Hyperloop Track
-
హైపర్లూప్ ‘పాడ్’.. అరగంటలో 350 కిలోమీటర్ల ప్రయాణం..
చెన్నై: భూమి మీద విమాన వేగంతో ప్రయాణికులను గమ్య స్థానాలకు చేర్చే హైపర్లూప్ ప్రాజెక్టుపై కీలక ప్రకటన చేశారు కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్. ఆసియాలో అతి పొడవైన హైపర్లూప్ ట్యూబ్ (410 మీ) త్వరలో అందుబాటులోకి రానుందన్నారు. ఇదే సమయంలో ‘పాడ్’(రైలు బోగీ) నమూనాకు సంబంధించిన ఓ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు.కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తాజాగా ఐఐటీ మద్రాస్లోని హైపర్లూప్ ట్రాప్ పరీక్షా కేంద్రాన్ని సందర్శించారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్ సహాయంతో అభివృద్ధి చేస్తున్న హైపర్లూప్ ట్యూబ్ పరిశీలించారు. అనంతరం, ఆయన మీడియాతో మాట్లాడుతూ..‘భారత్లో త్వరలోనే ప్రపంచంలోనే అతి పొడవైన హైపర్లూప్ ట్యూబ్ అవుతుంది. దీని పొడవు 410 మీటర్లు ఉంటుంది. రానున్న కాలంలో మరో 40 మీటర్లు పొడగిస్తాం. ఆసియాలోనే అతి పొడవైన హైపర్లూప్ ఇది. హైపర్లూప్ రవాణా కోసం స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానాలను ఉపయోగించి అభివృద్ధి చేశాం. ప్రస్తుతం అభివృద్ధి దశలో ఉన్న హైపర్లూప్ రవాణా సాంకేతికత ఇప్పటివరకు నిర్వహించిన పరీక్షల్లో మంచి ఫలితాలను ఇచ్చింది. త్వరలోనే అందుబాటులోకి వస్తుందనుకుంటున్నాం’ అని అన్నారు. మరోవైపు.. మంత్రి అశ్విని వైష్ణవ్ ట్విట్టర్ వేదికగా.. ఈ ప్రాజెక్ట్కు సంబంధించిన వీడియోను విడుదల చేశారు.Longest Hyperloop tube in Asia (410 m)… soon to be the world’s longest.@iitmadras pic.twitter.com/kYknzfO38l— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) March 16, 2025హైపర్లూప్ టెస్ట్ ట్రాక్ను రైల్వే మంత్రిత్వశాఖ తోడ్పాటుతో మద్రాస్ ఐఐటీ అభివృద్ధి చేసింది. ఈ తరహా రవాణా వ్యవస్థ సాకారమైతే 350 కిలోమీటర్ల దూరంలోని గమ్యస్థానాన్ని అరగంటలోపే చేరుకోవచ్చు. హైపర్లూప్ను ఐదో రవాణా విధానంగా అభివర్ణిస్తారు. హైపర్లూప్ టెక్నాలజీలో హైపర్లూప్ అనేది ఓ ప్రత్యేక నిర్మాణం. బాహ్యంగా అంటే రైలు మార్గంపై గానీ.. రైలుకు వెలుపల గానీ ఎటువంటి గాలి అసలుండదు. ఈ హైపర్ లూప్ వాక్యూం రూపంలో ఉన్న గొట్టాలలో ప్రయాణిస్తుంది. దీని కారణంగా దాని మీద ఏరోడైనమిక్ ప్రభావం ఉండదు. అంటే ఏ విధమైన బాహ్యపరమైన ఒత్తిడి రైలుపై గానీ.. దాని వేగంపై గానీ ప్రభావం చూపే అవకాశం లేదు. ఈ కారణంగానే హైపర్ లూప్ టెక్నాలజీలో రైలు అత్యంత వేగంగా ప్రయాణిస్తుందనేది ఓ సిద్ధాంతం. వీటిలో రైలు బోగీలను పోలిన పాడ్లు ప్రయాణిస్తాయి.India completes its first 422-meter-long Hyperloop test trackWith mass adoption, this high-speed sci-fi project will make it possible to travel 350 km in just 30 minutes pic.twitter.com/q4aeo1uu2X— RT (@RT_com) February 25, 2025సాధారణంగా భూమిపై ప్రయాణించే వాహనాలకు గాలి అనేది పెద్దగా ఆటంకం. దానివల్ల అవి ఒక పరిమితికి మించిన వేగంతో రోడ్డుపై వెళ్లడం సాధ్యంకాదు. కానీ గాలి పీడనం బాగా తక్కువగా ఉండే హైపర్ ల్యూబ్ ట్యూబ్లోకి బోగీని ప్రవేశపెడితే, దాని వేగంగా వెళ్లొచ్చు. గంటకు వెయ్యి కిలోమీటర్ల వేగాన్ని ఇవి అందుకునే వీలుందని చెబుతున్నారు. #WATCH | Chennai, Tamil Nadu | Union Minister Ashwini Vaishnaw inspects and assesses the work being done to develop a Hyperloop pod.A Hyperloop pod is a pressurized vehicle designed to travel at high speeds within a low-pressure tube, utilizing magnetic levitation and… pic.twitter.com/TQ1Vc76MkQ— ANI (@ANI) March 15, 2025 -
అరగంటలో 350 కిలోమీటర్ల జర్నీ!
న్యూఢిల్లీ: ఢిల్లీ నుంచి జైపూర్(రాజస్థాన్) మధ్య దూరం 300 కిలోమీటర్లు ఉంటుంది. అంతటి దూరాన్ని నిమిషాల్లో చేరుకోగలిగితే ఎలా ఉంటుంది?.. ఇలాంటి హైస్పీడ్ ప్రయాణం కోసం కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ తొలి అడుగు వేసింది. ఐఐటీ మద్రాస్ ఆలోచనతో భారత తొలి హైపర్లూప్ టెస్ట్ ట్రాక్ సిద్ధమైంది. హైపర్లూప్(Hyperloop) అనేది అత్యంత అధునాతనమైన రవాణా వ్యవస్థ. గంటకు వెయ్యి కిలోమీటర్ల ప్రయాణం ఈ రవాణా వ్యవస్థ లక్ష్యం. సుదుర గమ్యాలను నిమిషాల వ్యవధిలో చేరుకునేలా చేయడమే దీని ఉద్దేశం. అందుకే దీన్ని రవాణా వ్యవస్థలో హైపర్లూప్ను గేమ్ ఛేంజర్గా భావిస్తున్నారు. వందేభారత్ తర్వాత బుల్లెట్ రైల్ మీద దృష్టిసారించిన భారతీయ రైల్వే(Indian Railways) ఇప్పుడు మరో ఘనత వైపు అడుగులేస్తోంది. భారత తొలి హైపర్లూప్ టెస్ట్ ట్రాక్ వివరాలను కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్(Ashwini Vaishnaw) మీడియాకు తెలియజేశారు. ఐఐటీ మద్రాస్ సహకారంతో 422 మీటర్ల దూరం ఉన్న ట్రాక్ను రూపొందించారు. ఈ హైపర్లూప్ ప్రాజెక్టు వాస్తవరూపం దాలిస్తే అరగంటలోపే ఢిల్లీ నుంచి జైపూర్కు చేరుకోవచ్చన్నమాట. The hyperloop project at @iitmadras; Government-academia collaboration is driving innovation in futuristic transportation. pic.twitter.com/S1r1wirK5o— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) February 24, 2025రోడ్డు, రైలు, నీరు, వాయు రవాణా మార్గాల తర్వాత ఫిఫ్త్ ట్రాన్స్పోర్టేషన్గా హైపర్లూర్ను చెబుతుంటారు. వాక్యూమ్ ట్యూబ్స్లో పాడ్స్ ద్వారా ప్రయాణమే హైపర్లూప్. గొట్టాల్లాంటి ఆ నిర్మాణాల్లో గాలి నిరోధకత.. పాడ్లను అధిక వేగంతో ప్రయాణించేలా చేస్తుంది. 2013లో ఇలాన్ మస్క్ ప్రచారంతో దీని గురించి ఎక్కువ చర్చ నడిచింది. అమెరికా, చైనా ఇలా చాలా దేశాలు ఈ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చే ప్రయత్నాల్లో ఉన్నాయి. ప్రధాన నగరాలను అనుసంధానించడం కోసమైనా హైపర్లూప్ టెక్నాలజీ వినియోగంలోకి తేవాలని యూఏఈ సైతం భావిస్తోంది. -
భారత్ తొలి హైపర్లూప్ ట్రాక్ సిద్ధం
చెన్నై: భారత రవాణా రంగంలో మరో కలికితురాయి. ఐఐటీ మద్రాస్,భారత్ రైల్వేలు, ఇతర స్టార్టప్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న భారత్ తొలి హైపర్లూప్ టెస్ట్ ట్రాక్ సిద్ధమైంది. ఐఐటీ చెన్నైలోని తైయూర్ క్యాంపస్లో 410 మీటర్ల హైపర్లూప్ టెస్ట్ ట్రాక్ను కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఎక్స్ వేదికగా ప్రస్తావించారు. భారత్ తొలి హైపర్లూప్ టెస్ట్ ట్రాక్ (410 మీటర్లు) పూర్తయింది. రైల్వేస్, ఐఐటీ-మద్రాస్ ఆవిష్కార్ హైపర్లూప్ బృందం,ఓ స్టార్టప్ సంస్థ భాగస్వామ్యంలో ఈ హైపర్ లూప్ను నిర్మించినట్లు చెప్పారు. హైపర్ లూప్ టెక్నాలజీహైపర్ లూప్ అనేది ఓ ప్రత్యేక నిర్మాణం. బాహ్యంగా అంటే రైలు మార్గంపై గానీ.. రైలుకు వెలుపల గానీ ఎటువంటి గాలి అసలుండదు. ఈ హైపర్ లూప్ వాక్యూం రూపంలో ఉన్న గొట్టాలలో ప్రయాణిస్తుంది. దీని కారణంగా దాని మీద ఏరోడైనమిక్ ప్రభావం ఉండదు. అంటే ఏ విధమైన బాహ్యపరమైన ఒత్తిడి రైలుపై గానీ..దాని వేగంపై గానీ ప్రభావం చూపే అవకాశం లేదు. ఈ కారణంగానే హైపర్ లూప్ టెక్నాలజీలో రైలు అత్యంత వేగంగా ప్రయాణిస్తుందనేది ఓ సిద్ధాంతం. ఇప్పుడి హైపర్లూప్ ట్రాక్ను టెస్ట్ చేసేందుకు సర్వం సిద్ధమైంది.సాధారణంగా భూమిపై ప్రయాణించే వాహనాలకు గాలి అనేది పెద్దగా ఆటంకం. దానివల్ల అవి ఒక పరిమితికి మించిన వేగంతో రోడ్డుపై వెళ్లడం సాధ్యంకాదు. కానీ గాలి పీడనం బాగా తక్కువగా ఉండే హైపర్ ల్యూబ్ ట్యూబ్లోకి బోగీని ప్రవేశపెడితే, దాని వేగంగావెళ్లొచ్చు. ఈ హైపర్లూప్ ఈ పద్దతిపై ట్రయల్ రన్ చేస్తారు. -
విమానం కంటే స్పీడ్గా వెళ్లే రైలు.. కథ కంచికే..
శబ్దవేగంతో దూసుకెళ్లే విమానాల గురించి మనం వినే ఉంటాం. మరి అంతవేగంగా వెళ్లగలిగే ఫ్లైట్ని రూపొందించిన శాస్త్రవేత్తలు..అలాంటి ఓ బస్సునో రైలునో ఎందుకు సృష్టించలేకపోతున్నారో ఎప్పుడైనా అనుమానం కలిగిందా? మన చుట్టూ ఉన్న గాలే అందుకు కారణం. వేగంగా వెళ్లే ఏ వస్తువునైనా అది అడ్డుకుంటుంది. ఆ ఘర్షణలో అగ్గిరాజుకుంటుంది. అందుకే విమానాలు కూడా భూవాతావరణంలో తక్కువ వేగంతో వెళతాయి. ఆకాశంలోకి అంటే శూన్యంలోకి వెళ్లాకే వేగం పుంజుకుంటాయి. ‘మరి అదే శూన్యాన్ని నేలపైనా సృష్టించగలిగితే..? అందుకోసం ఓ పెద్ద ట్యూబుని ఏర్పాటుచేస్తే... అందులో ప్రయాణం సాగితే ఎలా ఉంటుంది?’ అనే ఆలోచన వచ్చింది టెస్లా వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్కి! ఈ కొత్త ఆలోచనకి అతను పేటెంట్ తీసుకోలేదు. దీనిపైన ఎవరైనా ప్రయోగాలు చేయొచ్చంటూ ప్రకటించాడు. దాంతో వర్జిన్ హైపర్లూప్, జెలెరస్ వంటి పదికిపైగా సంస్థలు దీని తయారీలో తలమునకలయ్యాయి. ఇందుకోసం వేలకోట్లు ఖర్చుపెడుతున్నాయి. తాజాగా చాలా కాలంగా పరిశోధనలు చేస్తున్న హైపర్లూప్ స్టార్టప్ల్లో ప్రధాన స్టార్టప్గా ఉన్న వర్జిన్ హైపర్లూప్ దాని కార్యకలాపాలు మూసివేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. డిసెంబర్ 31లోపు రిచర్డ్ బ్రాన్సన్ ఆధ్వర్యంలోని వర్జిన్ గ్రూప్నకు చెందిన ఈ ప్రాజెక్ట్ను నిలిస్తేస్తున్నట్లు మీడియా కథనాలు వెలువడ్డాయి. ఎలాన్మస్క్కు 2013లో హైపర్లూప్ అనే ఆలోచన వచ్చినప్పటి నుంచి 2014లో ‘హైపర్లూప్ వన్’ స్టార్టప్ను స్థాపించి వందల కోట్లును ఖర్చు చేశారు. టెక్నికల్ డెమోలు, టెస్ట్ ట్రాక్లు మినహా ప్రాజెక్ట్లో ఎలాంటి పురోగతి లేదని తెలిసింది. అయితే తాజాగా సంస్థ తన ఆపరేషన్స్ను నిలిపేస్తున్నట్లు ప్రకటించడంతో టెక్నాలజీ రంగంలో కొంత ఆందోళన మొదలైనట్లు సమాచారం. హైపర్లూప్ వన్ 2014లో ప్రారంభించిన తర్వాత బ్రాన్సన్ 2017లో అందులో పెట్టుబడి పెట్టారు. దాంతో అప్పటి నుంచి వర్జిన్ హైపర్లూప్ వన్ అనే పేరుతో దీన్ని పిలుస్తున్నారు. కానీ 2018లో జమాల్ ఖషోగ్గి హత్య తర్వాత బ్రాన్సన్ సౌదీ అరేబియాను తీవ్రంగా విమర్శించారు. దాంతో సంస్థ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన హైపర్లూప్ ప్రాజెక్ట్పై ప్రభావం పడంది. ఫలితంగా బ్రాన్సన్ ఛైర్మన్ పదవి నుంచి వైదొలిగారు. ఇదీ చదవండి: ఇకపై ఆధార్కు పాస్పోర్ట్ తరహా వెరిఫికేషన్.. కానీ.. అనంతరం దుబాయ్ పోర్ట్ ఆపరేటర్ డీపీ వరల్డ్ హైపర్లూప్ వన్ స్టార్టప్లో మెజారిటీ వాటా కలిగి ఉండడంతో కంపెనీకు సంబంధించి పూర్తి నియంత్రణ దాని చేతిలోకి వెళ్లిపోయింది. 2022 ప్రారంభంలో ఆ సంస్థ హైపర్లూప్ వన్లోని సగానికిపైగా సిబ్బందిని తొలగించింది. దాంతోపాటు డీపీ వరల్డ్ కార్గోసేవలపై ఎక్కువ దృష్టి కేంద్రీకరిస్తోంది. ఫలితంగా హైపర్లూప్ వన్ మేధో సంపత్తి ముగిసిపోతోందని టెక్ నిపుణులు ఆందోళన చెందుతున్నారు. ఈ స్టార్టప్కు చెందిన కొన్ని ఆస్తులను సైతం డీపీ వరల్డ్ విక్రయించేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. -
25 నిమిషాల్లోనే ముంబయి నుంచి పూణేకు..
సాక్షి, ముంబయి : దేశీయ రవాణా రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతూ తొలి హైపర్లూప్ ట్రైన్కు మార్గం సుగమమైంది. పూణే, ముంబయిలను కలుపుతూ హైపర్లూప్ నిర్మాణం కోసం వర్జిన్ హైపర్లూప్ వన్తో మహారాష్ట్ర ప్రభుత్వం అవగాహనా ఒప్పందంపై(ఎంఓయూ) సంతకాలు చేసింది. హైపర్లూప్ రూట్ సెంట్రల్ పూణే నుంచి నవీ ముంబయి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ముంబయిలకు కేవలం 25 నిమిషాల్లోనే ప్రయాణీకులను చేరవేస్తుంది. ఈ రూట్ ద్వారా లక్షల సంఖ్యలో ప్రయాణీకులు రాకపోకలు సాగిస్తూ ప్రయాణ సమయాన్నిభారీగా ఆదా చేయవచ్చని అధికార వర్గాలు తెలిపాయి. సాధ్యాసాధ్యాలపై ఆరు నెలల పాటు అథ్యయనం చేసిన అనంతరం రూట్ అలైన్మెంట్ ఖరారు చేస్తారు. రెండు దశల్లో పూణే-ముంబయి హైపర్లూప్ రూట్ నిర్మాణం చేపడతారు. తొలి దశలో ఆపరేషనల్ డిమాన్స్ర్టేషన్ ట్రాక్ను నిర్మిస్తారు. ఒప్పందం ఖరారైన అనంతరం ఐదు నుంచి ఏడేళ్ల వ్యవధిలో మొత్తం ప్రాజెక్టు నిర్మాణం పూర్తవుతుంది. రెండు ప్రధాన నగరాల మధ్య ప్రయాణీకులు, సరుకు రవాణా వేగవంతంగా జరిగితే పెద్ద ఎత్తున సమయం, వ్యయం ఆదాకావడంతో పాటు వృద్ధి రేటు, ఉపాధి అవకాశాలు భారీగా పెరుగుతాయని భావిస్తున్నారు. -
గొట్టంలో రైలు... రైల్లో మనం!
బుల్లెట్ ట్రెయిన్ కంటే వేగంగా వెళుతుంది! అంతెందుకు వేగంలో విమానం కూడా దీని ముందు దిగదుడుపే. పైగా ప్రయాణ ఖర్చులు బాగా చౌక! ఈ వివరాలన్నీ ఫొటోలో కనిపిస్తున్న ‘హైపర్లూప్’ గురించే. అన్నీ సవ్యంగా సాగితే ఇంకొన్నేళ్లలో ప్రపంచ రవాణా వ్యవస్థను సమూలంగా మార్చివేసే సామర్థ్యమున్న టెక్నాలజీ ఇది. వాహనాల్లో మనం వాడే పెట్రోలు, డీజిళ్లలో గురుత్వాకర్షణ శక్తి, గాలి నిరోధకతలను ఎదుర్కొనేందుకు దాదాపు 80 శాతం వృధా అవుతుందని తెలుసు కదా... ఈ రెండు అడ్డంకుల్లేకుండా చేస్తే అతి తక్కువ ఇంధనంతో చాలా వేగంగా దూసుకెళ్లవచ్చు. ఓ గొట్టం లాంటి నిర్మాణంతో హైపర్లూప్ సాధించాలనుకుంటున్నది ఇదే. అమెరికాలోని టెస్లా కంపెనీ యజమాని ఎలన్ మస్క్ కొన్నేళ్ల క్రితం ఈ ఆలోచనను ప్రపంచం ముందు పెట్టారు. అప్పటి నుంచి ఇప్పటివరకూ ఇది ఎన్నో దశలు దాటింది. డిజైన్ పోటీలు, ఇంజిన్లు, కేబిన్ల తయారీ నమూనా బుల్లి ట్రెయిన్లతో పరీక్షల వంటివన్నీ విజయవంతంగా పూర్తయ్యాయి కూడా. తాజాగా అసలైన సైజులో హైపర్లూప్ టెక్నాలజీని పరీక్షించేందుకు నెవడా (అమెరికా) ఎడారిలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. దాదాపు అర కిలోమీటర్ పొడవైన ఈ ట్రాక్పై కనిపిస్తున్న గొట్టం 10 అడుగుల వ్యాసముంటుంది. ఈ గొట్టంలోపల రైల్వే బోగీ లాంటి నిర్మాణంలో ప్రయాణీకులు కూర్చుంటారు. ఆ తర్వాత రయ్యిన దూసుకెళ్లడమే! కేవలం 150 మంది ఇంజినీర్ల సాయంతో కొన్ని నెలల వ్యవధిలో ఈ ‘డెవ్లూప్’ ట్రాక్ను సిద్ధం చేశామని, హైపర్లూప్ వన్ వ్యవస్థాపకుల్లో ఒకరైన జాష్ గైగెల్ అంటున్నారు. హైపర్లూప్ టెక్నాలజీ ద్వారా ప్రయాణాన్ని వేగవంతం చేసేందుకు ఇప్పటికే అనేక దేశాలు ప్రయత్నాలు మొదలుపెట్టాయి. దుబాయిలో ఈ వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం హైపర్లూప్ వన్తో చర్చలు జరుపుతూంటే.. భారత్లో ట్రాక్ ఏర్పాటు చేస్తామని హైపర్లూప్ ప్రభుత్వానికి ప్రతిపాదన పంపింది. ఒకవేళ ఇది అందుబాటులోకి వస్తే న్యూఢిల్లీ నుంచి ముంబైకి వచ్చేందుకు పట్టే సమయం ఎంతో తెలుసా? కేవలం 70 నిమిషాలు!