప్పటికీ కిలోలు కొద్ది బరువు తగ్గాడు. పైగా 40 ఏళ్లకు మించి బతకడని తేల్చి చెప్పిన వైద్యుల మాటే తప్పు అని ప్రూవ్ చేసి చూపించాడు. ఇంతకీ అతను ఎలా అన్ని కిలోల బరువు తగ్గాడు? అది సరైనదేనా అంటే..ఒకప్పడూ ప్రపంచంలోనే అత్యంత బరువైన వ్యక్తి, పాల్ మాసన్. అతను ఏకంగా 444.5 కిలోల బరువు ఉండేవాడు. అయితే ప్రస్తుతం అతను బరువు కోల్పోయాడు కానీ నడవలేడు. చెప్పాలంటే వాకింగ్ వంటివి చేయకుండానే బరువు తగ్గాడు. డాక్టర్లు సైతం అతడి భారీ కాయాన్ని చూసి మహా అయితే 40 ఏళ్లు బతుకుతాడని తేల్చి చెప్పేశారు. అయితే మాసన్ వైద్యుల అంచనాలను తారుమారు చేస్తూ..ఈ ఏడాది 64వ ఏడాదిలోకి అడుగుపెడుతున్నాడు మాసన్. ప్రస్తుతం ఆయన 288 కిలోల బరువు ఉన్నారు. అయితే ఆయన నడవలేరు మంచానికే పరిమితమయ్యారు. నిజానికి మాసన్ అత్యంత స్థూలకాయుడిగా మారడానికి కరోనా మహమ్మారి టైంలో లాక్డౌన్ కారణంగా డిప్రెషన్కి సంబంధించిన మందులు ఓవర్ డోస్ తీసుకున్నాడు. అదీగాక ఆ టైంలోనే బ్రిటన్లో అత్యంత బరువైన వ్యక్తిగా ఉన్న జాసన్ హోల్టన్ మరణం అతడి మానసిక శారీరక ఆరోగ్యంపై ప్రభావం చూపాయి. దీంతో అతడు విపరీతంగా బరువు పెరిగిపోయాడు. అయితే అను గ్యాస్ట్రిక్ బైపాస్ వంటి సర్జరీలతో 120 కిలోల వరకు బరువు తగ్గించుకోగలిగాడు. ఆ తర్వాత అదనపు స్కిన్ని తొలగించుకునేందుకు యూఎస్లో మరికొన్ని ఆపరేషన్లు చేయించుకున్నాడు. ఆ సమయంలోనే తన జీవిత భాగస్వామిని కూడా కలుసుకున్నాడు. అయితే ప్రస్తుతం తాను ఇంకా చాలా శారీరక, మానసిక సమస్యలు ఫేస్ చేస్తున్నాని, తినే ఆహారం క్వాండిటీ పెరుగుతుందే గానీ తగ్గదని చెబుతున్నాడు మాసన్. అంతేగాదు తన అధిక బరువుకు ప్రధాన కారణం మానసిక సమస్యలని కూడా తెలిపాడు. చిన్నతనంలో తన తండ్రి చేతిలో శారీరక వేధింపులకు గురయ్యానని, ఎలాపడితే అలా కొట్టేవాడని చెప్పుకొచ్చాడు. ఆరేళ్ల వయస్సు నుంచే తనని కుటుంబ సభ్యులు దారుణంగా వేధించేవారని చెప్పుకొచ్చాడు. ఇక్కడ మాసన్ వ్యక్తిగత మానసిక ఆరోగ్య సమస్యల కారణంగా ఆరోగ్యకరమైన పద్ధతిలో బరువు తగ్గడం సాధ్యపడలేదు. దీని కారణంగా మాసన్ ఆరోగ్యం పూర్తి స్థాయిలో మెరుగ్గా అవ్వలేదు. ఇంకా పలు సమస్యలు ఫేస్ చేస్తున్నట్లు కూడా వివరించాడు. ఈ సంఘటన ద్వారా మనం గ్రహించాల్సింది ఏంటంటే.. మానసికంగా ఆరోగ్యంగా ఉంటేనే ఏ అనారోగ్య సమస్య అయినా నయం అవుతుంది. అందువల్ల మానసికంగా స్ట్రాంగ్గా ఉండి ఆరోగ్యకరమైన రీతిలో బరవు తగ్గేందుకు యత్నించాలి. ఆరోగ్యకరమైన రీతిలో బరవు తగ్గాలంటే..బరువు తగ్గడం చాలా కష్టమైన పని అయినప్పటికీ, నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఆహారం, వ్యాయామం రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ ఒక నియమానుసారంగా చేస్తే..ఆరోగ్యకరమైన రీతీలో బరువు తగ్గడం సులభమని అంటున్నారు. అందుకోసం పాటించాల్సినవి ఏంటంటే..చక్కెరను తగ్గించండితాజా, కాలానుగుణ పండ్లు తినడంపై దృష్టి పెట్టండిఫైబర్, ప్రోటీన్లు ఉండే ఆహారం తీసుకోవడంమెడిటరేనియన్ డైట్ ఫాలో అవ్వడంక్రమం తప్పకుండా వ్యాయామంఎక్కవు నీరు త్రాగడంటైంకి మంచిగా నిద్రపోవడం. (చదవండి: నవ్వడం' కోసం ఏకంగా చట్టం..! ప్రతిరోజూ..)
![Darkest Dungeon 2 Is A Game Developed By Red Hook Studios](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/12/gaming.jpg.webp?itok=fFoPtNZV)
ఆ కొండకు చేరాలంటే.. కొండంత గుండె కావాలి!
డార్కెస్ట్ డంజన్కు సీక్వెల్గా వస్తున్న డార్కెస్ట్ డంజన్ 2 ఈ నెల 15న విడుదల అవుతుంది. గత గేమ్స్లాగే తాజా గేమ్ కూడా రోగ్లైక్ రోల్–ప్లేయింగ్ వీడియో గేమ్. తమవైన శక్తిసామర్థ్యాలతో ఉండే విభిన్నమైన క్యారెక్టర్లు దీనిలో ఉంటాయి.ఈ గేమ్ అంతిమ లక్ష్యం కొండకు చేరడం. కొన్ని శక్తులు ప్రపంచాన్ని ఆక్రమించడంలో కీలక పాత్ర పోషించిన కొండ ఇది. కొండను అన్వేషించే క్రమంలో ప్లేయర్కు రకరకాల అడ్డంకులు ఎదురవుతుంటాయి. ఈ టర్న్–బేస్డ్ గేమ్లో రాంగ్ స్పాట్లో ఉన్నప్పుడు ప్లేయర్ తన స్కిల్స్ను ఉపయోగించలేరు.డెవలపర్స్: రెడ్ హుక్ స్టూడియోస్ఇంజిన్: యూనిటీ ప్లాట్ఫామ్స్: విండోస్, ప్లేస్టేషన్ 4, ప్లేస్టేషన్ 5, నిన్టెండో స్విచ్, ఎక్స్బాక్స్ సిరీస్ ఎక్స్/ఎస్జానర్స్: రోల్–ప్లేయింగ్, రోగ్లైక్ మోడ్ సింగిల్–ప్లేయర్ఇవి చదవండి: Artificial Intelligence: ఫీచర్ జెమిని ఏఐ టూల్స్..
![Artificial Intelligence New Feature AI Tools](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/12/ai.jpg.webp?itok=ui34q7Du)
Artificial Intelligence: ఫీచర్ జెమిని ఏఐ టూల్స్..
వీలైనన్ని చోట్ల ఏఐ ఫీచర్లను తీసుకురావడానికి ప్రయత్నిస్తోంది గూగుల్. గూగుల్ జెమిని యాప్స్, మోడల్స్లో ఇది ఎక్కువగా కనిపిస్తున్నాయి. వాటిలో కొన్ని..హెల్ప్ మీ రైట్: రాసేటప్పుడు కొన్నిచోట్ల ఏం రాయలో తెలియక స్ట్రక్ అవుతుంటాం. ఇలాంటి సందర్భంలో రచన ముందుకు సాగడానికి ఉపయోగపడే ఫీచర్ ఇది. ఏఐ టెక్ట్స్ను జెనరేట్ చేస్తుంది.ఏఐ వాల్పేపర్ అండ్ బ్యాక్గ్రౌండ్స్: ఒక్క ప్రాంప్ట్ ఇస్తే చాలు కొత్త వాల్పేపర్, బ్యాక్స్గ్రౌండ్స్కు ఉపయోగపడే ఏఐ ఫీచర్ ఇది. ఉదా: ఏ క్యాబిన్ ఇన్ ది మిడిల్ ఆఫ్ ఏ పీస్ఫుల్ మెడో.మ్యాజిక్ ఎడిటర్: గూగుల్ ఫొటోస్లోని మ్యాజిక్ ఎడిటర్ ఇప్పుడు క్రోమ్ బుక్లో కూడా అందుబాటులో ఉంది. చిత్రంలోని వ్యక్తులు, వస్తువులను మూవ్ చేయడానికి, పూర్తిగా తొలగించడానికి ఇది ఉపయోగపడుతుంది.ఇవి చదవండి: Jasleen Royal: ఒకే సమయంలో.. ఎన్నో ఇన్స్ట్రుమెంట్లు ప్లే చేసి.. వావ్!
ఫొటోలు
![Yellamma Thalli Bonametthina Ashwini Sree Photos](/sites/default/files/styles/webp/public/gallery_images/2024/07/12/Yellamma%20Thalli%20Bonametthina%20Ashwini%20Sree%20Photos%20%2810%29.jpg.webp?itok=MBZJpN23)
![](/sites/default/files/styles/webp/public/gallery_images/2024/07/12/Yellamma%20Thalli%20Bonametthina%20Ashwini%20Sree%20Photos%20%2810%29.jpg.webp?itok=MBZJpN23)
Ashwini Sree : ఎల్లమ్మ తల్లికి బోనమెత్తిన బిగ్బాస్ బ్యూటీ (ఫోటోలు)
![Hollywood stars who will attend Ananth-Radhika Wedding Photos](/sites/default/files/styles/webp/public/gallery_images/2024/07/12/anant%20ambani%20radhika%20merchant%20wedding.jpg.webp?itok=rE3SDPE5)
![](/sites/default/files/styles/webp/public/gallery_images/2024/07/12/anant%20ambani%20radhika%20merchant%20wedding.jpg.webp?itok=rE3SDPE5)
అనంత్-రాధిక పెళ్లికి హాజరయ్యే హాలీవుడ్ స్టార్స్ వీళ్లే! (ఫోటోలు)
![Indian Actress Malavika Menon Latest Photos Goes Viral](/sites/default/files/styles/webp/public/gallery_images/2024/07/12/MalavikaMenon-01_0.jpg.webp?itok=ceP8oxIy)
![](/sites/default/files/styles/webp/public/gallery_images/2024/07/12/MalavikaMenon-01_0.jpg.webp?itok=ceP8oxIy)
Malavika Menon: మలయాళీ బ్యూటీ మాళవిక మీనన్ పిక్స్ వైరల్ (ఫోటోలు)
![Baby on the way for Pakistan cricket star Shaheen Afridi and his wife Ansha Photos](/sites/default/files/styles/webp/public/gallery_images/2024/07/12/Baby%20on%20the%20way%20for%20Pakistan%20cricket%20star%20Shaheen%20Afridi%20and%20his%20wife%20Ansha%20Photos%20%2811%29.jpg.webp?itok=L7_arYLa)
![](/sites/default/files/styles/webp/public/gallery_images/2024/07/12/Baby%20on%20the%20way%20for%20Pakistan%20cricket%20star%20Shaheen%20Afridi%20and%20his%20wife%20Ansha%20Photos%20%2811%29.jpg.webp?itok=L7_arYLa)
తండ్రి కాబోతున్న స్టార్ క్రికెటర్ (ఫొటోలు)
![Have A look On These Punjabi Phulkari Embroidery Designs](/sites/default/files/styles/webp/public/gallery_images/2024/07/12/Fashion.jpg.webp?itok=CX3n3pKR)
![](/sites/default/files/styles/webp/public/gallery_images/2024/07/12/Fashion.jpg.webp?itok=CX3n3pKR)
పంజాబ్ ‘ఫుల్కారీ’ కళ.. అదిరిపోయే డిజైన్లు చూశారా (ఫోటోలు)
National View all
![](/sites/default/files/article_images/2024/07/12/jairamramesh.jpg)
ఆరోజు ‘మోదీ ముక్తీ దివస్’.. బీజేపీకి జైరాం రమేష్ కౌంటర్
ఢిల్లీ: దేశంలో రాజకీయం మరోసారి హీటెక్కింది.
![](/sites/default/files/article_images/2024/07/12/pooja-khedkar-iSSUE.jpg)
పూజా ఖేద్కర్పై మరొకటి! ఆరోపణలు నిజమని తేలితే..
ముంబై: వివాదాస్పద ట్రెయినీ ఐఏఎస్ పూజా ఖేద్కర్ కెరియర్ చిక
![](/sites/default/files/article_images/2024/07/12/assam_0.jpg)
అస్సాంలో గాంధీ విగ్రహం తొలగింపు.. తనకు తెలియదన్న సీఎం
గువాహతి: అస్సాంలో మహాత్మా గాంధీ విగ్రహాన్ని తొలగించారు.
![](/sites/default/files/article_images/2024/07/12/Emergency_Day_June25.jpg)
జూన్ 25 సంవిధాన్ హత్యా దివస్.. కేంద్రం సంచలన ప్రకటన
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
![](/sites/default/files/article_images/2024/07/12/aap_4.jpg)
లిక్కర్ కేసులో కేజ్రీవాల్కు బెయిల్.. బీజేపీ కుట్రలు బహిర్గతం: ఆప్
న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సీఎం అరవింద్ కేజ్ర
International View all
![](/sites/default/files/article_images/2024/07/12/Israel.jpg)
హమాస్, లెబనాన్తో యుద్ధం.. ఇజ్రాయెల్ సంచలన నిర్ణయం!
జెరూసలెం: ఇజ్రాయెల్-హమాస్ మధ్య భీకర యుద్ధం నడుస్తున్న వేళ
![](/sites/default/files/article_images/2024/07/12/achanda.jpg)
విశ్వాస పరీక్షలో ఓడిన నేపాల్ ప్రధాని ‘ప్రచండ’
ఖాఠ్మాండూ: నేపాల్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.
![](/sites/default/files/article_images/2024/07/12/WorldKababday-Special.jpg)
World Kebab Day 2024 నోరూరించే కబాబ్స్ , స్మోకీ , జ్యూసీ.. వీటికథ పెద్దదే!
కబాబ్..ప్రస్తుత కాలంలో ఆహార ప్రియులకు పరిచయం అవసరం లేని వంటకం.
![](/sites/default/files/article_images/2024/07/12/Meloni_Irritate_Biden_Momen.jpg)
Watch: మెలోనీకి విసుగు తెప్పించిన బైడెన్!
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ గురించి వీడియోలు వైరల్ అవుతుండడం చూస్తున్నాం.
![](/sites/default/files/article_images/2024/07/12/upi01.jpg)
ఖతార్లో యూపీఐ సేవలు..!
దేశంలో డిజిటల్ చెల్లింపులకు కీలకంగా ఉన్న యూపీఐ సేవలను ఖతార్కు విస్తరిస్తున్నట్లు నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇం
NRI View all
![](/sites/default/files/article_images/2024/07/11/ukkk.jpg)
Video: భగవద్గీత సాక్షిగా బ్రిటన్ ఎంపీగా శివాని ప్రమాణం
భారత సంతతికి చెందిన 29 ఏళ్ల శివాని రాజా యూకే పార్లమెంటులో హిందువుల పవిత్రగ్రంథం భగవద్గీత సాక్షిగా ఎంపీగా ప్రమాణ స్
![](/sites/default/files/article_images/2024/07/11/ram.jpg)
45 కిలోలు తగ్గిన భారత సంతతి సీఈవో..అతడి హెల్త్ సీక్రెట్ ఇదే..!
బరువు తగ్గడం అనేది శారీరక శ్రమకు మించిన కష్టమైన ప్రక్రియ.
![](/sites/default/files/article_images/2024/07/10/usa_0.jpg)
అమెరికాలో నలుగురు తెలుగోళ్ల అరెస్టు!
సాక్షి, హైదరాబాద్: టెక్సాస్లో మానవ అక్రమ రవాణా రాకెట్ను నడుపుతున్న నలుగురు భారతీయులను అక్కడి పోలీసుల
![](/sites/default/files/article_images/2024/07/9/NRI1.jpg)
డల్లాస్లో ఘనంగా మహానేత వైఎస్సార్ 75వ జయంతి వేడుకలు
దివంగత ముఖ్యమంత్రి, మహానేత వైఎస్.
![](/sites/default/files/article_images/2024/07/9/PM%20Modi_Russiatrou.jpg)
రష్యా కళాకారులపై మోదీ ప్రశంసలు : అక్కడి ఎన్ఆర్ఐలకు గుడ్ న్యూస్
ప్రధాని నరేంద్ర మోదీ రష్యా పర్యటనలో భాగంగా మాస్కోలోని భారతీయులను కలిశారు. వారినుఉద్దేశించి ప్రసంగించారు.
Business
![These EPF members receiving interest payments for FY 2023 24](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/12/epf.jpg.webp?itok=NB3enSNO)
ఈపీఎఫ్ వడ్డీ చెల్లింపులు ప్రారంభం
సవరించిన వడ్డీ రేట్ల ప్రకారం.. ఈపీఎఫ్ వడ్డీ సొమ్మును అవుట్గోయింగ్ సభ్యులకు ఇప్పటికే చెల్లిస్తున్నట్లు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) తెలిపింది. దీంతో పదవీవిరమణ పొందిన సభ్యులు వారి ఫైనల్ పీఎఫ్ సెటిల్మెంట్లతో పాటు 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వడ్డీ సొమ్మును పొందుతున్నారు.ఈపీఎఫ్ వార్షిక వడ్డీ రేటు సాధారణంగా ఆర్థిక సంవత్సరం ముగిసిన తర్వాత తదుపరి ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో ప్రకటిస్తారు. దీని ప్రకారం, ఈపీఎఫ్ సభ్యులకు 2023-24 ఆర్థిక సంవత్సరానికి 8.25% వడ్డీ రేటును ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. ఇదే విషయాన్ని గత మే నెలలో ఈపీఎఫ్ఓ తెలియజేసింది. సవరించిన రేట్ల ప్రకారం వడ్డీ సొమ్మును ఇప్పటికే అవుట్గోయింగ్ సభ్యులకు చెల్లించడం ప్రారంభించినట్లు ఈపీఎఫ్ఓ పేర్కొంది.ఈపీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకోండిలా..ఉమంగ్ యాప్ ద్వారా పీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకునేందుకు..» యాప్ను డౌన్లోడ్ చేసి మీ మొబైల్ నంబర్తో నమోదు చేసుకోండి» ఆప్షన్స్ నుంచి "EPFO"ని ఎంచుకుని, "View Passbook"పై క్లిక్ చేయండి» స్క్రీన్పై మీ పాస్బుక్, ఈపీఎఫ్ బ్యాలెన్స్ చూడటానికి UAN ఎంటర్ చేసి, ‘Get OTP’పై క్లిక్ చేయండిఈపీఎఫ్ఓ పోర్టల్ ద్వారా.. » ఈపీఎఫ్ఓ వెబ్సైట్లోని ఎంప్లాయీ సెక్షన్కి వెళ్లి, "మెంబర్ పాస్బుక్"పై క్లిక్ చేయండి. » పీఎఫ్ పాస్బుక్ని చూడటానికి, మీ UAN, పాస్వర్డ్ను నమోదు చేయండి.» మీ UAN ఈపీఎఫ్ఓలో రిజిస్టర్ అయి ఉంటే 7738299899కి SMS పంపడం ద్వారా కూడా పీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు.
![Airbnb has witnessed a significant surge in bookings across the globe](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/12/air%20bnb01.jpg.webp?itok=di3Lo36T)
పారిస్ ఒలింపిక్స్.. భారీగా ట్రావెల్ బుకింగ్స్!
పారిస్ ఒలింపిక్స్ 2024 మరికొద్ది వారాల్లో ప్రారంభం అవుతున్న నేపథ్యంలో ట్రావెల్ బుకింగ్స్ భారీగా పెరినట్లు ఎయిర్ బీఎన్బీ తెలిపింది. తన ఆన్లైన్ ప్లాట్ఫామ్లో దాదాపు 90 శాతం వినియోగదారులు ఒలింపిక్స్ జరిగే ప్రదేశాల చుట్టూ ఉన్న హోటల్స్ కోసం సెర్చ్ చేస్తున్నట్లు పేర్కొంది.జులై 26 నుంచి ఆగస్టు 11 వరకు జరిగే ఒలింపిక్స్ క్రీడలకు ఈసారి పారిస్ ఆతిథ్యం ఇస్తుంది. ప్రపంచవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో క్రీడాకారులు, అథ్లెట్లు, ఇతరులు ఈ క్రీడల్లో పాల్గొనే అవకాశం ఉంది. దాంతో ఇప్పటికే చాలా మంది ఒలింపిక్స్ జరిగే క్రీడా ప్రాంగణాల పరిసరాల్లోని హోటల్స్ను బుక్ చేసుకున్నారు. ఈమేరకు ఆతిథ్య రంగంలో సేవలందిస్తున్న ప్రముఖ ఆన్లైన్ హోటల్ బుకింగ్ ప్లాట్పామ్ ఎయిర్ బీఎన్బీ ప్రకటన విడుదల చేసింది. ఒలింపిక్స్ జరిగే ఆక్వాటిక్స్ సెంటర్, బెర్సీ అరెనా, బార్డాక్స్ స్టేడియం, చాంప్ డే మార్స్ అరెనా, చాటూ డి వెర్సల్లీస్, చాట్రాక్స్ షూటింగ్ సెంటర్, ఈఫిల్ టవర్ స్టేడియం..వంటి క్రీడా ప్రాంగాణాల పరిసరాల్లో హోటల్స్ పూర్తిగా బుక్ అయినట్లు తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా తమ వినియోగదారుల్లో దాదాపు 90 శాతం మంది ఈ ఒలింపిక్స్ జరిగే ప్రాంతాల్లోని హోటల్స్ను సెర్చ్ చేస్తున్నట్లు పేర్కొంది. భారత్, చైనా, హాంకాంగ్, జపాన్ నుంచి వచ్చే ప్రయాణికుల్లో ఈసారి అత్యధిక పెరుగుదల కనిపిస్తుందని చెప్పింది. భారతీయ ప్రయాణికులు పారిస్తోపాటు సమీపంలోని నైస్, ఆబర్విల్లియర్స్, కొలంబెస్, సెయింట్-ఓవెన్-సుర్-సీన్ వంటి ఇతర ప్రదేశాలను అన్వేషిస్తున్నారని తెలిపింది.ఈ సందర్భంగా ఎయిర్ బీఎన్బీ జనరల్ మేనేజర్ అమన్ప్రీత్ బజాజ్ మాట్లాడుతూ..‘ప్రపంచవ్యాప్తంగా 160 కంటే ఎక్కువ దేశాల నుంచి అభిమానులు, క్రీడాకారులు, అథ్లెట్లు ఒలింపిక్స్కు హాజరుకానున్నారు. భారతీయులు ఒలింపిక్స్ ఈవెంట్ను దృష్టిలో ఉంచుకుని ప్రయాణాలను ప్లాన్ చేస్తున్నారు. గతంలో కంటే 30 శాతం భారత ప్రయాణికుల సంఖ్య పెరుగనుంది. ఈ నేపథ్యంలో మార్చి 31 నాటికి హోటల్స్లో బుక్ అయిన ‘స్టేయింగ్ టైం(రాత్రి, పగలు బుక్ చేసుకునే సమయం)’ రెండేళ్ల క్రితం వ్యవధితో పోలిస్తే ఐదు రెట్లు ఎక్కువగా ఉంది’ అన్నారు.ఇదీ చదవండి: ఖతార్లో యూపీఐ సేవలు..!పారిస్లో జరిగే ఒలింపిక్ క్రీడల పరిసర ప్రాంతాల్లోని దాదాపు రూ.8,300 కోట్లు వ్యాపారం సాగుతుందని అంచనా. దీనివల్ల దాదాపు 7,300 మందికి ఉపాధి లభిస్తుందని సమాచారం. ఇదిలాఉండగా, పారిస్లో ఒలింపిక్స్ నిర్వహణ సరైన నిర్ణయం కాదని గతంలో 44 శాతం స్థానికులు అభిప్రాయపడ్డారు. వేదికలు, క్రీడా గ్రామాల ఏర్పాటులో భాగంగా వేలాది మంది నిర్వాసితులను సమీపంలోని భవనాల నుంచి ఖాళీ చేయించడంపైనా విమర్శలు వస్తున్నాయి.
![TVS Jupiter 125 CNG Coming Soon in India](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/12/tvs-cng.jpg.webp?itok=mkt96HCL)
సీఎన్జీ విభాగంలోకి మరో వెహికల్!.. లాంచ్ ఎప్పుడంటే?
ఇటీవల బజాజ్ ఆటో ప్రపంచంలోనే మొట్ట మొదటి సీఎన్జీ బైక్ ఫ్రీడమ్ 125 లాంచ్ చేసింది. ఈ తరుణంలో టీవీఎస్ కంపెనీ కూడా ఈ విభాగంలో స్కూటర్ లాంచ్ చేయడానికి సన్నద్ధమైంది. సంస్థ 2025 నాటికి మార్కెట్లో జుపిటర్ సీఎన్జీ స్కూటర్ లాంచ్ చేయనున్నట్లు సమాచారం.టీవీఎస్ కంపెనీ తన జుపిటర్ స్కూటర్ను సీఎన్జీ రూపంలో లాంచ్ చేయడానికి యూ740 పేరుతో ఓ ప్రాజెక్ట్ ప్రారంభించింది. రాబోయే ఈ స్కూటర్ 125 సీసీ ఇంజిన్ పొందనున్నట్లు సమాచారం. అనుకున్నవన్నీ సవ్యంగా జరిగితే.. టీవీఎస్ జుపిటర్ సీఎన్జీ ఈ ఏడాది చివరినాటికి లాంచ్ అయ్యే అవకాశం ఉంది.టీవీఎస్ సీఎన్జీ స్కూటర్ మార్కెట్లో లాంచ్ అయిన తరువాత నెలకు సుమారు 1000 యూనిట్లను విక్రయించనున్నట్లు సమాచారం. వాతావరణంలో కార్బన్ ఉద్గారాలను తగ్గించడానికి కంపెనీ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా కంపెనీ లాంచ్ చేయనున్న ఈ సీఎన్జీ స్కూటర్ గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
![Union Budget 2024 Presentation Time Was Changed Check Here Time And Reason](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/12/nirmala-sitaraman_0.jpg.webp?itok=Xa36qye-)
బడ్జెట్.. 1999 ముందు వరకు ఒక లెక్క... తర్వాత ఒక లెక్క!
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024కి సంబంధించిన పూర్తి కేంద్ర బడ్జెట్ను జూలై 23న సమర్పించనున్నారు. మూడవసారి తిరిగి ఎన్నికైన తర్వాత బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం మొదటిసారి ప్రవేశపెడుతున్న బడ్జెట్ ఇదే. దేశ ఆర్థిక వృద్ధి, అభివృద్ధి, ఆర్థిక విధానాలపై ప్రభుత్వ విజన్ను బడ్జెట్లో వివిరించే అవకాశం ఉందని సమాచారం.లోక్సభలో ఉదయం 11 గంటలకు బడ్జెట్ సమర్పణ ప్రారంభమవుతుంది. అయితే గతంలో బడ్జెట్ను ఉదయం 11 గంటలకు సమర్పించేవారు కాదు. 1999 వరకు బడ్జెట్ను సాయంత్రం 5 గంటలకు సమర్పించే ఆనవాయితీ ఉండేది. ఆ సమయంలో అన్నీ బ్రిటీష్ ప్రభుత్వానికి అనుకూలంగా ఉండేవి. అప్పట్లో లండన్.. భారతదేశంలో ఏకకాలంలో బడ్జెట్ ప్రకటనలు ఉండేవని సమాచారం.భారతదేశం యూకే కంటే 5 గంటల 30 నిమిషాలు ముందున్నందున, భారతదేశంలో సాయంత్రం 5 గంటల సమయం GMT ఉదయం 11:30కి అనుగుణంగా ఉంది. దీని వలన బ్రిటిష్ ప్రభుత్వానికి బడ్జెట్ ప్రకటనలను సమన్వయం చేయడం సులభతరం అయ్యేది. ఇదే ప్రక్రియ భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత కూడా కొనసాగింది.1999లో అటల్ బిహారీ వాజ్పేయి నేతృత్వంలోని ప్రభుత్వంలో అప్పటి ఆర్థిక మంత్రి యశ్వంత్ సిన్హా బడ్జెట్ సమర్పణకు సంబంధించిన సమయాన్ని ఉదయం 11 గంటలకు మార్చాలని నిర్ణయించారు. భారత్ బ్రిటీష్ వారి సొత్తు కాదు, కాబట్టి లండన్ టైమ్ జోన్ను అనుసరించాల్సిన అవసరం లేదని.. బడ్జెట్ను అధ్యయనం చేయడానికి, చర్చించడానికి చట్టసభ సభ్యులు & అధికారులకు మరింత సమయం ఇవ్వాలని ఈ నిర్ణయం తీసుకున్నారు.ఫిబ్రవరి 27, 1999న యశ్వంత్ సిన్హా మొదటిసారిగా ఉదయం 11 గంటలకు కేంద్ర బడ్జెట్ను సమర్పించారు. ఈ కొత్త సమయం శాశ్వత మార్పుగా మారింది. అప్పటి నుండి, అన్ని యూనియన్ బడ్జెట్లు ఉదయం 11 గంటలకు సమర్పించడం ఆనవాయితీగా మారింది.
వీడియోలు
![TDP New Drama On Thalliki Vandanam Scheme](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/12/sc_1.jpg.webp?itok=N9vZSQkf)
![TDP New Drama On Thalliki Vandanam Scheme](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/12/sc_1.jpg.webp?itok=N9vZSQkf)
సాక్షి దెబ్బకు బెదిరిన టీడీపీ అమ్మకు వందనం తూచ్...
![AP CID Chief Sunil Kumar Tweet On Chandrababu TDP Government Filed Case On YS Jagan](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/12/te.jpg.webp?itok=mqBJojJU)
![AP CID Chief Sunil Kumar Tweet On Chandrababu TDP Government Filed Case On YS Jagan](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/12/te.jpg.webp?itok=mqBJojJU)
వీళ్ళ తెలివితేటలకు ఏమనాలో అర్థం కావటం లేదు
![Minister Sridhar Babu Slams KCR Over BRS MLAs Joinings In Congress](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/12/kr_3.jpg.webp?itok=lLMORw08)
![Minister Sridhar Babu Slams KCR Over BRS MLAs Joinings In Congress](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/12/kr_3.jpg.webp?itok=lLMORw08)
ఫిరాయింపులపై మాట్లాడే నైతిక హక్కు BRSకు లేదు - శ్రీధర్ బాబు
![Perni Nani Slams Chandrababu Pawan Kalyan and YS Sharmila](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/12/pe.jpg.webp?itok=Yvw4wGGU)
![Perni Nani Slams Chandrababu Pawan Kalyan and YS Sharmila](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/12/pe.jpg.webp?itok=Yvw4wGGU)
"ఆరడుగుల అబద్దం..' పేర్ని నాని నాన్ స్టాప్ కోటింగ్
![Drainage to Diamond Pilot Project to be Launched by Pawan Kalyan at Pithapuram](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/12/pw.jpg.webp?itok=FHHWMQU_)
![Drainage to Diamond Pilot Project to be Launched by Pawan Kalyan at Pithapuram](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/12/pw.jpg.webp?itok=FHHWMQU_)
"డ్రైనేజ్ టు డైమండ్.." పవన్ కొత్త ప్రాజెక్ట్
![Byreddy Siddharth Reddy Strong Reaction On Nandyala Girl Incident](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/12/by.jpg.webp?itok=1kYQy3Bb)
![Byreddy Siddharth Reddy Strong Reaction On Nandyala Girl Incident](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/12/by.jpg.webp?itok=1kYQy3Bb)
నంద్యాల బాలిక ఘటనపై బైరెడ్డి స్ట్రాంగ్ రియాక్షన్
![Fake Cases on YS Jagan](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/12/ca.jpg.webp?itok=ZRJxq-a_)
![Fake Cases on YS Jagan](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/12/ca.jpg.webp?itok=ZRJxq-a_)
"వీళ్లకు అది కూడా తెలియదా.." బాబును నవ్వులపాలు చేసిన రఘురామ
![Rising dengue cases In Fever Hospital](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/12/fh.jpg.webp?itok=H2-TfgKT)
![Rising dengue cases In Fever Hospital](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/12/fh.jpg.webp?itok=H2-TfgKT)
డేంజర్ బెల్స్.. ఫీవర్ హాస్పిటల్
![Gudivada Amarnath Reaction On TDP Goons Attack On Deccan Chronicle Office](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/12/n.jpg.webp?itok=_pQrtMnV)
![Gudivada Amarnath Reaction On TDP Goons Attack On Deccan Chronicle Office](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/12/n.jpg.webp?itok=_pQrtMnV)
డెక్కన్ క్రానికల్ ఆఫీస్ పై దాడి గుడివాడ రియాక్షన్
![Boat Sailing Competition in Hussain Sagar Hyderabad](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/12/tv.jpg.webp?itok=X82uB9f9)
![Boat Sailing Competition in Hussain Sagar Hyderabad](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/12/tv.jpg.webp?itok=X82uB9f9)
హుస్సేన్ సాగర్ లో బోట్ పోటీలు
న్యూస్ పాడ్కాస్ట్
![](themes/custom/sakshi/assets/images/audio.png)
ఆంధ్రప్రదేశ్లో ఇసుక మాయ... పేరుకు మాత్రమే ఉచితం.. యథేచ్ఛగా దోపిడీ చేస్తున్న అధికార తెలుగుదేశం పార్టీ నాయకులు.. ఇంకా ఇతర అప్డేట్స్
![](themes/custom/sakshi/assets/images/audio.png)
అమెరికాలో మానవ అక్రమ రవాణా కేసులో నలుగురు తెలుగు యువతీ యువకుల అరెస్టు.. ఇంకా ఇతర అప్డేట్స్
![](themes/custom/sakshi/assets/images/audio.png)
మాస్కోలో మోదీ. నేడు పుతిన్తో ప్రధాని మోదీ విస్తృతస్థాయి చర్చలు.. ఇంకా ఇతర అప్డేట్స్
![](themes/custom/sakshi/assets/images/audio.png)
వైఎస్ రాజశేఖరరెడ్డి మహోన్నత నాయకుడు... ఆయన లేరని ప్రతిరోజూ విచారిస్తూనే ఉన్నాం... సందేశం విడుదల చేసిన కాంగ్రెస్ పార్టీ అగ్రనేత సోనియా గాంధీశ.. ఇంకా ఇతర అప్డేట్స్
![](themes/custom/sakshi/assets/images/audio.png)
వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దాడులు వెంటనే ఆపండి.. పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి డిమాండ్.. టీడీపీ నాయకుల దాడిలో గాయపడిన వేంపల్లె అజయ్కుమార్రెడ్డికి పరామర్శ.. ఇంకా ఇతర అప్డేట్స్
![](themes/custom/sakshi/assets/images/audio.png)
బ్రిటన్ ప్రధానమంత్రిగా కియర్ స్టార్మర్... పార్లమెంట్ ఎన్నికల్లో లేబర్ పార్టీ ఘనవిజయం... రిషి సునాక్ రాజీనామా.. ఇంకా ఇతర అప్డేట్స్
![](themes/custom/sakshi/assets/images/audio.png)
టీ20 క్రికెట్ ప్రపంచ కప్ సాధించి స్వదేశానికి చేరుకున్న భారత జట్టు.. ముంబైలో అపూర్వ స్వాగతం పలికిన ప్రజలు.. ఇంకా ఇతర అప్డేట్స్
![](themes/custom/sakshi/assets/images/audio.png)
బ్రిటన్లో నేడే పార్లమెంట్ ఎన్నికలు... 650 స్థానాలకు జరుగనున్న పోలింగ్.. బరిలో 107 మంది బ్రిటిష్ ఇండియన్లు.. ఇంకా ఇతర అప్డేట్స్
![](themes/custom/sakshi/assets/images/audio.png)
రాహల్వి పిల్ల చేష్టలు. సానుభూతి కోసం సభలో వెక్కిళ్లు. రాహుల్పై ప్రధాని వాగ్బాణాలు.. ఇంకా ఇతర అప్డేట్స్
![](themes/custom/sakshi/assets/images/audio.png)
హిందువులమని చెప్తూనే హింసాద్వేషాలు వ్యాప్తి చేస్తున్నారని బీజేపీపై రాహుల్ ఫైర్.. ఇంకా ఇతర అప్డేట్స్