Karate player
-
కరాటే క్వీన్స్: చదువులో సరస్వతీ పుత్రిక.. కరాటేలో వండర్ కిడ్
‘నేటి సమాజంలో మహిళలపై జరుగుతున్న దాడులకు చెక్ పెట్టాలంటే ఆడపిల్లలకు కరాటే ఎంతో దోహదపడుతుంది. మా అమ్మానాన్నలు కరాటే నేర్చుకోవాలన్నప్పుడు మేం భయపడ్డాం. శిక్షణ పొందాక ఆ గొప్పతనం తెలిసింది. తల్లిదండ్రులందరూ తమ పిల్లలకు కరాటే నేర్పించాలి.’ – కరాటే విజేతలు అగనంపూడి(గాజువాక): ఆత్మస్థైర్యం, స్వీయరక్షణతోపాటు అంతర్జాతీయ పోటీల్లో సత్తా చాటేందుకు బాలికలు కరాటేను ఎంచుకుని.. నిరంతర సాధన చేశారు. చదువుతో పాటు కరాటేలో శిక్షణ పొందుతూ.. సరిలేరు మాకెవ్వరూ అంటూ పతకాలు పంట పండిస్తున్నారు. వీరే కూర్మన్నపాలెం, దువ్వాడ, రాజీవ్నగర్ ప్రాంతాలకు చెందిన బాలికలు. వేపగుంటకు చెందిన చాంపియన్స్ కరాటే డోజో సారథ్యంలో జాతీయ కోచ్, బ్లాక్ బెల్ట్ ఫిప్త్ డాన్, జపాన్ కరాటే షోటోకై వి.ఎన్.డి.ప్రవీణ్కుమార్ పర్యవేక్షణలో వీరంతా శిక్షణ పొందుతున్నారు. వీరికి గంటా కనకారావు మెమోరియల్ సంస్థ సాయం అందిస్తోంది. నిర్వాహకుల చేతుల మీదుగా బంగారు పతకం అందుకుంటున్న మృదుల, హీరో సుమన్ నుంచి పసిడి పతకం అందుకుంటున్న రేష్మా వండర్ కిడ్..రేష్మా చదువులో సరస్వతీ పుత్రిక.. కరాటేలో తన పంచ్లతో ప్రత్యర్థికి ముచ్చెమటలు పట్టించే వండర్ కిడ్.. పసిడి పతకాల పంట పండిస్తోంది పేడాడ రేష్మా. కూర్మన్నపాలెం సమీపంలోని మాతృశ్రీ లే అవుట్లో నివాసముంటున్న రేష్మా ఉక్కునగరంలోని ఓ పాఠశాలలో ఐదో తరగతి చదువుతోంది. 2019 నుంచి కరాటేలో శిక్షణ పొందుతోంది. ఇప్పటి వరకు రేష్మా తన పంచ్లతో రాష్ట్ర, జాతీయస్థాయిలో 8 బంగారు, 7 రజత, రెండు కాంస్య పతకాలు సాధించి ఈ ప్రాంత ప్రతిష్టను ఇనుమడింపజేసింది. తండ్రి పి.వరహాలరావు ఇండియన్ ఆర్మీ విశ్రాంత ఉద్యోగి. తల్లి ధనలక్ష్మి గృహిణి. అంతర్జాతీయ స్థాయిలో పసిడి పతకం సాధించి దేశానికి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలన్నదే ఆమె లక్ష్యం. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతోపాటు కోచ్లు ఆమెను ప్రోత్సహిస్తున్నారు. చదవండి👉🏾 మానవత్వం చాటుకున్న హోంమంత్రి తానేటి వనిత మృదుల.. పతకాల వరద దువ్వాడ విజ్ఞాన్ పబ్లిక్ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న ఎం.మృదుల కరాటేలో 2018 నుంచి శిక్షణ పొందుతోంది. చిన్నప్పటి నుంచి కరాటేపై ఆసక్తి పెంచుకున్న మృదుల ఇప్పటి వరకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో 26 పసిడి పతకాలు, 6 రజతం, 7 కాంస్య పతకాలు సాధించి.. పదునైన పంచ్లతో ప్రత్యర్థులకు తన పవర్ చూపించింది. తండ్రి ఎం.సుధాకర్ ప్రైవేట్ కర్మాగారంలో పనిచేస్తుండగా.. తల్లి పద్మజ గృహిణి. మృదులను ఆది నుంచి ప్రోత్సహిస్తుండడంతో మెరుపు పంచ్లతో పతకాల వేట సాగిస్తోంది. కరాటేలో ప్రపంచ చాంపియన్గా నిలవాలన్నదే తన లక్ష్యమని చెబుతోంది. జాతీయ కోచ్ చేతుల మీదుగా పసిడి పతకం అందుకుంటున్న లిఖిత చరిత్రలో ఓ పేజీ లిఖించుకుంది నేటి సమాజంలో బాలికలు, మహిళల ఆత్మ రక్షణకు కరాటే ఒక ఆయుధం అని భావించే టి.లిఖిత ఎన్ఏడీ కొత్తరోడ్డులోని ఓ కళాశాలలో ఇంటర్ చదువుతోంది. పాఠశాల విద్యార్థిగా ఉన్న రోజుల నుంచే కరాటేలో రాణిస్తోంది. చాంపియన్షిప్ పోటీల్లో పాల్గొని పంచ్ విసిరితే పతకం వచ్చి తీరాల్సిందే. లిఖిత ఇప్పటివరకు జాతీయ, అంతర్జాతీయస్థాయిలో 33 బంగారు పతకాలు, 3 రజతాలు, 4 కాంస్య పతకాలు తన ఖాతాలో జమచేసుకుంది. స్పోర్ట్స్ కోటాలో ప్రభుత్వ ఉద్యోగం పొందాలన్నది ఆమె లక్ష్యం. ఆమె తండ్రి వెంకట మహేష్ ప్రైవేట్ ఉద్యోగి. తల్లి గృహిణి. వీరిద్దరితోపాటు కోచ్లు కూడా తనకు ఆది నుంచి వెన్నంటి ప్రోత్సహిస్తున్నారని లిఖిత తెలిపింది. చదవండి👉 బుజ్జి పిట్ట.. బుల్లి పిట్ట.. పక్షి ప్రేమికుల విలక్షణ ఆలోచన సాయి కీర్తనకు పతకం అందిస్తున్న నిర్వాహకులు ‘కీర్తి’ ప్రతిష్టలు పెంచేలా.. నగరంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ చదువుతున్న సీహెచ్ వేద సాయి కీర్తన.. కుటుంబంతో నిర్వాసితకాలనీలో నివాసం ఉంటోంది. 2018 నుంచి డోజో ఇన్స్టిట్యూట్లో కరాటే శిక్షణ కొనసాగిస్తోంది. సమాజంలో మహిళలు పట్ల జరుగుతున్న అఘాయిత్యాలు, దాడులను ఎదుర్కొడానికి కరాటే ఒక్కటే శరణ్యమని భావించి.. దానిపై ఇష్టం పెంచుకుంది. స్వీయ రక్షణతో పాటు కరాటేలో ఉత్తమ ప్రదర్శనతో విశ్వవిఖ్యాతగా నిలవాలన్నది ఆమె లక్ష్యం. ఇప్పటి వరకు 15 బంగారు, మూడు రజతం, 9 కాంస్య పతకాలతో మెరుపులు మెరిపించింది. తండ్రి సీహెచ్.రమేష్ ప్రైవేట్ ఉద్యోగి. తల్లి అర్చనా దేవి స్టాఫ్నర్స్గా పనిచేస్తున్నారు. చదవండి👉🏻 వారి జీవితాల్లో వెలుగు రేఖలు.. బతుకు చూపిన ‘భారతి’ -
Afghanistan: ఆశలు ఆవిరి.. వారి 'ఖేల్' ఖతం..
కాబూల్: ఆఫ్గనిస్తాన్ మళ్లీ తాలిబన్ల ఆక్రమణలోకి వెళ్లడంతో దేశ ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటున్నారు. మెజారిటీ జనాభా దేశం నుంచి బయటపడేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ఇక, దేశంలోని మహిళల పరిస్థితి అయితే చెప్పనక్కర్లేదు. మహిళా క్రీడాకారిణులు తమ క్రీడా భవిష్యత్తుపై ఆశలు వదిలేసుకున్నారు. అఫ్గాన్ కరాటే ఛాంపియన్ అయిన మీనా అసది సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఆవేదన చెందుతుంది. తాలిబన్ల రాజ్యంలో మహిళా అథ్లెట్ల ఆశలు నీరుగారిపోయినట్టేనని, ఇక వారు ఇళ్లకు పరిమితమైతే కనీసం ప్రాణాలైనా దక్కించుకోగలరని పేర్కొంది. అఫ్గాన్లో మహిళల పరిస్థితి మున్ముందు మరింత దారుణంగా మారబోతుందని, ఇది తలచుకుంటేనే ఉలిక్కిపడాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలిపింది. కాగా, ప్రస్తుతం మీనా అసది జకార్తాలోని సిసారువా పట్టణంలో శరణార్ధిగా తలదాచుకుంటుంది. అక్కడే తోటి శరణార్థులకు ఆమె కరాటేలో శిక్షణ ఇస్తోంది. 12 ఏళ్ల వయసులోనే అఫ్గానిస్తాన్ను విడిచిపెట్టిన మీనా పాకిస్థాన్ వెళ్లింది. అక్కడ కరాటేలో శిక్షణ పొంది, అనంతరం 2010 దక్షిణాసియా క్రీడల్లో అఫ్గనిస్తాన్కు ప్రాతినిధ్యం వహించింది. చదవండి: పాకిస్తాన్తో సిరీస్ అంటే వణికిపోతున్న కివీస్ ఆటగాళ్లు! ఆ తర్వాతి ఏడాదే కాబూల్ తిరిగి వచ్చి ఫైట్ క్లబ్ను ఏర్పాటు చేసిన ఆమె.. దేశంలో హింస చెలరేగడంతో రెండోసారి దేశాన్ని వీడింది. భర్త, ఏడాది వయసున్న కుమార్తెతో ఇండోనేషియాకు వెళ్లిపోయింది. దేశాన్ని తాలిబన్లు మళ్లీ హస్తగతం చేసుకోవడంతో అఫ్గాన్లు ఇప్పటి వరకు సాధించిన అభివృద్ధికి అర్థం లేకుండా పోయిందని 28 ఏళ్ల మీనా ఆవేదన వ్యక్తం చేసింది. కాగా, 2012లో దక్షిణాసియా కరాటే ఛాంపియన్షిప్లో పాల్గొన్న మీనా రెండు రజత పతకాలు గెలుచుకుంది. ఆ క్రీడల్లో ఆఫ్ఘనిస్థాన్కు ప్రాతినిధ్యం వహించిన ఏకైక మహిళగా ఆమె రికార్డుల్లోకెక్కింది. ఇదిలా ఉంటే, పారాలింపిక్స్లో(టోక్యో 2021) పాల్గొన్న తొలి అఫ్గాన్ మహిళగా రికార్డుల్లోకెక్కాల్సిన తైక్వాండో అథ్లెట్ జకియా ఖుదాదాడి ఆశలను కూడా తాలిబన్లు చిదిమేశారు. ఇప్పుడామె దేశం విడిచి వెళ్లలేక ఇంటికే పరిమితమైంది. ఆమె ఒక్కరే కాదు.. ఇలా ఎంతోమంది అఫ్గాన్ మహిళా అథ్లెట్ల బంగారు భవిష్యత్తుకు తాలిబన్లు చరమగీతం పాడనున్నారని అఫ్గాన్ మీడియా గోడు వెల్లబుచ్చుకుంటుంది. చదవండి: అఫ్గాన్లు ప్రపంచకప్ గెలిచినా ఆశ్చర్యపోనక్కర్లేదు.. -
రోజు కూలీగా మారిన అంతర్జాతీయ అథ్లెట్..
న్యూఢిల్లీ: అంతర్జాతీయ స్థాయి కరాటే పోటీల్లో భారత్కు ప్రాతినిధ్యం వహించిన 23 ఏళ్ల పంజాబ్ అథ్లెట్ హర్దీప్ కౌర్, ప్రస్తుతం కుటుంబ పోషణ నిమిత్తం దినసరి కూలీగా మారింది. రోజుకు రూ.300 సంపాదన కోసం వరి పొలాల్లో పని చేస్తుంది. ఇప్పటి వరకు జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీల్లో 20కి పైగా పతకాలు సాధించిన ఆమె.. పాలకుల నిర్లక్ష్యం కారణంగా దుర్భర జీవితం కొనసాగిస్తుంది. ఓ వైపు విద్యను(ఫిజికల్ ఎడ్యుకేషన్లో డిప్లొమా) అభ్యసిస్తూనే, తల్లిదండ్రులతో కలిసి కూలీ పనులకు వెళ్తుంది. 2018లో మలేషియాలో జరిగిన కరాటే పోటీల్లో స్వర్ణం సాధించిన హర్దీప్కు ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని అప్పటి పంజాబ్ క్రీడామంత్రి రాణా గుర్మీత్ సోధీ హామీ ఇచ్చారు. అయితే ఆ హామీ మూడేళ్లు గడుస్తున్నా ఇప్పటికీ అమల్లోకి రాకపోవడంతో ఆమె ఆవేదన చెందుతుంది. ఉద్యోగం కోసం ప్రభుత్వ పెద్దలను ఎన్ని సార్లు కలిసినా ప్రయోజనం లేకుండా పోయిందని, దీంతో తప్పని పరిస్థితుల్లో పొలం పనులకు వెళ్లాల్సి వస్తుందని వాపోతుంది. తండ్రి నయాబ్ సింగ్, తల్లి సుఖ్విందర్ కౌర్ తన క్రీడా భవిష్యత్తు కోసం చాలా శ్రమించారని, ఉన్నది అమ్ముకుని తనను ఈ స్థాయికి తెచ్చారని, వారి బాధ చూడలేకే తాను వారితో కలిసి పనికి వెళ్తున్నానని చెప్పుకొచ్చింది. అంతర్జాతీయ స్థాయి క్రీడల్లో దేశానికి ప్రాతినిధ్యం వహించాక ఇటువంటి పరిస్థితి వస్తుందని తానెప్పుడు ఊహించలేదంటూ కన్నీళ్లు పెట్టుకుంది. ఇప్పటికైనా అధికారులు స్పందిస్తారని ఆమె ఆశగా ఎదురు చూస్తుంది. చదవండి: ఆ ఇంగ్లీష్ బౌలర్ పీక కోస్తానన్నాడు.. అందుకే అలా చేశా -
కరాటే పరశురాం..
పెద్దశంకరంపేట(మెదక్): ప్రతిభకు పేదరికం అడ్డుకాదని నిరూపిస్తున్నాడు పేట మండలానికి చెందిన యువకుడు పరశురాం. ఓ వైపు ఆటో డ్రైవర్గా పనిచేస్తూ, మరో వైపు కష్టపడి కరాటేలో రాణిస్తూ అనేక మంది మన్ననలు పొందుతున్నాడు మండల పరిధిలోని జూకల్ గ్రామానికి చెందిన ఈ యువకుడు. చూడడానికి వెళ్లి.. ఒకసారి మెదక్లో జరుగుతున్న కరాటే పోటీలను పరశురాం చూడడానికి వెళ్లాడు. అక్కడే ఉన్న కరాటే మాస్టర్ నగేష్ను కలిసి తన అభిమతం చెప్పాడు. అతని సహాయంతో ఆటో నడుపుతూనే కరాటే నేర్చుకున్నాడు. ఇలా ఏడేళ్లుగా కరాటేలో శిక్షణ పొందుతూ పలు రాష్ట్ర, అంతరాష్ట్ర పోటీల్లో పాల్గొని సత్తా చాటుతున్నాడు. గతేడాది బ్లాక్బెల్టు సాధించి ప్రముఖ సినీనటుడు సుమన్ చేతుల మీదుగా బెల్టు, ప్రశాంసా పత్రాన్ని అందుకున్నాడు. పట్టుదలే లక్ష్యంగా... జూకల్కు చెందిన పుట్ల బాలయ్య, మాణమ్మల కుమారుడు పరుశురాం. ఆరేళ్ల వయస్సులో తండ్రిని కోల్పోయాడు. మణమ్మ వారికి ఉన్న రెండెకరాల భూమిని సాగు చేసుకుంటూ కుమారుడిని చదివించింది. ప్రస్తుతం పరుశురాం పేటలో డీగ్రీ చదువుతూ ఆటో నడిపిస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. అనేక పతకాలు పరశురాం సొంతం.. గతేడాది ముంబాయిలో జరిగిన 22వ అంతర్జాతీయ ఏషియన్ ఓపెన్ ఛాంపియన్షిప్ పోటీల్లో 13 దేశాలకు చెందిన వారు పాల్గొనగా అండర్-20 స్పారింగ్ బ్లాక్ బెల్ట్ విభాగంలో పరశురాం కాంస్య పతకం సాధించాడు. వరంగల్లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి పోటీల్లో సైతం పాల్గొని పతకం సాధించాడు. ఉచితంగా శిక్షణ ఇస్తూ ఆదర్శం.. తనకు వచ్చిన కరాటే విద్యను పరుశురాం తన సొంత గ్రామమైన జూకల్లో గ్రామస్థులకు, పేటలోని పలువురు విద్యార్థులకు నేర్పిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాడు పరశురాం. ఇతని దగ్గర శిక్షణ పొందిన 14 మందిలో ఐదుగురు స్వర్ణపతకాలు సాధించడం విశేషం. దీంతో పాటు పేటలోని పలు ఉన్నత పాఠశాలల్లో విద్యార్థినిలకు సైతం పరశురాం కరాటే శిక్షణ ఇస్తున్నాడు. ఎప్పటికైనా ఒలింపిక్స్లో పాల్గొని గ్రామానికి పేరు తేవడమే తన లక్ష్యమని పరుశురాం చెబుతున్నాడు. -
కరాటే సయీదా, పైలట్ స్వాతికి సాయం
సాక్షి, హైదరాబాద్: కరాటే క్రీడాకారిణి, మహిళా పైలట్కు సీఎం కె.చంద్రశేఖర్రావు ఆర్థిక సాయం ప్రకటించారు. వారికి అవసరమయ్యే శిక్షణ ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుందని భరోసా ఇచ్చారు. హైదరాబాద్ పాతబస్తీకి చెందిన సయీదా ఫలక్ జూలైలో జరిగిన చెన్నై ఓపెన్ కరాటే చాంపియన్షిప్లో మహిళల వ్యక్తిగత విభాగంలో గోల్డ్ మెడల్ సాధించింది. ఈ ఏడాది సెప్టెంబర్లో జపాన్లో జరిగే 13వ సీనియర్ ఏషియన్ కరాటే చాంపియన్షిప్ పోటీల్లో మన దేశం తరఫున పాల్గొననుంది. సోమవారం సెక్రటేరియట్లో సీఎంను సయీదా కలిసింది. కరాటేలో రాణిస్తున్నందుకు సయిదాను అభినందించిన కేసీఆర్.. ఆమె శిక్షణకు అవసరమయ్యే ఖర్చును భరిస్తామని హామీ ఇచ్చారు. కాగా, ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్కు చెందిన గంటా స్వాతిరావు 2006లో పైలట్గా ఎంపికైంది. రాష్ట్రం నుంచి మొదటి పైలట్ అయిన స్వాతిరావు ఫిలిప్పైన్స్లో ఫ్లైట్ ఇన్స్ట్రక్టర్గా పని చేస్తోంది. ఎయిర్బస్ పైలట్గా మారేందుకు తదుపరి శిక్షణ తీసుకోవాల్సి ఉంది. మంత్రి ఇంద్రకరణ్రెడ్డితో స్వాతి సీఎంను కలిసింది. పైలట్ శిక్షణకు కావాల్సిన ఖర్చును భరిస్తామని సీఎం హామీ ఇచ్చారు. -
పాతబస్తీలో కరాటే ఆణిమూత్యం