extra collection
-
సర్వీస్ చార్జీ స్వచ్ఛందమే
న్యూఢిల్లీ: హోటళ్లు, రెస్టారెంట్లు సర్వీస్ చార్జీల పేరుతో అదనంగా వసూలు చేయడాన్ని ఢిల్లీ హైకోర్టు శుక్రవారం తప్పుబట్టింది. వినియోగదారులు సర్వీస్ చార్జీలను స్వచ్ఛందంగా ఇవ్వాల్సిందే తప్ప వారి నుంచి బలవంతంగా వసూలు చేయజాలవని స్పష్టం చేసింది. బిల్లుపై అదనంగా సర్వీస్ చార్జీలంటూ వసూలు చేయరాదన్న సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (సీసీపీఏ) నిబంధనలను సవాల్ చేస్తూ రెస్తారెంట్ల సంఘాలు వేసిన పిటిషన్లపై న్యాయమూర్తి జస్టిస్ ప్రతిభా ఎం.సింగ్ ఈ మేరకు తీర్పు వెలువరించారు. ‘‘కస్టమర్లకు ఇష్టమైతే టిప్ ఇవ్వొచ్చు. అంతేతప్ప సర్వీస్ చార్జీలంటూ వసూలు చేయడం నిబంధనలకు విరుద్ధం. అసలు బిల్లులో కలపని ఈ మొత్తాన్ని జీఎస్టీ లేదా సర్వీస్ ట్యాక్స్ అని కస్టమర్లు భావించే అవకాశముంది. ఇది మోసమే అవుతుంది’’ అని జడ్జి పేర్కొన్నారు. పిటిషన్దారులైన ఫెడరేషన్ ఆఫ్ హోటల్స్ అండ్ రెస్టారెంట్ అసోసియేషన్స్ ఆఫ్ ఇండియా(ఎఫ్హెచ్ఆర్ఏఐ), నేషనల్ రెస్టారెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆండియా(ఎన్ఆర్ఏఐ)లకు చెరో రూ.లక్ష చొప్పున జరిమానా సైతం విధించారు. వినియోగదారుల సంక్షేమానికి ఉపయోగపడేలా ఈ మొత్తాన్ని సీపీపీఏ ఖాతాలో జమ చేయాలన్నారు. రెస్టారెంట్ల హక్కుల కంటే వినియోగదారుల హక్కులకే ఎక్కువ ప్రాధాన్యం ఉంటుందని తేల్చి చెప్పారు. -
ఆగని ఆసీళ్ల దందా
ఐఏఎస్ పాలనలోనూ మారని తీరు యథేచ్ఛగా అధిక వసూళ్లు అధికారుల అనుమతి లేకుండా నగదు టోకెన్లు పంపిణీ సాక్షి, రాజమహేంద్రవరం : నగర పాలక సంస్థకు కమిషనర్గా ఐఏఎస్ అధికారి విధులు నిర్వర్తిస్తున్నా నగరంలో ఆసీల దందా యథేచ్ఛగా సాగుతోంది. కాంట్రాక్టర్ల దోపిడికి చిరు వ్యాపారులు తీవ్రంగా నష్టపోతున్నారు. నగరంలోని వివిధ మార్కెట్ల వద్ద సైకిల్, మోటారు సైకిల్పై వ్యాపారాలు చేసుకునే వారు అధికారుల లెక్కల ప్రకారమే దాదాపు 4 వేల మంది ఉన్నారు. గతేడాది ఈ వ్యాపారుల నుంచి రోజుకు రూ.2 మాత్రమే వసూలు చేశారు. ప్రస్తుత ఆర్థిక ఏడాదిలో సైకిల్, మోటారు సైకిల్ రోజు ఆసీలు రూ.8కి పెంచారు. అయితే ప్రస్తుతం జాంపేట, లింగంపేట మార్కెట్ల పరిధిలో రూ.20, ఆల్కట్తోటలో రూ.40, సెంట్రల్ కూరగాయలు, పండ్లు మార్కెట్ వద్ద రూ.20, మునికుట్ల అచ్యుతరామయ్య (కంబాల చెరువు), కోరుకొండ రోడ్డులోని జయకృష్ణపురం వద్ద రూ.25 లెక్కన వసూలు చేస్తున్న విషయం ‘సాక్షి’పరిశీలనలో తేటతెల్లమైంది. జాంపేటలో టోకె¯ŒS ఇవ్వకుండానే రూ.30 లెక్కన తీసుకుంటున్నారు. వీరందరూ నగర పాలక సంస్థ పేరుతో టోకెన్లు జారీ చేస్తున్నారు. అయితే వాటిపై అధికారుల సంతకం, ఆమోద ముద్ర లేకపోవడం విశేషం. ఇప్పటికైనా నిర్ణీత రేట్ల మేరకే ఆసీలు వసూలు చేసేలా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని చిరు వ్యాపారులు కోరుతున్నారు.