mukesh pandey
-
సూసైడ్కు ముందు కలెక్టర్ సెల్ఫీ వీడియో
న్యూఢిల్లీ: బిహార్లో కలెక్టర్ ముకేశ్ పాండే ఆత్మహత్య కలకలం రేపిన విషయం తెలిసిందే. తన మరణానికి ఎవరూ కారణం కాదని సూసైడ్ లేఖలో పేర్కొన్న ఆయన, చనిపోవటానికి ముందు ఓ వీడియోను రికార్డు చేశారు. పోలీసులు ఆ వీడియోను స్వాధీనపరుచుకున్నట్లు తెలుస్తోంది. 32 ఏళ్ల బక్సర్ కలెక్టర్గా ఈ మధ్యే బదిలీ అయ్యారు. అక్కడే ఆయన ఈ వీడియోను చిత్రీకరించినట్లు తెలుస్తోంది. తన బిడ్డ గురించి, భార్య తనను ఎంత ప్రేమిస్తుందో అన్న విషయాలను ఆయన అందులో చెప్పుకొచ్చారు. దీంతో మానసిక రుగ్మతతోనే ఆయన బలవన్మరణానికి పాల్పడినట్లు స్పష్టమౌతోంది. గురువారం మధ్యాహ్నం లీలా ప్యాలెస్ హోటల్ నుంచి ఓ మాల్ వద్దకు క్యాబ్ బుక్ చేసుకున్నారు. వాట్సాప్లో బంధువులకు తాను ఆత్మహత్య చేసుకుంటున్న విషయాన్ని తెలియజేశారు. బంధువులు పోలీసులను అప్రమత్తం చేయగా, అప్పటికే ఆయన మాల్ వద్ద నుంచి వెళ్లిపోయారు. సీసీ పుటేజీల్లో బ్లూ టీషర్ట్, జీన్స్ ధరించిన పాండే ఘజియాబాద్ మెట్రో స్టేషన్ వైపుగా వెళ్లిన దృశ్యాలు నమోదయ్యాయి. ఆ తర్వాతే ఆయన శవాన్ని పోలీసులు పట్టాలపై కనుగొన్నారు. ఆల్ ఇండియా సివిల్స్ సర్వీస్ పరీక్షలో 14వ ర్యాంకర్ అయిన ముకేశ్ పాండే, సమర్థవంతమైన ఆఫీసర్ గా సీఎం నితీశ్ కుమార్ నుంచి ప్రశంసలు అందుకున్నారు. "మనిషి అనేవాడికి ఈ భూమిపై మనుగడ లేదని, తనకు జీవించాలనే కోరిక చచ్చిపోయిందని, తన చావు గురించి కుటుంబ సభ్యులకు సమాచారం అందజేయండని" అని పాండే తన సూసైడ్ లేఖలో పేర్కొన్నారు. -
రైలు పట్టాలపై కలెక్టర్ మృతదేహం
- బసచేసిన హోటల్ గదిలో సూసైడ్ నోట్.. - మనిషి మనుగడపై నమ్మకం కోల్పోయా.. - సంచలనంగా మారిన బిహార్ ఐఏఎస్ ముకేశ్ పాండే ఆత్మహత్య ఘజియాబాద్: దేశంలో మరో ఐఏఎస్ అధికారి ఆత్మహత్య చేసుకున్న ఘటన సంచలనంగా మారింది. బిహార్లోని బక్సర్ జిల్లా కలెక్టర్గా పనిచేస్తోన్న ముకేశ్ పాండే.. వేగంగా వస్తున్న రైలుకు ఎరుదుగా వెళ్లి బలవన్మరణానికి పాల్పడ్డారు. ఢిల్లీ శివారు ఘజియాబాద్ స్టేషన్కు సమీపంలో గురువారం జీఆర్పీ పోలీసులు ఆయన మృతదేహాన్ని గుర్తించారు. ముకేశ్ ట్రౌజర్ పాకెట్లో ఒక కాగితాన్ని గుర్తించిన పోలీసులు.. దాని ఆధారంగా ఆయన బసచేసిన హోటల్ గదిలో సూసైడ్ నోట్ ను స్వాధీనం చేసుకున్నారు. ‘నేను.. ముఖేశ్ పాండే, ఐఏఎస్ 2012 బ్యాచ్ బిహార్ క్యాడర్ అధికారిని. ప్రస్తుతం బక్సర్ జిల్లా మేజిస్ట్రేట్(కలెక్టర్)గా పనిచేస్తున్న నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను. నా చావు వార్తను మా వాళ్లకు తెలియజేయండి. ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలన్నింటినీ ఒక నోట్లో రాశాను. లీలా ప్యాలెస్ హోటల్(ఢిల్లీ)లో నేను దిగిన రూమ్ నంబర్ 742లో నైక్ బ్యాగ్లో ఆ నోట్ ఉంది’ అని ముఖేశ్ ట్రౌజర్లో దొరికిన కాగితంలో రాసిఉంది. దాని ఆధారంగా హోటల్ గదికి వెళ్లిన పోలీసులు సూసైడ్ నోట్ను స్వాధీనం చేసుకున్నారు. ‘మనిషి అనేవాడికి ఇక్కడ మనుగడ లేకుండా పోయింది. బతకాలనే కోరిక చచ్చిపోయింది. అందుకే నేను ఆత్మహత్య చేసుకుంటున్నా..’ అని ముఖేశ్ సైసైడ్ నోట్లో పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు. ఇటీవలి కాలంలో యువ ఐఏఎస్ అధికారులు ఆత్మహత్యలకు పాల్పడుతుండటంపై కేంద్ర ప్రభుత్వం సైతం స్పందించిన విషయం తెలిసిందే. షాపింగ్ మాల్ 10 అంతస్తు నుంచి దూకుతున్నా.. బక్సర్ కలెక్టర్ ముఖేశ్ పాండే ఆత్మహత్య చేసుకునే ఉద్దేశంతోనే ఢిల్లీకి వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. చనిపోవడానికి ముందు ఆయన తన స్నేహితులతో మాట్లాడినట్లు పోలీసులు చెప్పారు. వెస్ట్ ఢిల్లీలోని జానకీపురిలో 10 అంతస్తుల షాపింగ్ మాల్ పై నుంచి దూకబోతున్నట్లు ముఖేశ్ ఒక స్నేహితుడికి ఫోన్లో చెప్పారు. దీంతో ఆ స్నేహితుడు పోలీసులకు ఫోన్చేసి సమాచారం అందించాడు. షాపింగ్ మాల్లోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించగా.. ముఖేశ్ మెట్రో స్టేషన్కు వెళుతున్న దృశ్యాలు కనిపించాయి. ఆ తర్వాత పోలీసులు ముఖేశ్ జాడను కనిపెట్టలేకపోయారు. చివరికి ఘజియాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో పట్టాలపై శవంగా కనిపించారు. సీఎం నితీశ్ సంతాపం ముఖేశ్ పాండే సమర్థుడైన అధికారి అని, బక్సర్ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్గా ఆయన అందించిన సేవలు మర్చిపోలేనివని బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ అన్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.