job searching
-
ఈ టిప్స్ పాటిస్తే.. మంచి జాబ్ పక్కా!!
ఉద్యోగం కోసం సెర్చ్ చేసేవారిలో 82 శాతం లేదా 10 మందిలో 8 మంది ఆన్లైన్(లింక్డ్ఇన్)లో వెతుకుతున్నారు. స్కామర్లు, సైబర్ నేరగాళ్లు పెరిగిపోయిన తరుణంలో ఫేక్ రిక్రూటర్లు తయారవుతున్నారు. ఉద్యోగార్థులు తప్పుదోవపట్టిస్తున్నారు. కొందరు డబ్బు కూడా వసూలు చేస్తున్నారు. కాబట్టి ఈ కథనంలో ఆన్లైన్ జాబ్ సెర్చింగ్లో తీసుకోవలసిన జాగ్రత్తలు వివరంగా తెలుసుకుందాం.జాబ్ సెర్చింగ్లో ఉద్యోగార్థులు సురక్షితంగా ఉండటానికి, వారికి సహాయం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని 'సేఫర్ ఇంటర్నెట్ డే' (Safer Internet Day) సందర్భంగా.. లింక్డ్ఇన్ (LinkedIn) ఇండియా లీగల్ & పబ్లిక్ పాలసీ హెడ్ 'అదితి ఝా' (Aditi Jha) పేర్కొన్నారు. జాబ్ పోస్టింగ్లను జాగ్రత్తగా సంప్రదించడం, అప్లై చేసుకునే ముందు అందుబాటులో ఉన్న మొత్తం సమాచారం తెలుసుకోవడం ముఖ్యని అన్నారు.సేఫ్ జాబ్ సెర్చింగ్ కోసం టిప్స్మీరు ఎలాంటి వివరాలను పంచుకుంటున్నారో చూసుకోండి. ఆన్బోర్డింగ్ ప్రక్రియకు ముందు బ్యాంక్ వివరాలను ఇవ్వకండి.అనుమానాస్పదమైన అభ్యర్థనలకు నో చెప్పండి. ఇంటర్వ్యూ కోసం ఎన్క్రిప్టెడ్ సాఫ్ట్వేర్ను డౌన్లోడ్ చేయమని అడగడం, ఎక్కువ జీతం.. తక్కువ పని వంటి ఆఫర్స్ ఇవ్వడం వంటి వాటిపై జాగ్రత్త వహించండి.ఉద్యోగం కోసం ముందుగానే డబ్బు చెల్లించాలి అని చెప్పే.. పోస్టింగుల పట్ల జాగ్రత్త వహించండి. డబ్బు పంపమని, క్రిప్టోకరెన్సీ, గిఫ్ట్ కార్డ్లు పంపమని లేదా పెట్టుబడి పెట్టమని అడిగే వారికి స్పందించకపోవడం ఉత్తమం.మీ సెట్టింగ్లను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉండండి. మీ ఖాతాకు అదనపు ఫోన్ నంబర్ లేదా ఇమెయిల్ చిరునామాను యాడ్ చేయడం వల్ల.. మీ పాస్వర్డ్ను మరచిపోయిన సమయంలో ఇవి ఉపయోగపడతాయి. -
కొత్త ఉద్యోగానికి సై
న్యూఢిల్లీ: వృత్తి నిపుణుల్లో ఎక్కువ మంది ఈ ఏడాది కొత్త ఉద్యోగం కోసం అన్వేషించనున్నారు. ఈ అన్వేషణ ఇంతకుముందెన్నడూ లేనంత కఠినంగా ఉండనున్నట్టు ప్రొఫెషనల్ నెట్వర్క్ ప్లాట్ఫామ్ లింక్డెన్ ఇండియా నిర్వహించిన అధ్యయనంలో తెలిపింది. అర్హతలు ఉన్న నిపుణులను గుర్తించడం సవాలుగా 69 శాతం మంది హెచ్ఆర్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వచ్చిన దరఖాస్తుల పరిశీలన కోసం హెచ్ఆర్ నిపుణులు రోజులో 3–5 గంటల సమయాన్ని వెచ్చిస్తున్నారు. 49 శాతం మంది గతంలో కంటే ఎక్కువ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకుంటున్నారు. అన్ని అర్హత ప్రమాణాలు సరితూగే దరఖాస్తుదారులు సగం కంటే తక్కువే ఉంటున్నట్టు 55 శాతం హెచ్ఆర్ నిపుణులు చెబుతున్నారు. ‘‘ఉద్యోగ మార్కెట్ కఠినంగా మారుతోంది. ఉద్యోగాన్వేషణ మరింత ఆలోచనాత్మకంగా ఉండాలని ఇది సంకేతమిస్తోంది. మరింత వ్యూహాత్మకంగా వ్యవహరించడం ద్వారా సవాళ్లతో కూడిన ఉద్యోగ మార్కెట్లోనూ కొత్త అవకాశాలను సొంతం చేసుకోవడమే కాకుండా, కెరీర్లో మంచి వృద్ధిని చూడొచ్చు’’అని లింక్డెన్ ఇండియా సీనియర్ మేనేజింగ్ ఎడిటర్, కెరీర్ ఎక్స్పర్ట్ నిరజిత బెనర్జీ అన్నారు. గతేడాది నవంబర్ 27 నుంచి, డిసెంబర్ 16 మధ్య ఈ అధ్యయనం జరిగింది. ఇందులో 22,010 మంది నిపుణులు పాల్గొన్నారు. భారత్తోపాటు, స్పెయిన్, ఐర్లాండ్, బ్రెజిల్, యూఎస్, యూకే, ఫ్రాన్స్, జర్మనీ, యూఏఈ, ఆస్ట్రేలియా, జపాన్, స్వీడన్, సింగపూర్, నెదర్లాండ్స్ తదితర దేశాల్లో అధ్యయనం కొనసాగింది. ఈ ఉద్యోగాల్లో వృద్ధి ఎక్కువ.. ఎయిర్క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజనీర్, రోబోటిక్స్ టెక్నీషియన్, క్లోజింగ్ మేనేజర్ ఈ ఏడాది భారత్లో ఎక్కువ వృద్ధి చెందే ఉద్యోగాలుగా లింక్డెన్ తెలిపింది. భారత్లో ప్రతి ఐదుగురు వృత్తి నిపుణుల్లో ముగ్గురు కొత్త రంగంలో, కొత్త విభాగంలో ఉద్యోగానికి సంసిద్ధంగా ఉండగా.. కొత్త అవకాశాలను సొంతం చేసుకునేందుకు వీలుగా నైపుణ్యాలను నేర్చుకోనున్నట్టు 39 శాతం మంది చెప్పారు. భవిష్యత్తులో ప్రతి ఉద్యోగానికి సంబంధించిన విలువను కృత్రిమ మేథ (ఏఐ) పెంచనున్నట్టు ఈ అధ్యయనం తెలిపింది. మహిళలు మరిన్ని ఉద్యోగ పాత్రల్లోకి అడుగుపెట్టున్నట్టు పేర్కొంది. నవంబర్లో పెరిగిన ఉపాధి ఈపీఎఫ్ఓ సభ్యత్వంలో 4.88 శాతం పెరుగుదల ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్ఓ)లో సభ్యత్వం నవంబర్లో 4.88 శాతం (2023 నవంబర్తో పోల్చి) పెరిగింది. ఉపాధి పెరుగుదలను సూచిస్తూ సమీక్షా నెల్లో ఈపీఎఫ్ఓలో 14.63 లక్షల నికర సభ్యత్వం నమోదయినట్లు తాజా పేరోల్ గణాంకాలు పేర్కొన్నాయి. ఇక 2024 అక్టోబర్తో పోల్చితే నికర సభ్యత్వం నెలవారీగా 9.07 శాతం పెరగడం గమనార్హం. నవంబర్లో నికర మహిళా సభ్యుల చేరిక 3.13 లక్షలు. అక్టోబర్తో పోల్చితే ఇది 12.16 శాతం అధికం. వార్షిక పెరుగుదల 11.75 శాతం. నెలలో 20.86 శాతం నికర సభ్యుల చేరికతో మహారాష్ట్ర ముందుంది. మహారాష్ట్ర తర్వాత ఐదు శాతానికిపైగా సభ్యత్వ నమోదులతో కర్ణాటక, తమిళనాడు, హర్యానా, గుజరాత్, ఢిల్లీ, తెలంగాణ, ఉత్తరప్రదేశ్లు నిలిచాయి. -
జాబ్ కోసం సెర్చ్ చేస్తున్నారు?.. ఇవి తెలుసుకోండి
టెక్నాలజీ విపరీతంగా అభివృద్ధి చెందుతున్న తరుణంలో.. చాలా పనులు సులభమైపోతున్నాయి. సోషల్ మీడియాను ఉపయోగించుకుని చాలామంది ఉద్యోగార్థులు జాబ్స్ వెతుక్కుంటూ ఉంటారు. ఇక్కడ మోసపోవడానికి కూడా ఆస్కారాలు చాలానే ఉన్నాయి. కాబట్టి దీని నుంచి బయట పడటానికి కొన్ని టిప్స్ పాటించాల్సి ఉంటుంది.ఉద్యోగం వెతుక్కోవడం కోసం చాలామంది లింక్డ్ఇన్ను ఆశ్రయిస్తారు. ఇది జాబ్స్ సెర్చ్ చేసుకోవడానికి విశ్వసనీయమైన స్థలం అయినప్పటికీ.. కొంత మంది తప్పుడు ప్రకటనలతో మోసం చేసే అవకాశం ఉంది. కాబట్టి ఉద్యోగార్థులు చాలా జాగ్రత్తగా ఉండాలని.. లింక్డ్ఇన్ ఇండియా లీగల్ & పబ్లిక్ పాలసీ హెడ్ 'అదితి ఝా' పేర్కొన్నారు. లింక్డ్ఇన్ ప్లాట్ఫామ్లో ఇలాంటి మోసాలను నివారించడానికి మా బృందం పనిచేస్తోందని కూడా అన్నారు.జాబ్ సెర్చ్ చేసే సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు➤ఉద్యోగం కోసం సెర్చ్ చేస్తున్న సమయంలో.. మీకు కనిపించే ఉద్యోగ పోస్టింగ్పై ధృవీకరణ బ్యాడ్జ్ అనేది ఉందా? లేదా? అని గమనించాలి. పోస్టర్ అధికారిక కంపెనీ పేజీతో అనుసంధానించి ఉంటే అలాంటి వాటిని ఎంచుకోవచ్చు. ఉద్యోగానికి సంబంధించిన ధృవీకరణ చాలా ముఖ్యమని గుర్తుంచుకోవాలి.➤మీరు ఒక ఉద్యోగాన్ని వెతుకుతున్న సమయంలో బ్యాంకింగ్ వివరాలు లేదా ఇతర వ్యక్తిగత సమాచారం అడుగుతున్నారంటే.. అలాంటి వివరాలను చెప్పకపోవడమే ఉత్తమం.➤ఇంటర్వ్యూ కోసం ఎన్క్రిప్టెడ్ సాఫ్ట్వేర్ను డౌన్లోడ్ చేయమని అడగడం లేదా తక్కువ పనికి అధిక వేతనంతో ఉద్యోగాలను అందించడం వంటివి చెబితే అస్సలు నమ్మకూడదు. చట్టబద్దమైన సంస్థలు ఎప్పుడూ ఇలాంటి విషయాలను చెప్పదని గుర్తుంచుకోవాలి.➤ఉద్యోగం కోసం ఎవరైనా మిమ్మల్ని డబ్బు డిమాండ్ చేస్తే.. క్రిప్టోకరెన్సీని, గిఫ్ట్ కార్డ్లను పంపమని లేదా పెట్టుబడి పెట్టమని అడగడం పట్ల జాగ్రత్తగా ఉండండి. జాబ్ ఇచ్చే కంపెనీలు మీ నుంచి డబ్బు ఆశించదు.➤కంపెనీల అధికారిక లింక్డ్ఇన్ పేజీలలో ఉద్యోగాలను వెతుక్కోవడం మంచిది. జాబ్ పోస్టర్లతో కంపెనీలు పోస్ట్ చేసిన ఉద్యోగాల కోసం ప్రత్యేకంగా సెర్చ్ చేయడానికి ఫిల్టర్ వంటివి ఎంచుకోవచ్చు. ఇది ఎంచుకుంటే.. వెరిఫికేషన్లతో కూడిన జాబ్లు మాత్రమే మీ శోధన ఫలితాల్లో కనిపిస్తాయి. -
ఏఐ కోచ్.. మీకు త్వరగా జాబ్ వచ్చేలా చేస్తుంది!
ప్రముఖ ప్రొఫెషనల్ నెట్వర్కింగ్ సైట్ లింక్డ్ఇన్.. జాబ్ కోసం వెతుకుతున్న యూజర్లకు సహాయం చేయడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత సాధనంపై పని చేస్తోంది. ‘ఏఐ కోచ్’ పేరుతో పిలుస్తున్న ఈ కొత్త టూల్ ఉద్యోగార్థులకు మరింత సమర్థవంతమైన పద్ధతిలో ఉద్యోగాలను కనుగొని దరఖాస్తు చేసుకోవడానికి సహాయం చేస్తుంది. ఈ విషయాన్ని లింక్డ్ఇన్ యాప్ రీసెర్చర్ నిమా ఓవ్జీ ట్విటర్లో షేర్ చేశారు. లింక్డ్ఇన్ ఏఐ కోచ్పై పని చేస్తోందని, ఇది జాబ్లకు దరఖాస్తు చేయండం, నైపుణ్యాన్ని పెంచుకోవడం, వృత్తిపరమైన నెట్వర్క్ను విస్తరించే మార్గాలను అన్వేషించడంలో ఉద్యోగార్థులకు సహాయపడుతుందని అందులో రాసుకొచ్చారు. ఓవ్జీ షేర్ చేసిన లింక్డ్ఇన్ ఏఐ కోచ్ స్క్రీన్షాట్ను చూస్తే ఇంచుమించు మైక్రోసాఫ్ట్ బింగ్ చాట్బాట్ను పోలి ఉంది. ఇందులో ఏఐ కోచ్ ఎలా పని చేస్తుంది.. కంపెనీల వర్క్ కల్చర్ ఎలా ఉంటుంది.. తదితర వివరాలను మీరు ఏఐ కోచ్ నుంచి ఆరా తీయవచ్చు. ఇది మైక్రోసాఫ్ట్ యాజమాన్యంలోని కంపెనీ అయినందున దాని ఏఐ సాంకేతికతతోనే దీన్ని రూపొందించే అవకాశం ఉంటుంది. ఇదీ చదవండి ➤ బ్యాంకు ఉద్యోగాలు చేదయ్యాయా? అలా చేరుతున్నారు.. ఇలా మానేస్తున్నారు! ప్రస్తుతం అన్నింట్లోనూ ఏఐ ఆధారిత సాధనాలు వస్తున్నాయి. వివిధ పనుల కోసం ప్రత్యేకంగా వీటిని అభివృద్ధి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉద్యోగ అన్వేషణలోనూ ఇవి సహాయం చేయనున్నాయి. ఈ దిశలో ‘ఏఐ కోచ్’ ఒక ప్రధాన అడుగు కాబోతోంది. ఇది ఉద్యోగార్థుల సమయం, శ్రమను ఆదా చేస్తుంది. మైక్రోసాఫ్ట్ ఇప్పటివరకు తన బింగ్ చాట్ను మైక్రోసాఫ్ట్ ఆఫీస్ సూట్ యాప్లు, ఎడ్, గిట్హబ్లకు పరిచయం చేసింది. మైక్రోసాఫ్ట్ ముఖ్యమైన ఉత్పత్తులలో లింక్డ్ఇన్ కూడా ఒకటి కావడం వల్ల ‘ఏఐ కోచ్’ ద్వారా ఇందులోనూ ఏఐ టెక్నాలజీని పరిచయం చేయబోతోందని చెప్పవచ్చు. #Linkedin is working on LinkedIn Coach! It's an AI ASSISTANT that helps you apply for JOBS, learn new SKILLS, and find more ways to CONNECT with your network! pic.twitter.com/jKBrPmEFJt — Nima Owji (@nima_owji) July 27, 2023 -
యువకుడు అనుమానాస్పద మృతి
హైదరాబాద్ : హైదరాబాద్ నగర శివారులోని ఎల్బీ నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో ఓ విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే... జయంత్(24) అనే యువకుడు ఎంటెక్ పూర్తి చేసి ఉద్యోగ ప్రయత్నాల నిమిత్తం హైదరాబాద్ ఎల్బీ నగర్లో నివాసముంటున్నాడు. అయితే సోమవారం ఉదయం నాగోలు ప్రాంతంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.