నవరాత్రి ప్రసాదాలు: పచ్చికొబ్బరితో లడ్డు | Dussehra 2024 durgamma prasadad ravva laddu | Sakshi
Sakshi News home page

నవరాత్రి ప్రసాదాలు: పచ్చికొబ్బరితో లడ్డు

Published Sat, Oct 5 2024 10:04 AM | Last Updated on Sat, Oct 5 2024 12:20 PM

Dussehra 2024  durgamma prasadad ravva laddu

దసరా నవరాత్రులు మొదలయ్యాయి.  అమ్మవారికి ప్రసాదాలు చేయాలి. ఆ ప్రసాదాలను పిల్లలు ఇష్టంగా తినాలి.   పొంగలి... పులిహోరకు తోడు ఇంకేం చేద్దాం. 

పచ్చికొబ్బరితో లడ్డు... మూంగ్‌దాల్‌ కోకోనట్‌ ఖీర్‌ ట్రై చేద్దాం

మూంగ్‌దాల్‌ కోకోనట్‌ ఖీర్‌ 

కావలసినవి: పెసరపప్పు – అరకప్పు; నీరు – ఒకటిన్నర కప్పు; కొబ్బరిపాలు – ముప్పావు కప్పు (కొబ్బరి పాలు వీలుకాక΄ోతే గేదెపాలు లేదా ఆవుపాలు); బెల్లం  పొడి– ముప్పావు కప్పు; యాలకుల  పొడి – అర టీ స్పూన్‌; జీడిపప్పు – పది; కిస్‌మిస్‌ – పది ; ఎండుకొబ్బరి పలుకులు – 2 టేబుల్‌ స్పూన్‌లు; నెయ్యి – 2 టేబుల్‌ స్పూన్‌లు; వెన్న తీయనిపాలు – అరలీటరు (పావు  వంతుకు ఇంకే వరకు మరిగించాలి).

తయారీ: ∙మందపాటి పెనం వేడి చేసి అందులో పెసరపప్పు వేసి మంట తగ్గించి పచ్చివాసనపోయి మంచి వాసన వచ్చే వరకు వేయించాలి. వేడి తగ్గిన తరవాత పప్పును కడిగి నీటిని ΄ోసి ప్రెషర్‌ కుకర్‌లో రెండు – మూడు విజిల్స్‌ వచ్చే వరకు ఉడికించాలి ∙ఈ లోపు బెల్లం పొడిని ఒక పాత్రలో వేసి నాలుగు టేబుల్‌ స్పూన్‌ల నీటిని పోసి మరిగించాలి. చిక్కబడేటప్పుడు దించి పక్కన పెట్టాలి ∙ఒక పెనంలో నెయ్యి వేడి చేసి జీడిపప్పు, కిస్‌మిన్, ఎండుకొబ్బరి పలుకులను వేయించి పక్కన పెట్టాలి ∙ప్రెషర్‌ కుకర్‌ వేడి తగ్గిన తర్వాత మూత తీసి పెసరపప్పును మెదపాలి. అందులో కొబ్బరిపాలు కలిపి స్టవ్‌ మీద పెట్టి ఒక చిన్న మంట మీద ఐదు నిమిషాల సేపు ఉడికించాలి. ఆ తర్వాత బెల్లం పాకం, యాలకుల పొడి కలిపి ఉడికించాలి. ఇప్పుడు చిక్కటి పాలను కూడా పోసి కలిపితే పెసరపప్పు పాయసం రెడీ. చివరగా నేతిలో వేయించిన జీడిపప్పు, కిస్‌మిస్, ఎండుకొబ్బరి పలుకులను నేతితో సహా వేసి కలపాలి. 

గమనిక: నీటి కొలత ప్రెషర్‌ కుకర్‌లో ఉడికించడానికి మాత్రమే. పాత్రను నేరుగా స్టవ్‌ మీద పెట్టి ఉడికిస్తే కనీసం మూడు కప్పుల నీరు అవసరమవుతుంది. కావలసినవి: పచ్చి కొబ్బరి తురుము – 2 కప్పులు; యాలకుల పొడి– పావు టీ స్పూన్‌ ; జీడిపప్పు – 10; నెయ్యి– టీ స్పూన్‌; చక్కెర – ముప్పావు కప్పు (రుచిని బట్టి మోతాదు మార్చుకోవాలి); పాలు – కప్పు.

 
పచ్చికొబ్బరితో లడ్డు..

తయారీ: ∙ఒక పెనంలో నెయ్యి వేడి చేసి జీడిపప్పులు వేయించి పక్కన పెట్టాలి ∙అదే పెనంలో కొబ్బరి తురుము,పాలు, చక్కెర, యాలకుల పొడి వేసి మరిగించాలి ∙మిశ్రమం అడుగుకు అంటుకోకుండా కలుపుతూ ఉండాలి. మిశ్రమం దగ్గరయ్యేటప్పుడు తరచుగా కలుపుతూ ఉండాలి పాలు, చక్కెరలను కొబ్బరి తురుము పూర్తిగా పీల్చుకుని తేమ ఇంకిన తర్వాత స్టవ్‌ ఆపేయాలి ∙మిశ్రమం వేడి తగ్గి గోరు వెచ్చగా ఉన్నప్పుడు అందులో జీడిపప్పు వేసి కలిపి మిశ్రమాన్ని పెద్ద నిమ్మకాయంత సైజులో చేతుల్లోకి తీసుకుని లడ్డూలు చేయాలి. 

గమనిక : చక్కెర బదులు బెల్లంతో కూడా చేసుకోవచ్చు. చక్కెరతో చేస్తే చూడడానికి తెల్లగా ఆకర్షణీయంగా ఉంటాయి. పిల్లలకు చక్కెర తింటే జలుబు చేసేటట్లయితే బెల్లంతో చేసుకోవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement