MYS Prasad
-
విజ్ఞాన్ యూనివర్సిటీ అడ్మిషన్ నోటిఫికేషన్ విడుదల
గుంటూరు ఎడ్యుకేషన్: గుంటూరు జిల్లా వడ్లమూడిలోని విజ్ఞాన్ విశ్వ విద్యాలయంలో 2019–20 విద్యాసంవత్సరానికి వివిధ కోర్సుల్లో ప్రవేశం కోసం అడ్మిషన్ నోటిఫికేషన్ను వర్సిటీ వీసీ డాక్టర్ ఎంవైఎస్ ప్రసాద్ గురువారం విడుదల చేశారు. గుంటూరులో గురువారం జరిగిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బీటెక్, బీబీఏ, బీసీఏ, బీఎస్సీ, ఎంటెక్, ఎంబీఏ, ఎంసీఏ, పీహెచ్డీ కోర్సుల్లో ప్రవేశాలకు ఏప్రిల్ 15 నుంచి 25 వరకూ ఆన్లైన్లో (వీశాట్– 2019, వీజెట్–2019) ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు. ఏపీ, తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ ఆన్లైన్ ద్వారా ప్రవేశ పరీక్ష నిర్వహిస్తామని దీనికి ఏప్రిల్ 5 లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. వీశాట్ దరఖాస్తులు గుంటూరు, విజయవాడ, హైదరాబాద్, విశాఖపట్నం, ఏలూరు, రాజమండ్రిలోని అన్ని విజ్ఞాన్ సంస్థలు, కార్యాలయాల్లో అందుబాటులో ఉంటాయని చెప్పారు. విద్యార్థులు యూనివర్సిటీ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లోనూ దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. వీశాట్లో తొలి 50 లోపు ర్యాంకులు సాధించిన వారికి 75 శాతం, 51–100 లోపు ర్యాంకుల వారికి 50 శాతం, వంద నుంచి 200 లోపు ర్యాంకులు సాధించిన వారికి 25 శాతం, 201 నుంచి 2 వేల లోపు ర్యాంకు సాధించిన వారికి 10 శాతం ఫీజు రాయితీ ఇస్తున్నట్లు చెప్పారు. ఇంటర్ మార్కులు, జేఈఈ ప్రిలిమ్స్, మెయిన్స్, ఎంసెట్ ర్యాంకుల ఆధారంగాను ఫీజు రాయితీ ఉంటుందన్నారు. ప్రతిభావంతులైన విద్యార్థులు ఎంటెక్, ఎంబీఏ కోర్సులకు సైతం ఫీజుల్లో రాయితీ పొందొచ్చని చెప్పారు. అన్ని విభాగాల్లో 25 శాతం సీట్లను ఫీజు రాయితీ కింద కేటాయించామని వివరించారు. వీటిని పూర్తిగా ప్రతిభ ఆధారంగా భర్తీ చేస్తామని తెలిపారు. వీశాట్ పరీక్ష రాసిన వారికి బీటెక్ సీట్ల కేటాయింపులో తొలి ప్రాధాన్యం ఉంటుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో డీన్ అడ్మిషన్స్ డాక్టర్ వి.రవికుమార్, ఇన్చార్జి రిజిస్ట్రార్ డాక్టర్ పీఎంవీ రావు, డాక్టర్ కేవీ కృష్ణకిషోర్ పాల్గొన్నారు. -
మరో మైలురాయి అధికమించిన 'ఇస్రో'
-
ఎమ్ఓటీ రాడార్ ను ప్రారంభించిన షార్ డైరెక్టర్
నెల్లూరు: నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోట అంతరిక్ష కేంద్రం షార్ నుంచి ఎమ్ఓటీ రాడార్ వ్యవస్థను ఆ సంస్థ డైరెక్టర్ డా.ఎమ్వైఎస్ ప్రసాద్ ప్రారంభించారు. శుక్రవారం రాడార్ వ్యవస్థను ప్రారంభించిన ఆయన మాట్లాడుతూ.. రాకెట్ల ప్రయోగ ప్రక్రియను పరిశీలించేందుకు ఈ రాడార్ ఉపయోగపడుతుందని చెప్పారు. ప్రపంచంలో కొన్ని దేశాలకే పరిమితమైన టెక్నాలజీని మన దేశంలో ఏర్పాటుచేయడం ఎంతో గర్వంగా ఉందని డెరెక్టర్ ప్రసాద్ అన్నారు. -
షార్ డైరెక్టర్కు ‘సారాభాయ్’ అవార్డు
-
షార్ డైరెక్టర్కు ‘సారాభాయ్’ అవార్డు
సూళ్లూరుపేట: ప్రతిష్టాత్మక విక్రమ్ సారాభాయ్ స్మారక అవార్డుకు సతీష్ ధవన్ స్పేస్ సెంటర్(షార్) డెరైక్టర్ పద్మశ్రీ ఎంవైఎస్ ప్రసాద్ను ఎంపిక చేసినట్టు ఇస్రో శనివారం ఒక ప్రకటనలో తెలిపింది. ఇటీవల ముంబైలో జరిగిన భారతీయ సైన్స్ కాంగ్రెస్లో 2014-15 సంవత్సరానికిగాను షార్ డెరైక్టర్ ప్రసాద్ను ఈ పురస్కారానికి ఎంపిక చేశారు. త్వరలో జరగబోయే కార్యక్రమంలో ప్రసాద్కు పసిడి పతకంతో పాటు ప్రశంసాపత్రాన్ని అందజేయనున్నట్టు సైన్స్ కాంగ్రెస్ అధ్యక్షుడు డాక్టర్ ఎస్బీ నిమ్సే పేర్కొన్నారు. గతంలో ఈ అవార్డును ఇస్రో చైర్మన్లు ప్రొఫెసర్ సతీష్ ధవన్, డాక్టర్ కస్తూరి రంగన్, డాక్టర్ మాధవన్ నాయర్, డాక్టర్ రాధాకృష్ణన్తో పాటు డీఆర్డీవో శాస్త్రవేత్త వీకే సారస్వత్ అందుకున్నారు. దేశానికి ఎన్నో సేవలందించిన ప్రసాద్ను ఈ అవార్డుకు ఎంపిక చేయడంపై ఇస్రో శాస్త్రవేత్తలు, షార్ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు. -
అమెరికా, రష్యా, యూరప్...ఇప్పుడు భారత్
తిరుపతి : మార్స్ ఆర్బిటర్ మిషన్ (మామ్) కు నేడు కీలక పరీక్ష చేపట్టనున్నట్లు షార్ డైరెక్టర్ ఎంవైఎస్ ప్రసాద్ తెలిపారు. ఆయన సోమవారమిక్కడ మాట్లాడుతూ మధ్యాహ్నం 2.30 గంటలకు ట్రయిల్ ఆపరేషన్లో భాగంగా ప్రధాన ఇంజన్కు ఫైర్ చేస్తామన్నారు. మార్స్ ఆర్బిటర్ మిషన్ ప్రయోగం మన దేశానికి ఎంతో కీలకమైందని ఆయన అన్నారు. గత ఏడాది నవంబర్ 5న శ్రీహరి కోట నుంచి ప్రయోగించామన్నారు. అంగారకుడిపై ఇస్రో చేస్తున్న తొలి ప్రయోగమని ఎంవైఎస్ ప్రసాద్ పేర్కొన్నారు. ఇప్పటివరకు అనుకున్నట్లుగానే ప్రయోగం విజయవంతంగా సాగుతోందని, పది నెలలుగా రోదసిలో నిరంతరం మార్స్ వైపు ప్రయాణిస్తున్న మామ్ ఈ నెల 24న.. బుధవారం తెల్లవారుజామున అరుణుడిని చేరుకోన్నట్లు తెలిపారు. తమకు ఈ ప్రయోగంలో మొత్తం 5 దశలు ఉన్నాయని, ఇప్పటికే మూడు దశలు విజయవంతం అయినట్లు ఎంవైఎస్ ప్రసాద్ పేర్కొన్నారు. ప్రస్తుత ప్రయోగం కీలక దశలో ఉందని, ఇప్పటివరకు ప్రపంచంలో ఆంగారకుడిపై అమెరికా, రష్య, యూరప్ దేశాలు మాత్రమే ప్రయోగాలు చేశాయన్నారు. ఈ ప్రయోగం ఫలిస్తే ప్రపంచంలో భారత్ నాలుగో దేశంగా గుర్తింపు పొందుతుందన్నారు. మామ్ ప్రయోగం భారతదేశ భవిష్యత్కు ఎంతో ఉపయోగపడుతుందని ఆయన తెలిపారు. భారత్ గ్రహాంతర యానం చేపట్టడం ఇదే తొలిసారి. గతేడాది నవంబరు 5న శ్రీహరికోట నుంచి పీఎస్ఎల్వీ సీ-25 రాకెట్ ద్వారా మామ్ను నింగికి పంపి అంగారక యాత్రను ఇస్రో ప్రారంభించడం తెలిసిందే. రోదసిలో 300 రోజుల సుదీర్ఘ ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తిచేసిన మామ్ మరో 48 గంటల్లోనే మార్స్ను చేరుకోనుంది. ఇస్రో అంగారక యాత్రలో ఈ తుది ఘట్టం కూడా విజయవంతం అయితే గనక.. మార్స్కు ఉపగ్రహాన్ని పంపిన ఏకైక ఆసియా దేశం, తొలిప్రయత్నంలోనే మార్స్కు వ్యోమనౌకను పంపిన ఒకే ఒక్క దేశం, అమెరికా, రష్యా, ఐరోపాల తర్వాత అంగారక యాత్రను విజయవంతంగా చేపట్టిన నాలుగో దేశంగా భారత్ చరిత్ర సృష్టించనుంది. -
MYS ప్రసాద్కు గౌరవ డాక్టరేట్
-
2017 నాటికి 12 ప్రయోగాలు
షార్ డెరైక్టర్ డాక్టర్ ఎంవైఎస్ ప్రసాద్ వెల్లడి సూళ్లూరుపేట, న్యూస్లైన్: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) నుంచి 2017వ సంవత్సరానికి 12 ప్రయోగాలు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని షార్ డెరైక్టర్ డాక్టర్ ఎంవైఎస్ ప్రసాద్ తెలిపారు. 64వ గణతంత్ర వేడుకల అనంతరం ఆదివారం ఆయన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా షార్లో విలేకరులతో మాట్లాడారు. శ్రీహరికోట రాకెట్ కేంద్రం అభివృద్ధిలో భాగంగా రూ.250 కోట్ల వ్యయంతో మల్టీ ఆబ్జెక్టివ్ రాడార్ కేంద్రం ఏర్పాటుకు రంగం సిద్ధమైందని తెలిపారు. ఆయన తెలిపిన మరికొన్ని వివరాలు... ఒకేసారి రెండు రాకెట్లు అనుసంధానం చేసేందుకు సెకెండ్ వెహికల్ అసెంబ్లింగ్ బిల్డింగ్ (స్వాబ్)ను రూ.360 కోట్లతో నిర్మించేందుకు కూడా కేంద్ర ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. ఈ ఏడాదిలో ఐదు ప్రయోగాలకు సిద్ధం. మార్చి రెండోవారంలో పీఎస్ఎల్వీ సీ24 రాకెట్ద్వారా ఐఆర్ఎన్ఎస్ఎస్-1బీ ఉపగ్రహం, మేలో పీఎస్ఎల్వీ సీ26 ద్వారా జర్మనీకి చెందిన స్పాట్-07 ఉపగ్రహాన్ని, మళ్లీ ఆరు నెలల్లో మరో రెండు ఐఆర్ఎన్ఎస్ఎస్ ఉపగ్రహాలను పంపనున్నాం. -
జ్ఞాపకాలు.. మైలురాళ్లు
జిల్లా చరిత్రలో 2013 ఉద్యమనామ సంవత్సరంగా నమోదైంది. రాష్ట్ర విభజన నిర్ణయానికి నిరసనగా కనీవినీ ఎరుగని రీతిలో ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడింది. మరోవైపు ప్రజా సమస్యలపై చిత్తశుద్ధితో పోరాడేది వైసీపీయేనని ఆ పార్టీ శ్రేణులు చాటిచెప్పాయి. ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్ పైలాన్ను సీఎం కిరణ్కుమార్రెడ్డి మన జిల్లాలోనే ఆవిష్కరించారు. ప్రపంచ చరిత్రలో మైలురాయిగా నిలిచిన షర్మిల మరోప్రజాప్రస్థానం పాదయాత్ర జిల్లాలో రెండు వేల కిలోమీటర్లు దాటింది. భారీ వర్షాలు, తుపాన్లు రైతులను నిండా ముంచాయి. వైసీపీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అన్నదాతలను పరామర్శించి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. జనవరి ఉద్యమ నామ సంవత్సరం రాష్ట్ర విభజన ఖాయమన్న సంకేతాలతో జనవరి 22న ప్రజా సంఘాలు జిల్లావ్యాప్తంగా ఆందోళనలకు శ్రీకారం చుట్టాయి. ‘ఇస్రో’లో మనోడు ఇస్రో డెరైక్టర్గా ఎంవైఎస్ ప్రసాద్ బాధ్యతలు చేపట్టడంతో ఆయన స్వగ్రామమైన మొగల్తూరులో పండగ వాతారణం నెల కొంది. ‘మీ సేవ’కు అవార్డు మీ సేవలో రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిచిన జిల్లాకు రాష్ట్ర ప్ర భుత్వం అవార్డును ప్రకటించింది. హైదరాబాద్లో సీఎం చేతుల మీదుగా అవార్డును కలెక్టర్ జి.వాణీమోహన్ అందుకున్నారు. ఫిబ్రవరి క్షీరపురిలో కళాభినేత్రి పాలకొల్లులో 6వ అఖిల భారతస్థారుు నాటికల పోటీలు ప్రారంభమయ్యూరుు. సినీ నటి వాణిశ్రీని మంత్రి టీజీ వెంకటేష్ చేతుల మీదుగా సత్కరించారు. రాజకీయాల్లో ‘రవి కిరణ’ం సహకార ఎన్నికలు జరిగాయి. డీసీసీబీ చైర్మన్గా ముత్యాల రత్నం, డీసీఎంఎస్ అధ్యక్షునిగా భూపతి రాజు రవివర్మ ఎన్నికయ్యారు. ఉభయగోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ శాననమండలి సభ్యునిగా కలిదిండి రవికిరణ్వర్మ విజ యం సాధించారు. మార్చి గవర్నర్ వచ్చారు.. లేసుల్ని చూశారు రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ సీతారామపురంలో లేసు పార్కును సతీసమేతంగా సందర్శించారు. లేసు మహిళల పనితీరును మెచ్చుకున్నారు. షిండే వచ్చె.. కేంద్ర హోం మంత్రి సుశీల్కుమార్ షిండే కాళ్ల మండలం కలవపూడి, మోడి గ్రామాల్లో పర్యటించారు. మొగదిండి డ్రెరుున్పై నిర్మించనున్న వంతెన పనులకు శంకుస్థాపన చేశారు. పన్నెండు రోజుల పర్యటన టీడీపీ అధినేత ఎన్.చంద్రబాబునాయుడు చేపట్టిన ‘వస్తున్నా మీకోసం’ పాదయూత్ర ఆకివీడు మండలం దుంపగడప వద్ద జిల్లాలో ప్రవేశించింది. 12 రోజుల పాటు యాత్ర సాగింది. ఏప్రిల్ సబ్ప్లాన్ పైలాన్ ఆవిష్కరణ సీఎం కిరణ్కుమార్రెడ్డి జిల్లాలో పర్యటించారు. జంగారెడ్డిగూడెంలో ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్ పైలాన్ను ఆవిష్కరించారు. ఎస్సీలతో ముఖాముఖి నిర్వహించారు. పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. మే 5న సీఎం మరోసారి జిల్లాకు వచ్చారు. డబ్లింగ్ పనులకు శంకుస్థాపన విజయవాడ-గుడివాడ, భీమవరం-నిడదవోలు రైల్వే లైన్ డబ్లింగ్, విద్యుదీకరణ పనులకు భీమవరం టౌన్ రైల్వేస్టేషన్ లో రైల్వే శాఖ సహాయ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి శంకుస్థాపన చేశారు. మే మహా యాత్ర.. మరో చరిత్ర షర్మిల మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర చింతలపూడి మండ లం గురుభట్లగూడెం వద్ద జిల్లాలో ప్రవేశించింది. 17న కామవరపుకోట మండలం రావికంపాడులో పాదయాత్ర 2 వేల కిలోమీటర్ల మైలురాయి దాటింది. జననేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్రమ నిర్బంధానికి నిరసనగా 28న పాలకొల్లులో షర్మిల రిలే దీక్ష కూడా చేశారు. బుద్ధ పార్కు ప్రారంభం ఏలూరులో బుద్ధపార్కును ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డితో పాటు కేంద్ర మంత్రి జైరాం రమేష్ ప్రారంభించారు. ఏలూరు, దెందులూరు నియోజకవర్గాల్లో ముఖ్యమంత్రి పర్యటించారు. ఎలాంటి హామీలు ఇవ్వకపోవడంతో జిల్లా ప్రజలు నిరు త్సాహానికి గురయ్యారు. జూన్ ఎమ్మెల్యేలపై వేటు ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటేసిన అభియోగంపై గోపాలపురం ఎ మ్మెల్యే తానేటి వనిత, ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ల నాని, చింతలపూడి ఎమ్మెల్యే రాజేష్కుమార్పై అనర్హత వేటు వేశారు. వారు అంతకుమందే తమ పార్టీకి, పదవులకు రాజీనామా చేశారు. పీసీసీలో జిల్లాకు సముచిత స్థానం ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలో జిల్లాకు సముచిత స్థానం ఇచ్చారు. మొత్తం కమిటీలో 44 మందికి చోటు కల్పించగా జిల్లాకు చెందిన నలుగురికి పార్టీ పదవులు ప్రకటించారు. ఎంపీ కావూరి సాంబశివరావు, పీసీసీ మాజీ చైర్మన్ జీఎస్ రావు, కంతేటి సత్యనారాయణ, ఎమ్మెల్యే కారుమూరికి స్థానం దక్కింది. జూలై వాణీ వెళ్లె.. జైన్ వచ్చె జిల్లా కలెక్టర్గా సిద్ధార్థజైన్ బాధ్యతలు స్వీకరించారు. కలెక్టర్ జి.వాణీమోహన్ కార్యదర్శిగా పదోన్నతి పొంది బదిలీ కావటంతో ఆ స్థానంలో సిద్ధార్థజైన్ను ప్రభుత్వం నియమించింది. బాలరాజు రాజీనామా రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ వైఖరికి నిరసనగా వైసీపీ పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు రాజీనామా చేశారు. రాష్ట్ర విభజనకు అనుకూలంగా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీసుకున్న నిర్ణయంతో జిల్లా భగ్గుమంది. ఊరూరా ధర్నాలు, రాస్తారోకోలు, మానవహారాలు చేపట్టారు. ఆగస్టు ఎన్జీవోల ‘సమ్మె’ట ఈ నెలంతా సమైక్యాంధ్ర పరిరక్షణ ఉద్యమంతో జిల్లా హోరెత్తింది. ఎన్జీవోలు సమ్మె చేపట్టడంతో ఉద్యమానికి ఊపు వచ్చింది. ప్రతి పట్టణం, మండల కేంద్రంలోను ఎన్జీవోలు రిలే దీక్షా శిబిరాలు ఏర్పాటు చేశారు. ప్రతిరోజు వినూత్న రీతిలో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ఇసుక ఇబ్బందులు ఇసుక ర్యాంపులు లీజు పూర్తికావటంలో 12 ర్యాంపులు మూత ప డ్డాయి. ఇది భవన నిర్మాణ రంగంపై తీవ్ర ప్రభావం చూపింది. స్వర్ణమయికి శ్రీకారం చినవెంకన్న ఆలయ విమాన గోపురానికి బంగారు తొడుగు చే యించేందుకు దేవస్థానం స్వర్ణమయి కార్యక్రమాన్ని ప్రకటించింది. సెప్టెంబర్ జగన్కు బెయిల్.. జిల్లాలో సంబరాలు వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి బెయిల్ రావడంతో జిల్లాలో ఆ పార్టీ శ్రేణులు పండగ చేసుకున్నాయి. ప్రజలు సంబరాల్లో మునిగితేలారు. నవరత్నాలకు పురస్కారాలు జిల్లా నుంచి ఈ ఏడాది తొమ్మిది మంది అధ్యాపకులు, ఉపాధ్యాయులు రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు ఎంపికయ్యారు. ఉపాధ్యాయ దినోత్సవం నాడు హైదరాబాదులో వారు పురస్కారాలు అందుకున్నారు. బ్యాడ్మింటన్ హోరాహోరీ తణుకు ఎస్కేఎస్డీ మహిళా కళాశాలలో రాష్ట్రస్థాయి అండర్-19 బాలబాలికల బ్యాడ్మింటన్ పోటీలు హోరాహోరీగా జరిగాయి. అక్టోబర్ విద్యుత్ ఉద్యోగుల సమ్మె.. కారు చీకట్లు సమైక్యాంధ్ర పరిరక్షణ కోసం విద్యుత్ ఉద్యోగులు చేపట్టిన సమ్మెతో జిల్లా వ్యాప్తంగా విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఊరూవాడా చీకట్లు అలముకున్నాయి. ఆలకిస్తూ.. అభయమిస్తూ.. జిల్లాలో వరద బాధితులను 28న వైసీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, 30న టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు పరామర్శించారు. నవంబర్ హెలెన్ తుపాను బీభత్సం జిల్లాలో హెలెన్ తుపాను బీభత్సం సృష్టించింది. 120-130 కిలోమీటర్ల వేగంతో భీకర గాలులు వీచాయి. తుపాను తాకిడికి రెండున్నర లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతినగా, 223 ఇళ్లు ధ్వంసమయ్యాయి. జగన్ పరామర్శ తుపాను బాధితులను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పరామర్శించారు. దెబ్బతిన్న పంటలను పరిశీలించి నేనున్నానంటూ రైతులకు భరోసా ఇచ్చారు. చంద్రబాబు పర్యటన హెలెన్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పర్యటించారు. డిసెంబర్ అంతర్ కళాశాలల అథ్లెటిక్స్ పోటీలు భీమవరం డీఎన్నార్ కళాశాల క్రీడా మైదానంలో ఆంధ్రా యూనివర్సిటీ, ఆదికవి నన్నయ వర్సిటీ అంతర్ కళాశాలల అథ్లెటిక్స్ పోటీలు జరిగాయి. రెండు రోజుల పాటు నిర్వహించిన పోటీల్లో 35 కళాశాలలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు. అక్నూ ఉ మెన్ చాంపియన్షిప్ను ఏలూరు సెయింట్ థెరిస్సా మహిళా కళాశాల కైవసం చేసుకొంది. బాలుర బేస్బాల్ విజేత ‘పశ్చిమ’ ఉంగుటూరు మండలం నారాయణపురం వివేకానంద జెడ్పీ హైస్కూల్లో 59వ అండర్-14, 17 బాలబాలికల రాష్ట్రస్థాయి త్రోబాల్, బేస్బాల్ పోటీలు అట్టహాసంగా నిర్వహించారు. మూడు రోజుల పాటు జరిగిన ఈ పోటీల్లో బేస్బాల్ విజేతగా జిల్లా బాలుర జట్టు నిలిచింది. -
షార్లోని పీఈఎల్ స్టోర్స్లో అగ్నిప్రమాదం
రూ.1.25 కోట్ల మేరకు నష్టం సూళ్లూరుపేట(నెల్లూరు), న్యూస్లైన్: భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన సతీష్ ధావన్ స్పేస్ సెంటర్(షార్)లో గురువారం తెల్లవారుజాము స్ప్రాబ్ విభాగంలోని ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్ లిమిటెడ్(పీఈఎల్) అనే కాంట్రాక్టు సంస్థకు చెందిన స్టోర్స్లో అగ్నిప్రమాదం జరిగింది. దాదాపు రూ.1.25 కోట్ల మేరకు ఆస్తి నష్టం వాటిల్లినట్టు అంచనా. షార్ట్ సర్క్యూటై ప్రమాదం జరిగి ఉంటుందని షార్ వర్గాలు భావిస్తున్నాయి. స్టోర్స్లో వున్న విలువైన ఎలక్ట్రికల్స్, ఎలక్ట్రానిక్స్ పరికరాలు కాలి బూడిదయ్యాయి. ప్రమాదం జరిగిన స్టోర్స్కు కొద్దిదూరంలో వున్న క్యూరింగ్ కాస్టింగ్ ప్లాంటుకు, ఘన ఇంధన ప్లాంటుకు త్రుటిలో ప్రమాదం తప్పింది. ఈ మంటలు షార్ అటవీప్రాంతాన్ని చుట్టుముట్టినా పెద్ద ప్రమాదమే జరిగేది. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. కాగా షార్లోని రెండో ప్రయోగవేదికపై జీఎస్ఎల్వీ డీ5 అనుసంధానం కార్యక్రమం జరుగుతుండటంతో అగ్రిప్రమాదంపై షార్ ఉద్యోగులు ఉలిక్కిపడ్డారు. ప్రమాదంపై విచారణ కోసం షార్ డెరైక్టర్ డాక్టర్ ఎంవైఎస్ ప్రసాద్ ఆధ్వర్యంలో కమిటీని వేశారు. కమిటీ ప్రమాదానికి గల కారణాలు, నష్టాన్ని అధికారికంగా వెల్లడిస్తుందని షార్ డెరైక్టర్ తెలిపారు.