gajwel meeting
-
మీ ప్రేమ కావాలి
మిషన్ భగీరథ సభలో ప్రధాని మోదీతో సీఎం కేసీఆర్ సాక్షి, సంగారెడ్డి: తొలిసారిగా తెలంగాణ పర్యటనకు వచ్చిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని రూ.50 వేల కోట్లు, లక్ష కోట్లు కావాలని అడగడం లేదని... తెలంగాణపై ప్రేమ చూపిస్తే చాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు పేర్కొన్నారు. తెలంగాణలో వెనుకబడిన నిరుపేదలే ఎక్కువగా ఉన్నారని.. ఇక్కడ చేపట్టే ప్రతి పనిలో ప్రేమ, సహకారం, ఆశీర్వాదాలు కావాలని ప్రధాని మోదీని కోరారు. రాష్ట్రంలో సాగునీటి సమస్యను అధిగమించడానికి ఒక జాతీయ ప్రాజెక్టునైనా కేటాయించాలని, రాష్ట్రానికి ఎయిమ్స్, ఐఐఎంలను మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే మంజూరైన ఐటీఐఆర్ను త్వరగా ప్రారంభించేలా చర్యలు చేపట్టాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ ప్రారంభోత్సవం సందర్భంగా మెదక్ జిల్లా కోమటిబండలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేసీఆర్ ప్రసంగించారు. ‘‘తెలంగాణ ప్రజలకు ఈ రోజు ఎంతో శుభదినం. రామగుండం ఎరువుల కర్మాగారం పునః ప్రారంభాన్ని స్వాగతిస్తున్నాం. ఉత్తర తెలంగాణ ప్రజల కల అయిన కొత్తపల్లి (కరీంనగర్)-మనోహరాబాద్ (హైదరాబాద్) రైల్వేలైన్ కు శంకుస్థాపన జరగడం ఎంతో సంతోషంగా ఉంది..’’ అని పేర్కొన్నారు. పన్నుల్లో రాష్ట్రాల వాటాను 42 శాతానికి పెంచినందుకు, తెలంగాణలోని 9 జిల్లాలను వెనుకబడిన జిల్లాలుగా గుర్తించినందుకు ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. వెనుకబడిన ప్రతి జిల్లాకు రూ.50 కోట్లు మంజూరు చేశారని, మోదీ ప్రభుత్వం వల్లే తెలంగాణలో జాతీయ రహదారుల శాతం పెరిగిందని కొనియాడారు. ప్రాజెక్టులకు హడ్కో రుణం మంజూరుకు సహకరించిన వెంకయ్యనాయుడుకు ధన్యవాదాలు చెప్పారు. దేశంలో గత 40 ఏళ్లలో అవినీతి రహిత పాలన సాగినది కేవలం మోదీ రెండేళ్ల పాలనలోనేనని.. మచ్చలేని స్వచ్ఛమైన పాలన మోదీ ప్రభుత్వానిదని కొనియాడారు. తెలంగాణకు అనేక విషయాల్లో కేంద్రం నుంచి సహకారం లభిస్తోందన్నారు. తెలంగాణపై ప్రేమ చూపండి బీజేపీ సహకారంతోనే తెలంగాణ కల సాకారమైందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. 2009లో పంజాబ్లోని లుథియానాలో తొలిసారిగా మోదీని కలిశానని గుర్తుచేసుకున్నారు. ‘‘అప్పుడు తెలంగాణ పోరాటం ధర్మ యుద్ధమని నరేంద్ర మోదీ చెప్పిన మాటలు నాకు గుర్తున్నాయి. ఇప్పుడు నేను బాధ్యత గల ముఖ్యమంత్రిని. మాకు కేంద్రం నుంచి రూ.50 వేల కోట్లు కావాలి, లక్ష కోట్లు కావాలని కోరబోం. మాకు మీ ప్రేమ, ఆశీర్వాదాలు కావాలి. తెలంగాణలో వెనుకబడిన నిరుపేదలే ఎక్కువగా ఉన్నారు. ఇక్కడ చేపట్టే ప్రతి పనిలో మోదీ ప్రేమ, సహకారం, ఆశీర్వాదాలు కావాలి...’’ అని కేసీఆర్ కోరారు. ప్రధాని ఆశీస్సులుంటే తెలంగాణ రాష్ట్రం నంబర్వన్ అవుతుందని.. తెలంగాణలో చేపట్టే కార్యక్రమాలకు కేంద్రం మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ‘మోదీ’ అంటేనే సంతోషం: దత్తాత్రేయ సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ‘మోదీ అంటేనే సంతోషం’ అని కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ అభివర్ణించారు. మిషన్ భగీరథ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన స్వాగతోపన్యాసం చేశారు. తెలంగాణ ఏర్పడ్డాక తొలిసారి ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రానికి రావడం ఎంతో సంతోషకరమని పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధిస్తాయని చెప్పారు. పార్టీలు వస్తుంటాయి.. పోతుంటాయని, కానీ ప్రజలు మాత్రం స్థిరమని, ప్రభుత్వాలు రాజకీయాలు పక్కన పెట్టి ప్రజల కోసమే పనిచేయాలని సూచించాఉ. గోదావరి జలాలు సముద్రంలో కలవకుండా తెలంగాణ బీడు భూముల్లో పారేలా చేయాలని ప్రధానిని ఆయన కోరారు. చిందేసిన ‘రసమయి’ కోమటిబండ సభావేదికపైకి ప్రధాని, ప్రముఖులు రాకముందు తెలంగాణ సాంస్కృతిక సారథి రసమ రుు బాలకిషన్ ఆధ్వర్యంలో కొనసాగిన ఆటాపాటా సభికులను ధూంధాంలో ముంచెత్తాయి. రసమరుు కూడా చిందేసి వారిని ఉత్సాహపరిచారు. చిన్నీ నా బతుకమ్మా, పచ్చపచ్చని పల్లె.. పచ్చాని పల్లే, మావురాల ఎల్లమ్మ వంటి పాటలను తెలంగాణ పథకాలపై తమదైన శైలిలో పాడారు. కాగా, యాంకర్లు తీన్మార్ సత్తి, సావిత్రిలు తమదైన శైలిలో సభికులను ఆకట్టుకున్నారు. తమ సరదా సంభాషణతో ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను వివరించారు. అత్యుత్తమ విధానాలతో ముందుకెళుతున్నాం టీఎస్ ఐపాస్ ద్వారా అత్యుత్తమ పారిశ్రామిక విధానం రూపొందించామని సీఎం కేసీఆర్ చెప్పారు. పారిశ్రామిక రంగానికి వెన్నుదన్నుగా తమ ప్రభుత్వం నిలుస్తోందన్నారు. ఐటీ రంగంలో దేశంలో ప్రథమ స్థానానికి చేరుకోవడానికి తెలంగాణ వేగంగా అడుగులు వేస్తోందని చెప్పారు. సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యత ఇస్తోందని.. సంక్షేమ కార్యక్రమాల కోసం ఏటా రూ.30వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని కేసీఆర్ తెలిపారు. వేదికపై ఎవరెవరు? ప్రధాని మోదీ ప్రసంగించిన ప్రధాన వేదిక మీద గవర్నర్ నరసింహన్, కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, అనంత్కుమార్, పీయూష్ గోయల్, సురేష్ప్రభు, బండారు దత్తాత్రేయ, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్రెడ్డి, మంత్రులు హరీశ్రావు, జగదీశ్రెడ్డి, మహేందర్రెడ్డి, మెదక్ జెడ్పీ చైర్పర్సన్ రాజమణి కూర్చున్నారు. పక్కనే ఉన్న మరో వేదికపై మంత్రులు కేటీఆర్, లక్ష్మారెడ్డి, పోచారం శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వర్రావు, జూపల్లి కృష్ణారావు, అంచనాలు, పద్దుల కమిటీ చైర్మన్ సోలిపేట రామలింగారెడ్డి, ఎంపీలు, ఎమ్మెల్యేలు కూర్చున్నారు. ప్రధాని తెలుగులో.. సీఎం హిందీలో! సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: మిషన్ భగీరథ వేదికపై విచిత్ర సంఘటన చోటుచేసుకుంది. ప్రధాని మోదీని ఆకర్షించేందుకు సీఎం కేసీఆర్ పూర్తిగా హిందీలో ప్రసంగించగా, ప్రధాని మాత్రం కొన్ని పదాలు తెలుగులో మాట్లాడి ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ‘సోదర సోదరీమణులారా తెలంగాణ ఏర్పడిన తరువాత మొదటిసారి ఇక్కడికి రావడం సంతోషంగా ఉంది. తెలంగాణ ప్రజలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు’ అని తెలుగులో మాట్లాడారు. ఆయన మాటలకు సభికుల నుంచి భారీ స్పందన లభించింది. ఇక 17 నిమిషాల పాటు ప్రసంగించిన సీఎం మాత్రం ఒకటి రెండు వాక్యాలు మినహా హిందీలోనే మాట్లాడితన వాక్చాతుర్యంతో మోదీని ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ‘మేం మీ ప్రేమ, ఆశీర్వాదం తప్ప అవి కావాలి.. ఇవి కావాలి అని అడగం’ అంటూనే ఐటీఐఆర్, జాతీయ సాగునీటి ప్రాజెక్టు, ఎయిమ్స్ కావాలని కోరారు. మధ్యాహ్నాం 2.59 గంటలకు హెలిప్యాడ్ దిగిన మోదీ అక్కడి నుంచి నేరుగా కాన్వాయ్లో కోమటిబండ గుట్ట మీదికి చేరుకున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన ఏర్పాటు చేసిన ‘మిషన్ భగీరథ’ పైలాన్ను సీఎంతో కలసి ప్రధాని ఆవిష్కరించారు. తెలంగాణ వాటర్ గ్రిడ్ పథకం పనుల తీరు, ప్రాముఖ్యాన్ని వివరించే ఫొటో ఎగ్జిబిషన్ను మోదీ తిలకించారు. కేసీఆర్ దగ్గరుండి మరీ ప్రతీ చిత్రాన్ని మోదీకి చూపిస్తూ మిషన్ భగీరథ పథకం అంకురార్పణ జరిగిన తీరును కళ్లకు కట్టినట్లు వివరించారు. సాదాసీదాగా కేటీఆర్ మోదీ సభలో సీఎం కేసీఆర్ తనయుడు, మంత్రి కేటీఆర్ సాదాసీదాగా వ్యవహరించారు. మోదీ ప్రసంగించే వేదికపైకి వెళ్లకుండా స్టేజీకి ఎడమవైపున మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎ మ్మెల్సీలకు కేటాయించిన వేదికపై కూర్చున్నా రు. కేటీఆర్తో పాటు మంత్రులు పోచారం, జూ పల్లి, తుమ్మల కూర్చున్నారు. జనం తాకిడితో మంత్రులకు సైతం ఇబ్బందులు తప్పలేదు. ప్రధానికి నెమలి సింహాసనం సాక్షి, హైదరాబాద్: ప్రధాని ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారమే హైదరాబాద్కు చేరుకున్నారు. అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో మధ్యాహ్నం 3 గంటలకు కోమటిబండకు వచ్చారు. ఐదుగురు కేంద్ర మంత్రులు, గవర్నర్ నరసింహన్, సీఎం కేసీఆర్లతో కలసి గుట్టపైకి వెళ్లారు. ఈ సందర్భంగా వేద పండితులు ప్రధానికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అంతకు ముందే అక్కడ నిర్వహించిన సుదర్శన యాగం భస్మ ప్రసాదాన్ని అందించారు. అనంతరం ప్రధాని మిషన్ భగీరథ పైలాన్ను ఆవిష్కరించి... నల్లా నుంచి నీటిని విడుదల చేశారు. తర్వాత మిషన్ భగీరథ ఫోటో ఎగ్జిబిషన్ను తిలకించారు. తర్వాత బహిరంగ సభ వేదిక వద్దకు వచ్చారు. ఈ సభకు జనం భారీగా తరలివచ్చారు. దాదాపు ఎనిమిది కిలోమీటర్ల పొడవునా వాహనాలన్నీ ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ఇక సభలో మంత్రి హరీశ్రావు వ్యాఖ్యాతగా వ్యవహరించారు. మంత్రులు జగదీశ్రెడ్డి, మహేందర్రెడ్డి, లక్ష్మారెడ్డి, మండలి చైర్మన్ స్వామిగౌడ్, డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్రెడ్డి, మిషన్ భగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్రెడ్డి, ఎంపీలు కేశవరావు, జితేందర్రెడ్డి, ప్రభాకరరెడ్డి ప్రధాన వేదికపై ఆసీనులయ్యారు. కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ స్వాగతోపన్యాసం చేశాక, సీఎం కేసీఆర్ మాట్లాడారు. అనంతరం ప్రధాని మోదీ 36 నిమిషాల పాటు మాట్లాడారు. ప్రసంగం పూర్తయ్యాక ప్రధానిని సీఎం కేసీఆర్ సన్మానించారు. శాలువా కప్పి, తలపాగా పెట్టి, నెమలి సింహాసనాన్ని కానుకగా ఇచ్చారు. అనంతరం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్శర్మ ధన్యవాదాలతో సభ ముగిసింది. -
అండగా ఉంటాం
* అభివృద్ధి మంత్రమే అన్నింటికీ పరిష్కారం: ప్రధాని మోదీ * రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే ప్రతి పనిలో వెన్నంటే ఉంటాం సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం చేపట్టే ప్రతి అభివృద్ధి పనిలో కేంద్ర ప్రభుత్వం వెన్నంటి ఉంటుందని ప్రధాని నరేంద్రమోదీ ఉద్ఘాటించారు. భుజం భుజం కలిపి కలిసికట్టుగా పని చేస్తుందని అన్నారు. ‘ఢిల్లీ మీకెంతో దూరంలో లేదు. హైదరాబాద్ మీకు ఎలాంటిదో.. ఢిల్లీ కూడా అలాంటిదే..’ అని అంటూ ప్రజలకు భరోసానిచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పరస్పర సహకారంతో దేశం అత్యున్నత శిఖరాలను చేరుతుందన్నారు. అభివృద్ధి మంత్రమే అన్నింటికీ సమాధానం చెబుతుందని పేర్కొన్నారు. అభివృద్ధిలో ఒక రాష్ట్రంతో మరో రాష్ట్రం పోటీ పడటం చూస్తే తనకు ఆనందంగా ఉందని, రాష్ట్రాల మధ్య ఆరోగ్యకరమైన ఈ పోటీ దేశ అభ్యున్నతికి దోహదపడుతుందన్నారు. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇదే తరహాలో అభివృద్ధికి పోటీ పడాలని ఆకాంక్షించారు. రాష్ట్రాలు రాష్ట్రాలతోనే కాదు.. కేంద్రంతోనూ పోటీ పడాలన్నారు. మెదక్ జిల్లా గజ్వేల్ మండలం కోమటిబండలో ఆదివారం మిషన్ భగీరథ కార్యక్రమాన్ని ప్రధాని మోదీ ప్రారంభించారు. ఇదే సందర్భంగా రామగుండంలోని 1,600 మెగావాట్ల ఎన్టీపీసీ థర్మల్ విద్యుత్ కేంద్రం, రామగుండం ఎరువుల కర్మాగారం పునరుద్ధరణ, మనోహరాబాద్-కొత్తపల్లి రైల్వే లైన్ శంకుస్థాపన ఫలకాలను ఆవిష్కరించారు. వీటితోపాటు వరంగల్లోని కాళోజీ హెల్త్ యూనివర్సిటీ ప్రారంభం, ఆదిలాబాద్ జిల్లా జైపూర్లోని 1,200 మెగావాట్ల సింగరేణి విద్యుత్ కేంద్రాన్ని జాతికి అంకితం చేసే శిలాఫలకాలను ఆవిష్కరించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన భారీ బహిరంగలో సభలో ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ప్రజలను ఆకట్టుకునేందుకు ప్రసంగాన్ని తెలుగులో ప్రారంభించారు. ‘సోదర సోదరీమణులారా.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారి ఇక్కడికి రావటం చాలా సంతోషంగా ఉంది. తెలంగాణ ప్రజలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు’ అని అన్నారు. తర్వాత హిందీలో 36 నిమిషాల పాటు మాట్లాడారు. ప్రధాని ప్రసంగం ఆయన మాటల్లోనే.. రెండేళ్లలోనే ఎన్నో పనులు తెలంగాణ రెండేళ్ల పసిబిడ్డ. దేశంలో అతి తక్కువ వయసున్న రాష్ట్రం. ఇంత తక్కువ సమయంలోనే ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ముందడుగు వేస్తోంది. ప్రజల నమ్మకానికి అనుగుణంగా ఈ ప్రభుత్వం కృషి చేస్తోందనే విశ్వాసం నాకుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేయిచేయి కలిపి ముందడుగు వేస్తే వచ్చే ఫలితానికి నేడు ఇక్కడ ఆవిష్కరించిన అభివృద్ధి కార్యక్రమాలే నిదర్శనం. నీరు, విద్యుత్, ఎరువులు.. ఈ కార్యక్రమం పంచశక్తుల ఆవిష్కారాన్ని తలపించింది. కేంద్ర రాష్ట్రాల సంబంధాలకు ఇది అసలైన ప్రతీక. సహకార సమాఖ్యకు నిదర్శనం. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు తెలంగాణ ప్రభుత్వం ఎన్నో పనులు చేపట్టింది. అవన్నీ సఫలం కావాలని కోరుకుంటున్నాను. అమ్మ కన్నా ఆవు మిన్న ఆవులు ఉంటే మన దేశ సంపద పెరిగినట్లే. ఆవును వ్యవసాయంతో అనుసంధానం చేయాలి. అమ్మ చిన్నప్పుడు కొన్నేళ్లు తన పిల్లలకు పాలు అందిస్తుందని, కానీ ఆవు మాత్రం జీవితాంతం పాలిస్తుందని గాంధీ చెప్పారు. రైతులకు భూమిని మించిన తల్లి లేదు. అందుకే భూసార పరీక్షలు ప్రవేశపెట్టాం. ఆవు పేడ, మూత్రం భూసారాన్ని పెంచుతాయి. ఆవును వ్యవసాయంతో అనుసంధానం చే స్తే భూమి ఆరోగ్యం బాగుపడుతుంది. పంటలు సమృద్ధిగా పండితే అది దేశ ఆర్థికాభివృద్ధికి దోహదపడుతుంది. తద్వారా ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతాయి. ఆలమంద ఉంటే మన సంపద రెట్టింపయినట్లే. ఇప్పుడు మిగులు విద్యుత్ నిన్నటి వరకు విద్యుత్ కొరతతో ఉన్న రాష్ట్రాలు ఇప్పుడు మిగులు విద్యుత్ రాష్ట్రాలు అయ్యాయి. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ సారథ్యంలో విద్యుత్ రంగంలో చేపట్టిన సంస్కరణలతోనే ఇది సాధ్యమైంది. తెలంగాణ ఏర్పడిన సమయంలో ఒక్కో యూనిట్ విద్యుత్ రూ.11.50కు అందుబాటులో ఉంటే.. ఇప్పుడు కేవలం ఒక రూపాయి పది పైసలకే లభ్యమవుతోంది. ప్రపంచంలో ఇప్పుడు తాగునీటి సమస్య నెలకొంది. నీరు, సౌర శక్తి ప్రకృతి ప్రసాదించిన వరాలు. సౌరశక్తిని ఒడిసిపడితేనే భవిష్యత్తు అవసరాలకు భరోసా ఉంటుంది. రెండేళ్ల కిందటి వరకు దేశంలో కేవలం 1,000 మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి కాగా.. ఇప్పుడు 3 వేల మెగావాట్లు ఉత్పత్తి అవుతోంది. సౌర విద్యుత్ సాయంతో మిషన్ భగీరథను ముందుకు తీసుకెళ్లాలి. దీంతో కరెంటు చార్జీలు తగ్గుతాయి. కొరత లేకుండా చేశాం గతంలో ప్రభుత్వాలు ఎరువులపై సబ్సిడీలు ఇచ్చేవి. కానీ ఆ సబ్సిడీ రైతులకు చేరేది కాదు. ఎందుకంటే ఎరువులే అందుబాటులో ఉండేవి కాదు. ఎరువుల్లేనప్పుడు సబ్సిడీలు ఇచ్చి ఏం లాభం? దేశంలో ఇప్పుడు ఎక్కడా ఎరువుల కొరత లేదు. రైతులకు సరసమైన ధరల్లో ఎరువులు అందించేందుకు కృషి చేస్తున్నాం. వేపపూత ఉన్న ఎరువులతో భూసారం పెరిగింది. నాలుగేళ్ల కిందట నేను గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు యూరియా కొరత ఉండేది. తమ రాష్ట్రాలకు యూరియా కేటాయించాలని సీఎంలు ప్రధానికి లేఖలు రాసేవారు. గడిచిన రెండేళ్లలో యూరియా కోసం ముఖ్యమంత్రి లేఖలు రాసే అగత్యం రాలేదు. గతంలో ఎరువులు బ్లాక్ మార్కెట్లో కొనుగోలు చేయాల్సి వచ్చేది. రైతులు రాత్రింబవళ్లూ క్యూలో నిలబడాల్సి వచ్చేది. ఎరువుల కర్మాగారాల్లో అవినీతి, గోదాముల్లో చోరీలు, అగ్నిప్రమాదాలు జరిగేవి. తెలంగాణలో ఇప్పటివరకు ఎరువుల కర్మాగారం లేదు. ఎరువులు అందుబాటులోకి తెచ్చేందుకు రామగుండంలో ఎరువుల ఫ్యాక్టరీని పునరుద్ధరిస్తున్నాం. రైల్వే లైన్లు పూర్తి చేసి చూపిస్తాం ఎంతోకాలంగా తెలంగాణ అడుగుతున్న రైల్వే లైన్లను పూర్తి చేసి చూపిస్తాం. గతంలో ఎందరో ప్రధానులు వచ్చిపోయినా ఈ రైల్వేలైన్కు మోక్షం రాలేదు. దేశంలో ఆర్థికాభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని రైల్వే లైన్లను అనుసంధానం చేస్తున్నాం. నిర్దేశిత సమయంలో రైల్వే ప్రాజెక్టులు పూర్తి చేస్తాం. తెలంగాణలో పెండింగ్లో ఉన్నవి పూర్తి చేస్తాం. గోరక్షణ పేరుతో దాడులు సరికాదు గోసంరక్షణ పేరుతో భారతీయ సమాజాన్ని చీల్చేందుకు కొందరు నకిలీ గోరక్షకులు కుట్ర పన్నుతున్నారు. గోరక్షణ పేరుతో చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. వారి పట్ల అసలైన గోరక్షకులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. నకిలీ వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. అలాంటివారివల్ల అందరికీ చెడ్డపేరు వస్తుంది. వారిని సమాజం నుంచి వెలివేయాలి. గోరక్షణ పేరుతో జరుగుతున్న దాడులు సరైనవి కావు. మీ ఆటలు కట్టిపెట్టండి. ఘర్షణ వాతావరణం సృష్టించే వారి పట్ల రాష్ట్ర ప్రభుత్వాలు కఠినంగా వ్యవహరించాలని కోరుతున్నా. హామీల్లేని ప్రధాని ప్రసంగం కేంద్ర, రాష్ట్రాల మధ్య సంబంధాలపై ప్రధాని, ముఖ్యమంత్రి పరస్పరం సంతృప్తి వ్యక్తం చేసినప్పటికీ.. ప్రధాని తెలంగాణకు ఒక్క హామీ కూడా ఇవ్వకపోవడం ప్రజలను నిరాశకు గురి చేసింది. ప్రభుత్వం నడపడంలో ఇబ్బందులు తనకు తెలుసని.. అది కావాలి, ఇది కావాలని తాను అడగటం లేదని కేసీఆర్ తన ప్రసంగంలో పేర్కొన్నారు. రూ.50 వేల కోట్లు, లక్ష కోట్లు కావాలని కోరడం లేదంటూనే.. ప్రధానంగా మూడు అంశాలను లేవనెత్తారు. సాగునీటి కొరత తీర్చేందుకు రాష్ట్రంలో ఒక సాగునీటి ప్రాజెక్టుకు జాతీయ హోదా ప్రకటించాలని కోరారు. ఎయిమ్స్ ఏర్పాటు చేయాలని, మిషన్ కాకతీయకు ఆర్థిక సాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. గతంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఐటీఐఆర్ హామీని అమలు చేయాలన్నారు. అయితే వీటిలో ఏ ఒక్క విషయాన్ని కూడా ప్రధాని తన ప్రసంగంలో ప్రస్తావించకపోవడం గమనార్హం. ప్రధాని ఎక్కువగా జాతీయ స్థాయి అంశాలనే ప్రస్తావించారు. తెలంగాణలో ఉన్న పెండింగ్ రైల్వే లైన్లను పూర్తి చేస్తామన్న ఒక్క హామీ మాత్రమే ఇచ్చారు. సాగు, తాగునీరే కేసీఆర్ మిషన్ ఈ రెండేళ్లలో కేసీఆర్ ఎన్నోసార్లు నన్ను కలిశారు. ప్రతిసారీ తెలంగాణ అభివృద్ధి గురించే మాట్లాడారు. ప్రధానంగా నీటి అంశాన్ని ప్రస్తావించేవారు. నీటి విషయం ఎత్తినప్పుడల్లా కేసీఆర్ భావోద్వేగానికి లోనయ్యేవారు. ప్రతిసారి అభివృద్ధి, సాగు, తాగునీటి గురించే మాట్లాడారు. తెలంగాణకు సాగు, తాగు నీరందించడమే ఆయన మిషన్ అని నాకు అర్థమైంది. మిషన్ భగీరథ గురించి చాలాసార్లు చెప్పారు. గుజరాత్లో మంచినీటి సరఫరాను పరిశీలించేందుకు ఓ టీమ్ను పంపించినట్లు చెప్పారు. అదే తీరుగా రాష్ట్రంలో ఇంటింటికీ తాగునీరు అందించాలని లక్ష్యంగా ఎంచుకున్నారు. సంకల్పం ఉంటే ఏదైనా చేయొచ్చనేందుకు ఇది నిదర్శనం. నీరుంటే మట్టిలోంచి బంగారం.. రైతులకు నీరివ్వడం ఓ బృహత్తర కార్యక్రమం. దేశానికి రైతులే పట్టుగొమ్మలు. అందరికీ నీటిని అందించటం మన బాధ్యత. అందుకే ప్రధాన మంత్రి కృషి సించాయ్ యోజన. నీటిని కాపాడుకుంటేనే భవిష్యత్తు ఉంటుంది. నీరుంటే మట్టి నుంచి బంగారం తీయొచ్చు. పొలానికి నీరు అందితే రైతులు బంగారం పండిస్తారు. జలమే జీవం. నీళ్లున్నంత వరకు నీటి విలువ తెలియదు. లేనపుడు దాని విలువ తెలుస్తుంది. గాంధీ పుట్టిన పోర్బందర్కు వెళ్లి చూస్తే ఒక్కో నీటి బొట్టును ఎలా సంరక్షిస్తున్నారో అర్థమవుతుంది. రెండు వందల ఏళ్ల కిందటే వాన నీటి సంరక్షణకు వివిధ మార్గాలు అనుసరించటం గొప్ప విషయం. అప్పుడు నీటి కొరత లేకున్నా.. అనుసరించిన మార్గాలు యావత్ దేశానికి ఇప్పటికీ ఆదర్శంగా నిలుస్తున్నాయి. ప్రతి నీటి బొట్టును వ్యవసాయానికి మళ్లిస్తే గ్రామాల్లో జీవన ప్రమాణాలు మారిపోతాయి. ట్వీట్లతో ధన్యవాదాలు రాష్ట్రంలో పర్యటన అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు తెలిపారు. గత రెండేళ్లుగా దేశంలో ప్రధాని మోదీ ఆధ్వర్యంలో అవినీతి రహిత పాలన సాగుతోందని కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను తెలంగాణ సీఎంవో ట్వీటర్లో పోస్ట్ చేసింది. దానిపై స్పందించిన ప్రధాని మోదీ.. ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలుపుతూ రీ ట్వీట్ చేశారు. -
'నాయకులు వస్తారు.. పోతారు'
మెదక్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యమని కేంద్రమంత్రి దత్తాత్రేయ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన మిషన్ భగీరథ పథకం ప్రారంభం సందర్భంగా కోమటిబండలో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో దత్తాత్రేయ ప్రారంభ ఉపన్యాసం చేశారు. మొదటిసారి తెలంగాణకు ప్రధాని మోదీ రావడం చాలా సంతోషంగా ఉందని దత్తాత్రేయ అన్నారు. తెలంగాణ ప్రజలకు కష్టపడే పనిచేసే సత్తా ఉంటుందని, కల్లా కపటం తెలియన వారని చెప్పారు. రాష్ట్రాలు భాగాలు అయితే, కేంద్రం అనేది తలకాయలాంటిదనే ఇవి రెండు సమన్వయంతోనే పనిచేస్తేనే మనుగడ సాధ్యం అని అన్నారు. ఒక చాయ్ అమ్మిన వ్యక్తి ప్రధానిగా మారాడంటే అది భారత దేశ, భారత ప్రజల గొప్పతనమే అని దత్తాత్రేయ చెప్పారు. నాయకులు వస్తుంటారు పోతుంటారని, కానీ ప్రజలు మాత్రం ఎప్పటికీ ఉంటారని, వారి శ్రేయస్సే ముఖ్యం అని దత్తాత్రేయ చెప్పారు. అలా ప్రజల శ్రేయస్సే ముఖ్యంగా నమ్మి పనిచేసే వ్యక్తి ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. -
తెలంగాణ రెండేళ్ల పసిబిడ్డ: మోదీ
గజ్వేల్: తెలంగాణ రెండేళ్ల పసిబిడ్డ అని ప్రధాని మోదీ అన్నారు. భారత దేశంలో అతి తక్కువ వయసున్న రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇక్కడికి రావడం తనకు చాలా సంతోషంగా ఉందని చెప్పారు. మిషన్ భగీరథ కార్యక్రమం ప్రారంభం సందర్భంగా జరిగిన బహిరంగ సభలో ప్రధాని మోదీ మాట్లాడారు. ఈ సందర్భంగా వేదికపై ఉన్నవారందరినీ తెలుగులో సంబోధించడమే కాకుండా సభకు వచ్చిన ప్రజలందరికీ తెలుగులో శుభాకాంక్షలు చెప్పారు. ఇక్కడ ఐదు పథకాలు ప్రారంభించడంతో తనకు ఈ రోజు పంచభూతాల దర్శనం అయిందని చెప్పారు. కేంద్రం, తెలంగాణ ప్రభుత్వాలు కలిసి పనిచేస్తున్నాయని అన్నారు. దీనిని సహకార సమాఖ్య అంటారని చెప్పారు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో పనులు చేపట్టిందని అన్నారు. అవన్నీ సఫలం కావాలని కోరుకుంటున్నానని చెప్పారు. తన దగ్గరకు వచ్చినప్పుడల్లా ముఖ్యమంత్రి కేసీఆర్ అభివృద్ధి గురించి మాట్లాడేవారని అన్నారు. కేసీఆర్ సీఎం అయినప్పటి నుంచి నన్ను కలిసినప్పుడల్లా ఇదే విషయం మాట్లాడేవారని చెప్పారు. నీళ్ల విషయంలో సీఎం కేసీఆర్ భావోద్వేగంతో ఉండేవారని అన్నారు. మిషన్ భగీరథ గురించి చాలా సార్లు చెప్పారని, తన దగ్గరకొచ్చి గుజరాత్ లో మంచినీటి సరఫరా గురించి పరిశీలించేందుకు ఓ టీంను పంపించానని చెప్పారన్నారు. నీళ్లుంటే మట్టి నుంచి బంగారం తీయొచ్చని వివరించారు. విద్యుత్ కోసం తాము యూనిట్ 11 రూపాయలు చెల్లించాల్సి వచ్చేదని తాము తెచ్చిన సంస్కరణలతో 1.45రూపాయలకు ఇప్పుడు ఒక యూనిట్ విద్యుత్ లభిస్తోందని అన్నారు. చాలా ఏళ్లుగా కోరుకుంటున్న రైల్వే లైన్ ఇప్పటి వరకు రాలేదని, నేడు దానికి శంకుస్థాపన జరిగిందని, గతంలో ఎందరు ప్రధానులు వచ్చిపోయినా ఇలా జరగలేదని, ఈ రైల్వే లైన్ కు మోక్షం కలగలేదని అన్నారు. దేశం అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని రైల్వేకు ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పారు. తెలంగాణ చరిత్రలో తొలిసారి ఫర్టిలైజర్ ప్లాంట్ ప్రారంభకాబోతుందని, గతంలో వచ్చిన వారు చెప్పినా అవి మాటలకే పరిమితమయ్యాయని అన్నారు. సబ్సిడీకి ఎరువులు ఇస్తామని మోసం చేశారని, కానీ తాము ఎరువులు ఇచ్చే కార్యక్రమం ప్రారంభించినట్లు వివరించారు. ఇప్పుడు ఏ సీఎంలు యూరియా కోసం కేంద్రానికి లేఖ రాయడం లేదని, సీఎం కేసీఆర్ లాంటి వారు కేంద్రంలో అవినీతి లేదని అంటున్నారని చెప్పారు. -
హిందీలో కేసీఆర్ ప్రసంగం..
-
హిందీలో కేసీఆర్ ప్రసంగం..
గజ్వేల్: మిషన్ భగీరథ మహోన్నత కార్యక్రమమని, వాటర్ గ్రిడ్ ద్వారా ఇంటిఇంటికి స్వచ్ఛమైన తాగునీరు అందిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు అన్నారు. తెలంగాణకు ఈ రోజు శుభదినమని పేర్కొన్నారు. ప్రధాని మోదీని, కేంద్ర మంత్రులను కేసీఆర్ ప్రశంసల్లో ముంచెత్తారు. మెదక్ జిల్లా గజ్వేల్లో జరిగిన బహిరంగ సభలో కేసీఆర్ మాట్లాడారు. హిందీలో తన ప్రసంగాన్ని ప్రారంభించిన కేసీఆర్.. తన పక్షాన, తెలంగాణ ప్రజల పక్షాన ప్రధాని నరేంద్ర మోదీకి హృదయపూర్వక స్వాగతం చెబుతున్నానని అన్నారు. సభలో కేసీఆర్ హిందీలోనే ఎక్కువసేపు మాట్లాడారు. కోమటిబండలో పలు అభివృద్ధి పథకాలను మోదీ ప్రారంభించిన అనంతరం ఆయనతో కలసి బహిరంగ సభ వేదిక వద్దకు చేరుకున్నారు. ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్తో పాటు గవర్నర్ నరసింహన్, కేంద్రమంత్రులు వెంకయ్య నాయుడు, దత్తాత్రేయ, అనంతకుమార్, సురేష్ ప్రభు, పీయూష్ గోయెల్, రాష్ట్ర మంత్రులు సభలో పాల్గొన్నారు. సభలో కేసీఆర్ మాట్లాడుతూ.. చాలా అంశాల్లో రాష్ట్రాలకు కేంద్రం చేయూతనిస్తోందని, రాష్ట్రాల తరపున ప్రధాని మోదీకి ధన్యవాదాలు చెబుతున్నానని అన్నారు. మోదీ నాయకత్వంలో దేశంలో అవినీతిరహిత పాలన సాగుతోందని, ఈ ఘనత ప్రధానిదేనని చెప్పారు. తెలంగాణలో జాతీయ రహదారులు అభివృద్ధిచెందుతున్నాయని కేసీఆర్ పేర్కొన్నారు. కొత్త రాష్ట్రంపై ప్రధాని అభిమానం చూపాలని, అవసరమైనపుడు కేంద్రం సాయం కోరుతామని చెప్పారు. ఐటీఐఆర్, ఎయిమ్స్కు ప్రధాని ఆశీస్సులు కావాలని, తెలంగాణకు ఒక జాతీయ ప్రాజెక్టు కేటాయించాలని కోరారు. 2009లో మోదీని తొలిసారి కలిశానని, తెలంగాణ ఉద్యమానికి మద్దతు పలికారని వెల్లడించారు. అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించేందుకు రావాలని అడిగిన వెంటనే మోదీ అంగీకరించారని, వచ్చినందుకు మోదీకి ధన్యవాదాలు చెబుతున్నాని అన్నారు.