MH17
-
ఎంహెచ్17 మృతురాలికి మాస్టర్ డిగ్రీ!
కౌలాలంపూర్: మలేషియా ఎయిర్ లైన్స్ విమాన (MH17) దుర్ఘటనలో మరణించిన ఎలిజబెత్ ఎన్ జీ లే తి అనే విద్యార్ధికి మాస్టర్ డిగ్రీని మంగళవారం కౌలాలంపూర్ యూనివర్సిటీ ప్రధానం చేసింది. ఎలిజబెత్ తరపున సోదరి షి యాన్ మాస్టర్ డిగ్రీని అందుకున్నారు. ఎలిజబెత్ మాస్టర్ డిగ్రీని 80 శాతం చేశారని, ఆ డిగ్రీని అందుకోవడానికి ఆమె అన్ని రకాలుగా అర్హత సాధించిందని యూనివర్సిటీ డీన్ నాజ్రీ ఇస్మాయిల్ తెలిపారు. మాస్టర్ డిగ్రీ పొందడానికి ఒక సబ్జెక్ట్, మరో రీసర్చ్ ప్రాజెక్ట్ ను పూర్తి చేయాల్సి ఉంది. అయితే నిబంధనల ప్రకారం 80 శాతం పూర్తి చేసి.. మరణించిన వారికి యూనివర్సిటీ డిగ్రీని అందచేస్తుంది. -
క్షిపణి ఢీకొనడం వల్ల కూలిన మలేషియా విమానం
హేగ్(నెథర్లాండ్స్): క్షిపణిలాంటి శక్తివంతమైన వస్తువు ఢీకొనడంవల్లనే మలేషియా ఎయిర్లైన్స్ విమానం ఎంహెచ్ 17 విమానం కూలిపోయిందని డచ్ సేఫ్టీ బోర్డు తొలి నివేదికలో తెలిపింది. నెదర్లాండ్స్లోని ఆమ్స్టర్డామ్ నుంచి మలేసియా రాజధాని కౌలాలంపూర్కు తెళుతున్న ఈ విమానం జూలై 17న కుప్పకూలిన విషయం తెలిసిందే. ఈ విమానంలో మొత్తం 298 మంది మృతి చెందారు. ఈ మలేషియా ఎయిర్లైన్స్ విమానం ఉక్రెయిన్ గగనతలంపై 10 కి.మీ ఎత్తులో ప్రయాణిస్తుండగా జరిగిన క్షిపణి దాడిలో కుప్పకూలింది. యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన మలేసియా విమానం కూల్చివేత ఉక్రెయిన్లోని రష్యా అనుకూల తిరుగుబాటుదారుల ఘాతుకమేనని అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ విమానాన్ని ఉక్రెయిన్ సైనిక రవాణా విమానంగా పొరబడిన తిరుగుబాటుదారులు దాన్ని కూల్చేందుకు క్షిపణి దాడికి పాల్పడినట్లు తెలిసింది. ఈ దుర్ఘటన అనంతరం రష్యా మిలటరీ ఇంటెలిజెన్స్ అధికారులు, ఉక్రెయిన్లోని రష్యా అనుకూల తిరుగుబాటుదారుల మధ్య జరిగిన సంభాషణల ఆడియో రికార్డుల రాతప్రతులను ఉక్రెయిన్ సెక్యూరిటీ సర్వీస్ బయటపెట్టింది. ప్రమాదం జరిగిన 20 నిమిషాల తరువాత ఈ సంభాషణలు చోటు చేసుకున్నాయి. ఈ సంభాషణల ప్రకారం ఇగోర్ బెజ్లర్ అనే మిలిటెంట్.. రష్యా నిఘా అధికారి వాలిసి జెరానిన్తో మాట్లాడుతూ ''మేం ఇప్పుడే ఒక విమానాన్ని పేల్చేశాం. అది గాల్లోనే ముక్కలైంది''అని పేర్కొన్నాడు. అలాగే మేజర్ అనే మిలిటెంట్ ఘటనాస్థలికి వెళ్లి విమాన శకలాలను పరిశీలించాక ''ఇది నూరు శాతం పౌర విమానమే. అన్నీ సాధారణ వస్తువులే కనిపిస్తున్నాయి'' అని గ్రెక్ అనే మరో మిలిటెంట్కు వివరించాడు. దీంతోపాటు తిరుగుబాటుదారుల నాయకుడిగా భావిస్తున్న మైకొలా కొజిత్సిన్తో మరో మిలిటెంట్ మాట్లాడుతూ ''ఇది ప్యాసింజర్ విమానంలా కనిపిస్తోంది. గ్రాబొవొ గ్రామ వెలుపల ఇది పడిపోయింది. మహిళలు, చిన్నపిల్లల మృతదేహాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి''అని కొజిత్సిన్కు వివరించాడు.రష్యా అనుకూల ఉగ్రవాదులే ఈ విమానాన్ని కూల్చేశారని ఉక్రెయిన్ అధ్యక్షుడు పెట్రో పొరోషెంకో ఆరోపించారు.అయితే ఉక్రెయిన్ వాదనను రష్యా తోసిపుచ్చింది. ఈ విమాన కూలిపోయిన ఘటనపై డచ్ సేఫ్టీ బోర్డు తొలి నివేదిక ఈరోజు సమర్పించింది. క్షిపణిలాంటి శక్తివంతమైన వస్తువు ఢీకొనడంవల్లనే ఈ విమానం కూలిపోయిందని బొర్డు ఆ నివేదికలో పేర్కొంది. ** -
విమాన ప్రమాదం మృతుల్లో ప్రధాని అమ్మమ్మ
ఎమ్హెచ్ 17 విమాన ప్రమాదంలో మలేషియా ప్రధాని నజీబ్ రజాక్ అమ్మమ్మ శ్రీ సిటి అమీరహ్ మృతి చెందారు. ఆ విషయాన్ని మలేషియా దేశ రక్షణ మంత్రి, ప్రధాని నజీబ్ రజాక్ సోదరుడు హిషమ్ముద్దీన్ హుస్సేన్ వెల్లడించారు. తమ సవతి అమమ్మ విమాన ప్రమాదంలో మరణించారని వెల్లడిస్తూ ఆమె ఫొటోను హుస్సేన్ ట్విట్టర్ పెట్టారు. అమీరహ్ స్వస్థలం ఇండోనేషియా అని చెప్పారు. ఇండోనేషియాలోని జోగ్ జకార్తా నగరానికి వెళ్లేందుకు ఆమె ఒంటరిగా ఆమ్స్టర్డామ్లో విమానం ఎక్కారని తెలిపారు. రంజాన్ పండగ సమీపిస్తున్న నేపథ్యంలో... బంధు మిత్రులతో ఆనందంగా ఆ పండగ చేసుకునేందుకు వస్తున్న తరుణంలో ఆమె మృతి చెందారని పేర్కొన్నారు. శ్రీసిటి అమీరహ్ను తమ తాత మహ్మద్ నవోహ్ ఒమర్ రెండో వివాహం చేసుకున్నారని చెప్పారు. తాను తన సోదరుడు నజీబ్ రజాక్ కజిన్స్ అని ఈ సందర్బంగా హిషమ్ముద్దీన్ హుస్సేన్ వివరించారు. ఆమ్స్టర్డామ్ నుంచి మలేషియా రాజధాని కౌలాలంపూర్ బయలుదేరిన విమానం గురువారం రష్యా సరిహద్దుల్లోని ఉక్రెయిన్ సమీపంలో తిరుబాటుదారులు క్షిపణులతో పేల్చివేశారు. ఆ ఘటనలో విమానంలో ప్రయాణిస్తున్న ప్రయాణికులు 280, సిబ్బంది 15 మంది మొత్తం 295 మంది మరణించిన సంగతి తెలిసిందే. -
'ప్రమాదం కానే కాదు.. కుట్రపూరిత చర్యే'
మెల్ బోర్న్: ఉక్రెయిన్ విమాన ప్రమాదంపై రష్యా స్పందించిన తీరుపై ఆస్త్రేలియా ప్రధాని టోని ఆబాట్ మండిపడ్డారు. 28 ఆస్ట్రేలియన్లతోపాటు, 298 మంది మృత్యువాత పడ్డిన విమాన ప్రమాదంపై రష్యా స్పందించిన తీరుపై ఆస్ట్రేలియా ప్రభుత్వం అసంతృప్తిని వెళ్లగక్కింది. మలేషియా ఎయిర్ లైన్ MH17 కూలిన ఘటన ప్రమాదం కానేకాదని.. అదో నేరపూరిత చర్య అని అబాట్ వ్యాఖ్యానించారు. ఉక్రెయిన్ విమాన దుర్ఘటనపై ఆస్ట్రేలియా పార్లమెంట్ లో చర్చ చేపట్టారు. విమాన ప్రమాదం ముమ్మాటికి కుట్రపూరిత చర్యే.. ప్రమాదం కాదని స్పీకర్ కు టోని అబాట్ వెల్లడించారు. ప్రమాదంలో మరణించిన వ్యక్తుల కుటుంబాలకు న్యాయం జరిగేలా చూడాలని అబాట్ విజ్క్షప్తి చేశారు. ప్రమాద ఘటనపై రష్యా రాయబారి స్పందించిన తీరుపై ఆయన మండిపడ్డారు. విమానాన్ని కూల్చివేతకు పాల్పడింది రష్యాకు చెందిన తిరుగుబాటుదారులేనని అబాట్ ఆరోపించారు. 295 మందితో అమ్స్టర్డామ్ నుంచి కౌలాలంపూర్కు బయల్దేరిన విమానాన్ని గురువారం సాయంత్రం ఉక్రెయిన్ గగనతలంపై పేల్చేవేసిన సంగతి తెలిసిందే. -
క్షిపణితో మలేసియా విమానం కూల్చివేత
-
ఉక్రెయిన్ గగనతలంపై భద్రత లేదా ?