navaratri celebrations
-
నవరాత్రి ప్రసాదాలు: పచ్చికొబ్బరితో లడ్డు
దసరా నవరాత్రులు మొదలయ్యాయి. అమ్మవారికి ప్రసాదాలు చేయాలి. ఆ ప్రసాదాలను పిల్లలు ఇష్టంగా తినాలి. పొంగలి... పులిహోరకు తోడు ఇంకేం చేద్దాం. పచ్చికొబ్బరితో లడ్డు... మూంగ్దాల్ కోకోనట్ ఖీర్ ట్రై చేద్దాం. మూంగ్దాల్ కోకోనట్ ఖీర్ కావలసినవి: పెసరపప్పు – అరకప్పు; నీరు – ఒకటిన్నర కప్పు; కొబ్బరిపాలు – ముప్పావు కప్పు (కొబ్బరి పాలు వీలుకాక΄ోతే గేదెపాలు లేదా ఆవుపాలు); బెల్లం పొడి– ముప్పావు కప్పు; యాలకుల పొడి – అర టీ స్పూన్; జీడిపప్పు – పది; కిస్మిస్ – పది ; ఎండుకొబ్బరి పలుకులు – 2 టేబుల్ స్పూన్లు; నెయ్యి – 2 టేబుల్ స్పూన్లు; వెన్న తీయనిపాలు – అరలీటరు (పావు వంతుకు ఇంకే వరకు మరిగించాలి).తయారీ: ∙మందపాటి పెనం వేడి చేసి అందులో పెసరపప్పు వేసి మంట తగ్గించి పచ్చివాసనపోయి మంచి వాసన వచ్చే వరకు వేయించాలి. వేడి తగ్గిన తరవాత పప్పును కడిగి నీటిని ΄ోసి ప్రెషర్ కుకర్లో రెండు – మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి ∙ఈ లోపు బెల్లం పొడిని ఒక పాత్రలో వేసి నాలుగు టేబుల్ స్పూన్ల నీటిని పోసి మరిగించాలి. చిక్కబడేటప్పుడు దించి పక్కన పెట్టాలి ∙ఒక పెనంలో నెయ్యి వేడి చేసి జీడిపప్పు, కిస్మిన్, ఎండుకొబ్బరి పలుకులను వేయించి పక్కన పెట్టాలి ∙ప్రెషర్ కుకర్ వేడి తగ్గిన తర్వాత మూత తీసి పెసరపప్పును మెదపాలి. అందులో కొబ్బరిపాలు కలిపి స్టవ్ మీద పెట్టి ఒక చిన్న మంట మీద ఐదు నిమిషాల సేపు ఉడికించాలి. ఆ తర్వాత బెల్లం పాకం, యాలకుల పొడి కలిపి ఉడికించాలి. ఇప్పుడు చిక్కటి పాలను కూడా పోసి కలిపితే పెసరపప్పు పాయసం రెడీ. చివరగా నేతిలో వేయించిన జీడిపప్పు, కిస్మిస్, ఎండుకొబ్బరి పలుకులను నేతితో సహా వేసి కలపాలి. గమనిక: నీటి కొలత ప్రెషర్ కుకర్లో ఉడికించడానికి మాత్రమే. పాత్రను నేరుగా స్టవ్ మీద పెట్టి ఉడికిస్తే కనీసం మూడు కప్పుల నీరు అవసరమవుతుంది. కావలసినవి: పచ్చి కొబ్బరి తురుము – 2 కప్పులు; యాలకుల పొడి– పావు టీ స్పూన్ ; జీడిపప్పు – 10; నెయ్యి– టీ స్పూన్; చక్కెర – ముప్పావు కప్పు (రుచిని బట్టి మోతాదు మార్చుకోవాలి); పాలు – కప్పు. పచ్చికొబ్బరితో లడ్డు..తయారీ: ∙ఒక పెనంలో నెయ్యి వేడి చేసి జీడిపప్పులు వేయించి పక్కన పెట్టాలి ∙అదే పెనంలో కొబ్బరి తురుము,పాలు, చక్కెర, యాలకుల పొడి వేసి మరిగించాలి ∙మిశ్రమం అడుగుకు అంటుకోకుండా కలుపుతూ ఉండాలి. మిశ్రమం దగ్గరయ్యేటప్పుడు తరచుగా కలుపుతూ ఉండాలి పాలు, చక్కెరలను కొబ్బరి తురుము పూర్తిగా పీల్చుకుని తేమ ఇంకిన తర్వాత స్టవ్ ఆపేయాలి ∙మిశ్రమం వేడి తగ్గి గోరు వెచ్చగా ఉన్నప్పుడు అందులో జీడిపప్పు వేసి కలిపి మిశ్రమాన్ని పెద్ద నిమ్మకాయంత సైజులో చేతుల్లోకి తీసుకుని లడ్డూలు చేయాలి. గమనిక : చక్కెర బదులు బెల్లంతో కూడా చేసుకోవచ్చు. చక్కెరతో చేస్తే చూడడానికి తెల్లగా ఆకర్షణీయంగా ఉంటాయి. పిల్లలకు చక్కెర తింటే జలుబు చేసేటట్లయితే బెల్లంతో చేసుకోవచ్చు. -
ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు
-
పురాతన శైలపుత్రి ఆలయానికి భక్తుల క్యూ
వారణాసి: దేశవ్యాప్తంగా దసరా శరన్నవరాత్రులు ప్రారంభమయ్యాయి. ఈ రోజుల్లో అమ్మవారి తొమ్మిది రూపాలకు పూజలు నిర్వహిస్తారు. నవరాత్రులలో తొలి రోజున శైలపుత్రి రూపాన్ని పూజిస్తారు.శివుని నగరంగా పేర్కొనే వారణాసిలో శైలపుత్రి అమ్మవారి పురాతన ఆలయం ఉంది. నవరాత్రుల తొలిరోజున ఈ ఆలయంలో ఎంతో ఘనంగా పూజలు జరుగుతాయి. ఈ నేపధ్యంలో నేటి తెల్లవారుజాము నుంచే అమ్మవారి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. ఈ పురాతన ఆలయం వారణాసి సిటీ స్టేషన్కు కొద్ది దూరంలో ఉంది. ఈ శైలపుత్రి ఆలయాన్ని ఎవరు నిర్మించారనేది ఇప్పటికీ స్పష్టం కాలేదు.ఆలయ పూజారి మీడియాకు ఈ ఆలయానికి సంబంధించిన పురాణ కథను తెలిపారు. శైలపుత్రి అమ్మవారు శైలరాజు ఇంట్లో జన్మించారు. ఆ సమయంలో నారదుడు అక్కడికి వచ్చి, శైలపుత్రి ఎంతో ప్రతిభావంతురాలవుతుందని తెలిపారట. శైలపుత్రికి చిన్నప్పటి నుంచే మహాశివునిపై ఇష్టం ఏర్పడింది. ఆమె పెరిగి పెద్దయ్యాక కాశీకి చేరుకుని, శివుణ్ణి ప్రసన్నం చేసుకునేందుకు తపస్సు చేసింది. కుమార్తె కోసం వెదుకుతూ కాశీ చేరుకున్న శైలరాజు కూడా తపస్సు ప్రారంభించాడని చెబుతారు. అనంతర కాలంలో ఈ ప్రాంతంలో శైలపుత్రితో పాటు ఆమె తండ్రి శైలరాజు ఆలయాలు నిర్మితమయ్యాయి. శైలపుత్రి ఆలయంలో మహాశివుడు లింగ రూపంలో దర్శనమిస్తాడు.ఇది కూడా చదవండి: శోభాయమానంగా ఇంద్రకీలాద్రి -
దసరా ఉత్సవాలకు ముస్తాబైన ఇంద్రకీలాద్రి
-
శోభాయమానంగా ఇంద్రకీలాద్రిపై శ్రీ దేవీ శరన్నవరాత్రులు (ఫొటోలు)
-
సకల కోరికలు నెరవేర్చే మాత కనకదుర్గమ్మ
-
కోటి 99 లక్షల నోటుతో అమ్మవారి అలంకరణ
-
తిరుమల: కల్పవృక్ష వాహనంపై మలయప్ప స్వామి వైభవం (ఫొటోలు)
-
తిరుమల బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్పెషల్ (ఫొటోలు)
-
విల్లా మేరీ కాలేజీలో నవరాత్రి మినీ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
శారదా నవరాత్రి మరియు సరస్వతి పూజ..!
-
ఘనంగా ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రులు ప్రారంభం
-
అమ్మవారికి పంచామృతాలతో అభిషేకాలు, అర్చనలు
-
కాకినాడలో ఘనంగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు
-
పది రోజులపాటు పది అవతారాల్లో దుర్గాదేవి
-
నిజామాబాద్ లో నవమాతృకల ప్రతిష్ఠ
-
విశాఖ శారదాపీఠంలో ఘనంగా శరన్నవరాత్రి పూజలు
-
గరుడ వాహనంపై విశ్వపతి
విశ్వపతి శ్రీ వేంకటేశ్వరుడు శనివారం గరుడ వాహనంపై అంగరంగ వైభవంగా ఊరేగుతూ భక్తకోటిని అనుగ్రహించారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉదయ్ ఉమేష్ లలిత్ గరుడ వాహన సేవలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అంతకుముందు.. ఆయన ఆలయంలో స్వామివారిని దర్శించుకున్నారు. – తిరుమల దేవీ శరన్నవరాత్రోత్సవాల్లో భాగంగా ఆరో రోజు శనివారం అలంపూర్ జోగుళాంబ, బాసర సరస్వతిదేవి, శ్రీశైలం భ్రమరాంబ అమ్మవార్లను కాత్యాయనీదేవిగా అలంకరించి పూజించారు. అలాగే వరంగల్ భద్రకాళి.. భవానీదేవిగా దర్శనమిచ్చారు. – జోగుళాంబ శక్తిపీఠం(అలంపూర్)/బాసర(ముథోల్)/హన్మకొండ కల్చరల్ -
గార్బా డ్యాన్స్తో అదరగొట్టిన ఎంపీ సుప్రియా సూలే.. వీడియో వైరల్
దేవీ నవరాత్రి ఉత్సవాలు దేశవ్యాప్తంగా వైభవంగా కొనసాగుతున్నాయి. ఆడపచులు సంప్రదాయ నృత్యాలతో సంబరాలు జరుపుకుంటున్నారు. ఈక్రమంలోనే ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ తనయ, బారామతి ఎంపీ సుప్రియా సూలే గార్బా, దాండియా ఆటలతో అలరించారు. మహారాష్ట్ర ఇందాపూర్లోని లఖెవాడి ప్రాంతంలో ఆమె స్థానికులతో కలిసి బుధవారం గార్బా నృత్యం చేశారు. చేతుల్లో చెక్క కోలలు పట్టుకుని దాండియా ఆడారు. లోవెయాత్రి సినిమాలోని చొగడా పాటకు ఆమె ఆడిపాడిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. (చదవండి: తల్లి గర్భంలోనే రుచుల మక్కువ) కాగా, గుజరాత్ ప్రాంతంలో గార్బా, దాండియా నృత్యాలు సంప్రదాయంగా ఉన్నాయి. దేవి నవరాత్రుల్లో వీటిని పెద్ద ఎత్తున నిర్వహిస్తారు. ఇతర ప్రాంతాల్లో సైతం వీటికి ఈ మధ్య కాలంలో ప్రాధాన్యం పెరిగింది. ఇదిలాఉండగా.. ముంబైలోని ప్రఖ్యాత మెరైన్ డ్రైవ్లో బుధవారం యువతీయువకులు భారీ స్థాయిలో సెలబ్రేట్ చేసుకున్న గార్బా నృత్యానికి సంబంధించిన దృశ్యాలు సైతం వైరల్గా మారాయి. ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహింద్రా వాటిని సోషల్ మీడియాలో షేర్ చేశారు. నవరాత్రి ఉత్సవ వేడుకలకు ముంబై ప్రసిద్ధి అని క్యాప్షన్ జత చేశారు. (చదవండి: ఘోర రోడ్డు ప్రమాదం.. గాయపడిన చిన్నారిని చూసి కన్నీరు పెట్టుకున్న మహిళా అధికారి) -
బాసరలో ఘనంగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు
-
విశాఖ శారదా పీఠంలో ప్రారంభమైన దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు
-
దసరా నవరాత్రులకు ముస్తాబైన ఇంద్రకీలాద్రి
-
దసరా మహోత్సవాలకు సర్వం సిద్ధమైన ఇంద్రకీలాద్రి
-
అన్నపూర్ణగా రాజశ్యామల అమ్మవారు
పెందుర్తి: దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా విశాఖ జిల్లా పెందుర్తి మండలం చినముషిడివాడలోని శ్రీశారదా పీఠంలో నాలుగో రోజు ఆదివారం అన్నపూర్ణదేవిగా శ్రీశారదా స్వరూప రాజశ్యామల అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ, ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామీజీ చేతుల మీదుగా అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిగాయి. గోపూజ, గణపతి పూజ, పుణ్యాహవచనం చేశారు. లోకకల్యాణార్థం పీఠంలో చేపట్టిన శత చండీయాగం, శ్రీమత్ భాగవత పారాయణం, వేదపారాయణం, నవావరణ అర్చన శాస్త్రోక్తంగా జరిగాయి. సాయంత్రం అమ్మవారికి స్వామీజీల చేతుల మీదుగా ఏకాదశ హారతులు ఇచ్చారు. ఉత్సవాల్లో భాగంగా సోమవారం (నేడు) లలితా త్రిపుర సుందరి దేవిగా అమ్మవారు దర్శనమిస్తారని పీఠం ప్రతినిధులు వెల్లడించారు. -
నేడే ‘గణ’ వేడుక
సాక్షి, హైదరాబాద్: సాగరం సన్నద్ధమైంది. గణనాథుడికి ఘనమైన స్వాగతం చెప్పేందుకు అలలు ఉవ్విళ్లూరుతున్నాయి. మరి కొద్ది సేపట్లో ప్రారంభం కానున్న మహా ‘గణ’ ప్రభంజనానికి సకల ఏర్పాట్లు పూర్తయ్యాయి. నగరంలో వందేళ్ల క్రితమే మొదలైన వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు అంచెలంచెలుగా మహానగరమంతా విస్తరించుకున్నాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు బొజ్జగణపయ్యకు భక్తజనం ఘనంగా వేడుకలు నిర్వహిస్తూనే ఉన్నారు. చదవండి: గణేష్ నిమజ్జనం: హైదరాబాద్ మెట్రో ప్రత్యేక సేవలు తొమ్మిది రోజుల పాటు కన్నుల పండువగా సాగే ఉత్సవాలు వైవిధ్యభరితమైన హైదరాబాద్ మహానగర చరిత్రకు ఒక సమున్నతమైన ఆధ్యాత్మిక ఆవిష్కరణ. చిన్న చిన్న గల్లీలు, బస్తీలు, కాలనీలు, అపార్ట్మెంట్లు మొదలుకొని ప్రధాన రహదారుల వరకు అడుగడుగునా కొలువుదీరిన విభిన్న మూర్తుల గణనాథుడి ఉత్సవంతో నగరం సరికొత్త కాంతులను సంతరించుకుంటుంది. గతేడాది కోవిడ్ కారణంగా దేవదేవుడికి సాదాసీదాగా పూజలు చేసిన భక్తజనం ఈసారి ఘనంగా వేడుకలు నిర్వహించింది. నగరమంతటా వేలాది విగ్రహాలను ప్రతిష్టించారు. ఇష్టదైవాన్ని ఆనందో త్సాహాలతో కొలిచి మొక్కారు. ‘ కరోనా వంటి మహమ్మారులు మరోసారి ప్రబలకుండా మమ్మల్ని కాపాడవయ్యా బొజ్జ గణపయ్యా’ అంటూ భక్తులు వేడుకున్నారు. మరి కొద్ది గంటల్లో ప్రారంభం కానున్న లంబోదరుడి నిమజ్జన శోభాయాత్రతో భక్తజన సాగరం కనువిందు చేయనుంది. శోభాయాత్రలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు ప్రభుత్వం వివిధ శాఖల సమన్వ యంతో సకల ఏర్పాట్లు చేసింది. బాలాపూర్ నుంచి మొదలయ్యే నిమజ్జన శోభాయాత్ర సాఫీగా సాగేందుకు తగిన చర్యలు తీసుకుంది. ►వివిధప్రాంతాల నుంచి హుస్సేన్సాగర్కు శోభాయాత్ర మార్గాలు: 320 కి.మీ. ►ఎప్పటికప్పుడు వ్యర్థాలు తొలగించి పరిశుభ్రం చేసేందుకు యాక్షన్ టీమ్స్ : 162 ►గణేశ్ యాక్షన్ టీమ్స్ సిబ్బంది : 8,116 ►నిమజ్జనం జరిగే ప్రాంతాలు : 33 చెరువులు, 25 కొలనులు. ►విగ్రహాల నిమజ్జనానికి అందుబాటులో ఉన్న క్రేన్లు: 316 ►ట్యాంక్బండ్ పరిసరాల్లో క్రేన్లు: 40 ►అంచనా వ్యర్థాలు: 3,910 మెట్రిక్ టన్నులు ►చెత్తను తరలించేందుకు పెద్ద వాహనాలు: 44, మినీ టిప్పర్లు: 39, జేసీబీలు:21 ►ఫైర్ వాహనాలు : 38 ►బారికేడింగ్స్ : 12 కి.మీ. ►వాటర్ప్రూఫ్ టెంట్లు : 15 ►తాగునీటి పంపిణీ శిబిరాలు: 101 ►అందుబాటులో వాటర్ప్యాకెట్లు: 30 లక్షలు ►హుస్సేన్సాగర్ వద్ద ట్రాన్స్ఫార్మర్లు: 48 ►అన్ని నిమజ్జనప్రాంతాల్లో ట్రాన్స్ఫార్మర్లు: 101 ►తాత్కాలిక వీధి దీపాలు: 41,284 ►ట్యాంక్బండ్ పరిసరాల్లో ఎల్ఈడీ లైట్లు: 2600 ►హుస్సేన్సాగర్ వద్ద బోట్లు : 9 ►ట్యాంక్బండ్ వద్ద స్విమ్మర్లు: 32 ►పంపిణీకి అందుబాటులో మాస్కులు: 5 లక్షలు ►శోభాయాత్ర మార్గంలో, చెరువుల వద్ద శానిటైజర్లు ►విధుల్లో ఉండే పోలీసు సిబ్బంది: 19000 ►ట్యాంక్బండ్పై అంబులెన్సులు: 2 పోలీస్ కంట్రోల్రూమ్స్: 2 ►ఆయా ప్రాంతాల్లో వాచ్ టవర్లు ►ఎన్టీఆర్ మార్గ్లో వాటర్బోర్డు, టీఎస్ఎస్ పీడీసీఎల్, జీహెచ్ఎంసీల కంట్రోల్రూమ్స్. ►సుప్రీంకోర్టుకు చేసిన విజ్ఞప్తికనుగుణంగా చెరు వులు, కొలనులు కలుషితంకాకుండా విగ్రహాలు వేసిన వెంటనే తొలగించేందుకు ఏర్పాట్లు. ►హుస్సేన్సాగర్ ప్రాంతంలో కోవిడ్ నిరోధక వ్యాక్సినేషన్ శిబిరం శనివారం రాత్రి హుస్సేన్సాగర్లో వినాయక విగ్రహ నిమజ్జనం హెలికాప్టర్ నుంచి పర్యవేక్షణ మంత్రులు తలసాని శ్రీనివాస్యాదవ్, మహ మూద్అలీలతోపాటు డీజీపీ మహేందర్రెడ్డి, నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్లు మధ్యాహ్నం ఒంటి గంటకు, సాయంత్రం 4 గంటలకు శోభాయాత్ర, నిమజ్జనాలను హెలికాప్టర్లో ఏరియల్వ్యూ ద్వారా పరిశీలిస్తారు. వాటర్ బోర్డు మంచి నీటిసరఫరా గణేష్ నిమజ్జనానికి తరలివచ్చే భక్తులకు తాగునీటిని అందించేందుకు జలమండలి వాటర్ క్యాంపులను ఏర్పాటు చేసింది. 119 వాటర్ క్యాంపులను ఏర్పాటు చేసి, 30.72 లక్షల వాటర్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచినట్లు ఎండీ దానకిశోర్ తెలిపారు. శోభయాత్ర జరిగే అన్ని ప్రాంతాల్లో జలమండలి వాటర్ క్యాంపులు ఏర్పాటు చేశారు.అవసరమైన చోట్ల డ్రమ్ముల్లో కూడా తాగునీటిని అందుబాటులో ఉంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన చెప్పారు. క్వాలిటీ అస్యూరెన్స్ టీమ్(క్యూఏటీ)లు ఎప్పటికప్పుడు వాటర్ క్యాంపుల్లో మంచినీటి నాణ్యతను పరీక్షించడంతో పాటు క్లోరిన్ లెవల్స్ తగిన మోతాదులో ఉండేలా చూస్తాయన్నారు. అర్ధరాత్రి 2 గంటల వరకు మెట్రో ►నిమజ్జనానికి తరలి వచ్చే భక్తుల కోసం ఆదివారం ఉదయం నుంచి అర్ధరాత్రి దాటిన తరువాత 2 గంటల (సోమవారం తెల్లవారు జాము)వరకు అన్ని రూట్లలో మెట్రో రైళ్లు నడుపనున్నట్లు అధికారులు తెలిపారు. ►నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు ట్యాంక్బండ్ హుస్సేన్సాగర్కు చేరుకునేం దుకు వీలుగా ఆర్టీసీ 565 బస్సులను నడిపేందుకు ఏర్పాట్లు చేసింది. దిల్సుఖ్నగర్, ఎల్బీనగర్, తదితర ప్రాంతాల నుంచి ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ వరకు, ఉప్పల్, సికింద్రాబాద్, తదితర ప్రాంతాల నుంచి ఇందిరాపార్కు వరకు, మెహదీపట్నం, పటాన్చెరు, బీహెచ్ఈఎల్, తదితర ప్రాంతాల నుంచి ఖైరతాబాద్, లక్డీకాపూల్ వరకు ఈ బస్సులు నడుస్తాయి. ►ఆదివారం రాత్రి 10 గంటల నుంచి సోమ వారం ఉదయం 4 గంటల వరకు భక్తులకు అందుబాటులో ఉండేవిధంగా 8 ఎంఎం టీఎస్ స్పెషల్ ట్రైన్స్ నడిపేందుకు దక్షిణమ ధ్య రైల్వే చర్యలు చేపట్టింది. లింగంపల్లి– సికింద్రాబాద్, నాంపల్లి– లింగపల్లి, ఫలక్నుమా– సికింద్రాబాద్, నాంపల్లి– ఫలక్నుమా రూట్లలో ఈ రైళ్లు నడుస్తాయి. -
ఈ సర్వీస్కు బిల్లు ఎక్కడికి పంపాలి?
టీమిండియా మాజీ ఓపెనర్, బీజేపీ ఎంపీ గౌతం గంభీర్ తన కూతుళ్ల కాళ్లు కడిగి.. వారి ఆశీర్వాదం తీసుకున్నారు. మాములుగా తండ్రి కూతురి పెళ్లి చేసేటప్పుడు అల్లుడి కాళ్లు కడుగుతాడు.. కానీ గంభీర్ ఎందుకు తన కూతుళ్ల కాళ్లు కడిగాడని అనుకుంటున్నారా. శరన్నవరాత్సోవాల సందర్భంగా జరుపుకునే అష్టమి కంజక్ ఆచారంలో భాగమే ఇది. ఈ ఆచారం ప్రకారం తండ్రి తన కూతుళ్ల కాళ్లు కడిగి.. వారి ఆశీర్వాదం తీసుకోవాలి. దీంతో గంభీర్ కూడా ఆ ఆచారాన్ని పాటించారు. ఇందుకు సంబంధించిన ఫొటోను గంభీర్ను ట్విటర్లో పోస్ట్ చేశారు. అంతేకాకుండా తను చేసిన ఈ సర్వీస్కు బిల్లు ఎక్కడికి పంపాలని తన భార్య నటాషాను ఉద్దేశించి సరదాగా వ్యాఖ్యానించారు. ప్రసుత్తం ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. తండ్రి ప్రేమ వెలకట్టలేనిదని పలువురు నెటిజన్లు ఈ ఫొటోపై కామెంట్ చేస్తున్నారు. కాగా, 2018లో క్రికెట్ అన్ని ఫార్మాట్లకు గుడ్ బై చెప్పిన గంభీర్.. ఆ తర్వాత రాజకీయాల్లో చేరారు. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తూర్పు ఢిల్లీ లోక్సభ నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున పోటీ చేసి గెలుపొందారు. As a dad of two young girls, I am gradually mastering my pedicure skills...besides seeking blessings on Ashtami Kanjak!!! @natashagambhir2 where should I send the bill for my services?💅🏽💅🏽🙋🏻♂️ pic.twitter.com/tjtP7yWBl6 — Gautam Gambhir (@GautamGambhir) October 8, 2019 -
దుర్గాదేవిగా ఇంద్రకీలాద్రి అమ్మవారు
-
దుర్గాదేవిగా ఇంద్రకీలాద్రి అమ్మవారు
సాక్షి, విజయవాడ : విజయవాడ ఇంద్రకీలాద్రిలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. శరన్నవరాత్రులలో భాగంగా ఎనిమిదో రోజున అమ్మవారు దుర్గాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. కాగా, దుర్గాదేవిని దర్శించుకునేందుకు భక్తులు తెల్లవారుజాము నుంచే కొండపైకి చేరుకున్నారు. దుర్గముడు అనే రాక్షసుడిని సంహరించినందుకు ప్రతీకగా అమ్మను ఈ అవతారంలో అలంకరిస్తారు. ఎనిమిది చేతులతో, ఎనిమిది రకాలైన ఆయుధాలను ధరించి, శత్రువులను సంహరించే స్వరూపంతో అమ్మవారి రూపం కన్నులపండువ కలిగిస్తోంది. మలయప్పస్వామిగా తిరుపతి వెంకన్న తిరుమల : తిరుమలలో బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవోపేతంగా కొనసాగుతున్నాయి. తిరుమల మాడ వీధుల్లో శ్రీ మలయప్పస్వామి సూర్యప్రభ వాహనంలో ఊరేగుతున్నారు. స్వామి రథసారథిగా సూర్యుడు ఆదిత్యుని రూపంలో సారథ్యం వహిస్తున్నాడు. తిరుమల గిరులన గోవింద నామస్మరణతో ప్రతిధ్వనిస్తున్నాయి. ఈ రోజు సాయంత్రం చంద్రప్రభ వాహనం మీద స్వామి రావటంతో, దివారాత్రాల కు తానే అధినేతనని ప్రకటించినట్లు భక్తులు భావిస్తారు. చంద్రప్రభ వాహనం మీద వచ్చే స్వామి, చంద్రప్రభలకు ప్రతీకలైన తెలుపు వస్త్రాలు, తెల్లని పుష్పాలు, మాలలు ధరించటం విశేషం . -
లలితా వదనారవిందం
-
అక్టోబర్ 5న అమ్మవారిని దర్శించుకోనున్న సీఎం జగన్
విజయవాడ : ప్రతి ఏటా ఆశ్వీయుజ మాసంలో 10 రోజులపాటు జరిగే దసరా శరన్నవరాత్రి మహోత్సవాలకు విజయవాడ ఇంద్రకీలాద్రి ముస్తాబయింది. ఉత్సవ ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ మాట్లాడుతూ.. నేటి నుంచి అక్టోబర్ 8వ తేదీ వరకు దసరా ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తాం. అమ్మవారి జన్మనక్షత్రం మూల నక్షత్రం రోజైన అక్టోబర్ 5న రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పట్టువస్త్రాలు, పసుపు, కుంకుమ, గాజులు, పువ్వులు, పండ్లు సమర్పిస్తారు. మూల నక్షత్రం రోజున ఇంద్రకీలాద్రి భక్తులతో కిటకిటలాడుతుంది. అందువల్ల ఆ రోజు వీఐపీల దర్శనం రద్దు చేశాం. ఆ రోజున అన్ని క్యూలైన్లను సర్వదర్శనంగా పరిగణిస్తారు. ఉత్సవాలకు ఏపీ నుంచే కాకుండా తెలంగాణ, కర్ణాటక, ఒడిశా, తమిళనాడు నుంచి భక్తులు లక్షల సంఖ్యలో తరలిరానుండడంతో భక్తులకి ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఇంకా ఎక్కడైనా సమన్వయలోపాలుంటే ఆలయ ఈఓతో చర్చించి వాటిని సరిదిద్దుకుంటామన్నారు. -
‘అదే దక్షిణాదైతే నిన్ను ముక్కలుగా నరికేవారు’
రుతుచక్రం.. మెన్సురేషన్, పిరియడ్స్ పేరేదైనా కావచ్చు. కానీ ఇప్పటికి మన దేశంలో ఇది ఒక అంటరాని మాటే. ఆడపిల్లగా పుట్టి మహిళగా ఎదిగే క్రమంలో స్త్రీ శరీరంలో జరిగే అతి సహజమైన మార్పుల్లో ఇది ఒకటి. కానీ ఇప్పటికి మన సమాజంలో నూటికి తొంభై తొమ్మిది మంది బహిరంగంగా ఈ పేరును పలకడానికి కూడా ఇష్టపడరు. మనిషి జీవితంలో ఆకలి, నిద్ర, బాధ, కోపంలాగానే పిరియడ్స్ కూడా ఓ భాగమైనప్పుడు మరేందుకు దాన్ని గురించి మాట్లాడలంటే జంకు. ఇప్పటికి మనదేశంలో పిరియడ్స్ సమయంలో ఆడవారు ఇంట్లో అన్ని గదుల్లో తిరగకూడదు.. మరీ ముఖ్యంగా పూజ గదిలోకి కానీ, ఆలయంలోకి కానీ ప్రవేశించకూడదు. పండగలు వంటి కార్యక్రమాల్లో పాల్గొనకూడదు. అరే.. సృష్టికి మూలం స్త్రీ అయినప్పుడు.. పిరియడ్స్ పేరు చెప్పి ఆ స్త్రీనే దేవునికి దూరంగా ఉంచడం ఎంత వరకూ సమంజసం. ఇదే ఆలోచన వచ్చింది ముంబైకు చెందిన అనికేత్ మిత్రా అనే కళాకారునికి. ఈ విషయం గురించి సమాజంలో చైతన్యం కల్గించడం కోసం కాస్తా విభిన్నమైన ఆర్ట్ వర్క్ని రూపొందించారు. అయితే మంచిని ఆలోచించి చేసిన ఆర్ట్ వర్క్ కాస్తా ఇప్పుడు అతనికి సమస్యలు తెచ్చిపెట్టింది. వివరాలు.. రానున్న నవరాత్రి ఉత్సవాలను దృష్టిలో పెట్టుకుని అనికేత్ అమ్మవారి రూపాన్ని ఎవరి ఊహకు అందనటువంటి విధంగా రూపొందించారు. స్త్రీ సహజమైన రుతుక్రమాన్ని ప్రధాన థీమ్గా తీసుకున్నారు. అందులో భాగంగా శానిటరీ నాప్కిన్ మీద ఎరుపు రంగులో ఉన్న కమలాన్ని చిత్రించారు. ఈ ఎరుపు రంగును పిరియడ్స్ సమయంలో జరిగే బ్లీడింగ్కు ప్రతి రూపంగా ఎంచుకున్నానని చెప్తారు మిత్రా. శానిటరీ నాప్కిన్ వెనక భాగాన దుర్గమాతాను అలంకరించే విధంగా డెకరేట్ చేసి ఫొటో తీసి తన ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. దాంతో ఈ ఆర్ట్ వర్క్ కాస్తా సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ ఆర్ట్ వర్క్ గురించి ప్రజల్లో మిశ్రమ స్పందన వెలువడింది. ‘ఇది కోల్కతా కాబట్టి కేవలం నీ మీద కంప్లైంట్ ఇచ్చి వదిలేస్తున్నాం. అదే దక్షిణ భారతదేశంలో నువ్వు ఇలాంటి వేషాలు వేస్తే ఈ పాటికే నిన్ను ముక్కలు ముక్కలుగా నరికేసేవారు’ అంటూ విమర్శిస్తున్నారు. అంతేకాక ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేస్తే నీకే ప్రమాదం అంటూ బెదిరింపు కాల్స్ కూడా వచ్చాయని తెలిపారు అనికేత్. కానీ మరో వర్గం నెటిజన్లు అనికేత్ సృజనను మెచ్చుకోవడమే కాక ఈ ఫొటోని షేర్ చేస్తున్నారు. పోస్ట్ చేసిన 24 గంటల్లోనే దాదాపు 4 వేల మంది ఈ ఫోటోని షేర్ చేశారు. ఈ విషయం గురించి అనికేత్ మాట్లాడుతూ.. ‘మన దేశంలో స్త్రీలు పిరియడ్స్ సమయంలో తమను తామే అపవిత్రంగా భావించుకుంటారు. అందువల్లే ఎటువంటి పూజా కార్యక్రమాల్లో పాల్గొనరు. ఈ ఆలోచనను తప్పు అని చెప్పి వారిలో చైతన్యం కల్గించడం కోసమే నేను ఇలాంటి ఆర్ట్ వర్క్ని రూపొందించాను. నన్ను విమర్శించేవారిని, బెదిరించేవారిని నేను పట్టించుకోను. ఈ విషయంలో నాకు మద్దతు ఇస్తున్నవారే నాకు ముఖ్యం’ అన్నారు. పిరియడ్స్ కారణంగానే కేరళ శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలోకి 10 - 50 ఏళ్ల మహిళల ప్రవేశంపై నిషేధం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ నిషేధం చెల్లదంటూ.. శారీరక కారణాలు చెప్పి మహిళలను ఆలయంలోకి ప్రవేశించకుండా చేయడం నేరమని సుప్రీం కోర్టు తాజాగా తీర్పునిచ్చింది. -
అమ్మా... అమ్మోరు తల్లీ...
దేశ వ్యాప్తంగా నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ అందరూ ఎవరికి తోచిన విధంగా వాళ్లు ‘అమ్మా.. అమ్మోరు తల్లీ..’ అంటూ అమ్మవారిని పూజిస్తున్నారు. హిందీ తారలైతే ఇంట్లో పూజలు చేయడంతో పాటు వీధుల్లో అక్కడక్కడా పెట్టే అమ్మవారి విగ్రహాలను దర్శిస్తుంటారు. ప్రతి ఏడాదీ అమితాబ్ బచ్చన్ కుటుంబం, కాజోల్, సుస్మితా సేన్, రాణీ ముఖర్జీ వంటి తారలు తప్పనిసరిగా అమ్మవారిని సందర్శిస్తుంటారు. అందరూ ఒకే ఏరియాకి కాకపోయినా ఎవరి సౌకర్యానికి తగ్గట్టుగా వాళ్లు వెళుతుంటారు. కొడుకు, కోడలు, మనవరాలు అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యా రాయ్, ఆరాధ్యా బచ్చన్, భార్య జయాబచ్చన్, కూతురు శ్వేతానందాతో కలిసి అమితాబ్ బచ్చన్ అమ్మవారికి పూజలు నిర్వహించారు. అభి, ఐష్, ఆరాధ్యలను జనాలు చుట్టుముట్టేసి, ఫొటోలు తీయడానికి ప్రయత్నించారు. ఇక, కాజోల్ విషయానికొస్తే, కూతురు నైసా, కొడుకు యుగ్, తల్లి తనూజలతో అమ్మవారిని దర్శించుకున్నారు. ఎప్పటిలానే సందడి సందడిగా ప్రసాదం పంచారు. దత్త పుత్రికలు రీనీ సేన్, అలీషా సేన్తో సుస్మితా సేన్ అమ్మోరు తల్లికి పూజలు నిర్వహించారు. డింపుల్ బ్యూటీ ఆలియా భట్ కూడా అమ్మవారిని దర్శించుకుని, తన భక్తిని చాటుకున్నారు. ఇంకా బాలీవుడ్కి చెందిన పలువురు స్టార్స్అమ్మోరు తల్లిని భక్తి శ్రద్ధలతో పూజించారు. -
వేములవాడలో నవరాత్రి ఉత్సవాలు
-
శైలిపుత్రిగా సరస్వతీమాత
ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా బాసరలో వేంచేసి ఉన్న సరస్వతీ మాత సన్నిధిలో దసరా ఉత్సవాలు మొదలయ్యాయి. మొదటిరోజు శైలిపుత్రిగా అమ్మవారు భక్తులకు దర్శనమిస్తోంది. శనివారం వేకువజాము నుంచి భక్తులు దర్శనం కోసం క్యూకట్టారు. భైంసాపట్టణానికి చెందిన వ్యాపారవేత్త జి.రమేష్ కుటుంబసభ్యులు అమ్మవారికి రెండు తులాల బంగారు గొలుసును సమర్పించుకున్నారు -
పల్నాటిగడ్డపై వెల్లివిరిసిన నవరాత్రి శోభ
-
ఇంద్రకీలాద్రిపై ముగిసిన నవరాత్రి వేడుకలు
-
కోలాటం కలెక్షన్
నవరాత్రి రోజుల్లో ప్రతీ యేటా దాండియాకు ఒకే విధమైన డ్రెస్ ధరించాలంటే బోర్గా ఉంటుంది. అలాగని సందర్భానికి తగినట్టుగా ఉండకపోతే నలుగురిలో తేలిపోయినట్టుగా ఉంటుంది. ఈ పరిస్థితి రాకుండా ఉండాలంటే ఒక ఫ్రెష్ ట్విస్ట్ను మీ డ్రెస్లకు ఇవ్వాలి. సంప్రదాయ ఫ్యాబ్రిక్స్ ఎన్నో అందుబాటులో ఉన్న నేటి రోజుల్లో అద్దాలు కుట్టినవి ఔటాఫ్ స్టైల్ అనిపిస్తే కొద్దిపాటి మార్పులతోనే మీ డ్రెస్సింగ్ స్టైల్ను ఆకర్షణీయంగా రూపుకట్టవచ్చు. నవరాత్రి వేడుకలలో కోలాటానికి కొత్త కళ తీసుకురావచ్చు. పుల్కారి వర్క్ రంగులతో చూపరులను ఇట్టే అట్రాక్ట్ చేస్తుంది పుల్కారి వర్క్. ఇది పంజాబీ ఎంబ్రాయిడరీ. ఇండో-వెస్ట్రన్ దుస్తులకు సరిగ్గా సరిపోయే వర్క్. కుర్తీలకు, చోళీలకు, ప్లెయిన్ లెహంగాలకు, స్ట్రెయిట్ ప్యాంట్స్కు.. ఈ వర్క్ బాగా నప్పుతుంది. ఈ వర్క్ దుపట్టా , లెహంగా అంచులుగా డిజైన్ చేయించుకున్నా మీ చుట్టూ ఉన్నవారి లుక్స్ మీ వైపు తిరగకుండా ఉండవు. కట్వర్క్ లాంగ్, షార్ట్ జాకెట్స్ను కట్వర్క్తో మెరిపిస్తే వేడుకలలో హైలైట్ కాకండా ఉండరు. కుర్తా లేదా అనార్కలీ జాకెట్ కట్వర్క్ ఉన్నది ఎంచుకుంటే సింపుల్గా అనిపించడమే కాదు విభిన్నంగా అట్రాక్ట్ చేస్తుంది. ఇది సరైన ఎంపిక కూడా అవుతుంది. షిమ్మర్ ఫ్యాబ్రిక్ని కట్వర్క్కు ఎంచుకుంటే మరింత ఆకర్షణీయంగా కనపడతారు. గోటాపట్టి ఈ వర్క్ హెవీగా ఉన్నప్పటికీ లైట్వెయిట్గా చూడటానికి రిచ్గా ఉంటుంది. పెద్ద పెద్ద అంచులను లెహంగాలకు, అనార్కలీ కుర్తాలను వాడితే పండగ కళ వచ్చేసినట్టే. నిలువు, అడ్డం పట్టీలుగా ఫ్లోర్ లెంగ్త్ స్కర్ట్లకు గోటాపట్టిని వాడి చూడండి. - ఎన్.ఆర్. -
మహాలక్ష్మి మందిరానికి భద్రత పెంపు
సాక్షి, ముంబై: నగరంలోని ప్రముఖ మహాలక్ష్మీ ఆలయం నవరాత్రి ఉత్సవాలకు ముస్తాబైంది. ఉత్సవాలను పురస్కరించుకుని ఈ మందిరానికి వివిధ ప్రాంతాల నుంచి లక్షలాది భక్తులు తరలివస్తారు.వారికి అవసరమైన అన్ని సదుపాయాలను ఆలయ నిర్వాహకులు పూర్తిచేశారు. ఇప్పటికే ఈ మందిరం ఉగ్రవాదుల హిట్ లిస్టులో ఉండడంవల్ల నగర పోలీసు శాఖ బందోబస్తు మరింత పటిష్టం చేసింది. సాధారణ రోజుల్లో ఈ మందిరం ఉదయం నుంచి రాత్రి వరకు భక్తులతో కిటకిటలాడుతుంది. నవరాత్రి ఉత్సవాల్లో ఈ సంఖ్య పది రెట్లకుపైనే ఉంటుంది. భక్తులు ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఉత్సవాల సమయంలో ఎలాంటి అపశృతులు చోటుచేసుకోకుండా మందిరం, ఆలయ పరిసరాల్లో దృష్టి సారించేందుకు 60 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ప్రవేశద్వారం వద్ద మెటల్ డిటెక్టర్లు అందుబాటులో ఉంచారు. బందోబస్తులో భాగంగా 1,200 మంది పోలీసులు, హోం గార్డులు, భద్రతాదళాలు, వివిధ స్వయంసేవా సంస్థలకు చెందిన కార్యకర్తలను నియమించనున్నారు. ఈ ఉత్సవాల కోసం ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేస్తున్నారు. మందిరానికి రంగులు వేయడంతోపాటు విద్యుత్ దీపాలతో అలంకరించారు. గురువారం ఉదయం ఐదు గంటల నుంచి ఆరు గంటల వరకు ప్రత్యేక పూజలు, అర్చన, హోం కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఆ తర్వాత భక్తులను ఆలయంలోకి అనుమతిస్తారు. అయితే మందిరానికి వచ్చే భక్తులు తమ వెంట పూజా సామగ్రి మినహా బ్యాగులు, ప్లాస్టిక్ క్యారీ బ్యాగుల తీసుకురావద్దని ఆలయ యాజమాన్యం వి/ప్తి చేసింది. భక్తులు క్యూలో నిలబడేందుకు క్యాడ్బరి జంక్షన్ వరకు మండపం ఏర్పాటు చేశారు. అందులో తాగునీరు, పాదరక్షలు ఉచితంగా భద్రపర్చుకునేందుకు రెండు స్టాండ్లు అందుబాటులో ఉంచారు. మందిరం ఆవరణలో ఎలాంటి అనుమానాస్పద వస్తువులు, బ్యాగులు, వ్యక్తులు కనిపించినా వెంటనే అక్కడ విధులు నిర్వహిస్తున్న పోలీసులకు, హోం గార్డుల దృష్టికి తీసుకెళ్లాలని తెలిపారు. భక్తులకు మార్గదర్శనం చేసేందుకు మందిరం బయట భులాభాయి దేశాయి రోడ్డుపై ప్రత్యేకంగా ఒక మండపం ఏర్పాటు చేశారు. అందులో విధులు నిర్వహించే సిబ్బంది మహాలక్ష్మి రైల్వే స్టేషన్కు ఎలా వెళ్లాలి...? బెస్ట్ బస్టాపులు ఎక్కడున్నాయి...? దర్శనానికి ఎక్కడి నుంచి క్యూ కట్టాలి...? తదితర అంశాలపై భక్తులకు మార్గదర్శనం చేస్తారు. -
అమెరికాలో మన ప్రధాని ఏం తింటారు?
భారత ప్రధాని నరేంద్రమోడీ అమెరికా వస్తున్నారని.. అక్కడి వాళ్లు ఆయనకు భారీగా వండి వడ్డించాలనుకోవడం సహజం. అందులోనూ అక్కడున్న ఎన్నారైలయితే మోడీ కోసం రకరకాల గుజరాతీ వంటలు చేయించాలని భావిస్తారు. ఇక అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాతో ఎటూ విందులు ఉండనే ఉంటాయి. కానీ ఇవన్నీ ఉన్నా కూడా.. అమెరికా పర్యటనలో మోడీ ఏం పుచ్చుకుంటారో తెలుసా.. కేవలం టీ, నిమ్మరసం మాత్రమే. నిమ్మరసంలో ఓ రెండు తేనె చుక్కలు వేసుకుంటారట. ఆ పర్యటనలోనే కాదు.. దసరా శరన్నవరాత్రులు తొమ్మిది రోజులూ నరేంద్ర మోడీ ప్రతి యేటా ఇలాగే చేస్తుంటారు. అనుకోకుండా ఆయన అమెరికా పర్యటన నవరాత్రుల సమయంలోనే వచ్చింది. దాంతో ఉపవాసానికి సంబంధించిన నియమ నిబంధనలు కచ్చితంగా పాటించే మోడీ.. అక్కడ కూడా కేవలం టీ, నిమ్మరసంతోనే సరిపెట్టుకుంటారు. మోడీ గౌరవార్థం అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఓ డిన్నర్ ఏర్పాటు చేశారు. అలాగే అమెరికన్ సీఈవోలు సెప్టెంబర్ 29న బ్రేక్ఫాస్ట్ ఏర్పాటుచేశారు. వీటన్నింటికీ మోడీ తప్పకుండా హాజరవుతారని, అయితే ప్రతిచోటా ఆయన మాత్రం కేవలం టీ, నిమ్మరసం మాత్రమే తీసుకుంటారని ప్రధాని కార్యాలయ వర్గాలు తెలిపాయి. గత నాలుగు దశాబ్దాలుగా నరేంద్రమోడీ శరన్నవరాత్రుల్లో ఉపవాసం చేస్తున్నారు. తెల్లవారుజామున 4 గంటలకు లేచి, ధ్యానం, ప్రార్థనలు చేసుకుంటారని, నిమ్మరసం కూడా తానే వెంట తీసుకెళ్తారని మోడీతో గత 12 ఏళ్లుగా అత్యంత సన్నిహితంగా పనిచేస్తున్న ఓ అధికారి చెప్పారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నన్నాళ్లు ఆయన సాధారణంగా ఈ తొమ్మిది రోజుల్లో రాష్ట్రం దాటి బయటకు వెళ్లేవారు కారు. సెప్టెంబర్ 25 నుంచి అక్టోబర్ 3వ తేదీ వరకు నవరాత్రులు ఉన్నాయి. 25వ తేదీ సాయంత్రమే మోడీ అమెరికా బయల్దేరి వెళ్లి, తిరిగి అక్టోబర్ 1న భారతదేశానికి వస్తారు. డాక్టర్లు ఆయనను పళ్లు ఎక్కువగా తీసుకోవాలని, అలాగే పళ్లరసాలు కూడా తాగాలని చెప్పినా.. నవరాత్రుల్లో అవేవీ తీసుకునేది లేదని మోడీ తిరస్కరించారని గుజరాత్లో మోడీకి సన్నిహితుడైన ఓ సీనియర్ మంత్రి చెప్పారు. చాలామంది నవరాత్రుల్లో ఉపవాసం చేసినా, సూర్యాస్తమయం తర్వాత మళ్లీ దీపారాధన చేసి అప్పుడు ఆహారం తీసుకుంటారు. మోడీ మాత్రం ఆ తొమ్మిది రోజులు అసలేమీ తినరు. -
అంతా రామమయం..!
లక్కవరంలో మూడు రామాలయాలు దుర్గమ్మకు రెండు, హనుమాన్కు రెండు ఆలయాలు వెల్లివిరుస్తున్న ఆధ్యాత్మిక భావాలు చోడవరం టౌన్, న్యూస్లైన్ : ఏదైనా ఊళ్లో ఒక రామాలయం ఉండడం సహజం. ఇంకా పెద్ద ఊరైతే ఆయా కులదైవాలకు ఆలయాలు సైతం ఉంటాయి. కానీ లక్కవరంలో వీధికొకరామాలయంతోబాటు రెండు హనుమాన్ దేవాలయాలు, మరో రెండు దుర్గా మందిరాలున్నాయి. ఇంకా ఓ శివాలయం, వెంకటేశ్వర దేవస్థానంతో పాటు పైడితల్లమ్మ, నూకాలమ్మ, మరిడిమాంబ, పరదేశిమాంబ, పసలమారమ్మ అమ్మవార్ల ఆలయాలు కూడా ఉన్నాయి. అయిదువేలు జనాభా, 12 వార్డులు, 3,221మంది ఓటర్లు ఉన్న ఈ గ్రామంలో వెలమవీధిలో ఒక రామాలయం, కాపువీధిలో ఒక రామాలయం, దిగువవీధిలో ఒక రామాలయం ఉన్నాయి. శ్రీరామనవమి వేడుకలు మూడు ఆలయాల వద్ద ఎవరికి వారే నిర్వహిస్తారు. అలాగే వెలమవీధిలో ఆంజనేయస్వామి, దుర్గాదేవి ఆలయాలు, కాపువీధిలో దుర్గాదేవి, ఆంజనేయస్వామి ఆలయంలు ఉన్నాయి. వీటివద్ద కూడా దేవీ నవరాత్రి ఉత్సవాలు, హనుమాన్ మాలాదీక్షా పీఠాలతో పాటు హనుమజ్జయంతి వేడుకలు కూడా వేర్వేరుగా నిర్వహిస్తారు. అయితే శివరాత్రి ఉత్సవాలు, అమ్మవారి పండుగలు గ్రామస్తులంతా కలిసి నిర్వహిస్తారు. జమిందారీ పాలన ఉన్న నాటినుంచి కూడా వేర్వేరు ఆలయాలు, వేర్వేరుగా వేడుకలు నిర్వహించుకోవడం ఇక్కడ ఆనవాయితీగా వస్తోంది. రాజులకు కూడా రామాలయం ఉండేదని, నాలుగేళ్ల క్రితం రామాలయాన్ని తొలగించి అదే స్థానంలో భూపతి వెంకటేశ్వరస్వామి దేవస్థానాన్ని నిర్మించారు. చోడవరం పంచాయతీ పరిధిలో పది రామాలయాలు చోడవరం మేజర్ పంచాయతీ పరిధిలో గల శివారు గ్రామాలతో కలిపి పది రామాలయాలు ఉన్నాయి. ఆలయాలన్నింటి వద్ద కూడా శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు. పట్టణంలోని వెలమవీధి, బోళ్లవీధి, నౌడువీధి, ఎడ్లవీధి, అన్నవరం వెంకయ్యగారిపేట, అంబేద్కర్ కాలనీ, రేవళ్లు, బంగారమ్మపాలెం, పి.ఎస్.పేట, అలాగే పి.ఎస్.పేట బ్రాహ్మణవీధిలలో గల రామాలయాల వద్దా నవమి వేడుకలు నిర్వహిస్తారు. -
సిద్ధి గణపతికి రూ.15.87 లక్షల ఆదాయం
అయినవిల్లి,న్యూస్లైన్ : అయినవిల్లి సిద్ధివినాయకుని ఆలయంలో నవరాత్రి మహోత్సవాలు మంగళవారం ఘనంగా ముగిసాయి. స్వామివారి ఉత్సవ పందిరిలో ఏర్పాటుచేసిన మట్టి గణపతి ప్రతిమను రాత్రి సమీపంలోని పంటకాలువలో నిమజ్జనం చేశారు. ఈ సందర్భంగా వైభవంగా గ్రామోత్సవం నిర్వహించారు. నవరాత్రుల సందర్భంగా పూజాటికెట్లు , ప్రసాద విక్రయాలు, అన్నదానపథకానికి విరాళాల రూపేణా స్వామివారికి రూ.15 లక్షల 87వేల 325 అదాయం లభించినట్టు ఆలయ ఈఓ మూదునూరి సత్యనారాయణరాజు తెలిపారు. రాజమండ్రికి చెందిన మలబార్ గోల్డ్ సంస్ధ యాజమాన్యం స్వామివారి ఆలయంలో ఉచిత ప్రసాద వితరణ నిర్వహించారు. నవరాత్రులలో అయినవిల్లి వచ్చే భక్తుల సంఖ్య సమైక్యాంధ్ర ఉద్యమ నేపథ్యంలో గణనీయంగా తగ్గింది. ఏటా నవరాత్రులలో స్వామివారిని సుమారు లక్ష ఏభైవేల మంది భక్తులు దర్శించేవారని, ఈసారి 70వేల మంది మాత్రమే వచ్చారని ఆలయ అధికారులు పేర్కోన్నారు. వినాయకునికి పుష్పాలంకరణ నవరాత్రుల ముగింపు సందర్భంగా మంగళవారం అయినవిల్లి సిద్ధి వినాయకుడ్ని ప్రత్యేకంగా అలంకరించారు. నెమలి పింఛాలు, వివిధ పుష్పాలతో స్వామిని అద్వితీయంగా అలంకరించడంతో భక్తులు పరవశించారు. ఆలయ అర్చకులు మాచరి వినాయకరావు, రాజేశ్వరరావు ఈ అలంకరణ నిర్వహించారు.