jamsetji tata
-
దేశ ఉక్కు సంకల్పం.. టాటా
టాటా గ్రూప్ లో భాగమైన టాటా స్టీల్ లిమిటెడ్ భౌగోళికంగా ప్రపంచంలోని అత్యంత వైవిధ్యభరితమైన ఉక్కు ఉత్పత్తిదారులలో ఒకటి. 1907లో జంషెడ్జీ నుస్సెర్వాన్జీ టాటా చేత టాటా ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ లిమిటెడ్ (టిస్కో) గా స్థాపితమైన ఈ సంస్థ ఉక్కు పరిశ్రమలో గ్లోబల్ లీడర్గా ఎదిగింది. మహారాష్ట్రలోని ముంబై కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న టాటా స్టీల్ భారత్, నెదర్లాండ్స్, యునైటెడ్ కింగ్ డమ్ లలో కీలక కార్యకలాపాలతో 26 దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది.జేఎన్ టాటా జయంతిటాటా స్టీల్ దార్శనిక వ్యవస్థాపకుడు, క్లుప్తంగా జెఎన్ టాటా అని పిలిచే జంషెడ్జీ నుస్సెర్వాన్జీ టాటా జయంతి మార్చి 3న. ఈసారి 186వ జయంతిని ఆ సంస్థ సగర్వంగా జరుపుకుంటోంది. దేశ అత్యంత ఐకానిక్ కంపెనీలలో ఒకదానికి పునాది వేసిన మార్గదర్శక స్ఫూర్తి, పారిశ్రామిక ఔన్నత్యానికి అచంచలమైన నిబద్ధత ఉన్న వ్యక్తికి నివాళిగా ఆయన జయంతిని ఫౌండర్ డేగా నిర్వహిస్తున్నారు.దూరదృష్టి గల నాయకుడు1839 మార్చి 3న గుజరాత్ లో జన్మించిన జేఎన్ టాటా భారత పారిశ్రామిక ముఖచిత్రాన్ని తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషించిన దార్శనిక పారిశ్రామికవేత్త. 1870 లలో మధ్య భారతదేశంలో ఒక వస్త్ర మిల్లుతో ఆయన వ్యవస్థాపక ప్రయాణం ప్రారంభమైంది. అయితే, ఆయన దార్శనికత వస్త్ర వ్యాపారాన్ని దాటి విస్తరించింది. భారత్ ను పారిశ్రామిక దేశాల సరసన నిలిపే ఉక్కు కర్మాగారాన్ని నెలకొల్పాలన్నది జేఎన్ టాటా కల. 1907లో టాటా స్టీల్ స్థాపనతో ఈ కల సాకారమైంది. ఇది భారతదేశ ఉక్కు పరిశ్రమకు నాంది పలికింది.టాటా స్టీల్ ఘనతలు● 2024 మార్చి 31 తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో ఈ గ్రూప్ దాదాపు 27.7 బిలియన్ డాలర్ల ఏకీకృత టర్నోవర్ను నమోదు చేసింది.● గ్రేట్ ప్లేస్ టు వర్క్ సంస్థగా గుర్తింపు పొందిన టాటా స్టీల్ లిమిటెడ్, దాని అనుబంధ సంస్థలు, అసోసియేట్లు, జాయింట్ వెంచర్లతో కలిసి, 78,000 కంటే ఎక్కువ మంది ఉద్యోగులతో ఐదు ఖండాలలో విస్తరించి ఉంది.● టాటా స్టీల్ 2045 నాటికి నికర జీరోతో సహా దాని ప్రధాన స్థిరత్వ లక్ష్యాలను ప్రకటించింది.● కంపెనీ తన జంషెడ్పూర్, కళింగనగర్ , ఐజేముదీన్ ప్లాంట్లకు వరల్డ్ ఎకనామిక్ ఫోరం గ్లోబల్ లైట్హౌస్ గుర్తింపును అందుకుంది. టాటా స్టీల్ను ఎకనామిక్ టైమ్స్ సీఐఓ 'డిజిటల్ ఎంటర్ప్రైజ్ ఆఫ్ ఇండియా - స్టీల్' అవార్డు 2024తో గుర్తించింది.● ఈ కంపెనీ వరల్డ్ ఎకనామిక్ ఫోరం గ్లోబల్ డైవర్సిటీ ఈక్విటీ & ఇంక్లూజన్ లైట్హౌస్ 2023తో గుర్తింపు పొందింది.● ఈ కంపెనీ 2012 నుండి డీజేఎస్ఐ ఎమర్జింగ్ మార్కెట్స్ ఇండెక్స్లో భాగంగా ఉంది. 2016 నుండి డీజేఎస్ఐ కార్పొరేట్ సస్టైనబిలిటీ అసెస్మెంట్లో టాప్ 10 స్టీల్ కంపెనీలలో స్థిరంగా స్థానం సంపాదించుకుంది.● టాటా స్టీల్ జంషెడ్పూర్ ప్లాంట్ భారతదేశంలో రెస్పాన్సిబుల్ స్టీల్ సర్టిఫికేషన్ పొందిన మొట్టమొదటి సైట్. తదనంతరం కళింగనగర్, మెరామండలి ప్లాంట్లు కూడా సర్టిఫికేషన్ పొందాయి దేశంలో, టాటా స్టీల్ ఇప్పుడు దాని ఉక్కు ఉత్పత్తిలో 90% కంటే ఎక్కువ రెస్పాన్సిబుల్ స్టీల్ సర్టిఫైడ్ సైట్ల నుండి కలిగి ఉంది.● 2016-17 సంవత్సరానికి ఉత్తమ పనితీరు కనబరిచిన ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్గా ప్రైమ్ మినిస్టర్స్ ట్రోపీ, 2024లో వరల్డ్ స్టీల్ నుంచి వరుసగా ఏడు సంవత్సరాలు స్టీల్ సస్టైనబిలిటీ ఛాంపియన్ గుర్తింపు, సీడీపీ ద్వారా 2023 క్లైమేట్ చేంజ్ లీడర్షిప్ అవార్డు, 2022లో డన్ & బ్రాడ్స్ట్రీట్ టాప్ 500 కంపెనీలలో అగ్రగామి, బ్రాండ్ ఫైనాన్స్ ద్వారా దేశంలో 2024 అత్యంత విలువైన మైనింగ్ అండ్ మెటల్స్ బ్రాండ్గా ర్యాంక్, ఎథిస్పియర్ ఇన్స్టిట్యూట్ నుండి 2021లో 'మోస్ట్ ఎథికల్ కంపెనీ' అవార్డు, స్పోర్ట్స్టార్ ఏసెస్ అవార్డ్స్ 2024లో 'బెస్ట్ కార్పొరేట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ స్పోర్ట్స్' గుర్తింపును పొందింది.● 2023 గ్లోబల్ ఈఆర్ఎం (ఎంటర్ప్రైజ్ రిస్క్ మేనేజ్మెంట్) అవార్డు ఆఫ్ డిస్టింక్షన్, వరుసగా ఎనిమిదవ సంవత్సరం 'మాస్టర్స్ ఆఫ్ రిస్క్' - మెటల్స్ & మైనింగ్ సెక్టార్ గుర్తింపు, ఐసీఎస్ఐ బిజినెస్ రెస్పాన్సిబిలిటీ అండ్ సస్టైనబిలిటీ అవార్డు 2023 అందుకుంది. -
కిరణ్ మజుందార్ షాకు జెంషెడ్జీ టాటా అవార్డు
బయోకాన్ గ్రూప్ చైర్పర్సన్ కిరణ్ మజుందార్ షాకు ప్రతిష్టాత్మక జెంషెడ్జీ టాటా అవార్డు లభించింది. దేశంలో బయోసైన్సెస్ ప్రగతికి మార్గదర్శకత్వం వహించి ప్రపంచవ్యాప్తంగా ఆమె చేసిన విశేషమైన కృషిని గుర్తిస్తూ ఇండియన్ సొసైటీ ఫర్ క్వాలిటీ (ఐఎస్క్యూ) ఈ పురస్కారాన్ని ప్రకటించింది.ఇండియన్ సొసైటీ ఫర్ క్వాలిటీ ప్రెసిడెంట్, టీక్యూఎం ఇంటర్నేషనల్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ అయిన జనక్ కుమార్ మెహతా చేతుల మీదుగా మజుందార్-షా ఈ పురస్కాన్ని అందుకున్నారు. ఈ కార్యక్రమంలో టాటా స్టీల్ మాజీ వైస్ చైర్మన్ బి ముత్తురామన్, ఆర్వి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ప్రిన్సిపాల్, ఐఎస్క్యూ బెంగళూరు చాప్టర్ ప్రెసిడెంట్ డాక్టర్ కేఎన్ సుబ్రమణ్య పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో కిరణ్ మజుందార్-షా మాట్లాడుతూ “ఐఎస్క్యూ అందిస్తున్న 2024 జంషెడ్జీ టాటా అవార్డును అందుకోవడం నాకు చాలా గౌరవంగా ఉంది. ఈ అవార్డు నాకు చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే ఇది భారతదేశపు గొప్ప దార్శనికుడి పేరుతో ఉంది. ఆయన వారసత్వం, ఆవిష్కరణ, దేశ నిర్మాణం మనందరికీ స్ఫూర్తినిస్తూనే ఉంటుంది’’ అన్నారు.ఫోర్బ్స్ అత్యంత శక్తివంతమైన మహిళబయోకాన్ వ్యవస్థాపకురాలు కిరణ్ మజుందార్-షా తన ప్రయాణాన్ని గ్యారేజీలో ప్రారంభించి, దేశపు అత్యంత ప్రభావవంతమైన మహిళా వ్యాపారవేత్తల్లో ఒకరిగా నిలిచారు. తాజాగా ఆమె 3.5 బిలియన్ డాలర్ల (సుమారు రూ.29,050 కోట్లు) నికర విలువతో ఫోర్బ్స్ అత్యంత శక్తివంతమైన మహిళల్లో స్థానం సంపాదించారు. ఈ లిస్ట్లో 82వ స్థానంలో నిలిచిన కిరణ్ మజుందార్ షా భారత్లోని అత్యంత సంపన్న వ్యక్తుల్లో 91వ స్థానంలో ఉన్నారు.####Biosciences#QualityExcellence#IndianSocietyForQuality#LifetimeAchievement#Biotechnology#HealthcareInnovation# -
బ్రిటిషర్లు కొట్టిన దెబ్బ! ‘టాటా’ సాహసోపేత నిర్ణయం..
భారతీయ పరిశ్రమ పితామహుడిగా భావించే జమ్షెడ్జీ టాటా గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. అనేక పరిశ్రమలు, వ్యాపారాల ద్వారా భారతదేశ వ్యాపార ప్రపంచాన్ని మార్చిన జమ్షెడ్జీ టాటా బ్రిటిష్ పాలకులు కొట్టిన దెబ్బతో కఠిన నిర్ణయం తీసుకున్నారు. టాటా గ్రూప్లో తొలి సంస్థ మూతపడింది...1890లలో టాటా షిప్పింగ్ లైన్ను మూసివేయాలని సాహసోపేతమైన నిర్ణయం తీసుకోవడానికి దారితీసిన పరిస్థితులపై ఇటీవల విడుదలైన ఒక పుస్తకంలో వివరించారు. క్లిష్ట సమయంలో నష్టాలను తగ్గించుకోవడానికి, మరింత ఆచరణీయమైన వెంచర్లపై దృష్టి పెట్టడానికి కఠినమైన నిర్ణయాలు తీసుకోవడంలో జమ్షెడ్జీ టాటా చతురతను ఈ వ్యూహాత్మక చర్య తెలియజేస్తుంది. టాటా గ్రూప్నకు చెందిన వెటరన్లు ఆర్ గోపాలకృష్ణన్, హరీష్ భట్ రాసిన "జమ్సెడ్జీ టాటా - పవర్ఫుల్ లర్నింగ్స్ ఫర్ కార్పొరేట్ సక్సెస్" అనే పుస్తకంలో అప్పటి పరిస్థితులను వివరించారు.అది 1880, 90ల కాలం. భారతదేశం నుంచి షిప్పింగ్లో ఇంగ్లండ్కు చెందిన P.&O సంస్థదే ఆధిపత్యం. ఆ గుత్తాధిపత్యాన్ని సవాలు చేస్తూ జమ్షెడ్జీ టాటా 'టాటా లైన్'ను ప్రారంభించారు. టాటా పేరును కలిగి ఉన్న మొదటి వ్యాపారం ఇదే. బ్రిటీష్ ఇండియా ప్రభుత్వం మద్దతుతో P.&O భారతీయ వ్యాపారులకు అధిక సరుకు రవాణా రేట్లు విధించింది. బ్రిటిష్, యూదు సంస్థలకు మాత్రం ఎక్కువ రాయితీలను అందించింది.టాటా లైన్ ప్రస్థానం..తన వస్త్ర వ్యాపారంపై ప్రతికూల ప్రభావాన్ని అనుభవించిన జమ్షెడ్జీ టాటా జపాన్లోని అతిపెద్ద షిప్పింగ్ లైన్ అయిన నిప్పాన్ యుసెన్ కైషా (NYK)తో కలిసి పనిచేయడానికి జపాన్కు వెళ్లారు. జమ్షెడ్జీ టాటా సమానమైన రిస్క్ తీసుకుని, నౌకలను స్వయంగా నిర్వహించినట్లయితేనే తమతో భాగస్వామ్యానికి ఎన్వైకే అంగీకరించింది. దీంతో టాటా 'అన్నీ బారో' అనే ఆంగ్ల నౌకను నెలకు 1,050 పౌండ్లకు అద్దెకు తీసుకున్నారు. ఇది 'టాటా లైన్'లో తొలి నౌక.తాను ప్రారంభించిన ఈ వ్యాపారం మొత్తం భారతీయ వస్త్ర పరిశ్రమకు షిప్పింగ్ రేట్లను తగ్గిస్తుందని, P.&O. గుత్తాధిపత్యాన్ని ఛేదించి టన్ను సరుకు రవాణాకు రూ. 19 నుంచి రూ. 12 వరకు తగ్గుతుందని జమ్సెడ్జీ విశ్వసించారు. అనతికాలంలోనే రెండవ ఓడ 'లిండిస్ఫార్న్'ను అద్దెకు తీసుకున్నారు. 1894 అక్టోబరులో ది ట్రిబ్యూన్ పత్రిక జమ్సెడ్జీ ప్రయత్నాలను ప్రశంసించింది.టాటా లైన్ వ్యాపారాన్ని దెబ్బకొట్టేందుకు P.&O సంస్థ ఎత్తుగడ వేసింది. టాటా లైన్, ఎన్వైకే షిప్లను ఉపయోగించని వ్యాపారులకు షిప్పింగ్ చార్జీని టన్నుకు 1.8 రూపాయలకు తగ్గిస్తామని ప్రకటించింది. దీంతోపాటు ఇలా అంగీకరించిన కొంతమంది వ్యాపారులకు ఉచితంగా రవాణాను కూడా అందించింది. 'లిండిస్ఫార్న్' నౌక పత్తి రవాణాకు పనికిరాదని పుకార్లు వ్యాప్తి చేసింది.క్రమంగా P.&O ప్రభావానికి భయపడి భారతీయ వ్యాపారులు టాటా లైన్తో వ్యాపారాన్ని ఉపసంహరించుకున్నారు. టాటా లైన్ను మూసివేస్తే భవిష్యత్తులో రేట్లు పెరుగుతాయని హెచ్చరించినప్పటికీ వారు అర్థం చేసుకోలేదు. ఫలితంగా జమ్షెడ్జీ టాటా నష్టాలను చవిచూశారు. ప్రతి నెలా రూ. వేలల్లో నష్టాలు.. ధరల పోటీ ముగిసే సమయానికి టాటా లైన్లో రూ. లక్షకు పైగా ఖర్చు చేయాల్సి వచ్చింది.పరిస్థితులను జాగ్రత్తగా పరిశీలించిన తర్వాత టాటా లైన్కు స్థిరమైన మార్గం లేదని నిర్ధారించుకున్న జామ్సెడ్జీ విజయవంతమైన వ్యాపారవేత్తగా తన ప్రతిష్టను పణంగా పెట్టి వ్యాపారాన్ని మూసివేయాలని నిర్ణయించుకున్నారు. లీజుకు తీసుకున్న ఓడలను ఇంగ్లండ్కు తిరిగి పంపించి టాటా లైన్ను ముగించేశారు. అయితే ఎంప్రెస్ మిల్స్, స్వదేశీ మిల్స్, అహ్మదాబాద్ అడ్వాన్స్ మిల్స్, టాటా స్టీల్ టాటా పవర్తో సహా జమ్షెడ్జీ టాటా స్థాపించిన అనే వ్యాపారాలు విజయవంతమయ్యాయి. -
జమ్షెడ్జీ నుసర్వాన్జీ టాటా.. మీరే మాకు స్పూర్తి!
టాటా గ్రూప్ వ్యవస్థాపకులు జమ్షెడ్జీ నుసర్వాన్జీ టాటాకు రతన్ టాటా నివాళులర్పించారు. 29 ఏళ్లకే ట్రేడింగ్ కంపెనీని ప్రారంభించి దేశంలో పరిశ్రమల స్థాపనకు ఆధ్యుడిగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న జమ్షెడ్జీ టాటా జన్మదినం సందర్భంగా ఆయన చేసిన సేవల్ని కొనియాడారు. జమ్షెడ్జీ నుసర్వాన్జీ టాటా గౌరవం, జీవనోపాధిని అందించిన మీరే స్ఫూర్తి, నీతి ,విలువలు, అతని , నిస్వార్థ సేవతో జామ్సెట్జీ నుస్సర్వాన్జీ టాటా మనకు అందించారు. వ్యవస్థాపకుడి జయంతి సందర్భంగా అన్ని టాటా గ్రూప్ కంపెనీలు, ఉద్యోగులు, వారి కుటుంబాలకు నా శుభాకాంక్షలు' అని టాటా ట్రస్ట్ ఛైర్మన్ జమ్ షెడ్జీ శిల్పం పక్కన నిలబడి ఉన్న ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. 'లెజెండ్ లైవ్స్ ఆన్' అనే హ్యాష్ట్యాగ్తో జమ్ షెడ్జీ ట్యాగ్తో ప్రత్యేకంగా ఆయన సేవల్ని గుర్తు చేస్తూ పోస్ట్లను ప్రత్యేకంగా సోషల్ మీడియాలో షేర్ చేశారు. -
ఓ తాత.... మనవడి కథ
అది 1920వ సంవత్సరం. ఉత్తర భారతంలోని సంపన్న కుటుంబానికి చెందిన ఒకాయన, దక్షిణ భారతంలోని ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన సంపన్న కుటుంబానికి చెందిన మరొకాయనకు విమానం కొనుగోలు చేయాలనే తలంపు కలిగింది. అనుకున్నదే తడవుగా ఇద్దరు ఇంగ్లాండ్ పయనమయ్యారు. ఇద్దరు చెరో విమానాన్ని కొనుగోలు చేశారు. ఆ విమానాల్లో దర్జాగా ఇండియా తిరిగి వచ్చారు. ఉత్తర భారతానికి చెందిన ఆసామీ తాను కొనుగోలు చేసిన విమానాన్ని ప్రయాణికుల కోసం విమాన సర్వీసును ఏర్పాటు చేశాడు. రెండో ఆయన మాత్రం తాను కొనుగోలు చేసిన విమానాన్ని తన సొంతానికి వినియోగించుకున్నాడు. ప్రయాణికుల కోసం విమాన సర్వీసు ప్రారంభించిన వ్యక్తి జంషెడ్ జీ టాటా కాగా... విమానంపై మక్కువతో తమ సొంతానికి ఉపయోగించుకున్న వ్యక్తి అలక్ నారాయణ గజపతి. ఈ అలక్ నారాయణ్ ఎవరో కాదు.... ప్రధాని నరేంద్ర మోడీ కేబినెట్లో పౌర విమానయాన శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన విజయనగరం ఎంపీ, టీడీపీ నేత అశోక్ గజపతి రాజుకి స్వయాన తాతయ్య. 1978లో రాజకీయాల్లోకి ప్రవేశించిన అశోక్ గజపతి రాజు ఇప్పటివరకు ఏడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నిక అయ్యారు. అయితే 2004లో మాత్రం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కె.వీరభద్రస్వామి చేతిలో ఓటమి చవి చూశారు. ఆ తర్వాత 2009 ఎన్నికల్లో గెలుపొందారు. ఇక 2014 ఎన్నికల్లో విజయనగరం పార్లమెంట్ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా అశోక్ గజపతి రాజు విజయం సాధించారు. మొదటిసారి ఎంపీగా విజయం సాధించడమే కాకుండా మోడీ కేబినేట్లో పౌర విమానాయ శాఖ మంత్రిగా అశోక్ గజపతి రాజు బాధ్యతులు చేపట్టారు. దాంతో అనగనగా ఓ రాజుగారికి మంత్రి పదవి దక్కింది.