అచ్యుతాపురం ఘటన: దిగొచ్చిన చంద్రబాబు సర్కార్
అనకాపల్లి అచ్యుతాపురం సెజ్ ఫార్మా కంపెనీ దుర్ఘటన అప్డేట్స్పరిహార ప్రకటన చేసిన చంద్రబాబుఎట్టకేలకు దిగొచ్చిన చంద్రబాబు సర్కార్బాధిత కుటుంబాల ఆందోళన, వైఎస్సార్సీపీ డిమాండ్కు తలొగ్గిన వైనంఅనకాపల్లి అచ్యుతాపురం సెజ్.. ఎసెన్షియా ఫార్మా కంపెనీ ప్రమాద బాధితులకు పరిహారం ప్రకటించిన ఏపీ ప్రభుత్వంవిశాఖపట్నం జిల్లా మెడికవర్ ఆస్పత్రిలో బాధితుల్ని పరామర్శించిన సీఎం చంద్రబాబుఅనంతరం మీడియాతో పరిహార ప్రకటనమృతుల కుటుంబాలకు కోటి రూపాయిలు పరిహారంఅవయవాలు కోల్పోయిన వారికి 50 లక్షలు,గాయాలు అయిన వారికి 25 లక్షలు పరిహారం ప్రకటించిన చంద్రబాబుచికిత్సకు అయ్యే పూర్తి ఖర్చు ప్రభుత్వమే భరిస్తుందని స్పష్టీకరణపరిహారం ఎప్పటిలోగా అందిస్తామనేదానిపై ఇవ్వని స్పష్టతగత ప్రభుత్వాలు వ్యవస్థలను నిర్వీర్యం చేశాయంటూ అసందర్భోచిత వ్యాఖ్యలుప్రమాదం జరిగిన వెంటనే స్పందించిన వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ కోటి రూపాయల పరిహారం ఇవ్వాల్సిందేనని, పరిహారంపై స్పష్టం చేయాలని జగన్ డిమాండ్ ప్రభుత్వ స్పందన సరిగా లేదు: బొత్స ఫైర్అచ్యుతాపురం ఘటన బాధాకరంప్రభుత్వం స్పందించిన తీరు సరికాదుబాధిత కుటుంబాలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదుమంత్రులు, ఎమ్మెల్యేలు బాధితుల్ని పరామర్శించలేదుచంద్రబాబు కేజీహెచ్కు ఎందుకు రాలేదు?బాధితులకు భరోసా కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలిగతంలో మా ప్రభుత్వం ఈ తరహా ప్రమాదాలు జరిగితే సత్వరమే స్పందించిందిమా ప్రభుత్వం ఎల్జీ పాలిమర్స్ ఘటనలో బాధితులకు కోటి రూపాయల పరిహారం ఇచ్చిందిసెజ్ ప్రమాద బాధితులకు కూడా కోటి రూపాయల పరిహారం ఇవ్వాలిరేపు బాధితుల్ని వైఎస్ జగన్ పరామర్శిస్తారుపరిహార ప్రకటనపై బాబు సర్కార్ డ్రామాలుఅచ్యుతాపురం ఫార్మా కంపెనీ ప్రమాదం.. పరిహారం విషయంలో చంద్రబాబు ప్రభుత్వం నాటకాలుగత ప్రభుత్వం మాదిరే పరిహారం ఇవ్వాలని కోరుతున్న బాధిత కుటుంబాలుఅటు విశాఖ, ఇటు అనకాపల్లి మార్చురీల వద్ద ఆందోళనపరిహారంపై స్పష్టమైన ప్రకటన తర్వాతే పోస్ట్మార్టానికి సహకరిస్తామని బైఠాయింపుపోలీసులు, రెవెన్యూ అధికారుల బుజ్జగింపులతో తలొగ్గని కుటుంబ సభ్యులుప్రభుత్వం కోటి రూపాయల పరిహారం ఇస్తుందని ప్రకటించిన కలెక్టర్ హరీందర్ ప్రసాద్తక్షణం సాయం అందించాలని బాధిత బంధువుల డిమాండ్కాసేపటికే జాయింట్ కలెక్టర్ జాహ్నవి విరుద్ధమైన ప్రకటనపరిహారం ఇవ్వాలంటే ముందు బాధితుల బంధువుల్ని గుర్తించాలంటూ మెలికమూడు రోజుల సమయం పడుతుందని వ్యాఖ్యపరిహారం చంద్రబాబే ప్రకటిస్తారంటూ తెలిపిన జాహ్నవిజేసీ ప్రకటన తర్వాత.. ఆందోళన ఉధృతానికి సిద్ధమైన బాధిత కుటుంబాలు, బంధువులుమెడికవర్ ఆస్పత్రికి చంద్రబాబువిశాఖ మెడికవర్ ఆస్పత్రిలో ఏపీ సీఎం చంద్రబాబు ఎసెన్షియా ఫార్మా కంపెనీ ప్రమాద బాధితులకు పరామర్శచికిత్స పొందుతున్న బాధితులతో మాట్లాడిన సీఎం చంద్రబాబువైద్యం అందుతున్న తీరును వైద్యుల్ని అడిగి తెలుసుకున్న చంద్రబాబుకేజీహెచ్కు వైఎస్సార్సీపీ నేతలువిశాఖ కేజీహెచ్ ఆస్పత్రికి వెళ్లిన వైఎస్సార్సీపీ నేతలుబాధిత కుటుంబాలకు ఎమ్మెల్సీ బొత్స, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ తదితరుల పరామర్శఅధికార యంత్రాగం, ప్రభుత్వం నుంచి సరైన స్పందన లేదని వాపోయిన బాధితులుఏ ఒక్కరూ పట్టించుకోలేదని కంటతడి పెట్టిన మహిళలుచలించిపోయి.. బాధితుల్ని ఓదార్చిన బొత్స ‘సీఎం రమేష్కు సిగ్గుందా?’అనకాపల్లి జిల్లా ఎన్టీఆర్ ఆసుపత్రి వద్ద ఉద్రిక్తతమార్చురీ గేటు ముందు నిరసనకు దిగిన మృతుల కుటుంబ సభ్యులుప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి వీడాలి అంటూ నినాదాలుమృతుల కుటుంబాలకు వెంటనే న్యాయం చేయాలని డిమాండ్.అచ్యుతాపురం ప్రమాద ఘటనపై కేంద్రం రూ. రెండు లక్షలు నష్టపరిహారం ప్రకటించడం దుర్మార్గంసీఎం రమేష్ కు సిగ్గుందా?బాధిత కుటుంబాలు రోదిస్తుంటే ఒక్క ప్రజాప్రతినిధి కూడా వచ్చి పరామర్శించలేదు..:::ఘంటా శ్రీరామ్, వామపక్ష నేతఅచ్యుతాపురం ప్రమాదంపై డిప్యూటీ సీఎం పవన్ రియాక్షన్అచ్యుతాపురం ఫార్మా ప్రమాదం చాలా బాధాకరం ప్రమాదంలో యాజమాన్యం నిర్లక్ష్యం ఉన్నట్లు తెలుస్తోంది పరిశ్రమల కాలుష్య నియంత్రణ నా శాఖ పరిధిలో ఉంది కానీ, భద్రత వేరే శాఖ కిందికి వస్తుంది పరిశ్రమల్లో సేఫ్టీ ఆడిట్ నిర్వహించాలని గతంలో చాలా సార్లు చెప్పాను అలా చేస్తే పరిశ్రమలు మూతపడతాయని నిర్వాహకులు భయపడుతున్నారుకానీ, ప్రజల ప్రాణాలు, కార్మికుల భద్రత కోసం సేఫ్టీ ఆడిట్ చేయించాల్సిందేఇలాంటి ఘటనలప్పుడు సంతాపం తెలిపి పరిహారం ఇవ్వడంతో సమస్య పరిష్కారం కాదు ప్రతి వారం ఏదో ఒక ప్రమాదం జరగడం బాధాకరంసెప్టెంబర్లో విశాఖ జిల్లాకు వెళ్లి భద్రతా చర్యలపై ప్రత్యేక సమావేశం నిర్వహిస్తాంరాబోయే 3 నెలల్లో పరిశ్రమల భద్రతపై కార్యాచరణ సిద్ధం చేస్తాం ఖర్గే దిగ్భ్రాంతిఅనకాపల్లి ఫార్మా కంపెనీ ప్రమాదంపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే దిగ్భ్రాంతిఈ ఘటనపై ఉన్నతస్థాయి దర్యాప్తు జరపాలిబాధితులకు న్యాయం చేసి, తగిన నష్టపరిహారం ఇవ్వాలిఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలిపరిహారాన్ని సీఎం ప్రకటిస్తారు: విశాఖ జేసీవిశాఖ కేజీహెచ్ ఆసుపత్రి మార్చురీ వద్ద మృతుల కుటుంబాలను కలిసిన అనకాపల్లి జాయింట్ కలెక్టర్ మేడిద జాహ్నవి.మృతుల వారసుల్ని విచారణ చేసి గుర్తిస్తాం: జేసీ జాహ్నవిపరిహారం చెల్లించటానికి వారసుల గుర్తింపు కార్యక్రమానికే మూడు రోజుల టైం పడుతుంది: : జేసీ జాహ్నవిపరిహారం ఎంత అనేది ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటిస్తారు : జేసీ జాహ్నవిప్రమాదానికి గల కారణాలు ఫోరెన్సిక్ రిపోర్టు వచ్చాక వెల్లడిస్తాం : జేసీ జాహ్నవిజేసీ ప్రకటన నేపథ్యంలో.. మీడియా ముందుకు బాధిత కుటుంబాలుపరిహారం ప్రకటించేదాకా మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించనీయమని స్పష్టీకరణపరిహారంపై ప్రకటనేది?ఎసెన్షియా ఫార్మా కంపెనీ ప్రమాదం.. అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రి మార్చురీ వద్ద ఉద్రిక్తతఆసుపత్రి సూపరింటెండెంట్తో మృతుల బంధువుల వాగ్వాదం నష్ట పరిహారంపై స్పష్టత వచ్చే వరకూ మృతదేహలను తీసుకెళ్ళేది లేదని తేల్చేసిన బంధువులుమృతుల బంధువులను బుజ్జగిస్తున్న పోలీసులు, రెవెన్యూ సిబ్బందివిశాఖ కేజీహెచ్ వద్ద ఇదే తరహా ఆందోళనఅందుకే ప్రమాదం!: అధికారుల వెర్షన్అనకాపల్లి ఎసెన్షియా కంపెనీ ప్రమాదంపై అంచనాకి వచ్చిన అధికారులురియాక్టర్ పేలడం వలన ప్రమాదం జరగలేదు అని క్లారిటీ తెచ్చుకున్న అధికారులు!ఒక రియాక్టర్ నుంచి మరొక రియాక్టర్ సాల్వెంట్ లో MTBE లిక్విడ్ లీక్ అవ్వడంతోనే ప్రమాదం?లీక్ అవుతున్న సాల్వెంట్ మీద ఎలక్ట్రికల్ స్పార్క్ పడటంతో పేలుడు సంభవించిందని అంచనాపేలుడు దాటికి కుప్పకూలిన బ్రిక్ వాల్మరో నలుగురి పరిస్థితి విషమంఫార్మా కంపెనీ ప్రమాదంలో గాయపడ్డ మరో నలుగురి పరిస్థితి విషమంమెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు అధికారుల సూచన18కి చేరిన మృతుల సంఖ్య కొనసాగుతున్న ఉద్రిక్తతవిశాఖ కేజీహెచ్ వద్ద కొనసాగుతున్న ఉద్రిక్తతపరిహారం విషయంలో ప్రభుత్వ ప్రకటనపై మృతుల బంధువుల ఆందోళన విశాఖ కలెక్టర్ హామీ తర్వాత కూడా వెనక్కి తగ్గని మృతుల కుటుంబ సభ్యులుఘటనపై ప్రభుత్వం స్పందించిన తీరును తప్పుబట్టిన కుటుంబ సభ్యులుఅధికార ప్రజాప్రతినిధులెవరూ రాలేదని మండిపాటుఅధికార యంత్రాంగం కూడా ఆలస్యంగా స్పందించిందంటున్న బాధితులుకోటి పరిహారం తక్షణమే అందించాలని డిమాండ్ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన వస్తేనే పోస్టుమార్టంకు సహకరిస్తామని స్పష్టీకరణగత ప్రభుత్వం ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు సత్వరమే ఆదుకుంది కదా అని గుర్తు చేస్తున్న మృతుల బంధువులు అచ్యుతాపురం ప్రమాద బాధితులను పరామర్శించనున్న సీఎం చంద్రబాబుఉదయం 11 గంటలకు విశాఖ చేరుకోనున్న సీఎంనగరంలోని మెడికవర్ ఆస్పత్రిలో క్షతగాత్రులను పరామర్శించనున్న చంద్రబాబుతర్వాత నేరుగా రాంబిల్లి మండలం ఫార్మాసిటీలో ఉన్న ఎసెన్షియా పరిశ్రమకు వెళ్లనున్న సీఎంఘటనా స్థలాన్ని సందర్శించనున్న చంద్రబాబుఎన్టీఆర్ ఆసుపత్రి వద్ద భారీగా పోలీసుల మోహరింపు అనకాపల్లి ఎన్టీఆర్ ప్రభుత్వ ఆసుపత్రి వద్ద భారీగా పోలీసుల మోహరింపు ఆస్పత్రిలో ఏడు మృతదేహాలు.. ఆరింటి గుర్తింపుమార్చురీ వద్ద ఉన్న మృతుల బంధువులపై ఆంక్షలువిశాఖ కేజీహెచ్ వద్ద పరిహారంపై స్పష్టమైన హామీ కోరుతూ బంధువుల ఆందోళనఎన్టీఆర్ ఆస్పత్రి వద్ద అలాంటి పరిస్థితి ఎదురుకావొచ్చని ముందు జాగ్రత్తమృతదేహన్ని చూస్తామని చెప్పినా లోపలకు పంపించని పోలీసులుపోలీసులతో బంధువుల వాగ్వాదం.. పరిస్థితి ఉద్రిక్తత సాక్షి చేతిలో ప్రమాదంపై ఫిర్యాదు కాపీరాంబిల్లీ పోలీసులకి ఫిర్యాదు చేసిన రాంబిల్లి తహశీల్దార్ భాగ్యవతిమధ్యాహ్నాం 2:15 కి పేలుడు జరుగున్నట్టు రిపోర్ట్ లో పేర్కొన్న తహశీల్దార్సాల్వెంట్ కెమికల్ పేలి ప్రమాదం జరిగినట్టు రిపోర్ట్ లో పేర్కొన్న తహశీల్దార్యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగా ప్రమాదం జరిగిందని రిపోర్ట్ఒకట్రెండు రోజుల్లో పరిహార ప్రకటన: విశాఖ కలెక్టర్కేజీహెచ్ వద్ద విశాఖ కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ను ముట్టడించిన మృతుల బంధువులు.ప్రమాదం జరిగిన తరువాత యాజమాన్యం ఎందుకు స్పందించలేదని నిలదీసిన మృతుల బంధువులు.ప్రభుత్వం నుండి పరిహారం ప్రకటన స్పష్టం గా వచ్చేవరకు మార్చురీ వద్ద ఆందోళన చేస్తామంటున్న బాధిత కుటుంబాలు.ఒకటి రెండు రోజుల్లో ప్రభుత్వం పరిహారం ప్రకటిస్తుంది అని చెప్పిన కలెక్టర్ కలెక్టర్ ప్రకటనపై బాధితుల కుటుంబాల అసంతృప్తి.. కొనసాగుతున్న ఆందోళనతగిన న్యాయం చేయాల్సిందే: బాధిత కుటుంబాల ఆందోళనకేజీహెచ్ మార్చురీ వద్ద ఆందోళనకేజీహెచ్ మార్చురీకి వచ్చిన జిల్లా కలెక్టర్.కలెక్టర్ను చుట్టుముట్టిన బాధితులుతమకు న్యాయం చేయాలని డిమాండ్జరిగిన ప్రమాదంపై ఇప్పుడు వరకు ప్రభుత్వ స్పందించలేదు: బాధిత కుటుంబాలుస్థానిక ఎమ్మెల్యే మంత్రి ఇప్పటివరకు కనీసం నోరు మెదపలేదు: బాధిత కుటుంబాలుకంపెనీ ప్రతినిధులు ఎవరూ రాలేదు: బాధిత కుటుంబాలుగతంలో జగన్ ప్రభుత్వం సత్వరమే ఆదుకుంది : బాధిత కుటుంబాలుఅదే తరహాలో ఇప్పుడు ఆదుకోవాలి: బాధిత కుటుంబాలుపరిహారంగా కోటి రూపాయలు పరిహారం ఇవ్వాలి: బాధిత కుటుంబాలుకేజీహెచ్ వద్ద ఉద్రిక్తతవిశాఖ కేజీహెచ్ ఆస్పత్రి వద్ద ఫార్మా కంపెనీ మృతుల బంధువుల ఆందోళననష్టపరిహారంపై స్పష్టమైన ప్రభుత్వం హామీ ఇవ్వాలని బంధువుల డిమాండ్కేజీహెచ్లో 12 మృతదేహాలుబంధువులతో రెవెన్యూ అధికారుల చర్చలు అచ్యుతాపురం సెజ్ వద్ద ఉద్రిక్తతనష్టపరిహారం పై స్పష్టమైన హామీ వచ్చేవరకు పంచనామాకు సహకరించేది లేదంటున్న మృతుల బంధువులు..మృతుల బంధువులను బుజ్జగిస్తున్న రెవెన్యూ అధికారులుపంచనామాకు సహకరించాలని మిగతా వివరాలు ఆపై మాట్లాడదామంటున్న రెవెన్యూ సిబ్బందిఎన్టీఆర్ ఆసుపత్రికి చేరుకున్న జాయింట్ కలెక్టర్మృతుల బంధువులకు సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్న జాయింట్ కలెక్టర్నష్టపరిహారంపై ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి రాని స్పష్టతఇదీ చదవండి: ప్రాణాలు తీసిన పాతకాలం రియాక్టర్!ఎసెన్షియా ఫార్మా ప్రమాదంపై కేసు నమోదు బీఎన్ఎస్ సెక్షన్లు 106(1), 125(b),125(a) కింద కేసులు నమోదుఎసెన్షియా ఫార్మా ప్రయివేటు లిమిటెడ్ యాజమాన్యం పై కేసునిర్లక్ష్యంతొ మరణానికి కారణం , ప్రాణాలకు, వ్యక్తిగత భద్రతకు భంగం వాటిల్లడం సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన రాంబిల్లి పోలీసులుప్రధాని మోదీ దిగ్భ్రాంతి.. పరిహారం ప్రకటనఅచ్యుతాపురం సెజ్లోని ఫార్మా కంపెనీలో భారీ పేలుడు ఘటనపై విదేశీ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతులకు సంతాపం తెలిపారు. బాధిత కుటుంబాలకు రూ.2 లక్షల పరిహారం, క్షతగాత్రులకు రూ.50 వేలు అందించనున్నట్లు చెప్పారు. మృతుల సంఖ్య 18!అచ్యుతాపురం సెట్ దుర్ఘటనలో 18కి చేరిన మృతుల సంఖ్యకేజీహెచ్ మార్చురీకి 12 మృతదేహాలుకొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్17 మృతదేహాల గుర్తింపు.. మరొకటి గుర్తించాల్సి ఉంది!విశాఖ కేజీహెచ్ మార్చురీలో ఉన్న మృతుల వివరాలు1)నీలపు రామిరెడ్డి అస్సోసియేట్ జెనరల్ మేనేజర్ 2)మహంతి నారాయణారావు అసిస్టెంట్ మనేజర్ 3)మొండి నాగబాబు అసిస్టెంట్ మేనేజర్ 4)చల్లపల్లి హారిక ట్రైనీ ఇంజినీర్ 5)మారిశెట్టి సతీష్ అసిస్టెంట్ మేనేజర్ 6)యళ్లబిల్లి చిన్నారావు పెయింటర్ 7)పైడి రాజశేఖర్ ట్రైనీ ప్రాసెస్ ఇంజినీర్ తండ్రి ధర్మారావు శ్రీకాకులం జిల్లా వంజంగి కులం కాలింగ 8) కొప్పర్తి గణేస్ కుమార్ M దుర్గా భవాని 9) ప్రశాంత్ హంస మేల్ W/o జ్యోతి 10) వేగి సన్యాసి నాయుడు11)పూడి మోహన్ దుర్గా ప్రసాద్ 12)జవ్వాది చిరంజీవిఅనకాపల్లి ఎన్టీఆర్ ప్రభుత్వ ఆసుపత్రిలో 5 మృతదేహాలుఈ ఐదు మృతదేహలకు పంచనామా నిర్వహించనున్న అధికారులుఎన్టీఆర్ ఆసుపత్రికి వస్తున్న మృతుల బంధువులుఎన్టీఆర్ ఆసుపత్రిలో ఉన్న మృతుల వివరాలు..జావేది పార్థసారిది, పార్వతీపురం మన్యంపూసల వెంకట సాయి, చిన గంట్యాడమారేణి సురేంద్ర, గాజువాకభి. ఆనందరావు, విజయనగరంబిఎన్. రామచంద్రరావుఎసెన్షియా (scientia) కంపెనీ ఎదుట రోదిస్తున్న బాధితుల బంధువులుఅచ్యుతాపురం సెజ్లోని ఎసెన్షియా అడ్వాన్స్డ్ సైన్సెస్ ఫార్మా కంపెనీలో బుధవారం పేలిన రియాక్టర్ తమ వారి ఆచూకీ ఇంకా తెలియదు అంటూ రోదిస్తున్న బాధితులుఇంకా శిథిలాల కిందే చిక్కుకున్న కొంతమంది కార్మికులు?సహాయక చర్యల్లో జాప్యం చేస్తున్నారనే విమర్శఎవ్వరూ పట్టించుకోక పోవడంతో.. కంపెనీ ఎదుట బైఠాయించిన బాధితులుఅధికార యంత్రాంగం తూతు మంత్రంగా వ్యవహరిస్తోందిఅనకాపల్లి ఫార్మా కంపెనీ ప్రమాద బాధితుల్ని అన్నివిధాలా ఆదుకోవాలిబాధితులకు మెరుగైన వైద్య సహాయం అందించాలిమృతుల కుటుంబాలకు రూ.1 కోటి చొప్పున నష్టపరిహారం ఇవ్వాలిఅచ్యుతాపురం ఫార్మా కంపెనీలో జరిగిన ప్రమాద ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలి.గత కొంతకాలంగా విశాఖ సమీపంలోని కంపెనీలలో వరుస ప్రమాదాలునిరంతరం ఫ్యాక్టరీల్లో భద్రత, నిబంధనలను పర్యవేక్షించాల్సిన అధికార యంత్రాంగం తూతూ మంత్రంగా వ్యవహరిస్తోంది:::సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ