global warning
-
ముంపు అంచున అగ్రరాజ్యం
భూతాపోన్నతి, కాలుష్యం, కార్చిచ్చులు అన్నీ కలిసి ధ్రువపు మంచును వేగంగా కరిగించేస్తున్నాయి. కొత్తగా వచి్చచేరిన నీటితో సముద్ర మట్టాలు అమాంతం పెరిగి తీరప్రాంతాలను తమలో కలిపేసుకోనున్నాయి. ఇలా సముద్రమట్టాల పెరుగుదలతో ముంపు ముప్పును అమెరికాలోని 24 తీరప్రాంత నగరాలు ఎదుర్కోనున్నాయని తాజా అధ్యయనం ఒకటి ప్రమాదఘంటికలు మోగించింది. ఇప్పటికైనా తేరుకోకపోతే అనూహ్యంగా పెరిగే సముద్రమట్టాలను ఆపడం ఎవరితరమూ కాదు. అమెరికాలోని ప్రభావిత 32 తీరనగరాలకుగాను 24 నగరాల వెంట సముద్రమట్టం ప్రతిసంవత్సరం 2 మిల్లీమీటర్ల మేర పెరుగుతోంది. వీటిలోని 12 నగరాల్లో అయితే అంతర్జాతీయ సముద్రమట్టాల సగటు పెరుగుదల రేటును దాటి మరీ జలాలు పైపైకి వస్తున్నాయి. వీటికితోడు ఈ నగరాల్లోని ప్రతి 50 మంది జనాభాలో ఒకరు దారుణమైన వరదలను చవిచూడక తప్పదని తాజా అధ్యయనం హెచ్చరించింది. ఈ పరిశోధన తాలూకు సమగ్ర వివరాలు జర్నల్ ‘నేచర్’లో ప్రచురితమయ్యాయి. గ్లోబల్ వార్మింగ్ దెబ్బకి వాతావరణంలో అనూహ్య ప్రతికూల మార్పులు సంభవిస్తున్నాయి. పెరిగిన ఉష్ణోగ్రతల కారణంగా తరచూ హీట్వేవ్లు, కరువులు సంభవించి, కార్చిచ్చులు చెలరేగి సగటు ఉష్ణోగ్రతలను అంతకంతకూ పెచ్చరిల్లుతున్నాయి. దీంతో ధృవాల వద్ద హిమానీనదాలు గతంలో కంటే వేగంగా కరిగిపోతున్నాయి. దీంతో అమెరికా, భారత్సహా పలు ప్రపంచదేశాల తీరప్రాంతాలకు ముంపు ప్రమాదం హెచి్చందని అధ్యయనకారులు ఆందోళన వ్యక్తంచేశారు. మరిన్ని వరదలు 2050 సంవత్సరంకల్లా అమెరికా తీరప్రాంతాల వెంట సముద్రం దాదాపు 0.30 మీటర్లమేర పైకి ఎగిసే ప్రమాదముంది. దీంతో జనావాసాలను సముద్రపు నీరు ముంచెత్తి జనజీవనం అస్తవ్యస్తంకానుంది. సముద్రపు నీటితో కుంగిన నేలలు, రోడ్లు ఇలా ప్రజారవాణా వ్యవస్థ మొత్తం దెబ్బతిననుంది. కొన్ని ప్రాంతాలు మరింతగా కుంగిపోయే ప్రమాదముందని గణాంకసహితంగా అధ్యయనం పేర్కొంది. వచ్చే 30 సంవత్సరాల్లో ప్రతి 35 ప్రైవేట్ ఆస్తుల్లో ఒకటి వరదల బారిన పడి నాశనమయ్యే అవకాశముంది. గత అంచనాలను మించి విధ్వంసం తప్పదని అధ్యయనం హెచ్చరించింది. మట్టం పెరగడంతో లక్షలాది మంది తీరప్రాంత ప్రజల జీవనం ప్రశ్నార్ధకంగా మారనుంది. అమెరికాలో 109 బిలియన్ డాలర్లమేర ఆస్తినష్టం సంభవించవచ్చని ఓ అంచనా. ఈ అధ్యయనంలో పంజాబ్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్, రీసెర్చ్ వారి బృందం సైతం పాలుపంచుకుంది. అమెరికా తీరప్రాంతంలో ముంపును ఎదుర్కోనున్న ప్రాంతాల అంచనా గణాంకాలను సిద్దంచేసింది. ‘నక్షత్రాలు నేలరాలితే ఏం చేయగలం?. చిన్నపాటి వర్షం కూడా పడవ వేగంగా మునగడానికి ప్రబల హేతువు కాగలదు. అలాగే తీరాల వెంట మట్టాలు పెరిగితే కలిగే విపత్తులు, విపరిణామాలు దారుణంగా ఉంటాయి’ అని ఈ అధ్యయనంలో పాలుపంచుకున్న శాస్త్రవేత్త రాబర్ట్ నెకొలస్ ఆందోళన వ్యక్తంచేశారు. ముంపు అవకాశమున్న 32 నగరాలు బోస్టన్, న్యూయార్క్ సిటీ, జెర్సీ సిటీ, అట్లాంటిక్ సిటీ, వర్జీనియా బీచ్, విలి్మంగ్టన్, మేర్టల్ బీచ్, చార్లెస్టన్, సవన్నా, జాక్సన్విల్లే, మయామీ, నేపుల్స్, మొబిల్, బిలోక్సీ, న్యూ ఓర్లీన్స్, స్లైడెల్, లేక్ చార్లెస్, పోర్ట్ ఆర్ధర్, టెక్సాస్ సిటీ, గాల్వెస్టన్, ఫ్రీపోర్ట్, కార్పస్ క్రిస్టీ, రిచ్మండ్, ఓక్లాండ్, శాన్ ప్రాన్సిస్కో, సౌత్ శాన్ ప్రాన్సిస్కో, ఫాస్టర్ సిటీ, శాంటాక్రూజ్, లాంగ్ బీచ్, హటింగ్టన్ బీచ్, న్యూపోర్ట్ బీచ్, శాండియాగో – సాక్షి, నేషనల్ డెస్క్ -
పాపం మీది.. పరిహారమివ్వండి.. పేద దేశాల డిమాండ్
షెర్మ్–ఎల్–షేక్: భూతాపం, ప్రకృతి విపత్తులు, ఉత్పాతాలు.. వీటికి శిలాజ ఇంధనాలను విచ్చలవిడిగా వినియోగించడం, పర్యావరణాన్ని నాశనం చేయడమే కారణం. ఈ పాపం సంపన్న, అభివృద్ధి చెందిన దేశాలదేనని పేద దేశాలు ఘోషిస్తున్నాయి. శిలాజ ఇంధనాలను అధికంగా ఉపయోగించే దేశాల కారణంగా తాము బాధితులుగా మారాల్సి వస్తోందని వాపోతున్నాయి. బడా దేశాలు, కార్పొరేట్ సంస్థలు నష్ట పరిహారం చెల్లించాలన్న డిమాండ్ ఊపందుకుంటోంది. ఈజిప్ట్లోని షెర్మ్–ఎల్–షేక్లో జరుగుతున్న కాప్–27లో పలుదేశాల నాయకులు ఈ డిమాండ్కు మద్దతుగా గళం విప్పుతున్నారు. విపత్తుల్లో నష్టపోతున్న పేద దేశాలకు న్యాయం చేయాలని మలావీ దేశాధ్యక్షుడు లాజరస్ చక్వెరియా అన్నారు. శిలాజ ఇంధన కంపెనీలు నిత్యం 3 బిలియన్ డాలర్ల లాభాలు ఆర్జిస్తున్నాయని ఆంటిగ్వా బార్బుడా ప్రధానమంత్రి గాస్టన్ బ్రౌనీ చెప్పారు. అందులో కొంత సొమ్మును పేద దేశాలకు పరిహారంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. భూగోళాన్ని మండించి, సొమ్ము చేసుకుంటారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంధన కంపెనీలు తమ లాభాల నుంచి గ్లోబల్ కార్బన్ ట్యాక్స్ చెల్లించాలన్నారు. మానవ నాగరికతను బలిపెట్టి లాభాలు పిండుకోవడం సరైంది కాదన్నారు. నష్టపరిహారం కోసం అవసరమైతే అంతర్జాతీయ కోర్టులను ఆశ్రయిస్తామని తేల్చిచెప్పారు. పెద్ద దేశాల నేతలు, కార్పొరేట్ సంస్థల ప్రతినిధులు ప్రతిఏటా కాప్కు సదస్సుకు హాజరై, ఘనంగా ప్రకటనలు ఇచ్చి వెళ్లిపోతున్నారని తప్పు ఆచరణలో ఏమీ చేయడం లేదని గాస్టన్ బ్రౌనీ ఆరోపించారు. వాతావరణ లక్ష్యాలను సాధించాలంటే చిన్న దేశాలపై విధించిన చట్టవిరుద్ధమైన ఆర్థిక ఆంక్షలను ఎత్తివేయాలని జింబాబ్వే అధ్యక్షుడు ఎమర్సన్ మాంగాగ్వే పేర్కొన్నారు. మడ అడవుల సంరక్షణలో సహకరిస్తాం మడ అడవుల పునరుద్ధరణలో భారత్ నైపుణ్యం సాధించిందని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ చెప్పారు. పర్యావరణానికి అత్యంత కీలకమైన మడ అడవుల సంరక్షణ కోసం గత ఐదు దశాబ్దాలుగా కార్యాచరణ కొనసాగిస్తోందని అన్నారు. ఈ విషయంలో ఇతర దేశాలకు సహకరించేందుకు భారత్ సిద్ధంగా ఉందని తెలిపారు. కాప్–27 సందర్భంగా యూఏఈ, ఇండోనేషియా ఆధ్వర్యంలో మాంగ్రూవ్ అలయెన్స్ ఫర్ క్లైమేట్(ఎంఏసీ)ని ప్రారంభించారు. ప్రపంచవ్యాప్తంగా మడ అడవుల పర్యావరణ వ్యవస్థను పునరుద్ధరించడం, కాపాడుకోవడం ఈ కూటమి లక్ష్యం. ఈ సందర్భంగా భూపేంద్ర మాట్లాడారు. ప్రపంచ ఉష్ణోగ్రత పెరుగుదలను 1.5 డిగ్రీల సెల్సియస్కు పరిమితం చేయాలన్న లక్ష్యాన్ని సాధించడానికి మడ అడవుల సంరక్షణ అత్యంత కీలకమని సూచించారు. కర్బన ఉద్గారాల నిర్మూలన ఇలాంటి అడవులతో సాధ్యమవుతుందన్నారు. అండమాన్, సుందర్బన్స్, గుజరాత్ తీర ప్రాంతంలో మడ అడువుల విస్తీర్ణం పెరిగిందని వెల్లడించారు. చదవండి: షాకింగ్ రిపోర్ట్: కరోనాను మించిన వైరస్ తయారీలో పాక్-చైనా! -
హెచ్చరిక!! ఈ శతాబ్దం చివరి నాటికి భూమిపై ఘోర మారణహోమం..
Biggest holocaust will come in the late century: యుగాంతం గురించి ఇప్పటికే పలుపుకార్లు పలుమార్లు చక్కర్లు కొట్టాయి. అవి కేవలం వదంతులని కొట్టిపారేయలేం కూడా. ఎందుకంటే భూమి అంతరించిపోయేంతగాకాకున్న ఎన్నడూ కనీవినీ ఎరుగని కొత్తకొత్త రోగాలు, వాతావరణ మార్పులు ఇప్పటికీ చవిచూస్తూనే ఉన్నాం. ఐతే తాజాగా ప్రపంచ అగ్రశ్రేణి శాస్త్రవేత్తలు మరో సంచలనాత్మక హెచ్చరికలు జారీ చేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద సైన్స్ మ్యాగజైన్ ‘నేచర్' నిర్వహించిన సర్వేలో భూమిపై వాతావరణ మార్పులకు సంబంధించి అనేక షాకింగ్ విషయాలను వెల్లడించింది. ఈ శతాబ్ధి చివరి నాటికి భూమిపై తీవ్ర మార్పులు సంభవిస్తాయని, త్వరలో భూమి నాశనమౌతుందని ఈ సర్వే నివేదిక పేర్కొంది. అంటే 2100 నాటికి భూమిపై భయంకరమైన మార్పులు సంభవించి, ఘోర మారణహోమం జరగబోతుందని ఆ నివేదిక సారాంశం. ప్రపంచ నలుమూలల నుండి 233 మంది ప్రకృతి శాస్త్రవేత్తలు రూపొందించిన ఐపీసీసీ వాతావరణ నివేదికలోఇది. చదవండి: North Korea: ఆ ఫొటోలు తీసినందుకు దేశం నుంచి శాశ్వతంగా బహిష్కరించారు.. ఈ శాస్త్రవేత్తల్లో కొలంబియాలోని యాంటికోయా విశ్వవిద్యాలయానికి చెందిన రీసెర్చర్ పావోలా అరియాస్ కూడా ఉన్నారు. ప్రపంచం తీరు మారుతుందని, వనరులు తీవ్రంగా దోపిడీకి గురవుతున్నాయని, కాలుష్యం, హీట్వేవ్ రోజురోజుకీ పెరుగుతున్నాయని అన్నారు. వీటన్నింటి మధ్య బతకడమే కష్టంగా మారుతోంది. వర్షాల గతి మారడం వల్ల తీవ్ర నీటి సమస్య తలెత్తి, మున్ముందు భయంకరమైన గడ్డు పరిస్థితులు తలెత్తుతాయని ఆయన అన్నారు. చదవండి: పాదాలను చూసి ఆ సీక్రెట్స్ కనిపెట్టేయ్యొచ్చట!! ఇక గ్లోబల్ వార్మింగ్ గురించి ప్రపంచ నాయకులు నత్తనడకన చర్యలు తీసుకుంటున్నారు. ఇలాగేకొనసాగితే ప్రకృతి వైపరీత్యాలు తలెత్తి పెద్ద సంఖ్యలో ప్రజలు ఏకకాలంలో మృత్యువాత పడే అవకాశం ఉంది. భూమిని రక్షించుకోవడానికి మనకిప్పుడు చాలా తక్కువ సమయం ఉన్నట్లు నివేదిక చూపుతుందని ఆయన అన్నారు. 2100 నాటికి అకాల వర్షాలు, మేఘావృతాలు, సునామీలు, కరువులు, వరదలు వంటి విపత్తులు పెద్ద ఎత్తున ఉత్పన్నమవుతాయి. ఫలితంగా సమస్త మానవజాతి కష్టాలపాలవ్వడం ఖాయమని ఆయన హెచ్చరించారు. చదవండి: టాయిలెట్లో ఎక్కువ సమయం గడుపుతున్నారా? ఆ సమస్య అందుకేనట!! -
అదే జరిగితే ఏసీలు కనుమరుగు అయినట్లే!
గ్లోబల్ వార్మింగ్, పర్యావరణపు ప్రతికూల మార్పుల వల్ల.. వాతావరణంలో విపరీతమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. సీజన్తో సంబంధం లేకుండా అధిక వేడిమి సమస్య భూమిని పట్టి పీడిస్తోంది. ఉక్కపోత నుంచి ఉపశమనం కోసం సమ్మర్తో సంబంధం లేకుండా ఎయిర్ కండిషనర్ల వాడకం మన దేశంలోనూ పెరిగిపోతోంది. ఈ క్రమంలో ఊరట ఇచ్చే వార్తను చెప్పారు సైంటిస్టులు. ఇండియానా(యూఎస్ స్టేట్స్)లోని పుర్డ్యూ యూనివర్సిటీ సైంటిస్టులు.. ప్రపంచంలోనే అత్యంత తెల్ల పెయింట్ను తయారు చేశారు. ఇది గనుక గోడలకు వేస్తే.. ఇంట్లో చల్లదనం కోసం కరెంట్ను కాల్చుకోవాల్సిన అవసరం లేదని చెప్తున్నారు. అంతేకాదు ఫ్రియాన్ విడుదల తప్పి.. గ్లోబల్ వార్మింగ్ సమస్య కూడా నివారించొచ్చని అంటున్నారు. ప్రపంచంలోనే అత్యంత తెల్ల పెయింట్ను పుర్డ్యూ యూనివర్సిటీ సైంటిస్టులు రూపొందించారు. ఇది తాజాగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుల్లోకి ఎక్కింది కూడా. ఇది సూర్యకాంతికి రిఫ్లెక్షన్ను దూరం చేస్తుందని ప్రొఫెసర్ గ్జియూలిన్ రువాన్ చెప్తున్నారు. గ్లోబల్ వార్మింగ్పై ఫైట్.. గ్లోబల్ వార్మింగ్ను తగ్గించేదిశగా ఈ వైట్ పెయింట్ పరిశోధన కృషి చేయనుందని రువాన్ అంటున్నారు. అత్యంత తెల్లదనం కారణంగానే ఇది గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డుల్లోకి ఎక్కిందని చెప్తున్నారాయన. ఈ పెయింట్ను గనుక వెయ్యి స్క్వేర్ ఫీట్ల మేర గోడకుగానీ, రూఫ్కుగానీ వేస్తే.. పది కిలోవాట్ల కరెంట్ అందించే చల్లదనాన్ని అందిస్తుందట. ఇది ఇళ్లలోని ఏసీలు అందించే చల్లదనం కంటే చాలా రెట్లు ఎక్కువని రువాన్ స్పష్టం చేశారు. తద్వారా ఎయిర్ కండిషనర్ల వాడకం తగ్గడంతో పాటు గ్లోబల్ వార్మింగ్ చాలావరకు తగ్గించినట్లే అవుతుందని అంటున్నారు. ఎలాగంటే.. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న పెయింట్స్ చల్లదనానికి బదులు.. వేడిని కలగజేస్తాయి. తెల్ల పెయింట్స్ 80 నుంచి 90 శాతం సూర్యకాంతిని రిఫ్లెక్ట్స్ చేస్తాయి. ఎలాంటి చల్లదనాన్ని అందించవు. కానీ, పుర్డ్యూ సైంటిస్టులు రూపొందించిన వైట్ పెయింట్ మాత్రం రివర్స్లో అతిచల్లదనాన్ని అందిస్తాయి. కాస్మోటిక్స్లో ఉపయోగించే కెమికల్ కాంపౌండ్, అధిక గాఢత బేరియం సల్ఫేట్ కలిపి ఈ పెయింట్ను డెవలప్ చేశారట. ధర కూడా తక్కువగా ఉండి.. ఎక్కువకాలం చెక్కుచెదరకుండా ఉంటుంది. ఇది మార్కెట్లోకి రావడానికి కొంచెం టైం పట్టొచ్చు. ఒకవేళ ఈ పెయింట్ గనుక మార్కెట్లోకి వస్తే మాత్రం ఎయిర్ కండిషనర్స్ అమ్మకాలపై తీవ్ర ప్రభావం పడొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. చదవండి: సెల్ఫోన్ టవర్లు, కేబుళ్లు కనుమరుగు కానున్నాయా..! -
అధిక ఉష్ణోగ్రత! కారణం ఏంటంటే..
అధిక ఉష్ణోగ్రతలు.. అది కూడా మంచుమయమైన అంటార్కిటికాలో పెరుగుతుండడంపై ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేస్తోంది. విశేషం ఏంటంటే.. ఇప్పటిదాకా ఈ గడ్డపై అత్యధిక ఉష్ణోగ్రత ఈ ఏడాదిలోనే నమోదు అయ్యిందని జులై 1న ఒక ప్రకటన విడుదల చేసింది యూఎన్వో. న్యూయార్క్: ఈ ఏడాది ఫిబ్రవరి 6న అంటార్కిటికాలో రికార్డు స్థాయిలో 18.3 డిగ్రీల సెల్సియస్ (64.9 డిగ్రీల ఫారెన్హీట్) ఉష్ణోగ్రత నమోదైనట్లు వెల్లడించింది. దీంతో ఇప్పుడు అంటార్కిటికా సైతం వేగంగా వేడెక్కుతున్న ప్రాంతాల్లో ఒకటిగా మారిందని ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇక అంటార్కిటికాలో గత 50 ఏళ్లలో దాదాపు మూడు డిగ్రీల సెల్సియస్ మేరకు సగటు ఉష్ణోగ్రత పెరిగినట్లు డబ్ల్యూఎంఓ సెక్రటరీ జనరల్ పెటేరి తాలాస్ చెప్పారు. దీనికి సంబంధించిన రిపోర్టును ఆయన గురువారం వెల్లడించారు. వేడికి కారణం మంచు కొండలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో అధిక పీడనం కారణంగా ఫోహెన్ ప్రభావం ఏర్పడుతుంది. అంటార్కిటికాలో ఉష్ణోగ్రతలు పెరగడానికి కారణమని UN డబ్ల్యూఎంవో(వరల్డ్ మెటియోరోలాజికల్ ఆర్గనైజేషన్) రిపోర్టు వెల్లడించింది. ఫోహెన్ ప్రభావం వల్ల.. మంచు కొండలకు ఒకవైపు నుంచి వీచే సాధారణ గాలులు.. కొండ అంచు నుంచి మరో వైపునకు వీచేటప్పుడు వేడెక్కుతాయి. ఈ ఫలితమే అత్యధిక వేడి, ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని ఈ రిపోర్టు పేర్కొంది. ఈ దిగువ గాలుల ఫలితంగా.. అంటార్కిటికాలోని ఎస్పెరంజా స్టేషన్, సేమౌర్ ద్వీపంలో ఉష్ణోగ్రతలు పెరిగాయి. గతంలో కూడా ఇలాంటి వాతావరణ పరిస్థితులు ఏర్పడినట్లు నివేదికలో పొందుపరిచారు. ఇంతకు ముందు.. గతంలో 2015, మార్చి 24న అంటార్కిటికాలో అత్యధికంగా 17.5 డిగ్రీల సెల్సియస్ (63.5 డిగ్రీల ఫారెన్హీట్) ఉష్ణోగ్రత నమోదైంది. ఇక్కడి ఎస్పెరంజా పరిశోధనా కేంద్రంలో ఈ ఉష్ణోగ్రత నమోదైనట్లు డబ్ల్యూఎమ్ఓ తెలిపింది. ఈ ఏడాది ప్రారంభంలో రికార్డు స్థాయిలో నమోదైన 18.3 డిగ్రీల సెల్సియస్ కొత్త రికార్డు కూడా అర్జెంటీనాలోని అదే స్టేషన్లో నమోదైనట్లు ఏజెన్సీ తెలిపింది. ఈ నేపథ్యంలో వాతావరణ మార్పులు, పెరుగుతున్న ఉష్ణోగ్రతలను నియంత్రించేందుకు అంటార్కిటిక్ ట్రీటీ సిస్టంతో కలిసి పనిచేస్తున్నట్లు ప్రొఫెసర్ తాలాస్ చెప్పారు. చదవండి: తొలిసారి నీలి తిమింగలం పాట! -
మరో 80 ఏళ్లలో మాల్దీవులు మాయం..!
మనదేశంలో సెలబ్రిటీల ఫెవరెట్ హాలీడే స్పాట్ అంటే టక్కున గుర్తుకు వచ్చేది మాల్దీవులు. మరీ ముఖ్యంగా బీటౌన్ లవ్ కపుల్స్కి మాల్దీవులంటే మహా ఇష్టం. ఇక హీరో, హీరోయిన్లు ఏమాత్రం గ్యాప్ దొరికినా చాలు.. మాల్దీవుల్లో వాలిపోతారు. కొత్తగా పెళ్లైన బడాబాబులు హానీమూన్ ట్రిప్ కోసం కూడా మాల్దీవులనే సెలక్ట్ చేసుకుంటారు. అక్కడి ఆహ్లాదకరమైన వాతావరణంలో సేద దీరుతూ.. ఏంజాయ్ చేస్తూ.. రోజువారి ఒత్తిడి నుంచి దూరమయ్యి.. రిఫ్రెష్ అయ్యి వస్తారు. అయితే మాల్దీవ్స్ లవర్స్కి ఓ బ్యాడ్ న్యూస్. మరో 80 ఏళ్లలో అనగా 2100 నాటికి మాల్దీవులు మాయమవుతాయట.. అంటే పూర్తిగా నీటిలో మునిగిపోతాయని నివేదిక వెల్లడించింది. మాల్దీవ్స్, ఫిజితో పాటు మరో మూడు అందమైన దీవులు నీటిలో మునిగిపోతాయంటున్నారు శాస్త్రవేత్తలు. రానున్న 60 ఏళ్లలోపు ఈ ద్వీపాలు నీటిలో మునిగిపోతాయని, గ్లోబల్ వార్మింగ్ వల్లనే ఇలా జరుగుతుందని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. గ్లోబల్ వార్మింగ్ వల్ల పెరుగుతున్న సముద్ర మట్టం 40 వ దశకంలో, అమెరికన్ శాస్త్రవేత్త బెనో గుటెన్బర్గ్ సముద్రంలో నీరు పెరుగుతున్నట్లు అనుమానించి.. ఒక అధ్యయనం చేశాడు. దీన్ని ధ్రువీకరించుకోవడానికి గుటెన్బర్గ్ గత 100 సంవత్సరాల డేటాను అధ్యయనం చేశాడు. అతని అనుమానం నిజమని తేలింది. ధృవాల వద్ద మంచు కరగడం వల్ల సముద్రంలో నీటి మట్టం నిరంతరం పెరుగుతోందని గుటెన్బర్గ్ గమనించాడు. 90 వ దశకంలో, నాసా కూడా దీనిని ధ్రువీకరించింది. అప్పటి నుంచి, గ్లోబల్ వార్మింగ్ వల్ల తలెత్తే సమస్యల ప్రపంచవ్యాప్తంగా తీవ్రమైన చర్చ ప్రారంభమయ్యింది. 2100 నాటికి మాయమవనున్న మాల్దీవులు సముద్రపు నీరు వేగంగా పెరగడం వల్ల 2100 చివరి నాటికి మాల్దీవులు నీటిలో మునిగిపోతాయని ప్రపంచ బ్యాంక్, అనేక ఇతర సంస్థలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఫిజీ కూడా ముప్పు అందమైన బీచ్లతో తయారైన ఫిజీ, దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలో ఉన్న ఒక ద్వీప దేశం. ఫిజీలో అనేక మంది భారతీయులు నివసిస్తున్నారు. అయితే సముద్ర మట్టం పెరగడం వల్ల భవిష్యత్తులో ఈ అందమైన దేశం కూడా నీటిలో మునిగిపోతుందనే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు శాస్త్రవేత్తలు. ఏటా పెరుగుతున్న సముద్ర నీటి మట్టం పలావు, పసిఫిక్ మహాసముద్రంలో ఉన్న ఒక ద్వీప దేశం. నీటి మట్టం పెరగడం వల్ల సముద్రంలో మునిగిపోయే ప్రమాదం ఎదుర్కొనబోతుంది. పలావు నేషనల్ వెదర్ సర్వీస్ ఆఫీస్ అండ్ పసిఫిక్ క్లైమేట్ చేంజ్ సర్వీస్ ప్రోగ్రాం ప్రకారం 1993 నుంచి ప్రతి సంవత్సరం ఇక్కడ సముద్రపు నీరు 0.35 అంగుళాల చొప్పున పెరుగుతోంది. ఇప్పటికే నీట మునుగుతున్న రిపోసోలోమోన్ ద్వీపం రీడర్స్ డైజెస్ట్లోని ఒక నివేదిక ప్రకారం, రిపోసోలోమోన్ ద్వీపం దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలో ఉంది. ఇది సుమారు 1000 ద్వీపాలు ఉంటాయి. ఇవి ఇప్పుడు నీటిలో మునిగిపోతున్నాయి అని తెలిపారు శాస్త్రవేత్తలు. చదవండి: ఇండియాకు మాల్దీవులు షాక్.. అయోమయంలో బీటౌన్ లవ్బర్డ్స్ -
గ్లోబల్ ‘వార్నింగ్’! నేడు ప్రపంచ ధరిత్రీ దినోత్సవం
వాతావరణ మార్పులు, గ్లోబల్ వార్మింగ్ ఇలాంటి వాటి వల్ల మనకు చాలా ముప్పు అని ఏళ్లుగా వింటునే ఉన్నాం.. నేడు (ఏప్రిల్ 22) ప్రపంచ ధరిత్రీ దినోత్సవం. ఈ సందర్భంగా ఓసారి మన ధరిత్రిపై ఓ లుక్కేద్దామా.. దాని ప్రస్తుత పరిస్థితి ఏంటో తరచి చూద్దామా.. పెనంపై కాల్చినట్లు.. కొన్నేళ్లుగా ప్రపంచవ్యాప్తంగా సగటు ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. మొదట్లో కాస్త మెల్లగా మార్పు వచ్చినా.. గత ముప్పై నలభై ఏళ్లుగా వేడి వేగం అందుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలను రికార్డు చేయడం మొదలుపెట్టినప్పటి నుంచి (అంటే సుమారు 250 ఏళ్ల నుంచి) పరిశీలిస్తే.. టాప్–20 అత్యంత వేడి సంవత్సరాల్లో 19 సంవత్సరాలు 2001–2021 మధ్య నమోదైనవే. ఇప్పటివరకూ భూమ్మీద నమోదైన అత్యంత వేడి సంవత్సరంగా 2020 నిలిచింది. 1981 నుంచి సగటున ఏటా 0.18 డిగ్రీల ఉష్ణోగ్రత పెరుగుతూ వస్తోంది. అంతకు ముందటితో పోలిస్తే ఇది రెండింతలు పెరుగుదల. మంచు మరుగుతోంది.. భూమి మీద మంచు కప్పి ఉండే ప్రాంతాల విస్తీర్ణం ఏటా పడిపోతోంది.భూమి ఉత్తర అర్ధభాగంలో మంచు ఏర్పడటం బాగా తగ్గిపోయిందని ఉపగ్రహ పరిశీలనలో గుర్తించారు. నిత్యం మంచుతో కప్పి ఉండే అంటార్కిటికాలో ఏటా 15 వేల కోట్ల టన్నులు, గ్రీన్ల్యాండ్లో 27,800 కోట్ల టన్నుల మంచు కరిగిపోతోంది. హిమాలయాలు సహా ప్రపంచవ్యాప్తంగా పర్వ తాలపై హిమనీనదాలు వేగంగా తరిగిపోతున్నాయి. సముద్రం పోటెత్తుతోంది.. భూమ్మీద మంచు కరిగిపోతుండటంతో ఏటా సముద్ర జలాల ఎత్తు పెరిగి.. భూభాగం మునిగిపోతోంది. సముద్రాలు 2006 నుంచి సగటున ఏటా 3.6 మిల్లీమీటర్ల మేర ఎత్తు పెరుగుతున్నాయి. అంతకుముందటితో పోలిస్తే ఇది రెండింతలు కావడం గమనార్హం. ఈ శతాబ్దం ముగిసే సమయం అంటే.. 2100 నాటికి సముద్ర జలాలు 35 సెంటీమీటర్లు, అంతకన్నాపైగా పెరుగుతాయని అంచనా. గత శతాబ్దంలో పెరిగింది 20 సెంటీమీటర్లే. నీళ్లు నిప్పులా మండుతున్నాయి.. భూమ్మీద 70 శాతం ఉపరితలం సముద్రాలదే. భూమిపై అదనంగా పెరిగిపోతున్న వేడిలో 90 శాతం వరకు సముద్రాల్లోకి చేరుతోంది. సముద్రాల్లో పైన సుమారు 100 మీటర్ల మేర నీటిపొర గత 40 ఏళ్లలో 0.33 డిగ్రీల సెల్సియస్ వేడెక్కింది. అంతా కార్బన్డయాక్సైడే.. వాతావరణంలో కార్బన్డయాక్సైడ్ ప్రమాదకర స్థాయిలో పెరుగుతోంది. 1958 నాటితో పోలిస్తే ఇప్పుడు 25 శాతం ఎక్కువగా ఉంది. 60 ఏళ్లతో పోల్చితే ఏటా కార్బన్ డయాక్సైడ్ పెరిగే శాతం ఇప్పుడు 100 రెట్లు పెరిగింది. సముద్రంపై యాసిడ్ దాడి.. వాతావరణంలో పెరిగిపోతున్న కార్బన్డయాౖMð్సడ్లో రోజు సగటున 2 కోట్ల టన్నుల మేర సముద్రాలు పీల్చుకుంటున్నాయి. దీనితో సముద్ర జలాల్లో ఆమ్లత్వం పెరిగిపోతోంది. పారిశ్రామిక విప్లవం వచ్చాక అంటే సుమారు గత 70, 80 ఏళ్లలో సముద్ర ఉపరితల జలాల ఆమ్లత్వం (యాసిడిటీ) 30 శాతం పెరిగింది. ఇది అంతకుముందటితో పోలిస్తే 100 రెట్లు ఎక్కువ. దీనివల్ల సముద్ర ప్రాణుల మనుగడపై ప్రభావం పడుతోంది. -
వాతావరణమే.. విలన్
పారిస్: వాతావరణంలో వస్తున్న పెనుమార్పులు ప్రపంచవ్యాప్తంగా పసిమొగ్గల జీవితాన్ని ఛిద్రం చేస్తున్నాయని లాన్సెట్ నివేదిక హెచ్చరించింది. శిలాజ ఇంధన ఉద్గారాలను కట్టడి చేయకపోతే భారత్ ఒకతరం ఆరోగ్యాన్ని కోల్పోయే ప్రమాదం ఉందని తేల్చింది. భారత్లో దీని ప్రభావం అత్యధికంగా కనబడుతోందని వెల్లడించింది. గత 50 ఏళ్లుగా చిన్నారుల ఆరోగ్యానికి భారత్ ఎంతో కృషి చేసిందని, కానీ వాతావరణ మార్పుల కారణంగా ఇప్పటివరకు చేసినదంతా వృథా కానుందని అంచనా వేసింది. ఇవాళ పుట్టిన ప్రతీ బిడ్డ భవిష్యత్ను వాతావరణంలో మార్పులే నిర్దేశిస్తాయని నివేదిక సహ రచయిత్రి పూర్ణిమ చెప్పారు. లాన్సెట్ కౌంట్డౌన్ ఆన్ హెల్త్, క్లైమేట్ ఛేంజ్ కోసం ప్రపంచ ఆరోగ్య సంస్థ, ప్రపంచ బ్యాంకు సహా మరో 35 సంస్థలకు చెందిన 120 మంది పర్యావరణ నిపుణులు అధ్యయనం చేశారు. వాతావరణంలో మార్పులు, ప్రభావానికి సంబంధించి 41 అంశాలను అధ్యయనం చేసి నివేదిక రూపొందించారు. ఆరోగ్యంపై ప్రభావం చూపించే అంశాలు ► కరువు పరిస్థితులు ► అంటు వ్యాధులు ► వరదలు ► వడగాడ్పులు ► కార్చిచ్చులు ఏయే వ్యాధులు వచ్చే అవకాశం ► నీటి కాలుష్యంతో డయేరియా ► వాయు కాలుష్యంతో ఆస్తమా, ఇతర శ్వాసకోశ వ్యాధులు ► చిన్నారుల్లో ఎదుగుదల లోపాలు ► డెంగీ వ్యాధి విజృంభణ ► గుండెపోటు ఏయే దేశాలపై ప్రభావం ► అత్యధిక జనాభా కలిగిన దేశాలు, వైద్య ఖర్చులు పెనుభారంగా మారిన దేశాలు, అసమానతలు, పేదరికం, పౌష్టికాహార లోపాలు కలిగిన భారత్ వంటి దేశాలపై వాతావరణంలో వస్తున్న మార్పులు పసివాళ్ల ఉసురు తీస్తున్నాయి. ► భారత్లో 2.1 కోట్ల మందిపై వాతావరణ మార్పుల ప్రభావం ► చైనాలో 1.7 కోట్ల మందికి ఆరోగ్య సమస్యలు ► 196 దేశాలకు గాను 152 దేశాలపై వాతావరణంలో మార్పులు అత్యధిక ప్రభావాన్ని చూపిస్తాయి. ► 2015లో భారత్లో వీచిన వడగాడ్పులతో వేలాది మంది ప్రాణాలు కోల్పోయిన పరిస్థితులు ఇకపై సర్వసాధారణం కానున్నాయి. పరిష్కార మార్గాలేంటి ? ► ప్రతీ ఏడాది ప్రపంచ దేశాలు సగటున 7.4 శాతం కర్బన ఉద్గారాలను తగ్గిస్తే 2050 నాటికి 1.5 డిగ్రీల ఉష్ణోగ్రతకు పరిమితం చేయాలన్న లక్ష్యాన్ని చేరుకోగలరు ► భారత్ థర్మల్ విద్యుత్ వినియోగాన్ని తగ్గించి సంప్రదాయేతర ఇంధనంపైనే ఆధారపడాలి. ► ప్రజా రవాణా వ్యవస్థను మరింత పటిష్టం చేయాలి ► చెత్త, పంట వ్యర్థాల నిర్వహణను సమర్థవంతంగా ఎదుర్కోవాలి. -
సూపర్ ఎఫీషియంట్ ఏసీ : ఇంధనం ఆదా, తక్కువ ధర
సాక్షి, న్యూఢిల్లీ : తక్కువ విద్యుత్, అందుబాటులో ధరల్లో ఎల్ఈడీ ఉత్పత్తులను (ట్యూబ్ లైట్స్, బల్బులు, ఫాన్స్) పరిచయం చేసి విజయవంతమైన కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (ఈఈఎస్ఎల్) మరో కీలక ఆవిష్కరణకు నాంది పలికింది. పవర్ సేవ్, సూపర్ ఎఫిషియంట్ ఎయిర్ కండిషనర్(ఏసీ) లను ఢిల్లీలో నేడు (సోమవారం,జూలై 8) లాంచ్ చేసింది. మార్కెట్లో ప్రస్తుతం లభిస్తున్న ఏసీల ధరలతో పోలిస్తే…ఈ ఏసీలు 30 శాతం తక్కువ ధరకు లభ్యం. నాలుగు ప్రభుత్వ రంగ సంస్థల జాయింట్ వెంచర్ (రాజధాని పవర్ లిమిటెడ్, యమునా పవర్ లిమిటెడ్, టాటా పవర్ డీడీఎల్ ) అయితే ఈఈఎస్ఎల్ వీటిని ఆవిష్కరించింది. మొదటి దశలో 50వేల ఏసీలను ఢిల్లీలోని వినియోగదారులకు అందుబాటులో ఉంచింది. వీటి ధరను రూ. 41,300 గా నిర్ణయించింది. తాము లాంచ్ చేసిన కొత్త ఏసీల ద్వారా 50 శాతం విద్యుత్తు ఆదా అవుతుందని కంపెనీ చెబుతోంది.1.5 టన్నుల ఇన్వర్టర్ స్ప్లిట్ ఎసిలు 5.4 శక్తి సామర్థ్య రేటింగ్ కలిగి ఉన్నాయని, ప్రస్తుతమున్న బీఇ 5 స్టార్ రేటెడ్ ఎసిల కంటే 20 శాతం ఎక్కువ సామర్థ్యం వీటి సొంతమని ప్రకటించింది. 4.5 సామర్థ్యం కలిగిన ఫైవ్ స్టార్ రేటెడ్ ఏసీ 1155 వాట్ల వద్ద పనిచేస్తుంది. కానీ తమ ఏసీలు కేవలం 960 వాట్ల వద్ద అదే పనితీరును కనబరుస్తాయని తెలిపింది. తద్వారా సగటున ఏడాదికి 300 యూనిట్లు లేదా 2400 రూపాయలు ఆదా అవుతుందని పేర్కొంది. అలాగే మార్కెట్లో ప్రస్తుతం లభిస్తున్న త్రీ స్టార్ ఏసీలతో పోలిస్తే ఏడాదికి 4వేల రూపాయలు పొదుపు చేయవచ్చని తెలిపింది. ముఖ్యంగా గ్లోబల్ వార్మింగ్ ముప్పును ఎదుర్కొనే చర్యల్లో భాగంగా ఈ సూపర్ ఎఫెక్టివ్ ఏసీలను తీసుకొచ్చామని ఈఈఎస్ఎల్ ఎండీ సౌరభ్ కుమార్ తెలిపారు. భారతదేశానికి ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న ఎంపికల కంటే చాలా స్థిరమైన, సరసమైన శీతలీకరణ అవసరం. ఈ లక్ష్యాన్ని సూపర్ ఎఫిషియంట్ ఎయిర్ కండిషనర్లు తీర్చనున్నాయన్నారు. ఈ ఏడాది డిసెంబర్ నాటికి మొత్తం స్టాక్ హాట్ సేల్ పూర్తి కానుందనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. తరువాతి సీజన్ నాటికి దేశ వ్యాప్తంగా 2లక్షల యూనిట్లను అందుబాటులో ఉంచాలని లక్ష్యంగా పెట్టుకున్నామని కుమార్ చెప్పారు. త్వరలోనే ఇ-కామర్స్ మార్కెట్లో లభ్యం కానున్న ఈ ఏసీలు ఫస్ట్ కం ఫస్ట్ సర్వ్ ప్రాతిపదికన ఈఈఎస్ఎల్మార్ట్.ఇన్ ద్వారా మాత్రమే లభ్యం కానున్నాయి. ఎంపిక చేసిన బ్యాంకుల ద్వారా ఆకర్షణీయమైన ఈఎంఐ ఆఫర్, ఉచిత రిపేర్ సర్వీసు, ఫిర్యాదుల పరిష్కార మద్దతుతదితర సేవలను ఆఫర్ చేస్తోంది. అంతేకాదు అప్గ్రేడ్ కావాలనుకున్న కస్టమర్లకు బై బ్యాక్ఆఫర్ను కూడా అందిచనుంది. In the first phase, 50,000 of these #SuperEfficient ACs will be available for consumers of BRPL, BSES, BYPL & Tata Power-DDL in Delhi. Consumers can buy these ACs on our dedicated online portal - https://t.co/oqRGg4Z1sy, at just a click of the button. — EESL India (@EESL_India) July 8, 2019 -
కళ్లు తెరిపించే హెచ్చరిక
ప్రకృతి ఎంతగా హెచ్చరిస్తున్నా పెడచెవిన పెడుతూ ఇష్టానుసారం విధ్వంసాన్ని కొనసాగిస్తున్న మానవాళికి ఐక్యరాజ్యసమితి వాతావరణ అధ్యయన బృందం(ఐపీసీసీ) వెల్లడించిన అంశాలు కను విప్పు కలిగించాలి. రానున్న రోజుల్లో భూతాపం వల్ల మన కోల్కతా నగరం, పాకిస్తాన్ నగరం కరాచీ చండప్రచండమైన ఎండల్ని, వడగాలుల్ని చవిచూస్తాయని ఆ సంస్థ విడుదల చేసిన నివేదిక హెచ్చ రించింది. సకాలంలో సరైన చర్యలు తీసుకోవడానికి సిద్ధపడకపోతే కోట్లాదిమంది జీవితాలు అస్త వ్యస్థమవుతాయని వివరించింది. ఒకటిన్నర దశాబ్దాల క్రితం అంకురార్పణ జరిగిన పారిశ్రామికీ కరణ సమస్త సహజ వనరుల్నీ పీల్చి పిప్పి చేస్తోంది. బొగ్గు నిల్వల వాడకం, శిలాజ ఇంధనాల వాడకం విచ్చలవిడిగా పెరిగి వాతావరణం అంతకంతకు నాశనమవుతోంది. దీన్నిలాగే కొనసాగ నిస్తే మున్ముందు ఎలాంటి ముప్పు ముంచుకొస్తుందో ఐపీసీసీ తెలిపింది. 2030నాటికి ఉష్ణోగ్రత 1.5–2 డిగ్రీల సెల్సియస్ మేర పెరిగితే విధ్వంసం ఎంత తీవ్రంగా ఉంటుందో కళ్లకు కట్టినట్టు చూపింది. ప్రపంచ దేశాలన్నీ సమష్టిగా కదిలితే, పర్యావరణ హిత చర్యలకు నడుం బిగిస్తే 2030నాటికి దాదాపు 3 లక్షల కోట్ల డాలర్ల మేర ఆర్థిక ప్రయోజనం కలుగుతుందని, ఆరున్నరకోట్ల ఉద్యోగాలను సృష్టించే అవకాశం ఉంటుందని, వాయు కాలుష్యం వల్ల కలిగే లక్షలాది మరణాలను అరికట్టడానికి అవకాశం ఏర్పడుతుందని గత నెలలో ఆర్థిక, వాతావరణ విషయాల అంతర్జాతీయ సంస్థ (జీసీఈసీ) తెలియజేసింది. శిలాజ ఇంధనాల వినియోగంపై ఆధారపడే ప్రస్తుత స్థితిని మార్చుకోగలిగితే ఎన్నో లాభాలుంటాయని గణాంక సహితంగా వివరించింది. ఇప్పుడు ఐపీసీసీ నివేదిక చూశాకైనా దేశాలన్నీ ఆ వైపు దృష్టి సారించాల్సిన అవసరం ఉన్నదని తెలుస్తుంది. 1992లో జరిగిన తొలి ధరిత్రీ సదస్సు పర్యావరణానికి జరుగుతున్న హానిని, దాని పర్యవసానంగా ఏర్పడే దుష్పరిణా మాల్ని వివరించి అందరిలోనూ చైతన్యాన్ని తీసుకొచ్చింది. ఆ తర్వాత 1997లో క్యోటో ప్రోటోకాల్ సాకారమైంది. అయితే కర్బన ఉద్గారాలకు నిర్దిష్ట వ్యవధిలో కోత పెట్టి, కాలుష్య నియంత్రణ సాంకే తిక పరిజ్ఞానాన్ని వర్ధమాన దేశాలకు అందుబాటులోకి తెస్తామని ధనిక దేశాలు అంగీకరించినా అప్పట్లో అమెరికా దాన్ని తోసిపుచ్చింది. నిజానికి ప్రపంచంలో అందరికన్నా అధికంగా, విచ్చలవి డిగా సహజ వనరుల్ని వాడేది అమెరికాయే. ఆ తర్వాత 2009లో జరిగిన కోపెన్ హాగన్ సదస్సు నాటికి అది కళ్లు తెరుచుకున్నదన్న అభిప్రాయం కలిగించింది. అప్పటి అధ్యక్షుడు ఒబామా తాము సైతం పర్యావరణ పరిరక్షణకు అంకితమవుతామని ప్రకటించారు. 2005 స్థాయి కర్బన ఉద్గారాల్లో 2020కల్లా 17 శాతం, 2030కల్లా 42 శాతం, 2050నాటికి 83 శాతం తగ్గిస్తామని ఆ దేశం సంసిద్ధత వ్యక్తపరిచింది. 2015లో పారిస్ శిఖరాగ్ర సదస్సులో కర్బన ఉద్గారాల తగ్గింపుపై 200 దేశాల మధ్య ఒడంబడిక కుదిరింది. 2005నాటి కర్బన ఉద్గారాల స్థాయిలో 33 నుంచి 35 శాతాన్ని 2030కల్లా తగ్గించాలని ఆ ఒడంబడిక సారాంశం. దాన్ని సాధించగలిగితే 2050నాటికి భూతాపం పెరుగుద లను కనీసం 1.5 – 2 డిగ్రీల సెంటీగ్రేడ్ స్థాయికి పరిమితం చేయగలమని ఆ సదస్సు అంచనా వేసింది. ఆ ఒడంబడిక అమలుకు సంబంధించిన సాంకేతిక అంశాల నిర్ధారణకు, వివిధ దేశాలు అప్పట్లో హామీ ఇచ్చిన లక్ష్యాల సాధనలో ఇవి ఏవిధంగా తోడ్పడగలవో అంచనా వేయడానికి నిరుడు జర్మనీలోని బాన్లో కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్(కాప్)–23 సదస్సు కూడా జరిగింది. అయితే నిర్దిష్టమైన మార్గదర్శకాల రూపకల్పనలో ఆ సదస్సు విఫలమైంది. దానికి కొనసాగింపుగా వచ్చే డిసెంబర్లో పోలాండ్లోని కటోవైస్లో కాప్–24 సదస్సుకు ఏర్పాట్లు సాగుతున్నాయి. కానీ అక్కడ ఈ దేశాలన్నీ ఏం సాధించగలవో అనుమానమే. మొత్తానికి 2020నాటికల్లా పారిస్ ఒడంబడిక అమలు ప్రారంభం కావాలని సంకల్పం చెప్పు కున్నా ఆ దిశగా అడుగు ముందుకు పడటం లేదు. ఒక్క అమెరికా మాత్రమే కాదు... మిగిలిన దేశాలు కూడా పర్యావరణానికి ముంచుకొస్తున్న ప్రమాదంపై చిత్తశుద్ధితో కృషి చేయడం లేదని ఈమధ్యే ఫిజీ ప్రధాని బైనిమారమా నిరాశ వ్యక్తం చేశారు. ఐపీసీసీ నివేదిక భయానక భవిష్యత్తును కళ్ల ముందు ఉంచింది. భూతాపం కారణంగా ఊహకందని విధ్వంసం చోటు చేసుకోబోతున్నదని హెచ్చరించింది. 2030నాటికి ఉష్ణోగ్రతలు 2 డిగ్రీలు పెరిగితే పంటల దిగుబడి గణనీయంగా తగ్గి పోతుందని, ప్రపంచవ్యాప్తంగా అంటువ్యాధులు, డెంగీ, మలేరియా వంటివి తీవ్ర రూపం దాలు స్తాయని తెలిపింది. నీటి కాలుష్యం, వాయు కాలుష్యం కారణంగా లక్షలాదిమంది మరణిస్తారని వివరించింది. భూతాపం పెరగడం వల్ల ధ్రువ ప్రాంతాల్లో మంచు కరిగి సముద్ర మట్టాలు పెరు గుతాయని, తీర ప్రాంతాలకు ముంపు ముప్పు తప్పదని హెచ్చరించింది. వీటి ప్రభావం అత్యంత నిరుపేద వర్గాలపైనే అధికంగా ఉంటుందని తెలిపింది. ఈ వర్గాలకు జీవనోపాధి దెబ్బతింటుం దని, ఆహార కొరత ఏర్పడుతుందని, అంటువ్యాధులు పీడిస్తాయని అంచనావేసింది. అన్ని అంశాలనూ అధ్యయనం చేసి, పొంచి ఉన్న పర్యావరణ ముప్పును అంచనా వేయమని పారిస్ ఒడంబడిక కుదిరాక ఐక్యరాజ్యసమితి ఐపీసీసీని కోరిన పర్యవసానంగా ప్రస్తుత నివేదిక రూపొందింది. అయితే దీని రూపకల్పన కోసం వివిధ దేశాల్లోని ప్రభుత్వాలను సంప్రదించటం, వారిచ్చిన గణాంకాలు స్వీకరించడం ప్రధాన లోపమనే చెప్పాలి. ప్రభుత్వాలు సహజంగానే పరి స్థితుల తీవ్రతను తగ్గించి చెబుతాయి. తమ లోపాల్ని కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నిస్తాయి. ఏ దేశమూ తాము రెండేళ్లనాటి పారిస్ ఒడంబడికకు అనుగుణంగా చర్యలు తీసుకోలేకపోయామని ఒప్పుకోదు. అమెరికా, సౌదీ అరేబియా వంటివైతే ఐపీసీసీకి సరిగా సహకరించనే లేదు. అంటే ఈ నివేదిక హెచ్చరిస్తున్న స్థాయికి మించే భూగోళానికి ముప్పు పొంచి ఉన్నదని ప్రపంచ ప్రజలు గుర్తించాలి. తమ తమ ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చి ప్రకృతి విధ్వంసాన్ని అడ్డుకోవాలి. అంతిమంగా ప్రజానీకంలో ఏర్పడే చైతన్యమే ప్రభుత్వాల మెడలు వంచగలదు. -
గ్లోబల్ వార్మింగ్తో పెను వినాశనమే!
ప్రపంచదేశాలు గ్లోబల్వార్మింగ్ను అరికట్టకపోతే ఊహకు అందని ఉపద్రవాలు సంభవిస్తాయని ఐక్యరాజ్యసమితి(ఐరాస) హెచ్చరించింది. అతివృష్టి, అనావృష్టి కారణంగా ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ఉపాధిని కోల్పోతారని వెల్లడించింది. దీని కారణంగా భారత్, పాకిస్తాన్లో తీవ్రమైన వడగాలులు వీస్తాయని పేర్కొంది. ఈ మేరకు ఐక్యరాజ్యసమితికి చెంది న ఇంటర్గవర్నమెంటల్ ప్యానెల్ క్లైమేట్ ఛేంజ్ (ఐపీసీసీ) ప్రత్యేక నివేదికను విడుదల చేసింది. భారత్లోని తీరప్రాంత నగరమైన కోల్కతాతో పాటు పాకిస్తాన్ ఆర్థిక రాజధాని కరాచీపై గ్లోబల్ వార్మింగ్ ప్రభావం తీవ్రంగా ఉంటుంద ని ఐపీసీసీ తన నివేదికలో తెలిపింది. విచ్చలవిడిగా శిలాజ ఇంధనాల వాడకం, అడవుల నరికి వేత కారణంగా ప్రపంచవ్యాప్తంగా సగటు ఉ ష్ణోగ్రతలో పెరుగుదల 1.5 డిగ్రీ సెల్సియస్ దాటిపోతుందని వెల్లడించింది. తద్వారా భూ తాపం పెరిగి భారత్, పాకిస్తాన్లో తీవ్రమైన వడగాలులు వీస్తాయంది. ప్రపంచవ్యాప్తంగా 40 దేశాలకు చెందిన 91 మంది నిపుణులు ఈ నివేదిక రూపకల్పనలో పాలుపంచుకున్నారు. అంటువ్యాధుల విజృంభన.. ఒకవేళ 2030 నాటికి ఈ ఉష్ణోగ్రతలు 2 డిగ్రీల సెల్సియస్ మేరకు పెరిగితే జరిగే విధ్వంసం ఊహకు కూడా అందదని ఐపీసీసీ తెలిపింది. తొలుత వాతావరణ మార్పులతో అతివృష్టి, ఆపై అనావృష్టి సంభవిస్తాయని నివేదికలో వెల్లడించింది. ‘ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరగడంతో పంటల దిగుబడి తగ్గిపోతుంది. దీనికి తోడుగా ప్రపంచవ్యాప్తంగా కీటకాల ద్వారా వ్యాప్తిచెందే అంటువ్యాధులు, డెంగీ, మలేరియా వంటి జ్వరాలు తీవ్రరూపం దాలుస్తాయి. ఓవైపు ఆహారకొరత, మరోవైపు అనారోగ్యం కారణంగా ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది మృత్యువాత పడతారు. భారత్లోని మెట్రో నగరాల్లో తీవ్రమైన ఎండకు తోడు ప్రాణాంతకమైన వడగాలులు వీస్తాయి. ఇవి దాదాపు 35 కోట్ల మంది ప్రజలపై ప్రభావం చూపుతాయి. ధ్రువ ప్రాంతాల్లో మంచు కరిగిపోవడంతో సముద్రమట్టాలు భారీగా పెరుగుతాయి. తద్వారా తీరప్రాంతాలు మునిగిపోతాయి. ఉష్ణోగ్రతలు అదుపుకాకపోవడంతో అడవుల్లో కార్చిచ్చులు చెలరేగుతాయి. అతివృష్టి, అనావృష్టితో పాటు అంటువ్యాధుల దెబ్బకు నిత్యావసరాల ధరలు సామాన్యులకు అందుబాటులో లేకుండా పోతాయి. దీంతో పొట్టపోసుకునేందుకు లక్షలాది మంది ప్రజలు పట్టణ ప్రాంతాలకు వలస వస్తారు. తద్వారా ప్రజల ఆదాయాలు భారీగా పడిపోతాయి. పట్టణాల్లో ఉపాధి అవకాశాలు సన్నగిల్లిపోతాయి. అంతిమంగా తీవ్ర వినాశనం సంభవిస్తుంది’ అని ఐపీసీసీ తెలిపింది. 1.5 డిగ్రీలు నియంత్రిస్తే... పోలండ్లోని కటోవిస్లో ఈ ఏడాది డిసెంబర్ 2 నుంచి 14 వరకూ జరిగే వాతావరణ మార్పుల సదస్సులో ఈ నివేదికపై ప్రపంచదేశాలు చర్చించి గ్లోబల్ వార్మింగ్ నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రణాళిక రూపొందించనున్నాయి. ఒకవేళ సగటు ఉష్ణోగ్రతలో పెరుగుదలను 1.5 డిగ్రీల సెల్సియస్లోపు నియంత్రించగలిగితే వాతావరణ మార్పుల కారణంగా ప్రభావితమయ్యే కోట్లాది మంది ముప్పు నుంచి బయటపడతారు. అలాగే ఆసియాలోని దేశాల్లో వరి, గోధుమ, మొక్కజొన్న పంటల దిగుబడి నష్టాలు గణనీయంగా తగ్గుతాయి. 2050 నాటికి పేదరికం ఊహించినస్థాయిలో పెరగదు. 2100 నాటికి ప్రపంచవ్యాప్తంగా సముద్రమట్టాల పెరుగుదలను 10 సెం.మీ. మేరకు తగ్గించవచ్చు. కర్బన ఉద్గారాలను 2035 నాటికి 45 శాతానికి తగ్గించాలని ఐపీసీసీ సూచించింది. అప్పుడే గ్లోబల్ వార్మింగ్ కారణంగా ఎదురయ్యే పెనుముప్పును సమర్ధవంతంగా ఎదుర్కొనగలమని స్పష్టం చేసింది. -
మండుతున్న సూరీడు
ఐరోపాలో భానుడు నిప్పులు చెరుగుతున్నాడు.స్వీడన్లో కార్చిచ్చులు వ్యాపిస్తున్నాయి. జపాన్లో ఎండల ధాటికి జనం ప్రాణాలు కోల్పోతూ ఉంటే.. అమెరికన్లూ ఉక్కబోత తట్టుకోలేకపోతున్నారు. ఇక సౌదీ అరేబియా గురించి ప్రత్యేకంగా చెప్పనే అక్కర్లేదు ఆ దేశం,ఈ దేశం అని కాదు ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు భానుడి ప్రతాపానికి అల్లాడిపోతున్నాయి. 2018 సంవత్సరం ఎండల్లో కొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఎందుకీ ఎండలు ? ఈ ఏడాదే ఎందుకింత మంటలు ? ఎండలు మండిపోయేందుకు పలు కారణాలున్నాయని రీడింగ్ యూనివర్సిటీ శాస్త్రవేత్త ప్రొఫసర్ లెన్ షాఫ్రే అంటున్నారు. వాతావరణంలో గాలి పీడనం ఎక్కువగా ఉన్నప్పుడు ఉష్ణోగ్రతలు పెరగడం సహజం. బలంగా వీచే గాలుల కారణంగా కొద్దికాలంలోనే పీడనం తగ్గిపోయి వాతావరణం చల్లబడుతూంటుంది. అయితే ఈ ఏడాది గాలులు చాలా మందగమనంతో వీస్తూండటం వల్ల అధిక పీడన పరిస్థితులు ఎక్కువ కాలం కొనసాగాయి. ఫలితంగా బ్రిటన్ తదితర దేశాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టడం లేదు. గాలులు ఎంత వేగంతో వీస్తాయన్నది ఉత్తరార్ధ, దక్షిణార్ధ గోళాల్లోని ఉష్ణోగ్రతల మధ్య ఉన్న తేడాపై ఆధారపడి ఉంటుంది. వేగం తక్కువగా ఉండటంతో ఈ ఏడాది దక్షిణార్ధ గోళం నుంచి బయలుదేరిన గాలులు యూరోపియన్ దేశాలకు చేరేందుకు ఎక్కువ కాలం పడుతోంది. అంతేకాకుండా దిశకూడా మార్చుకోవడంతో పరిస్థితి మరింత దిగజారుతోంది. భూతాపోన్నతీ కారణమే.. పెట్రోలు, డీజిల్ వంటి శిలాజ ఇంధనాల విచ్చలవిడి వాడకం వల్ల భూమి క్రమేపీ వేడెక్కుతోందని మనకు తెలుసు. కొన్నిదేశాల్లో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండేందుకు ఈ భూతాపోన్నతి కూడా కారణమని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఉత్తర అట్లాంటిక్ సముద్ర ఉపరితలంపై వస్తున్న అనూహ్య మార్పుల కారణంగా బ్రిటన్, ఐర్లండ్ వంటి దేశాల్లో ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. ఫసిఫిక్ మహాసముద్రంలోని కొన్ని ప్రాంతాల్లో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు పెరిగిన కారణంగా ఏర్పడే ఎల్నినో పరిస్థితులు నెలకొన్నాయి. గత ఏడాది అక్టోబర్ నుంచి లానినో పరిస్థితులు నెలకొన్నాయి. కానీ ఈ ఏడాది ఏప్రిల్ వచ్చేసరికి లానినో బలహీనమై ఎల్నినో పరిస్థితులు వచ్చేశాయి. దీంతో బ్రిటన్లో పొడి వాతావరణం నెలకొని ఉక్కబోత భరించలేని స్థాయికి చేరుకుంది. ఇప్పటివరకు ప్రపంచంలో 1976 సంవత్సరం అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైన ఏడాదిగా రికార్డులకెక్కింది. ఈ ఏడాది వివిధ దేశాల్లో ఇదే పరిస్థితి కొనసాగితే ఆ నాటి పరిస్థితే మళ్లీ పునరావతమవుతుందని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. యూకేలో 400 ఏళ్ల రికార్డులు బద్దలు ఇంగ్లండ్లో ఎండలు ఏ స్థాయికి చేరుకున్నాయంటే గత నాలుగు వందల ఏళ్ల రికార్డులు బద్దలైపోయాయి. 1600 సంవత్సరం తర్వాత ఉష్ణోగ్రతలు 36 డిగ్రీలకు చేరుకోవడం ఈ ఏడాదే.. ఎప్పుడూ 20 నుంచి 25 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఇంగ్లండ్లో ఈ వారం ఏకంగా 33 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదై జనాల్ని బెంబేలెత్తిస్తోంది. స్వీడన్లో ఈ శతాబ్దంలోనే అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదై కార్చిచ్చులు చెలరేగుతున్నాయి. గత కొన్ని రోజులుగా స్వీడన్లో ఉత్తరాన ఉన్న లాప్ల్యాండ్ నుంచి దక్షిణాదిన ఉన్న గోటాల్యాండ్ వరకు 44 ప్రాంతాల్లో అడవులు దగ్ధమవుతున్నాయి. అమెరికాలోని దక్షిణ కాలిఫోర్నియాలో రికార్డు స్థాయిలో 38 డిగ్రీల సెల్సియస్ నమోదైతే సౌదీ అరేబియాలో 46 డిగ్రీలు దాటి పోయాయి. జపాన్లో 41 డిగ్రీల ఉష్ణోగ్రతలు దాటిపోవడంతో ఎండ వేడికి తట్టుకోలేక ప్రజలు ప్రాణాలే కోల్పోతున్నారు. గత వారంలోనే 65 మంది మరణిస్తే, మరో 22 వేల మంది వడదెబ్బ తగిలి ఆస్పత్రి పాలయ్యారు. దీంతో ఆ దేశం ఎండల్ని ఒక ప్రకృతి వైపరీత్యంగా ప్రకటించింది.. ప్రపంచ దేశాల్లో ఈ ఎండల తీవ్రత ఆగస్టు నెలాఖరువరకు కొనసాగే అవకాశాలున్నాయని గ్లోబల్ ఫోర్కాస్ట్ సిస్టమ్, నేషనల్ ఓషన్ అట్మాస్ఫియర్ అడ్మినిస్ట్రేషన్లు అంచనా వేస్తున్నాయి. -
గ్లోబల్ వార్నింగ్
-
గ్లోబల్ వార్నింగ్
-
అగ్రరాజ్యం వణికిపోయిన రోజు