outskirts
-
24 గంటలు గడిచినా జాడలేని తల్లి పులి..బిక్కుబిక్కు మంటున్న కూనలు
సాక్షి, అమరావతి/కొత్తపల్లి: నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం పెద్దగుమ్మడాపురం గ్రామ శివారులోని ఓ గోడౌన్లో సోమవారం ఉదయం నాలుగు పెద్దపులి పిల్లలు కనిపించడంతో కలకలం రేగింది. ఆ నాలుగు ఆడ పులి పిల్లలను తల్లి వద్దకు చేర్చేందుకు అటవీశాఖ అధికారులు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు పిల్లల కోసం తల్లి పులి వచ్చి దాడి చేస్తుందని పెద్దగుమ్మడాపురం గ్రామస్తులు భయాందోళనలకు గురవుతున్నారు. ఆత్మకూరు అటవీ డివిజన్ పరిధిలోని కొత్తపల్లి మండలం పెద్దగుమ్మడాపురం గ్రామం నల్లమల అటవీ ప్రాంతానికి ఆనుకుని ఉంటుంది. గ్రామస్తులు ఉదయం కాలకృత్యాలు తీర్చుకునేందుకు అటవీ ప్రాంతానికి వెళుతుంటారు. ఈ క్రమంలో సోమవారం ఉదయం ఓ యువకుడు గ్రామానికి చివర నిర్మాణంలోని మల్టీపర్పస్ గోడౌన్ అవతలివైపునకు వెళ్లగా, పులిపిల్లల అరుపులు వినిపించాయి. మొదట జంగం పిల్లులుగా భావించినా.. దగ్గరకు వెళ్లి చూడగా నాలుగు పులి పిల్లలు కనిపించాయి. అతను వెంటనే ఈ విషయాన్ని గ్రామస్తులకు తెలియజేశాడు. స్థానికుల సమాచారం మేరకు ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ నాగేశ్వరావు, సిబ్బంది పెద్దగుమ్మడాపురం చేరుకుని నాలుగు పులి పిల్లలను పరిశీలించారు. సుమారు 40రోజుల వయసు కలిగిన పులి పిల్లలను అడవిలోకి తీసుకువెళ్లి తల్లితో కలిపేందుకు ప్రయత్నించారు. మూడు గంటలు అడవిలో తిరిగినా తల్లి కనిపించలేదు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో పులిపిల్లలు డీలా పడిపోయాయాయి. దీంతో వాటికి పాలు పట్టించి బైర్లూటి రేంజ్లో ఉన్న జంతువైద్యశాలకు తరలించారు. అక్కడ పరీక్షలు చేసి నాలుగు పిల్లలు ఆరోగ్యంగా ఉన్నాయని నిర్ధారించారు. అటవీ ప్రాంతంలో ఎండ పెరగడం, చెట్లకు మంట పెడుతుండటంతో వేడి తీవ్రత తట్టుకోలేక గ్రామంలోకి పెద్దపులి తన పిల్లలను తీసుకువచ్చి, ఒంటరిగా తిరిగి వెళ్లి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. ఆత్మకూరు సర్కిల్ సీఐ ఆర్జీ సుబ్రహ్మణ్యం పరిస్థితిని సమీక్షించారు. ఈ విషయమై సున్నిపెంట బయోడైవర్సిటీ రేంజ్ అధికారి మహమ్మద్ హయత్ మాట్లాడుతూ గ్రామస్తులు ఎలాంటి భయాందోళనలకు గురికావొద్దని, పులి రాకను గమనిస్తే వెంటనే అధికారులకు సమాచారం అందించాలని సూచించారు. పెద్ద పులికి రెండు, మూడు పిల్లలే పుడతాయని, అయితే నాలుగు ఆడ పులి పిల్లలు పుట్టడం చాలా అరుదని ఆయన తెలిపారు. ఎన్క్లోజర్లో పెట్టి.. తల్లి కోసం ఎదురుచూస్తూ.. పులి పిల్లలను తల్లి దగ్గరకు చేర్చేందుకు నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ (ఎన్టీసీఏ) నిబంధనల ప్రకారం అధికారులు, సిబ్బందితో ఒక కమిటీని ఏర్పాటు చేసినట్లు ప్రాజెక్ట్ టైగర్ సర్కిల్ ఏసీఎఫ్ (అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్) ఆర్.శ్రీనివాసరెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. పులి పిల్లలు దొరికిన సమీపంలోనే చిన్న ఎన్క్లోజర్లో వాటిని ఉంచి దూరం నుంచి తల్లి వస్తుందో.. లేదో.. అని గమనిస్తున్నట్లు తెలిపారు. చుట్టూ 50 కెమెరా ట్రాప్లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. పిల్లల వాసన, అరుపులను బట్టి తల్లి వస్తుందని భావిస్తున్నామని, వస్తే వాటిని దానికి జత చేస్తామన్నారు. అలాకాకుండా అడవిలో వదిలేస్తే అవి ఇతర జంతువుల బారినపడతాయని చెప్పారు. ఐతే 24 గంటలు గడిచినా తల్లి పులి జాడ లేదు. దీంతో అధికారులు ఒకటి, రెండు రోజులు చూసిన తర్వాత కూడా తల్లి రాకపోతే వాటిని తిరుపతి జూకు తరలించి సంరక్షించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఈ మేరకు ఆ కూనలు సంరక్షణ కోసం తిరుపతి వన్య ప్రాణి బృందం మంగళవారం ఆత్మకూరు రానుంది. ఇదిలా ఉండగా, సమీపంలోనే సంచరిస్తున్న తల్లి! పులి పిల్లలు లభించిన ప్రాంతంలోనే తల్లి పులి తిరుగుతున్నట్లు దాని గాండ్రిపుల ద్వారా అటవీ సిబ్బంది గుర్తించారు. ఈ తల్లి పులిని డిసెంబర్ నెలలో కెమెరా ట్రాప్లో గుర్తించినట్లు అటవీ శాఖాధికారులు చెబుతున్నారు. ఆ సమయంలో అది గర్భంతో ఉంది. ఇప్పుడు దాని పిల్లలే పెద్దగుమ్మడాపురంలో ఉన్నట్లు భావిస్తున్నారు. (చదవండి: ఎంఎస్ఎంఈల్లో రాణిస్తున్న మహిళలు) -
శివార్లలో వ్యర్థాల డంపింగ్..
దుండిగల్: నింగి, నేలా, నీరు.. అన్నీ కాలుష్యం బారిన పడుతున్నాయి. మానవ మనుగడకు జీవనాధారమైన వీటిని విషతుల్యంగా కొందరు మారుస్తున్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని జీడిమెట్ల, దూలపల్లి, అటు సంగారెడ్డి జిల్లా పరిధిలోకి వచ్చే గడ్డపోతారం పారిశ్రామికవాడల్లో వందలాది రసాయన పరిశ్రమల నుంచి నిత్యం వెలువడే ఘన, ద్రవ వ్యర్థాలను నగర శివారు ప్రాంతాల్లో డంపింగ్ చేస్తున్నారు. ఓ వైపు పీసీబీ టాస్క్ ఫోర్స్ ఉన్నా లేనట్లుగా వ్యవహరిస్తుండటంతో.. డంపింగ్ మాఫియా ఆగడాలకు అంతే లేకుండా పోతోంది. చెట్టు పూట్టా అనే తేడా లేకుండా ఖాళీ ప్రదేశం కనిపిస్తే చాలు డంప్ చేసేస్తున్నారు. చివరకు చెరువులు, కుంటలను కూడా వదలడం లేదు. ఇప్పటికే నగర శివారులోని కుంటలు, చెరువుల్లో శిఖం భూముల్లో నిత్యం రసాయనాల డంపింగ్ నిరాటంకంగా కొనసాగుతోంది. దీంతో స్థానికులు చర్మ, శ్వాస కోశ వ్యాధుల బారిన పడుతున్నారు. అర్ధరాత్రి వేళల్లో గుట్టు చప్పుడు కాకుండా.. పరిశ్రమల్లో ఉత్పత్తుల సమయంలో వెలువడే రసాయన, ఘన వ్యర్థాలు జేఈటీఎల్కు తరలించాల్సి ఉండగా అది ఖర్చుతో కూడుకున్నది కావడంతో పరిశ్రమల యాజమాన్యాలు డంపింగ్ మాఫియాలను ఆశ్రయిస్తున్నాయి. దీంతో వివిధ పరిశ్రమల నుండి సేకరించే వ్యర్థాలను రాత్రిపూట టీడీసీఎం, ట్రాక్టర్లలో తరలించి నగర శివారులోని ప్రభుత్వ భూములు, కుంటలు, అటవీ స్థలాల్లో పారబోస్తున్నారు. ఘాటైన వాసనలతో ఉక్కిరిబిక్కిరి.. దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని డీపోచంపల్లి, సారెగూడెం, దుండిగల్ తండా–1, 2 ప్రాంతాల వాసులు ఎక్కువగా ఈ రసాయనాల డంపింగ్లతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. రాత్రైందంటే చాలు ఘాటైన వాసనలతో ఈ ప్రాంత వాసులు ఊపిరాడక ఇబ్బందులు పడుతున్నారు. చిన్నారులు, వృద్ధులు, మహిళలపై ఈ రసాయనాలు తీవ్ర దుష్ప్రభావాన్ని చూపుతున్నాయి. ఈ అక్రమ డంపింగ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. కానరాని పీసీబీ టాస్క్ ఫోర్స్.. రసాయన పరిశ్రమలపై నిరంతరం నిఘా ఉంచేందుకు ఏర్పాటు చేసిన పీసీబీ టాస్క్ ఫోర్స్ దాదాపు పనిచేయడం లేదనే చెప్పవచ్చు. ఏదైనా ప్రాంతంలో రసాయనాలు డంప్ చేశారని ఫిర్యాదు వచ్చిన సమయంలోనే అధికారులు హడావుడి చేసి సంబంధిత శాంపిళ్లను తీసుకు వెళ్తున్నారేÆ తప్ప ఇప్పటి వరకు ఏ ఒక్క పరిశ్రమపై చర్యలు తీసుకున్న దాఖాలు లేవు. అనువైన ప్రాంతం.. మున్సిపాలిటీ పరిధిలో ఔటర్ రింగ్ రోడ్డు మల్లంపేట నుంచి దుండిగల్ వరకు విస్తరించి ఉంది. దీనికి తోడు ఇక్కడ వేల ఎకరాల ప్రభుత్వ స్థలం, నిర్మానుష్య ప్రాంతాలు అధికంగా ఉన్నాయి. దీంతో కెమికల్ మాఫియా ఇదే అనువైన ప్రాంతంగా భావించి గడ్డపోతారం, ఖాజిపల్లి, బొల్లారం ప్రాంతాల నుంచి రాత్రికి రాత్రే భారీ ఎత్తున రసాయనాలను తీసుకువచ్చి పారబోస్తున్నారు. మచ్చుకు కొన్ని.. 2021 జూన్ 7న గాగిల్లాపూర్ తండాకి వెళ్లే దారిలో ఓ పరిశ్రమ మెడికల్ వేస్టేజీని డంప్ చేసింది. జూన్ 9, 11 తేదీల్లో దుండిగల్ నుంచి గాగిల్లాపూర్ తండాకు వెళ్లేదారిలో ఉన్న గుర్జకుంటలో భారీ ఎత్తున రసాయనాలను డంప్ చేశారు. ఇదే నెలలో దుండిగల్ ఔటర్ రింగ్ రోడ్డు నుంచి ఎంఎల్ఆర్ఐటీకి వెళ్లే దారిలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణాల వద్ద సుమారు 100కు పైగా డ్రమ్ముల్లో రసాయనాలను డంపింగ్ చేశారు. పీసీబీ బాధ్యత వహించాలి.. తండాల సమీపంలోని చెరువులు, ఖాళీ ప్రదేశాల్లో భారీ ఎత్తున ఘన, ద్రవ రసాయన వ్యర్థాలను డంప్ చేస్తున్నా పీసీబీ అధికారులు స్పందించడం లేదు. పత్రికల్లో కథనాలు ప్రచురితమైన సమయాల్లోనే వచ్చి హడావుడి చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు కళ్లు తెరిచి ప్రజలు అనారోగ్యం పాలు చేస్తున్న వారిపై కఠినంగా వ్యవహరించాలి.– శివనాయక్, బీజేఎం మున్సిపల్ ప్రెసిడెంట్ -
శివార్లకు కొత్త నీటి పథకం
సాక్షి, హైదరాబాద్: ఔటర్ రింగ్ రోడ్డు(ఓఆర్ఆర్) లోపల చుట్టూ ఉన్న 190 గ్రామాలకు తాగునీటి సరఫరా కోసం రూ.628 కోట్లతో కొత్త ప్రాజెక్టు నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. జీహెచ్ఎంసీకి శివార్లలో ఉన్న ఈ గ్రామాలకు సరైన నీటి సరఫరా లేకపోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ గ్రామాలకు నీటి సరఫరా బాధ్యతలను గ్రామీణ నీటి సరఫరా విభాగం(ఆర్డబ్ల్యూఎస్) నుంచి జల మండలికి బదలాయించాలని, ప్రైవేటు పబ్లిక్ భాగస్వామ్య(పీపీపీ) పద్ధతిలో ఇంటింటికి నీటిసరఫరా కోసం రూ.628 కోట్ల అంచనా వ్యయంతో కొత్త తాగునీటి ప్రాజెక్టును నిర్మించాలని చాలా కాలంగా ప్రతిపాదనలు ఉన్నాయి. వీటిని ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించడంతో.. ఈ ప్రాజెక్టు పనులకు పాలనాపర అనుమతులు ఇస్తూ ఒకట్రెండు రోజుల్లో రాష్ట్ర పురపాలక శాఖ ఉత్తర్వులు జారీ చేయనుందని తెలిసింది. మిషన్ భగీరథ పథకంలో అంతర్భాగంగానే ఈ కొత్త తాగునీటి సరఫరా ప్రాజెక్టును నిర్మించనున్నారు. -
ఢిల్లీ శివారులో ఉద్రిక్తత
న్యూఢిల్లీ: ఒక రోడ్డు ప్రమాదం దేశ రాజధాని ఢిల్లీ శివారు ప్రాంతంలో పోలీసులు, సామాన్యులకు మధ్య ఘర్షణకు తావిచ్చింది. నిరసనకారులు భారీ స్థాయిలో ఆందోళనకు దిగడంతో వారిని నిలువరించేందుకు పోలీసులు కాల్పులు జరపగా ఒక ఆందోళన కారుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన ఢిల్లీ శివారులోని హోలాంబి కలాన్ లో చోటుచేసుకుంది. అసలేం జరిగిందంటే.. గురువారం మధ్యాహ్నం ప్రాంతంలో ఓ స్కూల్ బస్సు మూడేళ్ల పసిపాపను ఢీకొట్టి ఆ పాప ప్రాణాలుపోయేందుకు కారణమైంది. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. భారీ సంఖ్యలో అక్కడికి నిరసనలు తెలిపేందుకు వచ్చారు. ఈ క్రమంలో వారిని పోలీసులు అడ్డుకోగా తిరగబడ్డారు. రాళ్లతో దాడి చేశారు. దీంతో తొలుత భాష్పవాయుగోళాలు ప్రయోగించిన పోలీసులు అనంతరం ఫైరింగ్ చేశారు. దీంతో ఆందోళనకారుల్లో ఒకరు మృతిచెందాడు. -
విశాఖ శివారులో గ్యాస్ ట్యాంకర్ బోల్తా
-
బెజవాడ శివార్లలో వేగంగా విస్తరిస్తున్న విష జ్వరాలు
-
రాయచోటి శివార్లలో ఒంటెల మేళా