Latest News
-
అస్సలు పశ్చాత్తాప పడను.. షిండేపై వ్యాఖ్యల కేసులో కునాల్ కమ్రా
ముంబై: మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే(Eknath Shinde)ను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యల దుమారం తర్వాత ప్రముఖ స్టాండప్ కమెడియన్ కునాల్ కమ్రా(kunal kamra) తొలిసారి స్పందించారు. షిండేపై వ్యాఖ్యలను సమర్థించుకున్న కునాల్, ఈ వ్యహారంలో తాను క్షమాపణలు చెప్పాల్సి వస్తే.. అంటూ ఆసక్తికర వ్యాఖ్యలే చేశారు. ప్రస్తుతం తమిళనాడులో ఉన్న కమ్రాను ముంబై పోలీసులు సంప్రదించినట్లు సమాచారం. అయితే.. షిండేపై చేసిన వ్యాఖ్యలకు తానేమీ పశ్చాత్తాపం చెందడం లేదన్న కునాల్ కమ్రా.. తన వెనుక ఎవరో ఉన్నారన్న ప్రచారాన్ని తోసిపుచ్చారు. షిండే రాజకీయ ప్రత్యర్థులు డబ్బులు ఇచ్చి తనతో ఇలా మాట్లాడించారన్నదాంట్లో ఎలాంటి వాస్తవం లేదని ఆయన ముంబై పోలీసులకు వివరణ ఇచ్చినట్లు తెలుస్తోంది. అవసరమైతే తన ఆర్థిక లావాదేవీలను పరిశీలించేందుకు పోలీసులకు ఆయన అనుమతి ఇచ్చినట్లు సమాచారం.ఇక.. కునాల్ కమ్రా తక్షణమే షిండేకు క్షమాపణలు చెప్పాలని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ చేసిన హెచ్చరికలపైనా కమ్రా స్పందించారు. తాను కేవలం న్యాయస్థానాలు కోరినప్పుడు మాత్రమే క్షమాపణలు చెబుతానని ముంబై పోలీసులకు తేల్చి చెప్పాడట. ఈ మేరకు ఓ జాతీయ మీడియా ఈ వివరాలతో కథనం ఇచ్చింది.ఇదిలా ఉంటే.. ప్రముఖ స్టాండప్ కమెడియన్ కునాల్ కమ్రా వ్యాఖ్యలతో ది యూనికాంటినెంటల్ హోటల్లోని హాబిటాట్ క్లబ్కు కష్టాలు మొదలయ్యాయి. అందులో అక్రమ కట్టడాలు ఉంటున్నాయంటూ బీఎంసీ (బృహన్ ముంబయి కార్పొరేషన్) ఉద్యోగులు ఖార్ వద్దకు చేరుకొన్నారు. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి ప్రతాప్ సర్నైక్ మాట్లాడుతూ ఖార్లోని ఆ స్టూడియో అక్రమ నిర్మాణమని.. చర్యలు తీసుకోవాలని ముంబయి కమిషనర్ను కోరినట్లు వెల్లడించారు. అయితే ఇది రాజకీయ నిర్ణయం కాదంటూ ఆయన స్పష్టమైన ప్రకటన చేశారు. తాజా పరిణామాలపై అసిస్టెంట్ కమిషనర్ వినాయక్ విస్పుటే మాట్లాడుతూ ‘‘స్టూడియో యజమాని కొన్ని అక్రమ షెడ్లను నిర్మించారు. వాటిని ఇప్పుడు మేము తొలగిస్తున్నాం. వీటికి నోటీసులతో పనిలేదు’’ అని వెల్లడించారు. అసలు స్టూడియో ప్లాన్ను కూడా పరిశీలించి చర్యలు తీసుకొంటామని తెలిపారు.#WATCH | Mumbai: BMC officials arrive at Unicontinental Studio in Khar area of Mumbai. The officials have arrived here with hammers. Details awaited. pic.twitter.com/dLb1O2z3uT— ANI (@ANI) March 24, 2025ఇటీవల హబిటాట్ స్టూడియో(Habitat Club)లో జరిగిన ఓ కార్యక్రమంలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్నాథ్ శిందేపై కునాల్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ఆయన్ను ద్రోహితో పోల్చాడు. ఈ సందర్భంగా ‘దిల్ తో పాగల్ హై’ అనే హిందీ పాటలోని చరణాలను రాజకీయాలకు అనుగుణంగా మార్చి అవమానకర రీతిలో పాడారు. దీంతో శివసేన షిండే వర్గం కునాల్పై భగ్గుమంది. ఆ పార్టీ కార్యకర్తలు ఆ స్టూడియోపై దాడి చేసి ధ్వంసం చేశారు. దీంతో 12 మందిని అరెస్టు చేశారు. మరోవైపు పోలీసులు సోమవారం కునాల్పై కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఆ వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పాలని ఇప్పటికే ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తేల్చిచెప్పారు. ఇంకోవైపు.. థాక్రే శివసేన సహా పలు రాజకీయ పార్టీలు కునాల్కు మద్దతుగా నిలుస్తుండడం గమనార్హం.This is full length 45 minutes video of Kunal Kamra which has shaken the roots of right wing 🔥He has spoken facts with wit and satire which BJP can't digest. WATCH & SHARE BEFORE IT GETS BANNED ON YOUTUBE 🧵 pic.twitter.com/GNEs7gef6w— Amock_ (@Amockx2022) March 24, 2025 -
బడ్జెట్ వేళ.. పద్మశ్రీ గ్రహీత ఇచ్చిన చీరలో నిర్మలమ్మ
-
అనంతపురం జిల్లాలో నారాయణ కాలేజీ విద్యార్థి ఆత్మహత్య
-
అంబానీ జూకు ఏనుగుల తరలింపుపై విమర్శలా?!
ఎక్కడ అరుణాచల్ ప్రదేశ్.. ఎక్కడ గుజరాత్..? మూడు వేలకు పైగా కిలోమీటర్ల దూరం. అంత దూరం నుంచి.. అదీ ట్రక్కులలో ఏనుగులను తరలించడం ఏంటి?. స్పెషల్ ట్రక్కులలో అంబానీ కుటుంబానికి చెందిన జూకు ఏనుగులను తరలించడంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. మూగజీవుల కోసం పోరాడే ఉద్యమకారులైతే తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఆ దృశ్యాలు చూసి.. ‘‘పాపం ఏనుగులు.. డబ్బుంటే ఏమైనా చేయొచ్చా?’’ అని తిట్టుకునేవారు లేకపోలేదు. అయితే..అరుణాచల్ ప్రదేశ్(Arunachal Pradesh) నుంచి మాత్రమే కాదు.. అసోం(Assam) నుంచి కూడా జామ్ నగర్లోని అనంత్ అంబానీకి చెందిన వంతార జూనకు ఏనుగులను తరలించారట. ఈ తరలింపునకు ప్రభుత్వాల నుంచి ఎలాంటి అనుమతులు లేవని.. పైగా వన్యప్రాణులను అలా బంధించడమూ నేరమేనని కొందరు వాదిస్తున్నారు. ఈ క్రమంలోనే కొందరు నిజనిర్ధారణలు చేసుకోకుండా పోస్టులు పెట్టేస్తున్నారు. అయితే ఇలాంటి తరలింపునకు అసలు అనుమతులు ఉన్నాయా?. వన్యప్రాణులను ఇలా జంతు ప్రదర్శన శాలలో ఉంచొచ్చా?. దారిలో వాటికి ఏదైనా జరగరానిది జరిగితే ఎలా?... ఎవరిది బాధ్యత? సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ప్రచారంలో వాస్తవమెంత?. అయితే ఇవేం అడవుల నుంచి బలవంతంగా తరలిస్తున్న ఏనుగులు కాదని అధికారులు వివరణ ఇస్తున్నారు. జంతు సంరక్షణ చర్యల్లో భాగంగానే వాటిని తరలిస్తున్నట్లు స్పష్టత ఇచ్చారు. ఏనుగులను బంధించి.. వాటితో సొమ్ము చేసుకుంటున్న ముఠాల నుంచి వాటికి విముక్తి కలిగిస్తున్నారు. రిలయన్స్ వంతార జూ ‘చైన్ ఫ్రీ’ ఉద్యమం పేరిట నిర్వహిస్తున్న కార్యక్రమం భాగంగా ఇది ఎప్పటి నుంచో జరుగుతున్నదే. అయితే తాజా వీడియోలపై విమర్శల నేపథ్యంలో.. ఇటు వంతారా నిర్వాహకులు కూడా స్పందించారు.ఆరోగ్యకరమైన వాతావరణంలో అవి జీవిస్తాయని మాది గ్యారెంటీ. వాటికి గౌరవప్రదమైన జీవితం అందించడమే మా ఉద్దేశం’’ అని స్పష్టం చేసింది. అంతేకాదు.. ఇందుకు అవసరమైన ప్రక్రియ అంతా అధికారికంగానే నిర్వహించినట్లు స్పష్టత ఇచ్చింది. వన్యప్రాణుల సంరక్షణ చట్టం 1972 ప్రకారమే నడుచుకున్నట్లు, అలాగే.. గుజరాత్ , అరుణాచల్ ప్రదేశ్ అటవీ శాఖల నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్లు, ఏనుగుల తరలింపు కోసం రవాణా శాఖల నుంచీ ప్రత్యేక అనుమతులు పొందినట్లు పేర్కొంది.అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వం ఏం చెప్పిందంటే.. అవి అటవీ ఏనుగులు కాదని, ప్రైవేట్ ఓనర్ల నుంచి వాటిని వంతారా కొనుగోలు చేసినట్లు తెలిపింది. త్రిపుర హైకోర్టు వేసిన హైపవర్ కమిటీతో పాటు సుప్రీం కోర్టు పర్యవేక్షణలోనే ఇదంతా జరుగుతోందని స్పష్టం చేసింది. వాటిని తరలించిన ఆంబులెన్స్లు కూడా ప్రత్యేకమైన సదుపాయాలతోనే తరలించినట్లు పేర్కొంది.అసోం ప్రభుత్వం మాత్రం.. తమ భూభాగం నుంచి ఏనుగుల తరలింపేదీ జరగలేదని స్పష్టం చేసింది. అసోం నుంచి గుజరాత్ ప్రైవేట్ జూకు జంతువుల తరలింపు పేరిట అసత్య ప్రచారాలు, కథనాలు ఇస్తున్నారని ఆ రాష్ట్ర సీఎం కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. అయితే ఈ వివరణలలేవీ వైల్డ్లైఫ్(Wild Life) యాక్టవిస్టులను సంతృప్తి పర్చడం లేదు. పైగా వాతావరణ మార్పు వాటి ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తుందని, యానిమల్ ఆంబులెన్స్ పేరిట తరలిస్తున్న వాహనాల్లో ఎలాంటి సదుపాయాలు లేవని అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. అవసరమైతే ఈ అంశంపై కోర్టును ఆశ్రయిస్తామని అంటున్నారు. మరోవైపు.. ఈ వ్యవహారం ఇటు సోషల్ మీడియాలో, అటు రాజకీయంగా విమర్శలకు దారి తీసింది. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రైవేట్ వ్యక్తుల కోసం పని చేస్తున్నాయంటూ ప్రతిపక్షాలు తిట్టిపోస్తున్నాయి.వంతార.. రిలయన్స్ సౌజన్యంతో నడిచే అతిపెద్ద జంతు సంరక్షణశాల. దేశంలోనే అతిపెద్దది. ముకేష్ అంబానీ(Mukesh Ambani) తనయుడు అనంత్ చిన్నప్పటి నుంచి యానిమల్ లవర్ అట. అలా.. మూగ జీవుల సంరక్షణ ప్రధాన ఉద్దేశంగా రిలయన్స్ ఇండస్ట్రీస్, రిలయన్స్ ఫౌండేషన్ దేశంలో ఎక్కడా లేనన్ని సేవలతో ఈ జూను నడిపిస్తున్నాయి. వేటగాళ్ల చేతిలో బందీ అయిన, గాయపడిన ప్రాణులను రక్షించి చికిత్స చేయడం, కాపాడాటం, వాటికి పునరావాసం కల్పించడంపై దృష్టిపెట్టింది ఫౌండేషన్. ఈ ప్రాజెక్టు కింద భారతదేశంలోనే కాకుండా విదేశాల్లోని ప్రాణులను కూడా కాపాడుతున్నారు. ఇది గుజరాత్ లోని జామ్ నగర్ రిఫైనరీ కాంప్లెక్స్లోని రిలయన్స్ గ్రీన్ బెల్ట్లో సుమారు 600 ఎకరాల్లో విస్తరించి ఉంది.ఏమేం ఉన్నాయంటే..వంతార జూ(Vantara Zoo)లోనే లక్ష చదరపు అడుగుల్లో హాస్పిటల్, పరిశోధనా కేంద్రం నిర్మించారు. జంతువుల ట్రీట్మెంట్ కోసం అత్యాధునిక సౌకర్యాలు అందుబాటులోకి తీసుకొచ్చారు.. లేటెస్ట్ టెక్నాలజీతో ICU, MRI, CT స్కాన్, X-రే, అల్ట్రాసౌండ్, ఎండోస్కోపీ, డెంటల్ స్కాలార్, లిథోట్రిప్సీ, డయాలసిస్ సౌకర్యాలు ఏర్పాటు చేశారు. ఇక్కడ సర్జరీలకు లైవ్ వీడియో కాన్ఫరెన్సులు ఉన్నాయి. బ్లడ్ ప్లాస్మాను వేరు చేసే టెక్నాలజీ కూడా ఉంది. ఈ కేంద్రంలో 2 వేలకు పైగా ప్రాణులు, 43 జాతుల వాటిని కాపాడే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. అంతరించే జాతులకు సంబంధించిన 7 రకాల వన్యప్రాణులు కూడా ఇక్కడ ఉన్నాయి.. అలాగే విదేశాల్లో అంతరించే దశలో ఉన్న ప్రాణులనూ రక్షిస్తున్నారిక్కడ. రెస్క్యూలో భాగంగా ఇప్పటికే 2వందలకు పైగా ఏనుగులను సేవ్ చేసి.. వంతారలోని ఏనుగుల రక్షణ కేంద్రంలో వదిలేశారు. జూను చూసేందుకు 3వేల-4వేల మంది పనిచేస్తున్నారు. భారత్ తో సహా ప్రపంచంలోని పేరొందిన జంతుశాస్త్ర నిపుణులు.. వైద్య నిపుణులు కొందరు వంతార మిషన్ లో భాగమైయ్యారు. ప్రభుత్వ రంగ సంస్థలు.. ప్రభుత్వ పరిశోధనా సంస్థలు కూడా వంతార జూకు సహకరిస్తున్నాయి. -
ఆర్జీకర్ ఘటనలో తీర్పు.. కోర్టు హాలులో కన్నీటి రోదనలు
కోల్కతా ఆర్జీకర్ వైద్యురాలి హత్యాచార కేసులో తీర్పు వెలువడింది. నిందితుడు సంజయ్ రాయ్ను దోషిగా ప్రకటించింది సీల్దా కోర్టు. మొత్తం 160 పేజీలతో కూడిన తీర్పు కాపీని రూపొందించారు. అయితే జడ్జి తీర్పు చదువుతుండగా.. ఒకవైపు దోషి సంజయ్, మరోవైపు బాధితురాలి తండ్రి, బంధువుల కన్నీటి రోదనలతో కోర్టు హాలు మారుమోగింది.‘‘నేను ఈ పని చేయలేదు. ఈ కేసులో నన్ను ఇరికించారు. తప్పు చేసినవాళ్లను ఎందుకు స్వేచ్ఛగా వదిలేస్తున్నారు?. ఏ తప్పూ చేయని నన్ను ఎందుకు శిక్షిస్తున్నారు?’’ అంటూ గట్టిగా రోదించాడు. ఆ సమయంలో జడ్జి అనిర్బన్ దాస్ కలుగజేసుకుని చేసుకుని ‘‘నువ్వేమైనా మాట్లాడదల్చుకుంటే సోమవారం శిక్ష ఖరారు చేసే సమయంలో అవకాశం ఇస్తాం’’ అని వ్యాఖ్యానించారు. దీంతో సంజయ్ సైలెంట్ అయ్యాడు.మరోవైపు.. తీర్పు వెలువడుతున్న టైంలోనే బాధితురాలి తండ్రి భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టారు. ‘‘న్యాయాన్ని రక్షించి.. మీపై నాకున్న నమ్మకం నిలబెట్టుకున్నారు. మీరు మీ గౌరవాన్ని కాపాడుకున్నారు సర్’’ అంటూ న్యాయమూర్తిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. బాధితురాలి తరపున వచ్చినవాళ్లంతా చప్పట్లు కొట్టారు. దీంతో.. జడ్జి నిశబ్దం పాటించాలంటూ అంటూ గావెల్(సుత్తి)తో మందలించారు.తీర్పు వెలువడక ముందు సీల్దా(Sealdah) కోర్టు ప్రాంగణంలో గంభీరమైన వాతావరణం నెలకొంది. సంజయ్ను గట్టి భద్రతా మధ్య కోర్టుకు తీసుకొచ్చారు. లాయర్లంతా కోర్టు బయట ఉండి సంఘీభావం ప్రకటించారు. అయితే.. తీర్పు అనంతరం బాధితురాలి తరఫున పోరాడిన సంఘాలు, ఇతరులు లాయర్లతో కలిసి స్వీట్లు పంచడంతో సందడి కనిపిచింది.కోల్కతాలోని రాధా గోబిందా కర్(RG Kar) మెడికల్ కాలేజీ సెమినార్లో కిందటి ఏడాది ఆగష్టు 7వ తేదీన ఓ వైద్యవిద్యార్థిని(31) అర్ధనగ్నంగా విగతజీవిగా కనిపించింది. ఈ ఘోరం దేశాన్ని ఒక్కసారిగా కుదిపేసింది. వైద్య సిబ్బంది దేశవ్యాప్త నిరసనలకు దారి తీసింది. మూడు రోజుల తర్వాత(ఆగష్టు 10న) సంజయ్ రాయ్ అనే వ్యక్తిని కోల్కతా పోలీసులు అరెస్ట్ చేశారు. ఆసుపత్రి ఆవరణలోని సీసీటీవీలో నమోదైన దృశ్యాల ఆధారంగా సంజయ్ను అరెస్ట్ చేసినట్లు ప్రకటించారు. ఈలోపు ఘటనాస్థలంలోకి నిరసనకారులు దూసుకురావడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఇది సాక్ష్యాలను తారుమారు చేసే ప్రయత్నమేననే ఆరోపణలు వచ్చాయి. మరోవైపు.. ఇక ఈ కేసులో ఆర్జీకర్ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్, తాలా పోలీస్ స్టేషన్ మాజీ ఆఫీసర్ ఇన్ ఛార్జి అభిజిత్ మండల్ను అరెస్టు చేసింది. సాక్ష్యాలు తారుమారుచేశారన్న ఆరోపణలపై వారు అరెస్టు కాగా.. తర్వాత వారికి ప్రత్యేక న్యాయస్థానంలో బెయిల్ లభించింది. వారు అరెస్టయిన దగ్గరినుంచి 90 రోజుల్లో అనుబంధ ఛార్జ్షీట్ను ఫైల్ చేయకపోవడంతో ఈ బెయిల్ లభించింది.కేసు తీవ్రత దృష్ట్యా కలకత్తా హైకోర్టు సీబీఐకి కేసును బదిలీ చేసింది. బాధితురాలికి అండగా దేశం మొత్తం కదలడంతో.. నిర్భయ ఘటన స్ఫూర్తితో ఈ కేసును ‘అభయ’గా మీడియా అభివర్ణించడం మొదలుపెట్టింది. ఇక.. ఈ ఘటనలో రాయ్ ఒక్కడే లేడని, ఇంకొందరి ప్రమేయం ఉందని బాధిత కుటుంబం ఆరోపిస్తూ వస్తోంది. అయితే ఇటు కోల్కతా పోలీసులు, ఆపై సీబీఐ కూడా రాయ్ ఒక్కడే ఈ నేరానికి పాల్పడినట్లు నిర్ధారించాయి. సామూహిక అత్యాచారం విషయాన్ని అభియోగ పత్రంలో ప్రస్తావించలేదు. అయితే బాధిత కుటుంబ విజ్ఞప్తి మేరకు కోర్టు ఈ అంశాన్ని కూడా పరిశీలించింది. మరోవైపు.. అక్టోబర్ 7, 2024 సీల్దా కోర్టులో దాఖలైన ఛార్జ్ షీట్ ఆధారంగా సీల్దా అడిషనల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ కోర్టు విచారణ జరిపింది. నవంబర్ 12వ తేదీ నుంచి జనవరి 9వ తేదీ దాకా.. నిందితుడి ఇన్కెమెరా ట్రయల్ జరిగింది. ఆ టైంలో 50 మంది సాక్షులను విచారించారు. చివరకు.. ఆర్జీకర్ హత్యాచార కేసులో వలంటీర్గా పని చేసే సంజయ్ రాయ్ పాత్రను సీబీఐ నిర్ధారించగా.. సీల్దా కోర్టు ఇవాళ దోషిగా ప్రకటించింది. ప్రస్తుతం సంజయ్ కోల్కతా ప్రెసిడెన్సీ జైల్లో ఉన్నాడు. మొదటి నుంచి తాను అమాయకుడినేంటూ వాదిస్తున్నాడు. అంతేకాదు.. ఓ పోలీస్ ఉన్నతాధికారికి అన్నివిషయాలు తెలుసంటూ చెబుతున్నాడు. అయితే కోర్టు మాత్రం అతని వాదనను పట్టించుకోలేదు. బీఎన్ఎస్ సెక్షన్ 64, 66, 103(1) కింద అత్యాచారం, హత్య నేరాల కింద సంజయ్ రాయ్ను దోషిగా ప్రకటించింది కోర్టు. దీంతో సంజయ్కు మరణశిక్షగానీ, జీవితఖైదుగానీ పడే అవకాశాలే ఉన్నాయని జడ్జి వెల్లడించారు. -
మొక్కు తీర్చుకుని వస్తూ మృత్యుఒడికి..
మొక్కు తీర్చుకోవడానికి షిర్డీ వెళ్లిన ఓ కుటుంబం ప్రయాణిస్తున్న వాహనాన్ని ట్రాక్టర్ ఢీకొనడంతో నలుగురు దుర్మరణం చెందారు. అలాగే సంక్రాంతి పండుగకు సొంతూరు వెళ్లి తిరిగివస్తున్న వారి కారు అదుపుతప్పి లారీ కింద ఇరుక్కోవడంతో ఇద్దరు మృతిచెందారు. మృతిచెందిన వారిలో ఇద్దరు చిన్నారులు ఉన్నారు. మహారాష్ట్రలోని గంగాపూర్ వద్ద ఓ ఘటన చోటుచేసుకోగా, భువనగిరి జిల్లా కేంద్రం సమీపంలో మరో ఘటన చోటుచేసుకుంది. వివరాలు.. భువనగిరి: యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మున్సిపాలిటీ పరిధిలోని కొండగడప గ్రామానికి చెందిన శ్యాంశెట్టి కృష్ణమూర్తి, ప్రేమలత దంపతులు తమ కొడుకు, కోడలుతో సరూర్నగర్ గ్రీన్ పార్కు ఏరియాలో నివాసం ఉంటూ కిరాణా దుకాణం నిర్వహిస్తున్నారు. వీరికి మనవడు పుట్టిన సందర్భంగా మొక్కుతీర్చుకోవడానికి షిర్డీకి వెళ్లాలని అనుకున్నారు. భోగి పండుగ రోజు పెద్ద కూతురు ప్రసన్నలక్ష్మి, చిన్న కూతురు బజ్జూరి స్రవంతి కుటుంబాలతో కలిసి హైదరాబాద్ నుంచి ప్రైవేట్ బస్సులో వెళ్లి షిర్డీ సాయిబాబా దర్శనం చేసుకున్నారు. ఆ తర్వాత స్థానికంగా తుఫాన్ వాహనం కిరాయికి తీసుకొని ఔరంగాబాద్లోని మినీ తాజ్మహల్ను సందర్శించారు. ఔరంగాబాద్ – షిర్డీ మధ్యలో గంగాపూర్ వద్ద బుధవారం రాత్రి వీరు ప్రయాణిస్తున్న తుఫాన్ వాహనాన్ని ట్రాక్టర్ ఢీకొట్టడంతో శ్యాంశెట్టి ప్రేమలత (57) ఆమె కుమారుడి కొడుకు వైది్వక్ (6 నెలల బాలుడు), పెద్ద కూతురు తొల్పునూరి ప్రసన్నలక్ష్మి (42)తో పాటు ప్రసన్నలక్ష్మి పెద్ద కూతురు తొల్పునూరి అక్షిత (21) మృతిచెందారు. ప్రేమలత పెద్ద అల్లుడు శ్రీనివాస్, ప్రసన్నలక్ష్మి రెండో కూతురు శరణ్యతో పాటు ప్రేమలత భర్త కృష్ణమూర్తి, కుమారుడు వెంకన్నకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారు ఔరంగాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరి పరిస్థితి విషమంగా ఉంది. ప్రేమలత చిన్న కూతురు బజ్జూరి స్రవంతి, అల్లుడు రాంబాబుతో పాటు వీరి కుమారుడు, కుమార్తె ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. మృతదేహాలను పోస్టుమార్టం అనంతరం ఔరంగాబాద్ నుంచి స్వగ్రామానికి తరలించారు. సంక్రాంతి పండుగకు వచ్చి వెళ్తూ... మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం వెంకట్రాంతండాకు చెందిన గుగులోతు రవి, భూక్య సంతోష్ బావాబావమరుదులు. రవికి భార్య భవాని, కుమార్తె మోక్ష ఉండగా.. సంతోష్ కు భార్య అనూష (26), ఇద్దరు కుమార్తెలు ప్రణశ్వని, చైత్ర (6) ఉన్నారు. రవి, సంతోష్లు కుటుంబాలతో కొంతకాలంగా హైదరాబాద్లోని రామంతాపూర్లో ఉంటున్నారు. రవి, సంతోష్లు తమ భార్యాపిల్లలతో కలిసి సంక్రాంతి పండుగ జరుపుకునేందుకు కారులో స్వగ్రామం వెంకట్రాంతండాకు వెళ్లారు. బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత తిరిగి హైదరాబాద్కు బయల్దేరారు. సంతోష్ కారు నడుపుతుండగా.. అతడి భార్య అనూషతో పాటు చిన్న కుమార్తె చైత్ర అతడి పక్కన కారు ముందు భాగంలో కూర్చున్నారు. మిగతావారు వెనక కూర్చున్నారు. గురువారం తెల్లవారుజామున 6.30 గంటల సమయంలో భువనగిరి జిల్లా కేంద్రానికి సమీపంలోని రాయగిరి వద్దకు రాగానే వరంగల్–హైదరాబాద్ హైవే బైపాస్ రోడ్డుపై ముందు వెళ్తున్న లారీ డ్రైవర్ నిర్లక్ష్యంగా ఇండికేటర్ వేయకుండా పక్కనే ఉన్న పెట్రోల్ బంక్లోకి ఒక్కసారిగా టర్న్ తీసుకున్నాడు. వెనకాలే వస్తున్న వీరి కారు అదుపుతప్పి లారీని ఢీకొట్టింది. కారు లారీ కిందిభాగంలో ఇరుక్కుపోవడంతో నుజ్జునుజ్జు అయ్యింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కారును జేసీబీ సహాయంతో బయటకు తీయగా.. అప్పటికే అనూష, చైత్ర మృతిచెందారు. తీవ్రంగా గాయపడిన మిగతా ఐదుగురిని భువనగిరి జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. భూక్య సంతోష్ సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ చంద్రబాబు, ఎస్హెచ్ఓ సంతోష్ కుమార్ తెలిపారు. కాగా, ఈ ప్రమాదంలో గాయపడిన రవి భార్య భవాని 8 నెలల గర్భంతో ఉంది. ఆస్పత్రికి తరలించిన అనంతరం వైద్యులు ఆమెకు పరీక్షలు నిర్వహించారు. కడుపులో ఉన్న శిశువుకు ఎలాంటి ప్రమాదం లేదని తేల్చారు. -
మంచు ఫ్యామిలీ వివాదం లేటెస్ట్ న్యూస్
-
సంభాల్ అల్లర్ల వెనుక పాక్ ప్రమేయం?!
లక్నో: ఉత్తరప్రదేశ్లోని సంభల్ అల్లర్ల అంశం యావత్ దేశంలో చర్చనీయాంశంగా మారాయి. అయితే.. ఈ దాడులకు సంబంధించి షాకింగ్కు గురి చేసే విషయం ఒకటి ఫోరెన్సిక్ దర్యాప్తులో వెలుగు చూసింది. హింసకు ఉపయోగించిన ఆయుధాలపై మేడ్ ఇన్ పాక్ గుర్తులు బయటపడడంతో.. వీటి వెనుక పాకిస్థాన్ ప్రమేయం ఉందా? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. ఈ హింసాకాండలో పాకిస్తాన్కు చెందిన క్యాట్రిడ్జ్లు గుర్తించింది దర్యాప్తు బృందం(సిట్). నవంబర్ 24వ తేదీన కోట్ గర్వీ అల్లర్లు జరిగిన చోట.. ఐదు ఖాళీ షెల్స్, రెండు క్యాట్రిడ్జ్లను(మిస్ ఫైర్ అయినవే) ఫోరెన్సిక్స్ టీం సేకరించింది. అవి పాకిస్తాన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ నుంచి తయారైనవేనని నిర్ధారణ అయ్యిందని ఏఎస్పీ శ్రీష్ చంద్ర తెలిపారు. మరోవైపు.. పాక్కు చెందిన ఆయుధాల జాడ కనిపించడం ఈ కేసు తీవ్రతను తెలియజేస్తోందని సంభల్ ఎస్పీ కృష్ణ కుమార్ బిష్ణోయ్ అంటున్నారు. అదే టైంలో.. ఈ హింసాకాండలో భాగమైన వాళ్ల కోసం గాలింపు ఉధృతం చేశామని వెల్లడించారాయన.ఘటనా స్థలంలో.. సుమారు 90 నిమిషాల పాటు ఫోరెన్సిక్ తనిఖీలు కొనసాగాయి. పాక్తో పాటు అమెరికాకు చెందిన క్యాట్రిడ్జ్లు లభ్యమయ్యాయి. అలాగే అల్లర్లకు ఉపయోగించిన మందు సామగ్రి పాకిస్తాన్లో తయారైనట్లు తేలింది. దీంతో పాటు పోలీసులు స్వాధీనం చేసుకున్న వాటిలో రెండు 12 బోర్ షెల్స్, రెండు 32 బోర్ షెల్స్ ఉన్నాయి. మరింత పరిశీలనకు.. మున్సిపల్ శాఖకు ఆ ప్రాంతంలో శుభ్రం చేయొద్దని సిట్ ఆదేశాలు జారీ చేసింది. దర్యాప్తు ముమ్మరం ద్వారానే పాక్ ప్రమేయంపై ఒక స్పష్టత వస్తుందని అధికారులు అంటున్నారు. పొలిటికల్ హీట్ఘర్షణల దృష్ట్యా యూపీ సర్కార్ డిసెంబర్ 10వ తేదీ వరకు సంభాల్లో నిషేదాజ్ఞలు అమలు చేస్తోంది. అయితే ఇవాళ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ప్రియాకం గాంధీలు సంభాల్ పర్యటనకు వెళ్తుండగా.. ఘాజీపూర్ దగ్గర కాన్వాయ్ను పోలీసులు అడ్డుకున్నారు. ఇది రాజ్యాంగ ఉల్లంఘనే అని ఇద్దరూ యూపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. అయితే.. అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో.. వారు ఢిల్లీ వెళ్లకుండానే తిరిగి ప్రయాణమయ్యారు.ఏం జరిగిందంటే..ఉత్తరప్రదేశ్లోని సంభాల్ ప్రాంతంలో నవంబర్ చివరివారంలో హింసాకాండ చోటుచేసుకుంది. సంభాల్లోని షాహీ జామా మసీదు ఉన్న ప్రాంతంలోనే ఆలయం ఉందని గతంలో హిందూ పిటిషనర్లు ట్రయల్ కోర్టును ఆశ్రయించారు. ఈ విషయంపై కోర్టు విచారించి సర్వే చేయాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే సర్వే చేస్తున్న సమయంలో కొంతమంది అడ్డుకోవడంతో పాటు పోలీసులపై రాళ్ల దాడి చేశారు. దీంతో ఆ ప్రాంతంలో అల్లర్లు చెలరేగాయి. ఈ అల్లర్ల కేసుకు సంబంధించి.. 400 మందిని గుర్తించామని, ఇందులో 33 మందిని అరెస్ట్ చేశామని పోలీసులు ప్రకటించారు. -
‘మళ్లీ భూ ప్రకంపనలు’.. వాట్సాప్లో వాయిస్ మెసేజ్ చక్కర్లు
జయశంకర్, సాక్షి: ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో ఏ నలుగురు కలిసినా.. ఆఖరికి ఫోన్లలో మాట్లాడిన ఈ ఉదయంపూట సంభవించిన భూ ప్రకంపనల గురించే చర్చించుకుంటున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంతో పాటు కాటారం రెవెన్యూ డివిజన్ లోని కాటారం , మల్హార్ రావు, మహముత్తారం, మహదేవపూర్, పలిమెల మండలాల్లో నాలుగు సెకండ్ల పాటు కంపించిన భూమి.. ప్రజలను తీవ్ర భయాందోళనకు గురి చేసింది. అయితే..ఇది చర్చ వరకే పరిమితం కాలేదు. ‘‘మళ్లీ భూకంపం వస్తోందంటూ..’’ సోషల్ మీడియాలో ఓ వాయిస్ మెసేజ్.. వాట్సాప్ గ్రూపులలో చక్కర్లు కొడుతోంది. దీంతో జనం హడలిపోతున్నారు. ఇళ్లలోకి వెళ్లకుండా రోడ్లపై కూర్చుని.. భూకంపం గురించే చర్చించుకుంటున్నారు. అయితే ఈ ప్రచారాన్ని ఖండించిన పోలీసులు.. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రజలకు భరోసా కల్పిస్తున్నారు. అలాగే తప్పుడు ప్రచారాలు చేసేవాళ్లపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరిస్తున్నారు.ఇదిలా ఉంటే.. జిల్లా వ్యాప్తంగా ఉదయం భూమి స్వల్పంగా కంపించడంతో ప్రజలు వణికిపోయారు. భూపాలపల్లి జిల్లా కేంద్రంతో పాటు చిట్యాల మండలం కైలాపూర్ గ్రామంలో భూకంప తీవ్రత దృశ్యాలు సీసీ కెమెరాలు రికార్డు అయ్యాయి. అలాగే.. రంగాపురం గ్రామంలోని ఓ ఇంటి పెంకులు ఊడిపడిపోవడంతో.. ఆ ఊరి ప్రజలు ఆ ఇంటి వద్ద గుమిగూడారు. తమ ప్రాంతాల్లో ఏళ్ల తరబడి ఇలాంటి ఘటనలు చూడలేదని కొందరు వృద్ధులు చెబుతున్నారు. అయితే ఈ ప్రాంతం సేఫ్ జోన్గానే ఉందని, స్వల్ప ప్రకంపనలకు భయపడనక్కర్లేదని, భారీ భూకంపాలు అసలు తెలుగు రాష్ట్రాల్లో వచ్చే ఛాన్సే లేదని శాస్త్రవేత్తలు అంటున్నారు.అయితే.. గోదావరి పరివాహక ప్రాంతాల్లో భారీ భూకంపాల సంభవించే అవకాశాలపై.. అలాగే వీక్ జోన్ల పరిశీలనపై తమ అధ్యయనం కొనసాగుతోందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.20 ఏళ్ల తర్వాత తెలుగు గడ్డపై భూకంపం!.. చిత్రాల కోసం క్లిక్ చేయండి -
‘పుష్ప-2 బెనిఫిట్ షో కలెక్షన్లు ఏం చేస్తారు?’
హైదరాబాద్, సాక్షి: అల్లు అర్జున్-సుకుమార్ ‘పుష్ప-2’ చిత్ర విడుదలకు తెలంగాణ హైకోర్టు క్లియరెన్స్ ఇచ్చింది. సినిమా టికెట్ ధరల పెంపు వివాదంపై దాఖలైన పిటిషన్ను మంగళవారం విచారణ జరిపిన హైకోర్టు.. ఈ మేరకు విడుదల చేసుకునేందుకు మైత్రీ మూవీ మేకర్స్కు అనుమతి ఇచ్చింది. అదే టైంలో బెనిఫిట్ ద్వారా వచ్చే వసూళ్ల వివరాలను తమకు తదుపరి విచారణలో అందజేయాలని ప్రొడక్షన్ హౌజ్ను ఆదేశించింది. పుష్ప 2 సినిమా టికెట్ ధరల పెంపు వివాదంపై హైకోర్టు విచారణ జరిగింది. బెనిఫిట్ షోపేరుతో రూ.800 వసూలు చేయడం అన్యాయమని, బెనిఫిట్ షో ద్వారా వచ్చే డబ్బును ఎక్కడికి మల్లిస్తున్నారో తెలియాల్సిన అవసరం ఉందని పిటిషనర్ సతీష్ కోరారు. అయితే..చివరి నిమిషంలో సినిమా విడుదలను అడ్డుకోలేమని చెబుతూ విడుదలకు హైకోర్టు క్లియరెన్స్చ్చింది. పూర్తి నివేదిక పరిశీలించి ఆదేశాలు ఇస్తామని పేర్కొంది. అలాగే.. టికెట్ ధరల పెంపు ప్రభుత్వ జీవోలను సైతం పరిశీలిస్తామన్న హైకోర్టు తెలిపింది. కౌంటర్ దాఖలు చేయడానికి నిర్మాత తరఫు న్యాయవాది సమయం కోరగా, తదుపరి విచారణను డిసెంబరు 17వ తేదీకి న్యాయమూర్తి వాయిదా వేశారు. దీంతో చిత్ర నిర్మాణ సంస్థ నిర్దేశించిన విధంగానే టికెట్ల ధరలు కొనసాగనున్నాయి. అలాగే.. బెనిఫిట్ షో వసూళ్ల పూర్తి వివరాలు రెండు వారాల్లో సమర్పించాలని మైత్రి మూవీస్ కు హైకోర్టు స్పష్టం చేసింది.ఇక.. రాత్రి 10గం. షోవేస్తే.. అది అయిపోయే సరికి 1గం. అవుతుందని, తద్వారా పిల్లలకు నిద్ర లేకుండా పోతుందని, వాళ్లకు నిద్ర ఎంతో అవసరమని హైకోర్టు అభిప్రాయపడింది. వాదనలు ఇలా.. మొదటి 15రోజులు సైతం అధిక డబ్బులు వసూలు చేస్తున్నారు: పిటిషనర్ తరఫు లాయర్భారీ బడ్జెట్తో సినిమా చిత్రీకరించడంతో టికెట్ ధరలు పెంచాల్సి వచ్చింది: మైత్రీమూవీ మేకర్స్ తరఫు లాయర్‘ప్రభుత్వమే టికెట్ రేట్లు పెంచడానికి అనుమతించి కదా’: హైకోర్టుటికెట్ రేట్ల పెంపు వల్ల అభిమానులపై భారం పడుతోంది. అర్ధరాత్రి 1 గంటకు, తెల్లవారుజామున నాలుగు గంటలకు షోలు పెట్టి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారు: పిటిషనర్ తరపు న్యాయవాదిపెంచిన రేట్ల ద్వారా వచ్చిన ఆదాయం ఛారిటీ, సీఎం, పీఎం సహాయ నిధి ఖాతాలో వెళ్లడం లేదు. కేవలం నిర్మాత మాత్రమే లబ్ది పొందుతున్నాడు: పిటిషనర్ తరపు న్యాయవాదిటికెట్ ధరలతో పోలిస్తే థియేటర్లలో పాప్కార్న్, మంచి నీళ్ల బాటిళ్లను అధిక ధరలకు విక్రయిస్తున్నారు కదా. బెనిఫిట్ షోకు ఒక వ్యక్తి 10మంది కుటుంబ సభ్యులతో కలిసి వెళ్తే రూ.8వేలు అవుతుంది కదా: హైకోర్టు న్యాయమూర్తిబెనిఫిట్ షో కేవలం హీరో అభిమానుల సంఘాలకు మాత్రమే. అందుకే రేట్లు పెంచారు: నిర్మాత తరపు న్యాయవాది పుష్ప ది రూల్ స్క్రీనింగ్కు తెలంగాణ సర్కార్ ఇచ్చిన అనుమతులుడిసెంబర్ 4న రాత్రి 9.30 గంటలకే పడనున్న బెనిఫిట్ షోరాత్రి 9.30 షోకు టికెట్ ధరను అదనంగా రూ.800 వర్తింపు. రాష్ట్రవ్యాప్తంగా సింగిల్ స్క్రీన్, మల్టీఫ్లెక్స్ ఏదైనా సరే ప్రస్తుతం ఉన్న టికెట్ ధరకు అదనంగా రూ.800 చెల్లించాల్సిందే.అర్ధరాత్రి 1 గంట నుంచి తెల్లవారుజామున 4 గంటల వరకు అదనపు షోలకు కూడా అనుమతిడిసెంబర్ 5 నుంచి 8 వరకు సింగిల్ స్క్రీన్లలో రూ.150, మల్టీఫ్లెక్స్లో రూ.200 పెంపు.డిసెంబర్ 9 నుంచి 16 వరకు సింగిల్ స్క్రీన్లో రూ.105, మల్టీఫ్లెక్స్లో రూ.150 పెంపు.డిసెంబర్ 17 నుంచి 23 వరకు సింగిల్ స్క్రీన్లో రూ.20, మల్టీఫ్లెక్స్లో రూ.50 పెంపునకు అనుమతి అల్లు అర్జున్-సుకుమార్ కాంబోలో రాబోతున్న పుష్ప 2 డిసెంబర్ 5వ తేదీన ప్రపంచవ్యాప్తంగా 12 వేల స్క్రీన్లలో గ్రాండ్గా విడుదల కానుంది. 2021 డిసెంబర్లో రిలీజ్ అయిన పుష్ప మొదటి భాగం సంచలనాలు సృష్టించగా.. ఇప్పుడు రెండో భాగం మీద భారీ అంచనాలే ఉన్నాయి. -
Telangana: ఇక ఫొటోలు తీసి తిన్నాకే.. పిల్లలకు వడ్డించాలి!
హైదరాబాద్, సాక్షి: తెలంగాణ ప్రభుత్వ విద్యాసంస్థల్లో ఫుడ్పాయిజన్ ఘటనలను తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం అప్రమత్తమైంది. పాఠశాలలు, గురుకులాలు, అంగన్వాడీలలో.. ఆహార నాణ్యత పర్యవేక్షణ కోసం ఫుడ్ సేఫ్టీ కమిటీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు సీఎస్ శాంతకుమారి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.సంక్షేమ హాస్టల్లో ఫుడ్ సేఫ్టీ పై ఫోర్స్ కమిటీ ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఈ త్రీమెన్ కమిటీలో ఫుడ్ సేఫ్టీ కమిషనర్, అడిషనల్ డైరెక్టర్, జిల్లాకు సంబంధించిన కలెక్టర్లు ఉండనున్నారు. ఈ కమిటీలు తమ పరిధిల్లోని గురుకులాలు, వెల్ఫేర్ మైనారిటీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ ను పరిశీలిస్తారు. అలాగే.. విద్యా సంస్థల స్థాయిలో ఆహార పదార్థాల నాణ్యతను పరిశీలించేందుకు ఫుడ్ సేఫ్టీ పేరిట కమిటీలను ఏర్పాటు చేశారు.ఈ కమిటీలో హెడ్మాస్టర్, స్కూల్ ప్రిన్సిపాల్స్తో పాటు మరో ఇద్దరు సిబ్బంది (టీచర్లు) సభ్యులుగా ఉంటారు. వీరు వంటకు ముందు స్టోర్ రూం, కిచెన్ పరిశీలించాల్సి ఉంటుంది. అలాగే. ఎప్పటికప్పుడు వండిన పదార్థాలను ఫొటోలు తీసి ఉన్నతాధికారులకు పంపించాలి. వండిన ఆ పదార్థాలను వాళ్లు రుచి చూశాకే.. పిల్లలకు వడ్డించాలి. ఇకనుంచి.. పాఠశాలల్లో ఫుడ్ ఏర్పాట్లు తదితర అంశాలపై సంబంధిత అధికారులు కచ్చితంగా సూపర్ వైజ్ చేయాల్సి ఉంటుందని ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. -
సూపర్ పవర్ ఉందంటూ..
సేలం: తనకు సూపర్ పవర్స్ ఉన్నాయంటూ ఓ కళాశాల విద్యార్థి నాలుగో అంతస్తుపై నుంచి అమాంతం కిందకు దూకి కాళ్లు, చేతులు విరగొట్టుకున్న ఘటన కోవైలో కలకలం రేపింది. కాగా, ఆ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. వివరాల్లోకి వెళితే.. కోవై జిల్లా మలుమిసంపట్టి సమీపంలో మైలేరిపాళయంలో ఓ ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాల ఉంది. ఇందులో ఈరోడ్ జిల్లా పెరుందురై సమీపంలో ఉన్న మేక్కూర్ గ్రామానికి చెందిన యువకుడు ప్రభు (19) హాస్టల్లో బస చేసి చదువుకుంటున్నాడు. ఈ క్రమంలో ప్రభు మంగళవారం సాయంత్రం అతను బస చేసి ఉన్న హాస్టల్లో నాలుగో అంతస్తుపై నుంచి అకస్మాత్తుగా కిందకు దూకాడు. దీంతో చేతులు, కాళ్లు విరిగి పోయి తీవ్రంగా గాయపడిన ప్రభును సహ విద్యార్థులు, హాస్టల్ నిర్వాహకులు రక్షించి సమీపంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చెట్టిపాళయం పోలీసులు జరిపిన విచారణలో బాధితుడు బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్న విద్యార్థి ప్రభు అని తెలిసింది. తనకు సూపర్ పవర్ ఉందనే భ్రమలో ఉన్న ప్రభు తాను ఎంత ఎత్తయిన భవనం పై నుంచైనా దూకగలడని, తనకు ఏమీ కాదనే నమ్మకాన్ని పలు మార్లు స్నేహితులకు చెప్పినట్లు తెలిసింది. గతంలో కూడా ఇదే విధంగా పక్క భవనం పైకి జంప్ చేసిన క్రమంలో కింద పడి గాయపడినట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఈమేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు. కాగా హాస్టల్ నాలుగో అంతస్తు పైనుంచి ప్రభు కిందకు దూకిన వీడియో సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతోంది.Shocking, a 19-year-old #BTech #student, believed he had #superpowers and jumped off the fourth floor of the students' hostel building in #Coimbatore , #TamilNadu The student from Mekkur village near Perundurai in Erode district suffered injuries. 28/10/24 pic.twitter.com/sGXqeMyRWF— Dilip kumar @DBN (@Dilipkumar_PTI) October 30, 2024 -
కుళ్ళిపోతున్న ఉల్లి.. రైతుల ఆవేదన
-
కాంగ్రెస్ ప్రభుత్వంపై గవర్నర్ కు కంప్లైంట్ చేసిన ఈటల రాజేందర్
-
డ్రైనేజీతో డేంజర్ వర్షం పడితే నరకమే..
-
మౌలాలీలో కేటీఆర్ కు నిరసన సెగ
-
ఏపీలో దారుణం .. అర్ధరాత్రి అత్తా కోడలిపై లైంగిక దాడి
-
ఎవరికో పుట్టిన బిడ్డకు పేర్లు పెట్టుకోవడం చంద్రబాబుకు అలవాటు
-
వైభవంగా శ్రీవారి చక్రస్నానం .. కోనేటిలో భక్తుల స్నానాలు
-
కేసీఆర్ కేజీ టు పీజీ కథ చెప్పి చేసిన మోసం
-
Tiruvallur: సహాయక చర్యలు ముమ్మరం
-
KSR : ఈరోజు ముఖ్యాంశాలు
-
వైజాగ్ హనీ ట్రాప్ కేసులో బయటపడ్డ జాయ్ జెమిమా వీడియో
-
కేసీఆర్పై కారాలు మిర్యాలు నూరిన కోమటి రెడ్డి
-
జ్యువెలరీ షోరూంలో రూ.6 కోట్లు నగలు చోరీ
-
దూసుకొస్తున్న తుఫాన్.. ఏపీకి మరో గండం!
-
ఇంద్రకీలాద్రిపై అపచారం .. షూతో పోలీసుల డ్యూటీ
-
ఈవీఎంలపై చంద్రబాబు మాటల గారడీ.. సాక్ష్యాలు చూపిన మేరుగు నాగార్జున
-
ఆంధ్రాకు వెళ్లాల్సిందే.. ఐఏఎస్, ఐపీఎస్లకు DOPT బిగ్ షాక్
-
విజయవాడలో కలకలం.. గంజాయి బ్యాచ్ దాడిలో లోకో పైలట్ మృతి
-
సొంత రాష్ట్రాలకు వెళ్లిపోండి.. ఐఏఎస్, ఐపీఎస్ లకు కేంద్రం షాక్
-
రతన్ టాటా సక్సెస్ స్టోరీ
-
LIVE: కాసేపట్లో రతన్ టాటా అంతిమయాత్ర
-
కేటీఆర్ పరువు నష్టం దావాపై విచారణ ప్రారంభం
-
నువ్వు లేవంటున్నారు..కష్టంగా ఉంది.. రతన్ టాటా మాజీ ప్రేయసి భావోద్వేగం
-
భవిష్యత్ తరాలకు రతన్ టాటా రతనాల మాటలు
-
టాటా అంటే పేరు కాదు.. బ్రాండ్.. రతన్ టాటాకు ప్రముఖుల నివాళి
-
తిరుపతిలో వాలంటీర ఆందోళన చంద్రబాబు సీరియస్ వార్నింగ్
-
ప్రజల సందర్శనార్థం ఎన్సీపీఏ గ్రౌండ్లో రతన్ టాటా పార్థివ దేహం
-
ముంబై NCPAకి రతన్ టాటా పార్థివ దేహం
-
YSRCP హయాంలో వచ్చిన TCS.. మేమే తెచ్చామంటూ టీడీపీ అబద్దాలు
-
రతన్ టాటా మృతిపట్ల వైఎస్ జగన్ నివాళి
-
విలువలతో కూడిన వ్యాపారావేత్త 10 వేల కోట్ల నుంచి లక్షల కోట్లకు
-
ఎందరికో స్ఫూర్తిదాత రతన్ టాటా మృతిపట్ల ప్రముఖుల సంతాపం
-
దాతృత్వ శిఖరం కన్నుమూత
-
భౌతిక శాస్త్రంలో ఇద్దరికి నోబెల్ బహుమతి
-
ఇదే మీకు మాకు తేడా.. ప్రభుత్వానికి జగన్ హెచ్చరిక
-
పాలన గాలికి ఎగిరిపోయింది..
-
దేవుడిని అడ్డు పెట్టుకుని.
-
అవసరం తీరాక వెన్నుపోటు ..
-
Actor Govinda: ఆసుపత్రిలో నటుడు గోవింద..
-
TS DSC Results 2024: తెలంగాణ DSC ఫలితాలు విడుదల
-
దేవుడిపై అబద్దాలా..నువ్వేం సీఎం..! చంద్రబాబుపై సుప్రీంకోర్టు ఆగ్రహం
-
హైకోర్టును కూడా కూల్చేస్తారా..? కోర్టు ప్రశ్నలకు హైడ్రా షాక్..!
-
సింగల్ గా వస్తావా..! మహిళలకు కొలికపూడి మెసేజ్ లు
-
నేను తిరుమలకు వెళ్తే అరెస్ట్ చేస్తారంట
-
జియో-బీపీ 500వ ఈవీ చార్జింగ్ స్టేషన్ ప్రారంభం
-
LIVE: తిరుమల పర్యటన పై జగన్ కీలక ప్రెస్ మీట్
-
తెలంగాణ సీఎం సహాయ నిధికి రిలయన్స్ భారీ విరాళం
-
పేదల ఇండ్లపై బుల్డోజర్ యాక్షన్
-
పొంగులేటి ఇంట్లో ఈడీ సోదాలు
-
మతం ముసుగులో రాజకీయం
-
హర్ష సాయి కేసులో బిగ్ ట్విస్ట్..
-
అమ్మమ్మ గారి ఊరికి కేటీఆర్ వరాలు..
-
డీజే, బాణాసంచా సౌండ్స్ పై కీలక నిర్ణయం
-
రాజమండ్రి నుంచి మకాం మార్చిన చిరుత
-
కేటీఆర్ సంచలన కామెంట్స్..
-
గవర్నర్ తో సీతక్క భేటీ
-
ఏం చేశారని 100 రోజుల సంబరాలు.. బాబు పై వాలంటీర్లు ఫైర్
-
చంపడానికి వచ్చారు.. ధర్మవరంలో రెచ్చిపోయిన కూటమి నేతలు.. కేతిరెడ్డి ఫైర్
-
నేడు శేరిలింగంపల్లి బీఆర్ఎస్ నేతలతో కేటీఆర్ సమావేశం
-
యాజమాన్యానికి షాకిచ్చిన విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు
-
స్టీల్ ప్లాంట్ను అమ్మేస్తున్న A1, A 2, A 3
-
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం..
-
కేసీఆర్ కుటుంబాన్ని కాపాడుతున్న కాంగ్రెస్
-
చీఫ్ కు పార్టీ నేతల ఫిర్యాదు..
-
తమ్ముడి భూమినే కొట్టేసిన విశాఖ జనసేన నేత
-
అతిశి అనే నేను..! ఢిల్లీ కొత్త సీఎం ప్రమాణస్వీకారం
-
జగన్ అంటే ఎందుకంత భయం చంద్రం .. ఆ రిపోర్ట్ను ఎందుకు దాచిపెట్టావు..?
-
ప్రైవేటీకరణ వైపు స్టీల్ ప్లాంట్ నిజాలు బయటపెట్టిన CMD
-
అడుసుమిల్లి కుటుంబసభ్యులకు జగన్ పరామర్శ
-
100 రోజుల్లో పార్టీ మటాష్.. బై బై బాబు..బై బై బాబు
-
వైఎస్సార్సీపీ నేతలతో జగన్ కీలక సమావేశం
-
నేరం అంగీకరించిన జానీ మాస్టర్
-
హైకోర్టు ముందు వైఎస్ఆర్సీపీ ప్రస్తావన
-
రెండు తెలుగు రాష్ట్రాల వరద బాధితుల కోసం లడ్డూ వేలం విరాళాలు
-
ఈ టైంలో చంద్రబాబు కనిపిస్తే.. రెచ్చిపోయిన కేఏ పాల్
-
జానీ మాస్టర్ భార్య ఓవరాక్షన్ మీడియా ప్రతినిధులపై చిందులు
-
MSME-2024 పాలసీ ఆవిష్కరణ
-
లడఖ్ పారిపోయిన జానీ మాస్టర్ పోక్సో కేసు నమోదు
-
టీడీపీ రాక్షసానందం
-
జమిలి ఎన్నికలకు కేంద్రం ఓకే.. త్వరలో దేశం మొత్తం ఎన్నికలు..
-
జయభేరి సంస్థ మమ్మల్ని మోసం చేసింది
-
అసెంబ్లీ ఎన్నికలో ఉత్సాహంగా ఓటేస్తున్న కశ్మీరీలు
-
సెంటిమెంట్ కుదరదు.
-
కొత్త కొత్త కథలు..
-
డల్లాస్ లో రాహుల్ గాంధీకి ఘన స్వాగతం
-
జనసేన నేత వ్యాఖ్యలను ఖండించిన స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాలు
-
బాలాపూర్ లడ్డు వేలం పాట ఫుల్ వీడియో
-
మంత్రి నారాయణ సంచలన వ్యాఖ్యలు
-
50 వేల కుటుంబాలకు YSRCP నిత్యావసర సరకులు పంపిణీ..
-
జనసేన నేత అత్యాచారం..
-
టోక్యోలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు
-
పుంగనూరు నియోజకవర్గం నాకు తల్లితో సమానం
-
హైడ్రా కూల్చివేతలు.. RERA చట్టం ఏం చెబుతోంది..?
-
గణేష్ శోభాయాత్ర.. భక్తులకు ఆమ్రపాలి విజ్ఞప్తి
-
వినాయక నిమజ్జనాలకు కర్నూల్ ముస్తాబు
-
మమతా బెనర్జీ చివరి ప్రయత్నం
-
నా కడుపు కాలిపోతోంది బాబు.. లోకేష్ వద్దే తేల్చుకుంటా?
-
ఇసుక ఖతం.. దోచేస్తున్న పచ్చ నేతలు
-
J&k: జమ్ముకశ్మీర్ లో ప్రధాని మోదీ పర్యటన
-
ముంబైలో లగ్జరీ అపార్ట్మెంట్ను కొన్న ఎబ్కో డైరెక్టర్
-
సీతారాం ఏచూరి నివాసానికి పార్థివ దేహం
-
ఏచూరి పార్థివదేహంను ప్రజా సేవకు అంకితం
-
ఎలాన్ మస్క్పై సొంత కూతురే..
-
అనకాపల్లి జిల్లాలో విద్యార్థుల ఆందోళన
-
జగన్ మీకు త్వరలో చుక్కలు చూపించడం ఖాయం చంద్రబాబుకు జూపూడి హెచ్చరిక
-
మా ఓపికను పరీక్షించొద్దు..
-
సీతారాం ఏచూరి కన్నుమూత
-
మంత్రి సంధ్యారాణి కాన్వాయ్ కి ప్రమాదం
-
జనప్రియ వారి సరికొత్త ప్రాజెక్ట్స్ ఇవే...
-
అదిరే ఫీచర్లతో యాపిల్16
-
మీకూ ఇదే గతి.. జగన్ వార్నింగ్
-
చంద్రబాబును ఇమిటేట్ చేసిన జగన్ మాస్ ర్యాగింగ్.. వేరే లెవెల్...
-
రెడ్ బుక్ రాయడం మాకూ వచ్చు: YS Jagan
-
మళ్లీ మండుతున్న మణిపూర్
-
సెంట్రల్ జైలు గేటు వద్ద రౌడీషీటర్ హల్చల్
-
మచిలీపట్నంలో జనసేన నేతతో కాళ్లు పట్టించిన టీడీపీ నేతలు
-
పీఏసీ పదవిపై కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య రాజకీయ రగడ
-
బోట్ల పేరుతో బాబు క్షుద్ర రాజకీయం..
-
అంతర్జాతీయ వేదికపై వైఎస్ జగన్ పాలనపై ప్రశంసలు
-
మంకీ పాక్స్ లక్షణాలు ఎలా ఉంటాయంటే
-
ఆక్వా ఎగుమతుల్లో మీసం మెలేస్తున్న భారత్
-
UPI మోసాలకు పాల్పడుతున్న ముఠా అరెస్ట్
-
బాబు బోట్ల ఎపిసోడైపై కృష్ణంరాజు కీలక వ్యాఖ్యలు..
-
హేట్ టు లవ్.. నాలుక మడతేసిన ట్రంప్
-
బడిలో మంటలు.. చిన్నారుల సజీవదహనం
తూర్పు ఆఫ్రికా దేశం కెన్యాలో ఘోరం చోటు చేసుకుంది. ఓ ప్రైమరీ స్కూల్లో మంటలు చెలరేగి చిన్నారులు సజీవ దహనం అయ్యారు. మరణించవాళ్లంతా 5 నుంచి 12 ఏళ్లలోపువాళ్లే కావడం గమనార్హం. ప్రమాద తీవ్రతను మృతుల సంఖ్య మరింతగా పెరగొచ్చని అధికారులు చెబుతున్నారు.కెన్యాలో తూర్పు ఆఫ్రికా వెంట పాఠశాలల్లో గత కొంతకాలంగా అగ్నిప్రమాదాలు సర్వసాధారణంగా మారాయి. తాజాగా రాజధాని నైరోబీకి 170కిలోమీటర్ల దూరంలో.. మధ్య కెన్యా నైయేరీ కౌంటీలో ఘోరం చోటు చేసుకుంది.హిల్సైడ్ ఎండారషా ప్రైమరీ పాఠశాల వసతి గృహంలో గత అర్ధరాత్రి మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో పలువురు చిన్నారులు నిద్రలోనే సజీవ దహనం అయ్యారు.తీవ్రంగా గాయపడిన వాళ్లలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. దీంతో మృతుల సంఖ్య పెరిగేలా కనిపిస్తోంది. ప్రమాదం ఎలా జరిగిందనేదానిపై అధికారులు ఇంకా ఓ అంచనాకి రాలేదు. #BREAKINGTragic news from Kenya as at least 17 children have lost their lives in a devastating fire at Hillside Endarasha Academy in Kieni, Nyeri.Bodies were burned beyond recognition.#Kenya #SchoolFire #HillsideEndarasha #Tragedy #BreakingNewspic.twitter.com/sDskxUYBxQ— Mr. Shaz (@Wh_So_Serious) September 6, 2024 మృతదేహాలు గుర్తుపట్టలేనంతంగా కాలిపోయాయని సహాయక బృందాలు చెబుతున్నాయి. ఘటనపై అధ్యక్షుడు విలియమ్ రుటో తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ స్కూల్లో సుమారు 800 చిన్నారులు వసతి పొందుతున్నారని అధికారులు తెలిపారు. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటిదాకా 17 మృతదేహాలను వెలికి తీశారు. శిథిలాల తొలగింపు తర్వాత మరిన్ని మృతుల సంఖ్యపై స్పష్టత రావొచ్చని అధికారులు అంటున్నారు. గతంలో.. 2016లో నైరోబీలోని ఓ బాలికల పాఠశాలలో అగ్నిప్రమాదం జరిగి 9 మంది మరణించారు. 1994లో టాంజానియాలోని కిలిమంజారో రీజియన్లో ఓ స్కూల్లో మంటలు చెలరేగి 40 మంది విద్యార్థులు సజీవ దహనమయ్యారు. -
మంచి గురువును ఎంచుకోవడం ఎలా?
-
జగన్ను చూసి చిన్నారి భావోద్వేగం.. కన్నీళ్లు తుడిచిన జననేత
-
వరద బాధితులకు ధైర్యం చెప్పిన వైఎస్ జగన్
-
నా హయాంలో ఇదే చేశా.
-
AP Capital: రాజధాని అమరావతి.. బాబు గుండెల్లో గుబులు
-
మూసీ నదికి పోటెత్తిన వరద.
-
మల్టీస్టారర్ కు మొగ్గు చూపుతున్న బడా హీరోలు
-
చేతకాని ప్రభుత్వం 4పులిహోర ప్యాకెట్లు..400 ఫోటోలు
-
పవన్ కళ్యాణ్ మొహం చూసి ఓట్లు వేశాం ఇప్పుడు సిగ్గుపడుతున్నాం
-
వరదలో మునిగిన RTC డిపో 1 పూర్తిగా పాడైపోయిన 70 బస్సులు
-
ఇప్పుడే తేలిన లంక గ్రామాలు పరిస్థితి దయనీయం
-
పువ్వాడపై రాళ్ల దాడి..
-
తెలంగాణ వరదలు, ప్రాణ, ఆస్తి నష్టానికి నిధులు ఇవ్వాలని మోదీ గారికి లేఖ రాశాము