fourth time
-
బంగ్లాదేశ్ ఎన్నికల్లో ‘అవామీ’ విజయం
ఢాకా: బంగ్లాదేశ్ పార్లమెంట్ ఎన్నికల్లో అధికార అవామీ లీగ్ మరోసారి ఘన విజయం సాధించింది. మొత్తం 300 పార్లమెంట్ స్థానాలకు గాను 299 స్థానాల్లో ఎన్నికలు నిర్వహించగా, అవామీ లీగ్ ఏకంగా 223 స్థానాలు సొంతం చేసుకుంది. ఎన్నికలు అదివారం జరగ్గా, సోమవారం ఓట్ల లెక్కింపు పూర్తయ్యింది. తుది ఫలితాలు వెలువడ్డాయి. పార్లమెంట్లో ప్రధాన ప్రతిపక్షమైన జతియా పార్టీ 11 సీట్లు గెలుచుకుంది. బంగ్లాదేశ్ కల్యాణ్ పార్టీ కేవలం ఒక స్థానంలో గెలుపొందింది. 62 స్థానాల్లో స్వతంత్ర అభ్యర్థులు జయకేతనం ఎగురవేశారు. అలాగే జతియా సమాజ్ తాంత్రిక్ దళ్, వర్కర్స్ పార్టీ ఆఫ్ బంగ్లాదేశ్ ఒక్కో స్థానం చొప్పున గెలుచుకున్నాయి. అవామీ లీగ్ అధినేత, ప్రధానమంత్రి షేక్ హసీనా గోపాల్గంజ్–3 నియోజకవర్గం నుంచి అఖండ విజయం సాధించారు. బంగ్లాదేశ్ పార్లమెంట్కు ఆమె ఎన్నిక కావడం ఇది ఎనిమిదోసారి కావడం విశేషం. హసీనా రికార్డు 76 ఏళ్ల షేక్ హసీనా 2009 నుంచి ప్రధానిగా కొనసాగుతున్నారు. ఇప్పుడు వరుసగా నాలుగోసారి బాధ్యతలు చేపట్టబోతున్నారు. మొత్తంగా ఆమె ప్రధాని అవుతుండడం ఇది ఐదోసారి. బంగ్లా చరిత్రలో అత్యధిక కాలం ప్రధానిగా పనిచేసిన నేతగా రికార్డు సృష్టించబోతున్నారు. మాజీ ప్రధాని ఖలీదా జియా నేతృత్వంలోని బంగ్లాదేశ్ నేషనలిస్టు పారీ్టతో పాటు మరో 15 పార్టీలు ఈసారి ఎన్నికలకు దూరంగా ఉన్నాయి. ఈసారి కేవలం 41.8 శాతం పోలింగ్ నమోదైంది. 2018 ఎన్నికల్లో 80 శాతానికి పైగా నమోదవడం విశేషం. ఇండియా గొప్ప మిత్రదేశం భారత్ తమకు గొప్ప మిత్రదేశమని బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా కొనియాడారు. ఎన్నికల్లో విజయం అనంతరం ఆమె సోమవారం మీడియాతో మాట్లాడారు. ఇరుగుపొరుగు దేశాలైన భారత్–బంగ్లాదేశ్ ఎన్నో సమస్యలను కలిసి పరిష్కరించుకున్నాయని చెప్పారు. 1971, 1975లో భారత్ తమకు అండగా నిలిచిందని గుర్తుచేశారు. తనకు, సోదరికి, కుటుంబ సభ్యులకు ఆశ్రయం కలి్పంచిందని అన్నారు. ఇండియాను తమ పక్కింటిలాంటి మిత్రదేశంగా భావిస్తామని తెలిపారు. ఇండియాతో తమకు అద్భుతమైన సంబంధాలు ఉన్నాయని వెల్లడించారు. హసీనాకు ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. బంగ్లాదేశ్తో సంబంధాల బలోపేతానికి కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు. -
జీఎస్టీ వసూళ్లు @ రూ. 1.62 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీఎస్టీ వసూళ్లు నాలుగోసారి రూ.1.60 లక్షల కోట్లు దాటాయి. సెపె్టంబర్తో పోలిస్తే అక్టోబర్లో 10 శాతం పెరిగి రూ. 1.47 లక్షల కోట్ల నుంచి రూ. 1.62 లక్షల కోట్లకు చేరాయి. ఆర్థిక శాఖ విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. గత నెల స్థూల జీఎస్టీ ఆదాయం రూ. 1,62,712 కోట్లు. ఇందులో సెంట్రల్ జీఎస్టీ రూ. 29,818 కోట్లు, రాష్ట్ర జీఎస్టీ రూ. 37,657 కోట్లు, సమీకృత జీఎస్టీ రూ. 83,623 కోట్లు, సెస్సు రూ. 11,613 కోట్లుగా ఉన్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలో (ఏప్రిల్–సెపె్టంబర్) స్థూల జీఎస్టీ వసూళ్లు గతేడాది ఇదే వ్యవధితో పోలిస్తే 11 శాతం పెరిగి రూ. 9,92,508 కోట్లకు చేరాయి. సగటున ప్రతి నెలా రూ. 1.65 లక్షల కోట్ల మేర నమోదయ్యాయి. రూ. 1.60 లక్షల కోట్ల వసూళ్లు ఇకపై సర్వసాధారణమైన విషయంగా మారవచ్చని కేపీఎంజీ పరోక్ష పన్నుల విభాగం హెడ్ అభిõÙక్ జైన్ తెలిపారు. రాబోయే పండుగ సీజన్లో వసూళ్లు మరింత పెరగవచ్చని పేర్కొన్నారు. ఎకానమీ స్థిరంగా వృద్ధి బాటన కొనసాగుతుండటాన్ని ఇది సూచిస్తుందని ఈవై ట్యాక్స్ పార్ట్నర్ సౌరభ్ అగర్వాల్ తెలిపారు. జమ్మూ .. కశీ్మర్, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్, లడఖ్లలో వసూళ్లు స్థిరంగా వృద్ధి చెందుతుండటమనేది ఆయా ప్రాంతాల్లో వినియోగం పెరుగుతోందనడానికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. -
ఆ హీరోతో నాలుగోసారి సినిమా చేస్తున్న సమంత !
Samantha Team Up With Vijay And Lokesh Kanagaraj For Thalapathy 67: తెలుగులో వరుస చిత్రాలతో దూసుకెళ్తుంది సమంత. శాకుంతలం, యశోద, ఖుషి సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న సామ్ తాజాగా ఓ తమిళ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని టాక్. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ హీరోగా నటించనున్న 67వ (Thalapathy 67) చిత్రంలో హీరోయిన్గా నటించనుందట సమంత. ‘మాస్టర్’ వంటి హిట్ చిత్రం తర్వాత లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో విజయ్ హీరోగా ఓ సినిమా రూపొందనుంది. ఈ చిత్రంలో విజయ్కి జోడీగా సమంత ఫిక్స్ అయిందని కోలీవుడ్ టాక్. ‘కత్తి, తేరి, మెర్సల్’ వంటి చిత్రాల్లో మంచి జోడీ అనిపించుకున్నారు విజయ్-సమంత. తాజా చిత్రంలో నటిస్తే వీరిద్దరూ నాలుగోసారి జత కట్టినట్లు అవుతుంది. లోకేశ్ గత సినిమాలతో పోలిస్తే ఈ చిత్రంలో హీరోయిన్ పాత్రకు ప్రాధాన్యత ఉందని సమాచారం. ఈ ఏడాది చివర్లో ఈ సినిమా సెట్స్పైకి వెళ్లనుంది. ఇదిలా ఉంటే.. సమంత లీడ్ రోల్లో నటించిన ‘శాకుంతలం, యశోద’ సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉండగా, విజయ్ దేవరకొండ సరసన చేస్తున్న ‘ఖుషి’ షూటింగ్ జరుగుతోంది. చదవండి: సమంత చేతుల మీదుగా నూనుగు మీసాల సాంగ్ రిలీజ్ -
నాలుగోసారి అవార్డు: ఫుల్ ఖుషీలో బాలీవుడ్ ఐరన్ లేడీ
అష్టకష్టాలు పడి సినీ పరిశ్రమకు వచ్చి హీరోయిన్గా సుస్థిర స్థానం సంపాదించుకున్న కంగనా రనౌత్ తన నటనతో ప్రేక్షకులను అలరిస్తూనే విమర్శకుల ప్రశంసలు కూడా పొందుతోంది. ఆమె నటనకు అందరూ ఫిదా అవుతున్నారు. దీంతో ఆమె ఇంటికి అవార్డులు పరుగెత్తుకుంటూ వెళ్తున్నాయి. తాజాగా ప్రకటించిన జాతీయ సినిమా అవార్డుల్లో నాలుగోసారి ఉత్తమ నటిగా కంగనా అవార్డు దక్కించుకుంది. హిమాచల్ ప్రదేశ్కు చెందిన కంగనా రనౌత్ ముంబైలో స్థిరపడడానికి ఎంతో కష్టపడింది. తనలోని నటనకు ప్రాధాన్యం ఉన్న సినిమాలు చేస్తూనే కథలకు కూడా కంగనా పెద్దపీట వేస్తుంటుంది. హీరోకు పోటీగా తన పాత్ర ఉండేలా చూసుకుంటోంది. ఈ విధంగా హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలకు కంగనా కేరాఫ్ అడ్రస్గా నిలుస్తోంది. ఆమె నటనకు మెచ్చి జాతీయ అవార్డులతో పాటు ఇతర అవార్డులు ఆమెను వరిస్తున్నాయి. మధుర్ భండార్కర్ దర్శకత్వంలో ‘ప్యాషన్’ సినిమాలో నటించగా కంగనాకు తొలిసారి జాతీయ ఉత్తమ సహాయ నటి అవార్డు లభించింది. అనంతరం ‘క్వీన్’ సినిమాతో ప్రేక్షకులందరినీ ఆకట్టుకున్న కంగనా జాతీయ ఉత్తమ నటి అవార్డు తొలిసారి సొంతం చేసుకుంది. ఆ తర్వాత ‘తను వెడ్స్ మను రిటర్న్స్’ సినిమాకు రెండోసారి జాతీయ ఉత్తమ నటిగా కంగనా నిలిచింది. ఇప్పుడు మణికర్ణిక, పాంగా సినిమాల్లో నటనకు గాను ఆమెకు మరోసారి భారత ప్రభుత్వం జాతీయ ఉత్తమ నటిగా గుర్తించి అవార్డు ప్రకటించింది. వీటితో కలిపి మూడుసార్లు ఉత్తమ నటిగా, ఒకసారి ఉత్తమ సహాయ నటిగా కంగనా అవార్డులు సొంతం చేసుకుంది. అవార్డు వచ్చిన సందర్భంగా ట్విటర్లో కంగనా స్పందించారు. తనను ఆదరిస్తున్న వారందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలిపారు. జాతీయ అవార్డులు 2008 ప్యాషన్ (సహాయ నటి) 2014 క్వీన్ 2015 తను వెడ్స్ మను రిటర్న్స్ 2021 మణికర్ణిక, పాంగా కంగనా సినిమాలతో పాటు దేశంలో జరిగే పరిణామాలపై తరచూ స్పందిస్తుంటింది. ఆమెపై రాజకీయ వివాదాలు కూడా ఉన్నాయి. భారత ప్రభుత్వం గతంలో పద్మశ్రీ కూడా ప్రకటించిన విషయం తెలిసిందే. ఫిల్మ్ ఫేర్ అవార్డులు ఎన్నో సొంతం చేసుకోగా.. ఫోర్బ్స్ జాబితాలో టాప్ 100లో కంగనా చోటు సంపాదించుకుంది. చదవండి: జాతీయ అవార్డులు: దుమ్మురేపిన మహేశ్బాబు, నాని #NationalFilmAwards #NationalAwards2019 #Manikarnika #Panga pic.twitter.com/nNlF7YEa3E — Kangana Ranaut (@KanganaTeam) March 22, 2021 -
బిహార్ సీఎంగా మళ్లీ నితీశ్
పట్నా: బిహార్ ముఖ్యమంత్రిగా నితీశ్ కుమార్ వరుసగా నాలుగోసారి సోమవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బొటాబొటి మెజార్టీతో నెగ్గిన ఎన్డీయే కూటమి ముందే ప్రకటించినట్టుగా సీఎం పగ్గాలు నితీశ్కే అప్పగించింది. ఆదివారం పట్నాలో జరిగిన ఎన్డీయే కూటమి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీకి ఎన్నికైన ఎమ్మెల్యేలు తమ శాసనసభా పక్ష నేతగా నితీశ్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. 243 సీట్లున్న అసెంబ్లీలో 125 సీట్ల మెజార్టీతో అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. సుపరిపాలనా దక్షుడిగా పేరు తెచ్చుకున్న నితీశ్కుమార్ కరోనా నేపథ్యంలో విధించిన లాక్డౌన్ సమయంలో వలస కార్మికుల సమస్యను ఎదుర్కోవడంలో విఫలం కావడంతో చాలా మంది ఆయనకు వ్యతిరేకమయ్యారు. గత అసెంబ్లీతో పోల్చి చూస్తే నితీశ్ పార్టీ జనతాదళ్ యునైటెడ్ (జేడీ–యూ) బలం 71 నుంచి 43కి పడిపోయింది. అయినప్పటికీ ముందుగా చేసిన నిర్ణయానికి కట్టుబడి ఎన్డీయే భాగస్వామ్య పక్షాలు మిస్టర్ క్లీన్ ముద్ర ఉన్న నితీశ్కు మళ్లీ ముఖ్యమంత్రి పదవిని అప్పగించారు. గవర్నర్ని కలుసుకున్న నితీశ్ ఎన్డీయే శాసనసభా పక్షనాయకుడిగా ఎన్నికైన వెంటనే నితీశ్ కుమార్ రాజ్భవన్కు వెళ్లి గవర్నర్ ఫాగూ చౌహాన్ను కలుసుకున్నారు. కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని ఆయనని కోరారు. ఎన్డీయే పార్టీల ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన పత్రాన్ని గవర్నర్కు సమర్పించారు. అనంతరం నితీశ్ విలేకరులతో మాట్లాడుతూ సోమవారమే తాను పదవీ ప్రమాణం చేయనున్నట్టుగా చెప్పారు. ‘‘ఎన్డీయే కూటమిలో నాలుగు పార్టీల ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన లేఖని గవర్నర్కి సమర్పించాను. గవర్నర్ ఆదేశం మేరకు సోమవారం సాయంత్రం 4–4:30 మధ్య రాజ్భవన్లో పదవీ ప్రమాణ స్వీకారం చేస్తాను’’అని చెప్పారు. ఎన్డీయే కూటమి సమావేశానికి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, పార్టీ రాష్ట్ర ఇన్ చార్జ్ భూపేంద్ర యాదవ్, ఎన్నికల ఇన్చార్జ్ ఫడ్నవీస్ హాజరయ్యారు. బీజేపీ శాసనసభా పక్ష నేతగా తార్ కిశోర్ బిహార్ ఉప ముఖ్యమంత్రి పదవి ఈసారి ఇద్దరిని వరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కతిహర్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన తార్ కిశోర్ ప్రసాద్, బెత్తాహ్ ఎమ్మెల్యే రేణుదేవిలను డిప్యూటీ సీఎంలుగా దాదాపు ఖరారు అయినట్టే. అసెంబ్లీలో బీజేపీ శాసనసభా పక్ష నాయకునిగా తార్ కిశోర్ ప్రసాద్ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడంతో ఆయనే డిప్యూటీ సీఎం పగ్గాలు చేపడతారని భావిస్తున్నారు. ఇన్నాళ్లూ డిప్యూటీ సీఎంగా వ్యవహరించిన సుశీల్ కుమార్ మోదీకి కేంద్రంలో పదవి అప్పగించే అవకాశాలున్నాయి. బీజేపీ శాసనసభ పక్ష సమావేశంలో ఆయనే ప్రసాద్ పేరు ప్రతిపాదించారు. బీజేపీఎల్పీ ఉప నేతగా రేణు దేవిని ఎన్నుకోవడంతో ఆమెకు కూడా డిప్యూటీ సీఎం పదవి లభిస్తుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఎవరీ తార్కిశోర్ ప్రసాద్ ? రాజకీయవర్గాల్లో పెద్దగా పరిచయం లేని ప్రసాద్ (52) ఎంపికపై అందరూ విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థ ఏబీవీపీ నుంచి రాజకీయాల్లోకి వచ్చిన ప్రసాద్ వెనుకబడిన కల్వార్ సామాజిక వర్గానికి చెందినవారు. కతిహర్ నుంచి వరుసగా నాలుగోసారి ఎమ్మెల్యే అయ్యారు. తార్ కిశోర్, రేణు దేవి -
డిజిటల్ విప్లవానికి భారత్ సారథ్యం
న్యూఢిల్లీ: తొలి మూడు పారిశ్రామిక విప్లవాలను అందుకోలేకపోయినప్పటికీ జియో ఊతంతో నాలుగో పారిశ్రామిక విప్లవానికి భారత్ సారథ్యం వహించగలిగే అవకాశం ఉందని రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ వెల్లడించారు. పుష్కలమైన ఐటీ సామర్థ్యాలు, అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్ కనెక్టివిటీ, చౌక స్మార్ట్ డివైజ్ల కలయిక ఇందుకు దోహదపడగలదని ఆయన పేర్కొన్నారు. నాలుగో పారిశ్రామిక విప్లవానికి భారత్ సారథ్యం వహించేందుకు కావల్సిన సరంజామాను సమకూర్చే ఉద్దేశంతోనే జియో రూపకల్పన జరిగిందని అంబానీ చెప్పారు. డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ వరల్డ్ సిరీస్ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ విషయాలు తెలిపారు. ‘దేశం ఎదుర్కొంటున్న డేటా కష్టాలకు ముగింపు పలకాలని, డిజిటల్ విప్లవాన్ని తేవాలని లక్ష్యంగా పెట్టుకుని జియో ఏర్పాటైంది. దేశవ్యాప్తంగా అత్యంత వేగవంతంగా, విస్తృతంగా కవరేజీ ఇచ్చే ప్రపంచ స్థాయి డిజిటల్ నెట్వర్క్ను మేం నిర్మించాం‘ అని అంబానీ చెప్పారు. 2జీ నెట్వర్క్ను నిర్మించేందుకు దేశీ టెలికం రంగానికి 25 ఏళ్లు పడితే... తాము కేవలం మూడేళ్లలోనే సొంత 4జీ నెట్వర్క్ను నిర్మించుకున్నామని తెలిపారు. ‘నేడు భారత్లో డేటా వినియోగం ప్రతి నెలా 6 ఎక్సాబైట్ల పైగా ఉంటోంది. జియో రావడానికి పూర్వం.. నాలుగేళ్ల క్రితం నాటి పరిస్థితులతో పోలిస్తే ఇది 30 రెట్లు ఎక్కువ. మొబైల్ డేటా వినియోగానికి సంబంధించి కేవలం నాలుగేళ్ల వ్యవధిలోనే భారత్ 155వ ర్యాంకు నుంచి అగ్రస్థానానికి చేరింది‘ అని అంబానీ చెప్పారు. తద్వారా అధునానత టెక్నాలజీలను అమలు చేసేందుకు భారత్ ఇంకా సిద్ధంగా లేదన్న అపోహలను జియో పటాపంచలు చేసిందన్నారు. -
నాలుగోసారి...
కొన్ని కాంబినేషన్స్ చాలా క్రేజీగా ఉంటాయి. అలాంటి కాంబినేషన్స్లో సినిమాలు మళ్లీ మళ్లీ రావాలనుకుంటారు ప్రేక్షకులు. తమిళ హీరో విజయ్–దర్శకుడు ఎ.ఆర్. మురుగదాస్లది అలాంటి కాంబినేషనే. ఈ ఇద్దరి కాంబోలో ‘తుపాకి’, ‘కత్తి’, ‘సర్కార్’ సినిమాలు విడుదలై బాక్సాఫీస్ దగ్గర సంచలన విజయాలు నమోదు చేశాయి. ఈ మూడూ పక్కా కమర్షియల్ సినిమాలు. కానీ సందేశం కూడా ఉండేట్లుగా చూసుకున్నారు విజయ్, మురుగదాస్. ఈ క్రేజీ కాంబినేషన్లో మరో సినిమా రానుందట. ‘సర్కార్’ చిత్రాన్ని నిర్మించిన సన్ పిక్చర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. విజయ్ నటించనున్న 65వ చిత్రమిది. ప్రస్తుతం విజయ్ హీరోగా నటించిన ‘మాస్టర్’ చిత్రం ఆడియో వేడుకను చిత్రబృందం సమక్షంలో జరపాలనుకుంటున్నారు. కరోనా కారణంగా భారీ వేడుక రిస్క్ అని యూనిట్ భావించింది. మోహన్రాజా దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఏప్రిల్ 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతానికి సినిమా థియేటర్లు మూతపడ్డాయి. షూటింగ్లు ఆగాయి. ఏప్రిల్నాటికి పరిస్థితి ఎలా ఉంటుందో? మరి ‘మాస్టర్’ చెప్పిన ప్రకారం ఏప్రిల్ 9న వస్తాడా? వాయిదా పడతాడా? చూడాలి. -
బంగ్లా ప్రధానిగా హసీనా ప్రమాణం
ఢాకా: నాలుగోసారి బంగ్లాదేశ్ ప్రధానమంత్రిగా ఎన్నికైన ఆవామీ లీగ్ అధినేత షేక్ హసీనా సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. బంగ్లా అధ్యక్షుడు మహ్మద్ అబ్దుల్ హమీద్ హసీనాతో బంగాభవన్లో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం 24 మంది కేబినెట్ మంత్రులుగా, 19 సహాయ మంత్రు లుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈసారి కేబినెట్లో 31 మంది కొత్తవారికి అవకాశం కల్పించారు. ఆవామీ లీగ్తో జతకట్టిన కూటమి పార్టీలకు చెందిన మాజీ మంత్రులకు స్థానం కల్పించలేదు. ఆవామీ లీగ్కు చెందిన వారిని మాత్రమే మంత్రులుగా ఎంపిక చేశారు. వరుసగా మూడుసార్లు, మొత్తంగా 4సార్లు బంగ్లాకు ప్రధానిగా ఎన్నికై హసీనా రికార్డు సృష్టించారు. 1996, 2008, 2014వ సంవత్సరాల్లో ఆమె ప్రధానిగా ఎన్నికయ్యారు. ఇటీవల జరిగిన బంగ్లాదేశ్ 11వ పార్లమెంటు ఎన్నికల్లో హసీనా నేతృత్వంలోని మహాకూటమి ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో మహాకూటమి 96% సీట్లను సాధించింది. ఈ ఎన్నికల్లో గెలిచేందుకు రిగ్గింగ్కు పాల్పడ్డారని, ఓటర్లను భయపెట్టి హింసకు పాల్పడ్డారని ప్రతిపక్షాలు చేసిన ఆరోపణలను హసీనా ఖండించారు. ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీ వారిపై దాడులకు పాల్పడటం, హింస చెలరేగడంపై ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తంచేసింది. -
సూపర్స్టార్తో నయన నాల్గోసారి..
సూపర్స్టార్ రజనీకాంత్తో నేటి క్రేజీ నటి నయనతార మరోసారి జత క ట్టనున్నారా? అలాంటి అవకాశం ఉందనే ప్రచారం కోలీవుడ్లో హల్చల్ చేస్తోంది. రజనీకాంత్తో ఒక్క చిత్రంలోనైనా నటించాలని చాలా మంది యువ కథానాయకులు కోరుకుంటారని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన చిత్రంలో చిన్న పాత్ర అయినా లభిస్తే చాలని ఆశ పడేవారెందరో. అంత దాకా ఎందుకు నటి త్రిష రజనీకాంత్తో నటించే అవకాశం కోసం చాలా కాలంగానే ఎదురు చూస్తున్నారు. ఈ విషయాన్ని ఇటీవల ఆమె స్వయంగా ఒక భేటీలో పేర్కొన్నారు. ఇక అందాల తార హన్సిక కూడా రజనీతో కలిసి నటించడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నట్లు తన మనసులోని మాటను స్పష్టం చేసింది. లక్కీ హీరోయిన్ నయనతారకు సూపర్స్టార్తో మరోసారి రొమాన్స్ చేసే అవకాశం అతి చేరువలో ఉన్నట్లు కోలీవుడ్ టాక్. ఈ అమ్మడు ఇప్పటికే రజనీకాంత్తో చంద్రముఖి, శివాజీ, కుచేలన్ చిత్రాలలో నటించారు. వీటిలో శివాజీ చిత్రంలో సూపర్స్టార్తో సింగిల్ సాంగ్లోనే స్టెప్స్ వేశారన్నది గమనార్హం. రజనీకాంత్ ప్రస్తుతం కబాలి, 2.ఓ చిత్రాల్లో నటిస్తున్నారు. వీటిలో కబాలి చిత్రం షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. మే చివరి వారంలో తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. ఇక శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న 2.ఓ చిత్రం వచ్చే ఏడాదిలో విడుదలయ్యే అవకాశం ఉంది. కాగా రజనీకాంత్ తదుపరి చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు, మలయాళంలో మమ్ముట్టి నయనతార జంటగా నటించిన హిట్ చిత్రం భాస్కర్ ది రాస్కెల్ చిత్ర తమిళ రీమేక్లో నటించనున్నట్లు ప్రచారంలో ఉంది. ఇందులో నయనతార హీరోయిన్గా నటించనున్నట్లు సమాచారం. ఇదే గనుక నిజం అయితే ఈ ముద్దుగుమ్మ సూపర్స్టార్తో నాలుగోసారి రొమాన్స్కు సిద్ధం అవుతున్నట్లే. అయితే భాస్కర్ ది రాస్కెల్ చిత్ర రీమేక్లో నటించే విషయమై రజనీ వర్గం నుంచి ఎలాంటి స్పందన లేదన్నది గమనార్హం. -
హిస్టారికల్ స్టోరీలో నటిస్తున్న మహేష్ ?