lord shiva temples
-
కాశీ విశ్వనాథ ఆలయాన్ని సందర్శించవలసిన ప్రదేశాలు..!
-
భక్తులతో కిటకిటలాడుతున్న బంజారా హిల్స్ శివాలయం
-
తెలుగు రాష్ట్రాల్లో కార్తీక శోభ
-
పాపికొండలు.. పర్యటనకు వెళ్తారా?
సాక్షి, హైదరాబాద్: పర్యాటక సందడి తిరిగి మొదలైంది. కోవిడ్ కారణంగా చాలా కాలంగా ఇళ్లకే పరిమితమైన నగరవాసులు కాలక్షేపం కోసం పర్యటనలకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ఈ క్రమంలో తెలంగాణ పర్యాటకాభివృద్ధి సంస్థ పర్యాటకుల అభిరుచికి అనుగుణమైన ప్యాకేజీలను రూపొందించింది. నగరంలోని చారిత్రక, పర్యాటక ప్రాంతాలను సందర్శించేందుకు ఏసీ, నాన్ ఏసీ బస్సుల్లో హైదరాబాద్ను సందర్శించే సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. ప్రకృతి ఒడిలో.. పాపికొండల యాత్ర: ఇది ప్రతి శుక్రవారం ఉంటుంది. రాత్రి 8.30 గంటలకు బయలుదేరుతారు. శనివారం ఉదయం భద్రాద్రికి చేరుకుంటారు. శ్రీరాముడి దర్శనం అనంతరం పర్ణశాలకు వెళ్తారు. ఆ తర్వాత మధ్యాహ్నం పాపికొండలకు వెళ్తారు. రాత్రికి కొల్లూరులోని బ్యాంబూ హట్స్లో బస ఉంటుంది. మరుసటి రోజు బయలుదేరి తిరిగి నగరానికి చేరుకుంటారు. పెద్దవారికి చార్జీ రూ.4,594 ఉంటుంది. పిల్లలకు ఇందులో 80 శాతం వరకు చార్జీ ఉంటుంది. ఆధ్యాత్మికం.. రమణీయం.. అనంతగిరిహిల్స్: వికారాబాద్ సమీపంలోని అద్భుతమైన పర్యాటక ప్రాంతం అనంతగిరి విహారం కోసం నగరం నుంచి ఉదయం 9 గంటలకు బయల్దేరి రాత్రి 8 గంటలకు తిరిగి చేరుకుంటారు. అనంతగిరి కొండల్లో రమణీయమైన ప్రకృతిని ఆస్వాదించడంతో పాటు, పద్మనాభస్వామి ఆలయాన్ని సందర్శించవచ్చు. ఈ టూర్ కోసం పెద్దవారికి రూ.900, పిల్లలకు రూ.720 చొప్పున చార్జీ ఉంటుంది. సిటీ టూరు.. బోటు షికారు.. సిటీ టూర్లో భాగంగా బిర్లా టెంపుల్, నిజామ్ మ్యూజియం, చౌమొహల్లా ప్యాలెస్, చార్మినార్ (బయట నుంచి మాత్రమే), జూపార్కు, తారామతి బారాదరి, గోల్కొండ తదితర పర్యాటక ప్రాంతాలను సందర్శించవచ్చు.ఈ పర్యటన కోసం ఏసీ వాహనాల్లో రూ.350, నాన్ ఏసీ వాహనాల్లో రూ.250 వరకు చార్జీ ఉంటుంది. పర్యటనలో భాగంగా టిఫిన్, భోజనం, వివిధ ప్రాంతాల్లో సందర్శన టికెట్ల రుసుము పర్యాటకులే చెల్లించాల్సి ఉంటుంది. రవాణా సదుపాయాన్ని మాత్రమే పర్యాటక అభివృద్ధి సంస్థ కల్పిస్తుంది. హుస్సేన్సాగర్లో బోటు షికారు కూడా అందుబాటులోకి తెచ్చారు. కాకతీయ రీజియన్ యాత్ర: ఉదయం 9.30 గంటలకు హైదరాబాద్ నుంచి బస్సు బయలుదేరుతుంది. 2వ రోజు రాత్రి 9 గంటలకు తిరిగి చేరుకుంటారు. కాళేశ్వరం, రామప్ప, వేయిస్తంభాల గుడి, యాదాద్రి, కీసర తదితర పుణ్యక్షేత్రాల సందర్శన ఉంటుంది. పెద్దవారికి రూ.1,550, పిల్లలకు రూ.1,320 చొప్పున చార్జీ ఉంటుంది. శైవ క్షేత్రాల సందర్శన.. శాతవాహన యాత్ర: ఈ పర్యటన కోసం నగరం నుంచి ప్రతి సోమవారం ఉదయం 7 గంటలకు బయలుదేరి తిరిగి రాత్రి 10 గంటలకు చేరుకుంటారు. వేములవాడ, కొండగట్టు, ధర్మపురి తదితర ఆలయాల సందర్శన ఉంటుంది. బస్సు చార్జీ పెద్దవారికి రూ.1300, పిల్లలకు రూ.1040 చొప్పున ఉంటుంది. ఆలయ ప్రవేశ రుసుము, భోజనం వంటివి పర్యాటకులే ఏర్పాటు చేసుకోవాలి. పంచారామాలకు: ఆంధ్రప్రదేశ్లోని పంచారామాలకు కూడా హైదరాబాద్ నుంచి టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ప్రత్యేక బస్సులు నడుపుతోంది. ఇది 3 రోజుల పాటు ఉంటుంది. ఉదయం 9 గంటలకు బయల్దేరి 3వ రోజు ఉదయం 7 గంటలకు తిరిగి నగరానికి చేరుకుంటారు. అమరావతి, పాలకొల్లు, భీమవరం, ద్రాక్షారామం, సామర్లకోట క్షేత్రాలను సందర్శించవచ్చు. పెద్దవారికి రూ.3,500, పిల్లలకు రూ.2,800 చొప్పున చార్జీలు ఉంటాయి. బుకింగ్ ఇలా.. ఈ పర్యటనల కోసం తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ వెబ్సైట్ను సందర్శించవచ్చు. ఆన్లైన్లోనే టికెట్లు బుక్ చేసుకోవచ్చు. మరిన్ని వివరాల కోసం 040– 29801040, 98485 40371 -
తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా శివరాత్రి వేడుకలు
-
శివనామస్మరణతో పోటెత్తిన ఆలయాలు
సాక్షి, రాజమండ్రి: మహాశివరాత్రి సందర్భంగా శైవక్షేత్రాలకు భక్తులు పోటెత్తుతున్నారు. శివనామస్మరణతో ఆలయాలు మార్మోగుతున్నాయి. శ్రీశైలం, శ్రీకాళహస్తి, అమరావతి ఆలయాలతో పాటు రాష్ట్రవ్యాప్తంగా భక్తులు శివాలయాలను దర్శించుకుంటున్నారు. రాజమండ్రిలో గోదావరి ఘాట్లన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. గోదావరి పుణ్య స్నానాలు ఆచరించిన భక్తులు ఆలయంలో స్వామివారి అమ్మవార్ల దర్శనం చేసుకుంటున్నారు. పంచారామ క్షేత్రం అయిన ద్రాక్షారామం, కోటిపల్లి ఛాయా సోమేశ్వర స్వామి, మురమళ్ళ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి, క్షణ ముక్తేశ్వర స్వామి ఆలయాలకు భక్తుల తాకిడి అధికంగా ఉంది. కృష్ణా: శివన్నామస్మరణతో మల్లన్నగట్టు శైవక్షేత్రం మార్మోగుతోంది. వేలాదిగా భక్తులు తరలిరావడంతో పోలీసులు భారీ భద్రతను కల్పించారు. విస్సన్నపేట మండలం కొండపర్వగట్టు శ్రీ భ్రమరాంబిక మల్లేశ్వర స్వామిని ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ రక్షణనిధి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా పరమశివుడుకి ప్రత్యేక పూజలు నిర్వహించి అభిషేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తోట్లవల్లూరు మండలం ఐలూరులో రామేశ్వరస్వామిని పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్థసారధి, పామర్రు ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా భక్తులకు ఉచితంగా మజ్జిగ పంపిణీ చేశారు. వీరివెంట కళ్ళం వెంకటేశ్వరరెడ్డి, జొన్నాల మోహనరెడ్డి, మర్రెడ్డి శేషిరెడ్డి, షేక్ లతీఫ్, నడకుదురు రాజేంద్ర, కిలారపు శ్రీనివాసరావు ఉన్నారు. ఇబ్రహీంపట్నం ఫెర్రీ ఘాట్ వద్ద భక్తులు కోలాహలం నెలకొంది. పండగను పురస్కరించుకుని పుణ్యస్నానాలు ఆచరించడానికి భక్తులు తెల్లవారుజామునే ఘాట్ వద్దకు చేరుకున్నారు. దీంతో శివనామ స్మరణలతో కృష్ణాతీరం ప్రతిధ్వనిస్తోంది. తిరువూరు నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ రక్షణనిధి మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు. ప.గో: మహాశివరాత్రి సందర్భంగా మంత్రి తానేటి వనిత పట్టిసీమ వీరభద్రేశ్వరుని దర్శించుకున్నారు. గుంటూరు: కోటప్పకొండ త్రికోటేశ్వరుడిని డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి, నర్సరావుపేట ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి దంపతులు దర్శించుకున్నారు. అమరావతి భక్తులతో అమరేశ్వరుడి ఆలయం కిటకిటలాడుతోంది. వేకువజాము నుంచే కృష్ణ నదిలో స్నానమాచరించి భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు. భారీస్థాయిలో భక్తులు గుడికి తరలి వస్తున్నారు. విశాఖపట్నం: ఆర్కే బీచ్ లో రాజ్యసభ సభ్యులు టి.సుబ్బిరామిరెడ్డి అధ్వర్యంలో మహా కుంభాభిషేకం నిర్వహించారు. కోటి శివలింగాలకు అభిషేకాలు చేపట్టారు. శారదా పీఠాధిపతి స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి, ఉత్తరాదికారి స్వామి స్వత్మానందేంద్ర సరస్వతి మహా కుంభాభిషేకాన్ని ప్రారంభించారు. డిప్యూటీ సీఎం నారాయణ స్వామితో పాటు చిత్తూర్ ఎంపీ రెడ్డప్ప, సినీ నటులు వాణి శ్రీ, శారద, కవిత, మురళీమోహన్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతగిరి మండలం బొర్రా గుహల్లో నేడు ప్రవేశం ఉచితమని అధికారులు ప్రకటించారు. కాశీపట్నంలోని ఉమా రామలింగేశ్వర ఆలయం, బొర్రా గూహ లోని మహా శివలింగానికి, కిముడుపల్లిలో స్వయంభు శివలింగానికి గిరిజనులు అభిషేకాలు చేస్తున్నారు. అఫీషియల్ కాలనీలోని వైశాకేశ్వర స్వామి ఆలయంలో తెల్లవారుజాము నుంచి శివరాత్రి అభిషేకాలు నిర్వహిస్తున్నారు. హుకుంపేట మండలం మత్స గుండంలో, సబ్బవరం లోని భీమా లింగేశ్వర ఆలయం, లింగాల తిరుగుడు లోని సోమేశ్వరాలయం, చోడవరం లోని గౌరీ, పార్వతి సమేత పరమేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేపట్టారు. అప్పికొండ పుణ్యక్షేత్రంలోనూ పెద్ద ఎత్తున అభిషేకాది కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. లక్షల సంఖ్యలో భక్తులు రానుండడంతో ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేశారు. చిత్తూరు: సోమల మండలంలోని దుర్గం కొండలోని శివాలయంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి పెద్దిరెడ్డిరామచంద్రారెడ్డి ప్రత్యేక పూజలు నిరవహించారు. కట్టమంచి కులుండీశ్వర ఆలయాన్ని ఎమ్మెల్యే శ్రీనివాసులు దర్శించారు. పశ్చిమ గోదావరి జిల్లా: ఆచంట ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీరామేశ్వర స్వామివారిని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ రంగనాధరాజు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. భీమవరంలోని పంచారామక్షేత్రం ఉమా సోమేశ్వర జనార్దన స్వామి ఆలయంలో ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు చేశారు. ద్వారకాతిరుమల శేషాచల కొండపై కొలువైన శ్రీ భ్రమరాంబ మల్లేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. స్వామివారికి అత్యంత భక్తి శ్రద్ధలతో అభిషేకాలు చేస్తున్నారు. నరసాపురంలో శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తెల్లవారుజాము నుంచే క్యూ లైన్లలో బారులు తీరారు. పాలకొల్లు పంచారామక్షేత్రంలోని క్షీరా రామలింగేశ్వరస్వామి ఆలయాన్ని సుందరంగా ముస్తాబు చేశారు. స్వామివారికి భక్తులు ప్రత్యేక పూజాదికార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఉమానీలకంఠేశ్వర క్షేత్రంలో స్వామివారు విశేష అభిషేకాలు అందుకుంటున్నారు. జంగారెడ్డిగూడెం, తాడువాయి శివాలయాలలో భక్తుల రద్దీ కనిపిస్తోంది. పట్టిసీమ పట్టిసాచలక్షేత్రం భక్తజన సంద్రాన్ని తలపిస్తోంది. వీరభద్రేశ్వర స్వామికి వంశపారంపర్య ధర్మకర్తలు తొలిపూజ నిర్వహించారు. తెల్లవారుజామున రెండు గంటల నుంచి భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు. ప్రకాశం: సీఎస్ పురం మండలంలోని బైరవకోన లో మహాశివరాత్రి సందర్భంగా ఉదయం నుండే భక్తులు బారులు తీరారు. నెల్లూరు: నగరంలో మాగుంట సర్కిల్ లో బ్రహ్మ కుమారీల ఆధ్వర్యంలో 18 అడుగుల శివలింగం ఏర్పాటు చేశారు. ద్వాదశ జ్యోతిర్లింగాల నమూనాతో ప్రతిష్టించారు. ఈ సందర్భంగా అక్కడికి చేరుకున్న భక్తులు అభిషేకాలు చేస్తున్నారు. కావలి పాత ఊరులోని శివాలయంలో భక్తులు ప్రత్యేక పూజలు చేపట్టారు. మూలస్థానేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. మైపాడు, కాటేపల్లి, పట్రాంగంలలో భక్తులు సముద్ర స్నానాలు చేసిన అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఘటిక సిద్దేశ్వరం ఆలయంలో ప్రత్యేక అభిషేకాలు నిర్వహిస్తున్నారు. సంగంలో పినాకినీ నదిలో స్నానమాచరించి సంగమేశ్వర స్వామిని భక్తులు దర్శించుకుంటున్నారు. రాపూరు మండలం సిద్దేశ్వర కోన లో విశేష పూజలు చేపట్టారు. బుచ్చిరెడ్డి పాలెం మండలం జొన్నవాడలోని శ్రీ కామాక్షి తాయి సమేత మల్లిఖార్జున స్వామి వారి ఆలయంలో శివ రాత్రి సందర్భంగా మహాన్యాస పూర్వక రుద్రాభిషేకాలు నిర్వహించనున్నారు. శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తిలో తెల్లవారుజామున 2 గంటల నుంచే దర్శన ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. ఎమ్మెల్యే బియ్యపు మధుసూధన్ రెడ్డి, ఆలయ ఈవో చంద్రశేఖర్ రెడ్డిలు దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షించారు. కాకినాడ: సామర్లకోట కుమారా రామ భీమేశ్వరస్వామి ఆలయాన్ని దర్శించిన భక్తులు ప్రత్యేక పూజలతో పాటు అభిషేకాలు నిర్వహిస్తున్నారు. పిఠాపురం శ్రీ ఉమా కుక్కుటేశ్వరం ఆలయంలో ఘనంగా శివరాత్రి పూజలు ఘనంగా జరుగుతున్నాయి. పుష్కరిణిలో భక్తులు పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. కుక్కుటేశ్వర స్వామి ఆలయంలో ఎమ్మెల్యే పెండెం దొరబాబు దంపతులు ప్రత్యేక పూజలు చేపట్టారు. వైఎస్సార్ కడప: రాజంపేట మండలం ఊటుకూరులోని భక్తకన్నప్ప జన్మస్థలమైన శివాలయానికి శివభక్తులు చేరుకుంటున్నారు. ఈ సందర్భంగా భక్తకన్నప్ప ఆలయం శివనామస్మరణలతో మారుమోగుతోంది. బద్వేలు నియోజకవర్గంలో శివాలయాలు శివనామ స్మరణతో మార్మోగుతున్నాయి. లంకమల, మల్లెంకొండ, గండి క్షేత్రంలోని దేవాలయాలకు తెల్లవారు జామునుంచే భక్తులు భారీ సంఖ్యలో చేరుకుంటున్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు జరగకుండా అధికారులు చర్యలు చేపడుతున్నారు. పరుశురాముడు మాతృహత్యా పాతకం నుంచి విముక్తి పొందిన రాజంపేట మండలం హత్యరాలలో శివుని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరవుతున్నారు. హత్యరాల శ్రీ కామాక్షి సమేత త్రేతేశ్వరున్ని దర్శించుకుని పులకించిపోతున్నారు. రైల్వే కోడూరులో శ్రీ భుజంగేశ్వర ఆలయంలో భక్తులు బారులు తీరారు. శివపార్వతుల కల్యాణోత్సవం కార్యక్రమానికి పెద్ద ఎత్తున హాజరయ్యారు. చిత్తూరు జిల్లా: కట్టమంచి కులుండీశ్వర ఆలయంలో ఎమ్మెల్యే శ్రీనివాసులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎర్రావారిపాళెంలో తలకోన సిద్దేశ్వర స్వామికి రాష్ట్ర పంచాయితీ రాజ్ శాఖమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పట్టు వస్త్రాలు సమరగపించారు. చంద్రగిరి మండలం శ్రీనివాస మంగాపురంలో వెలసిన శ్రీకళ్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయంలో వార్షిక బ్రహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా నేడు ఉదయం రథోత్సవ సేవ నిర్వహించారు. రథంపై తిరుమాఢ వీధుల్లో స్వామివారిని ఊరేగించారు. రాత్రికి అశ్వవాహనంపై తిరిగి ఊరేగించనున్నారు. ఎర్రవారిపాళ్ళెం మండలం తలకోనలో మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. పార్వతి పరమేశ్వరులకు ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి శేషవస్త్రాలు సమర్పించారు. చంద్రగిరి నియోజకవర్గంలోని పలు శివాలయాకు ఆయన శేషవస్త్రాలు అందించారు. తిరుమల: టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలుగు రాష్ట్రాల ప్రజలకు మహా శివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఆ పరమశివుని ఆశీస్సులు ప్రజలందరికీ ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని పేర్కొన్నారు. విజయవాడ: పున్నమిఘాట్, క్రుష్ణవేణి, పవిత్ర సంగమంతో పాటు నదీ పరివాహక ప్రాంతాల్లోని ఘాట్లలో భక్తులు పుణ్యస్నానాలాచరిస్తున్నారు. పాత శివాలయం, యనమలకుదురు శివాలయం, వేదాద్రి, ముత్యాలతో పాటు ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో శివయ్య దర్శనార్థం వేకువజామునే భక్తులు బారులు తీరారు. అనంతరం స్వామి వారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా: పెదపూడి మండలం గొల్లల మామిడాడ పాటిమీద వేంచేసి ఉన్న శ్రీ మాణిక్యాంబ భీమేశ్వర స్వామి రథోత్సవం కార్యక్రమంలో అమలాపురం పార్లమెంటు ఎంపీ చింతా అనురాధ, ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి పాల్గొన్నారు. అల్లవరం మండలం గోడి గ్రామంలోని శివాలయంలో ఎంపి చింతా అనురాధ ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాట్రేనికోనలో కుండలేశ్వర స్వామి వారిని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపె విశ్వరూప్ దర్శించుకున్నారు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా గోదావరి ఘాట్లకు భక్తులు పోటెత్తారు. సూర్యోదయానికి ముందు నుంచే గోదావరిలో పుణ్యస్నానాలు ప్రారంభమయ్యాయి. కోటిలింగేశ్వరస్వామి ఆలయం, ఉమా మార్కండేయ స్వామి ఆలయాలు శివనామస్మరణతో హోరెత్తిపోతున్నాయి. గౌతమి గోదావరి నది తీరంలోని పంచారామక్షేత్రం ద్రాక్షారామం, కోటిపల్లి ఛాయా సోమేశ్వర స్వామి, మురమళ్ళ వీరభద్రేశ్వరస్వామి ఆలయాలకు భక్తుల తాకిడి అధికంగా ఉంది. ఉదయాన్నే స్నానమాచరించి కోటిపల్లి శ్రీ ఛాయా సోమేశ్వర స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహిస్తున్నారు. దక్షిణకాశిగా పేరుగాంచిన ద్రాక్షారామంలో కొలువైన మాణిక్యాంబా సమేత భీమేశ్వర స్వామి వారిని ఎమ్మెల్యే చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ దంపతులు దర్శించుకున్నారు. అనంతపురం: గుంతకల్లు ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వ విద్యాలయంలో మహా శివరాత్రివేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఇక్కడ విశేషంగా చేపట్టిన కార్యక్రమాల్లో ఎమ్మెల్యే వై.వెంకట్రామిరెడ్డి పాల్గొన్నారు. మొదటిరోడ్డు శివాలయంలో ఎమ్మెల్యే అనంతవెంకటరామిరెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శివాలయాల అభివృద్ధి కి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. శ్రీకాకుళం: కోటేశ్వర స్వామి, శ్రీముఖలింగం మధుకేశ్వరస్వామి, రావివలస ఎండలమల్లికార్జున స్వామి దేవాలయాలు పండగను పురస్కరించుకుని సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. -
మహాశివరాత్రికి ముస్తాబవుతున్న ఆలయాలు
శివరాత్రికి విద్యుదీపాలంకరణలో ముస్తాబు కాళేశ్వరం: జయశంకర్భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరాలయంలో ఈ నెల 20 నుంచి 22 వరకు జరిగే మహాశివరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని కాళేశ్వరాలయం విద్యుత్దీపాలతో జిగేల్మంటోంది. మంగళవారం రాత్రి ఆలయంలోని ప్రధాన గర్భగుడిని విద్యుత్ దీపాలతో అలంకరించారు. రంగు రంగుల విద్యుత్ దీపాలతో కాళేశ్వరాలయం ముస్తాబు కావడంతో శివరాత్రి శోభను సంతరించుకుంది. శివకేశవుల నిలయం పాలకుర్తి పుణ్యక్షేత్రం జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలో(క్షీరగిరి)పై వెలసిన శ్రీ సోమేశ్వర లక్ష్మీ నర్సింహస్వామి లింగము స్వయంభువు. ఆలయ గుహల నుంచి∙ఓంకార ప్రణవనాదం వినిపిస్తుందని భక్తుల విశ్వాసం. అదృశ్య రూపంలో ఉన్న సిద్ద పురుషులు అర్ధ రాత్రి వేళల్లో స్వామి వారిని అర్చించడానికి వస్తారని ప్రతీతి. ఈ క్షేత్రాన్ని సందర్శించిన వారికి లక్ష రెట్లు అధిక ఫలితంతో పాటు మోక్షం లభిస్తుందని నమ్మిక. పక్కనే మరొక గుహలో శ్రీ లక్ష్మీనర్సింహ స్వామి వెలసి శివ కేశవులకు భేదం లేదని ప్రభోదిస్తున్నాడు. ఈ శివ పంచాయతన క్షేత్రంలో శివుడు శ్రీ సోమేశ్వరుడిగా, విష్ణువు లక్ష్మీనర్సింహుడిగా వేర్వేరు గుహల్లో స్వయంభువులుగా వెలసి ఉన్నారు. పూర్వ కాలంలో సూర్యభగవానుని ఆల యం ఉండగా.. ఇప్పుడు కూడా ఆనవాళ్లు కనిపిస్తాయి. స్వామిపై విశ్వాసం సడలినా, కొండకు పరిశుద్దులై రాకపోయినా స్వామి రక్షక భటులైన తేనేటీగలు వెంటపడి కొండను దిగేలా చేస్తాయి. ఇక్కడ శైవాగం, వైదికాగం ప్రకారంగా బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. గిరిజనులు సంప్రదాయ బద్ధంగా నృత్యాలు చేస్తూ కోలాటాలతో ఎడ్ల బండ్లతో ప్రదర్శనగా రావడం జాతర ప్రత్యేకత. గ్రామంలో పంచగుళ్ల వద్ద ఉన్న కోనేరులో స్నానం చేసిన భక్తులు పంచగుళ్లు దర్శించుకుని సోమేశ్వర ఆలయానికి రావడానికి ఏర్పాట్లుచేశారు. పాలకుర్తి టౌన్: తెలంగాణ రాష్ట్రంలోని ప్రముఖ శైవక్షేత్రాల్లో ఒకటైన పాలకుర్తిలోని శ్రీసోమేశ్వర లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు ఆలయ అధికారులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. హరిహరులు స్వయంభువులుగా ఒకే గుట్టపై వెలసిన దివ్య క్షేత్రంగా పాలకుర్తి వెలుగొందుతుంది. ఏటా మహా శివరాత్రి సందర్బంగా బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. ఈనెల 20 నుంచి 24 వరకు జరిగే బ్రహ్మోత్సవాలకు ఇతర జిల్లాల నుంచే కాకుండా పలు రాష్ట్రాల నుండి భక్తులు తరలి రానున్నారు. 21న మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని స్వామి వారి కల్యాణం నిర్వహించనుండగా.. రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు దంపతులు పాల్గొని పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. భక్తుల కొంగుబంగారం కురవి వీరన్న కురవి: భక్తుల కల్పతరువుగా, నమ్మిన వారి కొంగు బంగారంగా కురవిలోని వీరభద్రస్వామి విలసిల్లుతున్నాడు. తెలంగాణ రాష్ట్రంలోనే అత్యంత ప్రసిద్ధి గాంచిన శైవ పుణ్యక్షేత్రమైన భద్రకాళి సమేత శ్రీవీరభద్రస్వామి ఆలయంలో కల్యాణ బ్రహోత్సవాలు ఈనెల 20న గురువారం అంకురార్పణతో ప్రారంభం కానున్నాయి. ఈనెల 21వ తేదీన(శుక్రవారం) మహాశివరాత్రి పర్వదినోత్సవాన్ని పురస్కరించుకుని కల్యాణమహోత్సవం కన్నుల పండువగా జరగనుంది. ఈనెల 20వ తేదీ నుంచి మార్చి 6వ తేదీ వరకు శ్రీ స్వామివారి కల్యాణ బ్రహ్మోత్సవాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆలయచరిత్ర... క్రీ.శ. 850 ప్రాంతంలో వేంగి రాజధానిగా పాలించు చాళుక్యుల సామంతులైన రాష్ట్రకూట రాజు భీమరాజు కురవిని రాజధానిగా చేసుకుని పాలించేవాడు. అప్పుడే వీరభద్రస్వామి ఆలయాన్ని నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. అనంతరం కాకతీయ తొలి స్వతంత్ర రాజు ఒకటో బేతరాజు ఆలయాన్ని జీర్ణోద్ధరణ చేసినట్లు శాసనాల ద్వారా తెలుస్తోంది. రెండో బేతరాజు కురవి పక్కనే పెద్ద తటాకం(చెరువు)ను తవ్వించినట్లు చెబుతారు. కాకతీయ రాణి రుద్రమదేవి ఆలయాన్ని సందర్శించి ఏకశిల రాతి స్తంభ దీపాన్ని నిర్మించినట్లు చరిత్ర ద్వారా తెలుస్తుంది. ఇప్పటికి ఆ స్తంభం దర్శనమిస్తుంది. రాజగోపురం దాటి లోనికి వెళ్లగానే ఏకశిలపై నందీశ్వరుడు దర్శనమిస్తాడు. స్వామివారి ప్రాశస్త్యం సకల క్తిమూర్తివరాల ప్రదాత అయిన వీరభద్రస్వామి పడమటముఖుడై దశహస్తుడై, త్రినేత్రుడై రౌద్రపరాక్రమములతో విలసిల్లుతున్నాడు. భక్తులను ఆదుకునే పరమభోళామూర్తిగా దర్శనమిస్తున్నాడు. క్షుద్రగణాలకు వీరభద్రుడంటే భయం. అందుకే ఆలయానికి వచ్చి స్వామి వారిని దర్శించుకునే భక్తులకు ఆయురారోగ్యాలు, సిరిసంపదలను అందుతాయని భక్తుల నమ్మిక. స్వామివారికి ఎడమవైపు చతుర్భుజములు కలిగి ఉండి శ్రీ భద్రకాళీ అమ్మవారు వెలసి ఉన్నారు. స్వామి వారికి ఇరువైపులా శివుడు(లింగాకారంలో) దర్శనమిస్తాడు. ఆలయానికి దక్షిణ దిశలో భద్రకాళి అమ్మవారు స్వయంశక్తిమూర్తిగా వెలిసి పూజలందుకుంటోంది. ఉత్సవాల్లో ముఖ్యఘట్టాలు.. జాతర ఉత్సవాల్లో భాగంగా ఈనెల 20న ఉదయం 9గంటలకు పసుపు, కుంకుమలు అర్చకులు ఆలయానికి తీసుకొస్తారు. సాయంత్రం 7గంటలకు అంకురార్పణ, అఖండకలశస్థాపన, ధ్వజారోహనం, రాత్రి 10గంటలకు బసవ ముద్ద కార్యక్రమం ఉంటుంది. 21న మహాశివరాత్రి రోజున స్వామి వారి ఆలయంలో సేవలు, రాత్రి 1.20గంటలకు(తెల్లవారితే శనివారం) స్వామి వారి కల్యాణ మహోత్సవం జరుగుతుంది. ఇక 26వ తేదీన రథోత్సవం, 27వ తేదీన బండ్లు తిరుగుట, మార్చి 5వ తేదీన శ్రీ పార్వతీరామలింగేశ్వరస్వామి కల్యాణం, 6వ తేదిన పదహారు రోజుల పండుగతో ఉత్సవాలు ముగుస్తాయి. ముమ్మరంగా సాగుతున్న ఏర్పాట్లు కురవిలోని భద్రకాళీ సమేత శ్రీవీరభద్రస్వామి కల్యాణ మహోత్సవ జాతరకు ఆలయ అధికారులు, వివిధ శాఖల అధికారులు ఏర్పాట్లను ముమ్మరం చేశారు. బుధవారం నాటికి ఏర్పాట్లు పూర్తికానున్నాయి. ఆలయ ఆవరణలో చలువ పందిళ్లు ఏర్పాటుచేయగా... స్వామి కల్యాణ మహోత్సవం జరిగే నాగేంద్రస్వామి ఆలయ ఆవరణలో బారికేడ్లను ఆర్అండ్బీ అధికారులు నిర్మిస్తున్నారు. స్నాన ఘట్టాల వద్ద షవర్లు, తాత్కాలిక మరుగుదొడ్ల నిర్మాణాలు పూర్తి కావొస్తున్నాయి. మొత్తంగా జాతర ఏర్పాట్లు 95శాతం పూర్తి అయ్యాయి. ఈ మేరకు ఏర్పాట్లను మహబూబాబాద్ డీఎస్పీ నరేష్కుమార్ మంగళవారం పరిశీలించి పలు సూచనలు చేశారు. జాతర పరిసర ప్రాంతాల్లో పార్కింగ్ ఏర్పాట్లపై కురవి ఎస్సై జక్కుల శంకర్రావుతో చర్చించారు. మహిమాన్వితుడు.. అగస్తీశ్వర స్వామి మరిపెడ రూరల్: మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం అబ్బాయిపాలెం శివారు కొండపై స్వయంభూగా వెలసిన అగస్తీశ్వర స్వామి మహిమాన్వితుడిగా భక్తులతో పూజలు అందుకుంటున్నాడు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ నెల 21, 22, 23వ తేదీల్లో నిర్వహించే మహాజాతర మహోత్సవానికి మూడు జిల్లాల నుంచి భక్తులు హాజరుకానుండగా.. నిర్వాహకులు ఏర్పాట్లు పూర్తిచేశారు.. సిద్ధేశ్వరా నమోనమః! బచ్చన్నపేట: ఉమ్మడి జిల్లాలోని ప్రముఖ శైవక్షేత్రాల్లో ఒకటైన జనగామ జిల్ల బచ్చన్నపేట మండలంలోని కొడ్వటూరు గ్రామంలోని శ్రీ సిద్ధేశ్వర ఆలయం మహా శివరాత్రి ఉత్సవాలకు ముస్తాబవుతోంది. బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. నేటి నుంచి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. తొలిరోజు గంగపూజ, ఋత్వికరణం, అవాహన దేవత పూజ, 20న ఏకదశరుద్రాభిషేకం, రుద్రహోమం, శతరుద్రాభిషేకం, 21వ తేదీన మహాశివరాత్రి పర్వదినాన శ్రీ భద్రకాశి వీరభద్రేశ్వరస్వామి ఆహ్వానం, రాత్రి శివపార్వతుల కల్యాణం, లింగోద్భవ పూజ ఉంటాయి. 22న ఉదయం అగ్నిగుండ ప్రవేశం, గెలుపు ఆశీర్వాదంతో ఈ బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. స్వామి కల్యాణానికి జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి దంపతులు పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను సమర్పించనున్నారు. బ్రహ్మోత్సవాలకు తరలివచ్చే భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేశారు. -
రేపు మహా శివరాత్రి ముస్తాబైన శివాలయాలు
-
కార్తీకం శుభప్రదం!
పవిత్ర కార్తిక మాసం ప్రారంభం కావడంతో శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి.ఈ కార్తిక మాసంలో భక్తులంతా తెల్లవారు జామునే లేచి పవిత్ర స్నానాలు ఆచరించి ప్రత్యేక పూజలు చేయడంలో నిమగ్నం అయిపోతారు. కార్తిక మాసం సర్వమంగళకరం హరిహరులకు ప్రీతికరమైనది.కార్తిర మాసంలో ఏ పనిచేసినా...మంచి ఫలితాలు కలుగుతాయని ప్రజల నమ్మకం అందుకే ఈ మాసంలో భక్తులు ఉదయాన్నే నది స్నానాలు చేసి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి హరిహరులకు పూజలు నిర్వహిస్తారు. ప్రత్యేకించి సోమవారాలు, ఏకాదశి, ద్యాదశి, పౌర్ణమి తిదులను పరమ పవిత్రమైన దినాలుగా భావిస్తారు. ధర్మపురి: కార్తీకమాసం ఎంతో శుభప్రదం. ఆదివారం సెలవు రోజు కావడంతో ధర్మపురి శ్రీలక్ష్మీనరసింహస్వామి సన్నిధికి వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. ప్రధాన ఆలయం శ్రీయోగానందుడైన శ్రీలక్ష్మీనృసింహస్వామితో పాటు అనుబంధ ఆలయాల్లో పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలోని ఉసిరిక చెట్టు వద్ద మహిళలు కార్తీక దీపాలను వెలిగించారు. కార్తీక మాసం సందర్భంగా ఆలయంలో సత్యనారాయణ వ్రతాలను నిర్వహించారు. -
భక్తులతో పోటెత్తిన శైవక్షేత్రాలు
హైదరాబాద్: కార్తీక మాసం ఆఖరి సోమవారం కావడంతో వేకువజాము నుంచే శైవక్షేత్రాలకు భక్తులు పోటెత్తుతున్నారు. తెలుగు రాష్ట్రాలలోని పలు ఆలయాల్లో భక్తులు దీపోత్సవాలు నిర్వహిస్తున్నారు. కార్తీక మాసం చివరి సోమవారం, ఏకాదశి కావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు ఆరాధ్యదైవం శివుడికి అభిషేకాలు నిర్వహిస్తున్నారు. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో భక్తుల రద్దీ చాలా ఎక్కువగా ఉంది. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ కాశీచింతల దేవాలయానికి భక్తుల తాకిడి చాలా ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. పంచారామాలు భక్త జనసందోహంతో సందడి వాతావరణం నెలకొంది. ఇంద్రకీలాద్రి: విజయవాడలోని కృష్ణానది తీరం భక్తులతో నిండిపోయింది. అన్ని ఘాట్లలో తెల్లవారుజామున 2 గంటల నుంచే వేల సంఖ్యలో భక్తులు పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. పాత శివాలయం, విజయేశ్వరాలయం, ఇంద్రకీలాద్రిపై కొలువైన మల్లేశ్వరస్వామి వార్లను భక్తులు దర్శించుకుని ప్రత్యేకపూజలు చేస్తున్నారు. -
నల్గొండలో భక్తులతో కిటకిటలాడుతున్న శివాలయాలు