interact
-
వ్యవసాయ కూలీలతో ముచ్చటించిన మంత్రి పొంగులేటి
-
విద్యార్థులతో ముఖాముఖి.. సీఎం రేవంత్ కీలక పిలుపు
సాక్షి, హైదరాబాద్: విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే ప్రభుత్వ లక్ష్యమని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. బుధవారం ఆయన ఖమ్మం జిల్లా మధిర, వైరా నియోజకవర్గాలకు చెందిన విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, అందరికి విద్య, వైద్య, ఉపాధి అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని.. అందుకే డైట్, కాస్మోటిక్ చార్జీలు పెంచామని తెలిపారు.‘‘21 వేల మంది ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించాం. 11,062 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేశాం. దేశ నిర్మాణంలో మీరు భాగస్వామ్యం కావాలి. సామాజిక న్యాయం అందించేందుకు ప్రభుత్వం కుల గణన సర్వే నిర్వహిస్తోంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల కోసం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మిస్తున్నాం. ప్రతీ నియోజకవర్గంలో 20 నుంచి 25 ఎకరాల్లో ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు నిర్మిస్తున్నాం. వచ్చే అకడమిక్ ఇయర్లోగా నిర్మాణాలు పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. చదువుతో పాటు స్కిల్ ఉంటేనే ఉద్యోగాలు లభిస్తాయి. అందుకే విద్యార్థి, నిరుద్యోగులకు నైపుణ్య శిక్షణ అందించేందుకు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేశాం’’ అని సీఎం రేవంత్ తెలిపారు.టాటా ఇనిస్టిట్యూట్ సహకారంతో ఐటీఐలను ఏటీసీలుగా మారుస్తున్నాం. సాంకేతిక నైపుణ్యంతో పాటు ప్రభుత్వం ఉద్యోగ భద్రతను కల్పిస్తోంది. చదువుతో పాటు విద్యార్థులు క్రీడల్లోనూ రాణించాలి. విద్యార్థులు క్రీడల్లో రాణించాలని వారిని ప్రోత్సహించే ప్రయత్నం చేస్తున్నాం. వచ్చే ఒలింపిక్స్ లక్ష్యంగా యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేయబోతున్నాం. ఇవాళ్టి విద్యార్థులు రేపటి పౌరులుగా మారి తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములు కావాలి. సచివాలయం రాష్ట్రానికి గుండెకాయ లాంటిది. ఉన్నత చదువులు చదివి భవిష్యత్లో మీరు సచివాలయంలో అడుగు పెట్టాలని.. పరిపాలనలో భాగస్వాములు కావాలని ఆకాంక్షిస్తున్నా’’ అని సీఎం చెప్పారు.‘‘గంజాయి, డ్రగ్స్ ఎక్కడ కనిపించినా 100కు డయల్ చేసి సమాచారం అందించండి. వ్యసనాలకు బానిసైతే జీవితాలు నాశనం అవుతాయి. ప్రతీ ఒక్కరు సామాజిక బాధ్యతను అలవరచుకోవాలి. నవంబర్ 14న 15 వేల మంది విద్యార్థులతో ఒక మంచి కార్యక్రమం చేస్తున్నాం. అదే రోజు ఫేజ్-2 ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను మంజూరు చేయబోతున్నాం’’ అని సీఎం రేవంత్ వెల్లడించారు. -
పులివెందులలో జననేత.. పలకరిస్తూ, యోగక్షేమాలు తెలుసుకుంటూ (ఫొటోలు)
-
దీక్ష చేస్తున్న మహిళా రెజ్లర్లకు కాంగ్రెస్ మద్దతు
-
హైదరాబాద్ : విద్యార్థులతో కలసి రాష్ట్రపతి ముఖాముఖి
-
కామన్ వెల్త్ గేమ్స్ లో పాల్గొంటున్న క్రీడాకారులతో మాట్లాడిన ప్రధాని మోదీ
-
ముఖ్యమంత్రులతో మోదీ సమావేశం..
న్యూఢిల్లీః ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఛైర్మన్ గా ఉండే ఇంటర్ స్టేట్ కౌన్సిల్ జూలై 16న ముఖ్యమంత్రులతో సమావేశం కానునుంది. పాఠశాల విద్య, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ ఫర్ స్కీమ్, ఆధార్ కార్డ్, ఆర్థిక, సామాజిక అంశాల ప్రణాళికలపై ఈ ప్రత్యేక సమావేశంలో చర్చించనున్నారు. మోదీ ప్రభుత్వంపై ఇప్పటికే ఎన్నో విమర్శలు కురిపిస్తున్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సైతం ఈ వేదికపై సమస్యలను చర్చించే అవకాశం ఉంది. ఇంటర్ స్టేట్ కౌన్సిల్ 11 వ సమావేశం జూలై 16వ తేదీన నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా రాష్ట్రాల్లో సమస్యలు, సంబంధాలు, భద్రత, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ వంటి అంశాలతోపాటు, పాఠశాల విద్య, ఆధార్ సమస్యలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. పదేళ్ళ తర్వాత ఈ 11వ ముఖ్యమంత్రుల సమావేశం జరగడం విశేషం. కౌన్సిల్ కు ఛైర్మన్ గా ఉన్న ప్రధానమంత్రి మోదీ.. కేబినెట్ లోని ఆరుగురు మంత్రులు రాజ్ నాథ్ సింగ్, సుష్మాస్వరాజ్, అరుణ్ జైట్లీ, వెంకయ్య నాయుడు, నితిన్ గడ్కారీ, మనోహర్ పారికర్ ల ను కౌన్సిల్ సభ్యులుగా ఎన్నుకున్నారు. అంతేకాక మరో 11 మంది శాశ్వత ఆహ్వానితులుగా ఉన్న మంత్రులు సైతం ఈ సమావేశంలో పాల్గొంటారు. కేంద్రపాలిత ప్రాంతాలతోపాటు ఇతర అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశంలో పాల్గొని ఆయా రాష్ట్రాల్లోని సమస్యలతోపాటు, దేశవ్యాప్తంగా ప్రధాన సమస్యలను చర్చిస్తారు. పదేళ్ళ క్రితం 2006 లో ఈ ఇంటర్ స్టేట్ కౌన్సిల్ సమావేశం జరిగింది. యూపీఏ ప్రభుత్వ పదేళ్ళ హయాంలో కేవలం రెండుసార్లు మాత్రమే కౌన్సిల్ మీటింగ్ జరిగింది. మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2014 అనంతరం ఇంటర్ స్టేట్ కౌన్సిల్ రూపాన్ని కొంతవరకూ మార్చింది. జూలై 16 నిర్వహించే 11వ సమావేశంలో అనేక సమస్యలపై ప్రధాని ముఖ్యమంత్రులతో చర్చించనున్నారు. -
ఆలోచనలకు హద్దులు పెట్టవద్దు..
-
ఏపి మంత్రికి ఒళ్లు మండింది!!
-
ఉండవల్లి రైతులతో పవన్ కల్యాణ్