jaganamohanrao
-
నందినికి నజరానా.. నగదు ప్రోత్సాహకంగా రూ. లక్ష
సాక్షి, హైదరాబాద్: ఆసియా క్రీడల కాంస్య పతక విజేత, హైదరాబాద్ యువ అథ్లెట్ అగసార నందినికి హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్సీఏ) అధ్యక్షుడు, అక్షర విద్యాసంస్థల చైర్మన్ అరశనపల్లి జగన్మోహన్ రావు అండగా నిలిచారు. అక్షర ఇంటర్నేషనల్ స్కూల్ (ఉప్పల్ బ్రాంచ్)లో జరిగిన వార్షికోత్స వేడుకలో నందినిని జగన్మోహన్ రావు ఘనంగా సత్కరించారు. ఉత్తరాఖండ్లో జరుగుతున్న జాతీయ క్రీడల్లో ఈనెల 8వ తేదీన తెలంగాణకు తరఫున బరిలోకి దిగుతున్న నందినికి రూ.1 లక్ష చెక్ను నగదు ప్రోత్సాహకంగా ఆయన అందించారు.భవిష్యత్లో కూడా నందినికి అన్ని విధాలా అండగా ఉంటానని ఈ సందర్భంగా జగన్మోహన్ రావు హామీ ఇచ్చారు. సాధారణ మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చి, అనేక కష్టాలను అధిగమించి ఈ స్థాయికి చేరుకున్న నందిని విద్యార్థులు స్ఫూర్తిగా తీసుకోవాలని జగన్మోహన్ రావు సూచించారు. నందిని 2028 లాస్ఏంజెలిస్ ఒలింపిక్స్లో పతకం సాధించాలని ఆయన ఆకాంక్షించారు.అనంతరం నందిని మాట్లాడుతూ... ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని క్రమశిక్షణ, పట్టుదలతో కృషి చేస్తే జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకోవచ్చని, అందుకు తానే ఒక ఉదాహరణ అని చెప్పింది. తల్లిదండ్రులు పిల్లల ఇష్టాలను తెలుసుకొని వారికి నచ్చిన రంగంలో ప్రోత్సహించాలని కోరింది. అనంతరం పాఠశాలలో వివిధ పోటీల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు నందిని పతకాలను ప్రదానం చేసింది. ఈ కార్యక్రమంలో అక్షర విద్యాసంస్థల సీఈఓ ఎ.మదన్మోహన్ రావు, ఫైనాన్స్ డైరెక్టర్ రామారావు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సరితా రావు, ప్రిన్సిపాల్ స్వప్న తదితరులు పాల్గొన్నారు. మరిన్ని క్రీడా వార్తలుశ్రీనిధి డెక్కన్ ఎఫ్సీ జట్టుకు నాలుగో విజయం సాక్షి, హైదరాబాద్: ఐ–లీగ్ జాతీయ ఫుట్బాల్ లీగ్లో హైదరాబాద్కు చెందిన శ్రీనిధి డెక్కన్ ఫుట్బాల్ క్లబ్ (ఎఫ్సీ) జట్టు ఖాతాలో నాలుగో విజయం చేరింది. హైదరాబాద్లో సోమవారం జరిగిన మ్యాచ్లో శ్రీనిధి డెక్కన్ జట్టు 3–0 గోల్స్ తేడాతో ఐజ్వాల్ ఎఫ్సీ జట్టుపై గెలిచింది. శ్రీనిధి డెక్కన్ జట్టు తరఫున గుర్ముఖ్ సింగ్ (5వ నిమిషంలో), లాల్రొమావియా (24వ నిమిషంలో), డేవిడ్ కాస్టనెడా మునోజ్ (33వ నిమిషంలో) ఒక్కో గోల్ చేశారు. 12 జట్లు పోటీపడుతున్న ఈ లీగ్లో శ్రీనిధి జట్టు 12 మ్యాచ్లు పూర్తి చేసుకుంది. నాలుగింటిలో గెలిచి, మూడింటిని ‘డ్రా’ చేసుకొని, ఐదింటిలో ఓడి 15 పాయింట్లతో ఎనిమిదో స్థానంలో ఉంది. ఈనెల 6న హైదరాబాద్లో జరిగే తదుపరి మ్యాచ్లో రియల్ కశ్మీర్ ఎఫ్సీ జట్టుతో శ్రీనిధి జట్టు తలపడుతుంది. సుశ్రుత–శ్రీశాన్వి జోడీకి కాంస్య పతకం సాక్షి, హైదరాబాద్: జాతీయ సబ్ జూనియర్, క్యాడెట్ టేబుల్ టెన్నిస్ (టీటీ) చాంపియన్షిప్లో తెలంగాణకు కాంస్య పతకం లభించింది. మధ్యప్రదేశ్లోని ఇండోర్ నగరంలో జరిగిన ఈ టోరీ్నలో అండర్–15 బాలికల డబుల్స్ విభాగంలో సుశ్రుత అనియా ఆనంద్–శ్రీశాన్వి కామారపు (తెలంగాణ) జోడీ కాంస్య పతకాన్ని దక్కించుకుంది. సెమీఫైనల్లో సుశ్రుత–శ్రీశాన్వి ద్వయం 11–13, 6–11, 9–11తో దివ్యాంశి–నైషా (మహారాష్ట్ర) జంట చేతిలో ఓడిపోయింది. తెలంగాణ జట్టుకు ఎస్.ప్రణీత్, ఎం.చైతన్య కోచ్లుగా వ్యవహరించారు. -
కార్పొరేషన్ చైర్మన్ల బాధ్యతల స్వీకరణ
సాక్షి, హైదరాబాద్: ఇటీవల వివిధ ప్రభుత్వ కార్పొరేషన్ల చైర్మన్లుగా నియమితులైన టీఆర్ఎస్ నేతలు బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఖైరతాబాద్లోని టీఎస్ఎండీసీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర ఖనిజాభివృద్ది సంస్థ చైర్మన్గా మన్నె క్రిషాంక్, అసెంబ్లీ ఎదురుగా ఉన్న హాకా భవన్లో తెలంగాణ స్టేట్ టెక్నాలజీ సర్వీసెస్ చైర్మన్గా పాటిమీది జగన్మోహన్రావు బాధ్యతలు స్వీకరించారు. మన్నె క్రిషాంక్ బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు హాజరై అభినందించారు. నూతన టీఎస్టీఎస్ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన పాటిమీది జగన్మోహన్రావును మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్గౌడ్ అభినందించారు. అనంతరం బేవరేజెస్ కార్పోరేషన్ చైర్మన్గా గజ్జెల నాగేశ్ బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్గౌడ్తో పాటు టీఎస్ఐఐసీ ఛైర్మన్ గ్యాదరి బాలమల్లు హాజరై అభినందనలు తెలిపారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన వివిధ కార్పొరేషన్ చైర్మన్లకు మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎర్రబెల్లి దయాకర్రావులు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి సంస్థ ఛైర్మన్గా నియమితులైన దూదిమెట్ల బాలరాజు యాదవ్ గురువారం బాధ్యతలు స్వీకరిస్తారు. -
హెచ్ఎఫ్ఐ అధ్యక్షునిగా జగన్మోహన్ రావు
సాక్షి, హైదరాబాద్: భారత హ్యాండ్బాల్ సమాఖ్య (హెచ్ఎఫ్ఐ) నూతన కార్యవర్గం కొలువు దీరింది. హెచ్ఎఫ్ఐ నూతన అధ్యక్షుడిగా తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఎ. జగన్మోహన్ రావు ఎన్నికయ్యారు. అధ్యక్ష పదవి కోసం జరిగిన ఎన్నికల్లో ఆయన ఏకగ్రీవంగా విజయం సాధించారు. సమాఖ్యకు సీనియర్ ఉపాధ్యక్షులుగా ఆనందీశ్వర్ పాండే, ప్రదీప్ కుమార్ వ్యవహరించనున్నారు. కార్యదర్శిగా ప్రీత్ సింగ్ నియమితులు కాగా సంయుక్త కార్యదర్శులుగా తేజ్రాజ్ సింగ్, బ్రిజ్కుమార్ శర్మ, ఎన్కే శర్మ, వీణ శేఖర్ బాధ్యతలు నిర్వర్తించనున్నారు. వినయ్ కుమార్ సింగ్ కోశాధికారిగా ఎంపికయ్యారు. ఉపా ధ్యక్షులుగా పద్మశ్రీ సత్పాల్, అమల్ నారాయణన్, రీనా సవీన్ వ్యవహరిస్తారు. -
హ్యాండ్బాల్ ఛైర్మన్గా జగన్ మోహన్ రావు
సాక్షి, హైదరాబాద్ : జాతీయ హ్యాండ్బాల్ ఫెడరేషన్ (హెచ్ఎఫ్ఐ) ఎన్నికల్లో తెలంగాణకు చెందిన అరిశెనపల్లి జగన్ మోహన్రావు విజయ దుందుభి మోగించారు. ఈనెల 18న ఎన్నికల ప్రక్రియ ప్రారంభమవగా అధ్యక్ష పదవికి జగన్ ఒక్కరే నామినేషన్ వేయడంతో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. లక్నో లోని హెచ్ ఎఫ్ ఐ ప్రధాన కార్యాలయంలో జాతీయ అధ్యక్షుడిగా జగన్ మోహన్ రావు ప్రమాణ స్వీకారం చేశారు.జాతీయ కార్యవర్గంలోని ఇతర పదవులకు ముందు ఒకటి కంటే ఎక్కువే నామినేషన్లు పడ్డా ఎన్నికలు ఏకగ్రీవమయ్యేలా జగన్ మంత్రాంగం నడిపారు. భారత ఒలింపిక్ సంఘం కోశాధికారి, హ్యాండ్బాల్ ప్రధాన కార్యదర్శి ఆనందీశ్వర్ పాండే సహకారంతో అసోసియేషన్ పై పట్టు సంపాదించిన జగన్ స్వల్ప కాలంలోనే అధ్యక్ష స్థాయికి ఎదిగారు. 2018లో క్రీడారంగంలోకి ప్రవేశం.. జగన్ స్వస్థలం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని దండుమైలారం. స్వతహాగా పారిశ్రామిక వేత్త అయిన జగన్ క్రీడలపై ఆసక్తితో వాటి అభివృద్ధికి నడుం బిగించారు. 47 ఏళ్ల జగన్ 2018లో జరిగిన తెలంగాణ టీ20 లీగ్ నిర్వహణలో కీలకపాత్ర పోషించడంతో పాటు మెదక్ మేవరిక్స్ జట్టు యజమాని కూడా. ఆ టోర్నీలో మేవరిక్స్ జట్టు రన్నరప్గా నిలిచింది. ఆసియా హ్యాండ్ బాల్ పోటీల ద్వారా.. ఒలింపిక్ క్రీడైన హ్యాండ్బాల్ కార్యకలాపాల్లో 2018 నుంచి క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న జగన్ మోహన్రావు 2019లో తెలంగాణ హ్యాండ్బాల్ సంఘం ప్రెసిడెంట్గా ఎన్నికయ్యారు. ఆ వెంటనే ఆసియా హ్యాండ్ బాల్, ఇంటర్ డిస్ట్రిక్ట్ జాతీయ హ్యాండ్బాల్ ఛాంపియన్షిప్ను హైదరాబాద్ వేదికగా విజయవంతంగా నిర్వహించి జాతీయ స్థాయిలో అందరి దృష్టి ఆకర్షించారు. ఈ పోటీలను విజయవంతంగా నిర్వహించడంతో జాతీయ ఫెడరేషన్ ఉపాధ్యక్ష పదవిని జగన్కు కట్టబెట్టారు. టార్గెట్ ఒలింపిక్స్గా పనిచేస్తాం: జగన్ ముందుగా నా మీద ప్రేమ, ఆప్యాయతలతో హ్యాండ్బాల్ జాతీయ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్న 29 రాష్ట్ర సంఘాలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నా. నా మీద నమ్మకం ఉంచి ఇంతటి గురుతర బాధ్యతలను అప్పగించినందుకు శక్తి వంచన లేకుండా హ్యాండ్బాల్ అభివృద్ధికి కృషి చేస్తా. మన దేశంలో గ్రామీణ స్థాయి నుంచి హ్యాండ్బాల్కు మంచి క్రేజ్ ఉంది. అయితే, వాణిజ్యపరంగా పోలిస్తే క్రికెట్, బ్యాడ్మింటన్ కంటే చాలా వెనకపడి ఉండటంతో ఒక లెవల్ వద్దే నిలిచిపోయింది. ఇండోర్ గేమ్ అయిన హ్యాండ్బాల్ మౌలికవసతుల లేమి కారణంగా మెట్రో నగరాలు మొదలు గ్రామాల వరకూ అవుట్డోర్ స్పోర్ట్లా మారిపోయింది. *హ్యాండ్ బాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కొత్త కార్యవర్గం ప్రెసిడెంట్ : అరిశెనపల్లి జగన్ మోహన్ రావు సీనియర్ వైస్ ప్రెసిడెంట్ : డాక్టర్ ఆనందీశ్వర్ పాండే,డాక్టర్ ప్రదీప్ కుమార్ బలంచు (జార్ఖండ్) వైస్ ప్రెసిడెంట్స్ : పద్మశ్రీ సత్త్ పాల్, అమల్ నారాయణ్ పటోవని, రీనా సవీన్ జనరల్ సెక్రెటరీ : ప్రీత్ సింగ్ సలూరియా జాయింట్ సెక్రెటరీ : తేజ్ రాజ్ సింగ్, బ్రిజ్ కుమార్ శర్మ, ఎన్.కె.శర్మ, వీణా శేఖర్ ట్రెజరర్ : వినయ్ కుమార్ సింగ్ (గుజరాత్) -
బీసీ నాయకుడైతే అవినీతికి పాల్పడవచ్చా?
-
ఆ ఎన్నికలు జరగనిచ్చే ప్రసక్తే లేదు
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ఒలంపిక్ అసోసియేషన్ ఎన్నికలకు సంబంధించి హైడ్రామా కొనసాగుతోంది. ఈ నెల 9న జరగబోయే ఎన్నికలను అడ్డుకుంటామని జయేష్ రంజన్ ప్యానల్ అంటోంది. రిటర్నింగ్ అధికారి చంద్రకుమార్ నియామకం చెల్లదని చెబుతోంది. మాజీ న్యాయమూర్తి కేసీ.భానును మొదట రిటర్నింగ్ అధికారిగా నియమించి, అనంతరం తెర మీదకి మాజీ న్యాయమూర్తి చంద్రకుమార్ను తీసుకురావటాన్ని తప్పుబడుతోంది. ఢిల్లీ పెద్దల సహకారంతో కొందరు తెలంగాణలో పెత్తనం చేయాలని చూస్తున్నారని జయేష్ రంజన్ ప్యానెల్ ఆరోపిస్తోంది. ఢిల్లీలో కాదు.. ఎన్నికలు హైదరాబాద్లోనే.. ‘తెలంగాణ ఒలంపిక్ అసోసియేషన్ ఎన్నికలు ఢిల్లీలో కాదు.. హైదరాబాద్లోనే జరిగి తీరతాయ్’ అని తెలంగాణ హ్యాండ్బాల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జగన్మోహన్రావు అన్నారు. ఒలంపిక్ ఎన్నికల విషయంలో నెలకొన్న పరిణామాలపై ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. రిటర్నింగ్ అధికారిగా చంద్రకుమార్ నియామకంపై కోర్టును ఆశ్రయిస్తామన్నారు. జయేష్ రంజన్ నామినేషన్ తిరస్కరించటం అనైతికమని తెలిపారు. నామినేషన్ తిరస్కరించటానికి గల కారణాలు చంద్రకుమార్ ఇప్పటికీ చెప్పటంలేదని, రిటర్నింగ్ ఆఫీసర్గా చంద్రకుమార్ను ఎవరు నియమించారో చెప్పాలని డిమాండ్ చేశారు. చదవండి : ఆ ఇద్దరి నామినేషన్లు తిరస్కరణ.. -
నీలి కిరోసిన్ పట్టివేత
కల్లూరు, న్యూస్లైన్: స్థానిక బళ్లారి చౌరస్తా సమీపంలోని కృష్ణారెడ్డినగర్లో అక్రమంగా నిల్వ ఉంచిన నీలి కిరోసిన్ను జిల్లా పౌరసరఫరాల అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సెల్ఫోన్కు మెసేజ్ రూపంలో వచ్చిన పక్కా సమాచారం మేరకు డీఎస్వో వెంకటేశ్వర్లు నిఘా పెట్టి పట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను డీఎస్వో విలేకరులకు వెల్లడించారు. కృష్ణారెడ్డినగర్లోని ఖాళీ స్థలంలో 12 డ్రమ్ములు కనిపించగా స్వాధీనం చేసుకున్నామన్నారు. అందులో నాలుగు డ్రమ్ముల్లో 800 లీటర్ల కిరోసిన్ ఉందన్నారు. మిగతా డ్రమ్ములు ఖాళీగా ఉన్నాయన్నారు. స్వాధీనం చేసుకున్న కిరోసిన్ను సమీపంలోని 130 షాపు నెంబరు డీలరు మధుసూదన్కు అప్పగించామన్నారు. కిరోసిన్ను ఎవరూ అక్కడ ఉంచారనే విషయంపై విచారణ చేస్తున్నట్లు తెలిపారు. దాడి వివరాలపై జేసీకి నివేదిక సమర్పిస్తామన్నారు. దాడులు చేసిన వారిలో ఏఎస్ఓ జగన్మోహన్రావు, ఎఫ్ఐ రామాంజనేయరెడ్డి, సిబ్బంది వెంకటరాజు, సుల్తాన్ ఉన్నారు.