pakistan artists
-
పాక్ నటులపై బ్యాన్.. అంతా రాజకీయమే!: బాలీవుడ్ నటుడు
పాకిస్తాన్ నటులపై బ్యాన్ విధించాల్సిన అవసరం ఏముందని ప్రశ్నిస్తున్నాడు బాలీవుడ్ నటుడు రాజీవ్ ఖందేల్వాల్. వాళ్లు నటులు మాత్రమేనని, ఏజెంట్లు కాదని మండిపడ్డాడు. తాజాగా ఇతడు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. రాజకీయాల వల్లే పాక్ నటులపై నిషేధం విధించారు. ఇది చాలా తప్పు పెద్దు. ఆర్టిస్టులపై బ్యాన్ విధించడానికి రాజకీయ నాయకులకు ఏం హక్కు ఉంది? మనల్ని నిర్దేశించడానికి వీళ్లెవరు?చిచ్చు పెట్టే పార్టీలువాళ్లు ఎప్పుడూ కూడా ఒకటే ఫాలో అవుతారు. రెండు దేశాల మధ్య ప్రేమ చిగురించడాన్ని అస్సలు ఒప్పుకోరు. అదెందుకో మరి నాకర్థం కాదు. మనమెప్పుడూ శాంతి, సామరస్యం అని మాట్లాడుతూ ఉంటాం. కానీ అవి ఉన్న చోట కూడా ఈ రాజకీయ పార్టీలు హిందూ, ముస్లిం అన్న కోణాన్ని తీసుకొస్తాయి. అదెంత దారుణం. పాకిస్తాన్ ప్రభుత్వం ఆర్టిస్టులను ఏజెంట్లుగా ఏమీ పంపట్లేదు. అది సరి కాదుఅయినా వారిని భారతీయ సినిమాల్లో నటించేదుకు ఒప్పుకోకపోవడం కరెక్ట్ కాదు అని అభిప్రాయపడ్డాడు. కాగా రాజీవ్.. కహీ తో హోగా, సచ్ కా సామ్నా అనే సీరియల్స్లో నటించాడు. 2008లో వచ్చిన ఆమిర్ చిత్రంతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చాడు. షైతాన్, టేబుల్ నెం.21 చిత్రాల్లో మెరిశాడు. ఇటీవల వచ్చిన షో టైమ్ వెబ్ సిరీస్ రెండో సీజన్లోనూ మెప్పించాడు.చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 20 సినిమాలు.. ఆ నాలుగు స్పెషల్ -
పాక్ మోడల్ ఫొటోలు వైరల్.. సిక్కు మతస్థుల ఆగ్రహం..
Pakistan Model Apologises After Her Photos Went Viral: సిక్కు మతస్థులు తమ మతాన్ని, సంస్కృతిని, ఆచార్యవ్యవహారాలను ఎంతో గౌరవిస్తారు. ఆలయాల్లో వారి ఆచారాలు పాటించకుండా, అగౌర్వపరిస్తే అస్సలు ఊరుకోరు. ఎదుటివారు ఎలాంటివారైనా తమదైన స్టైల్లో విరుచుకుపడతారు. ఇటీవల ఒక పాకిస్థాన్ మోడల్పై ఆ దేశ సిక్కు మతస్థులు గరంగరంగా ఉండడంతో క్షమాపణలు చెప్పింది. పంజాబ్లోని కర్తార్పూర్ గురుద్వారా దర్బార్ సాహిబ్లో మోడల్ సౌలేహ ఒట్టి తలతో (హెడ్ కవర్ లేకుండా) ఉన్న ఫొటోలను ఇన్స్టా గ్రామ్లో పంచుకుంది. అది చూసిన మతస్థులు తమ మనోభావాలు దెబ్బతీసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో వారికి క్షమాపణలు చెబుతూ అదే ఇన్స్టా గ్రామ్లో పోస్ట్ పెట్టింది ఆ మోడల్. 'ఇటీవల నేను ఇన్స్టాలో ఒక ఫొటోను పోస్ట్ చేశాను. నేను చరిత్ర, సిక్కు సమాజం గురించి తెలుకోవడానికి కర్తార్పూర్కి వెళ్లాను. అంతేగానీ ఎవరి మనోభావాలను దెబ్బతీయాలని అనుకోలేదు. నేను ఎవరినైనా బాధపెట్టి ఉంటే, వారి సంస్కృతిని అగౌరపరిచానని భావిస్తే నన్ను క్షమించండి. అక్కడ ఫొటోలు తీసే ప్రజలను చూశాను. నేను సిక్కు మతానికి సంబంధించిన ఫొటోలు కూడా తీసుకున్నాను. అక్కడ అలా చేయాల్సింది కాదు. నేను సిక్కు సంస్కృతిని చాలా గౌరవిస్తాను. ఈ ఫొటోలు నేను అక్కడికి వెళ్లనట్లుగా జ్ఞాపకంలో భాగం మాత్రమే. అంతకు మించి ఏమి లేదు. భవిష్యత్తులో వీటి గురించి మరింత అవగాహనతో ఉంటాను. ఇలాంటి చర్యలకు దూరంగా ఉంటాను. అలాగే నేను ఇది ఉద్దేశపూర్వకంగా చేసింది కాదని ప్రజలు తప్పక తెలుసుకోవాలి. అది అందరికీ తెలిసేలా చేయండి.' అని మోడల్ సౌలేహ సంజాయిషీ ఇచ్చుకుంది. View this post on Instagram A post shared by Sauleha صالحہ امتیاز 🇵🇰 (@swalaaa_lala) అయితే కర్తార్పూర్ సాహిబ్ గురుద్వారా ఆలయం లోపల సోమవారం మోడల్ తల చుట్టూ ఎలాంటి వస్త్రం లేకుండా ఫోజులిచ్చిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో శిరోమణి అకాలీదళ్ అధికార ప్రతినిధి మంజీందర్ సింగ్ సిర్సా కూడా సౌలేహను విమర్శించారు. 'శ్రీ గురునానక్ దేవ్ జీ పవిత్ర స్థలంలో ఇలాంటి ప్రవర్తన, చర్య పూర్తిగా ఆమోదయోగ్యం కాదు. ఆమె పాకిస్థాన్లోని తన మత స్థలంలో కూడా ఇలాగే చేస్తుందా ? అలా చేయడానికి ధైర్యం ఉందా ? కర్తార్పూర్ సాహిబ్ పిక్నిక్ స్పాట్ అనుకుంటున్న పాకిస్థాన్ ప్రజలు ధోరణిపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుంటుంది.' అని మంజీందర్ సింగ్ సిర్సా ట్వీట్ చేశారు. అయితే పాకిస్థాన్ పంజాబ్లోని కర్తార్పూర్ సాహిబ్ గురుద్వారా సిక్కులకు పవిత్రస్థలం. Such behaviour & act at pious place of Sri Guru Nanak Dev Ji is totally unacceptable! Can she dare to do the same at her religious place in Pakistan?@ImranKhanPTI @GovtofPakistan shd tk immed action to stop this trend of treating Sri Kartarpur Sahib as picnic spot by Pak people pic.twitter.com/AwyIkmqgbC — Manjinder Singh Sirsa (@mssirsa) November 29, 2021 -
'పాకిస్థాన్ నుంచి అన్నీ ఆపేయండి'
-
'పాకిస్థాన్ నుంచి అన్నీ ఆపేయండి'
ముంబై: పాకిస్థాన్ నటీనటులపై నిషేధం విషయంలో ప్రభుత్వం కపటబుద్ధితో వ్యవహరిస్తోందని బాలీవుడ్ హీరో అభయ్ డియోల్ విమర్శించాడు. పాకిస్థాన్ తో సంబంధాలు తెంచుకోవాలని భావిస్తే ఆ దేశానికి చెందిన అన్నిటిపైనా నిషేధం విధించాలని డిమాండ్ చేశాడు. 18వ జియో 'మామి' ఫిల్మ్ ఫెస్టివల్ లో అతడు మాట్లాడుతూ... మిగతావి అన్ని వదిలేసి పాకిస్థాన్ కళాకారులపైనే ఆంక్షలు విధించడం సరికాదన్నాడు. 'పాకిస్థాన్ కు చెందిన వాటిని నిషేధించాలనుకుంటే అన్నిటిపైనా ఆంక్షలు విధించండి. ఒక్క సినిమాలనే నిషేధించడం సరికాదు. పొరుగు దేశం నుంచి ఎగుమతులు, దిగుమతులు కూడా ఆపేయండి. మీరు సగం పనిచేస్తే ఎవరూ సీరియస్ గా తీసుకోరు. నేను కూడా ప్రభుత్వాన్ని సీరియస్ గా తీసుకోను. పాకిస్థాన్ కు చెందిన వాటిపై నిషేధం వల్ల మన సైనికులకు మంచి జరుగుతుందనుకుంటే నేను తప్పకుండా సమర్థిస్తాను. అంతేకాని ఈ వివాదంపై అనవసరం రాద్ధాంతం చేయడం మంచిది కాద'ని అభయ్ డియోల్ స్పష్టం చేశాడు. పాకిస్థాన్ కళాకారులు నటించిన సినిమాలను అడ్డుకుంటామని ఎమ్మెన్నెస్ హెచ్చరించిన నేపథ్యంలో ఆయన ఈ విధంగా స్పందించారు. -
ఆ సినిమా చూడొద్దని మీరెలా చెబుతారు?
న్యూఢిల్లీ: సినిమా ధియేటర్లపై దాడులు చేసే హక్కు మహారాష్ట్ర నవ నిర్మాణ సేన(ఎమ్మెన్నెస్)కు లేదని కేంద్ర మంత్రి బాబూల్ సుప్రియో అన్నారు. ఎమ్మెన్నెస్ రౌడీల పార్టీ అని దుయ్యబట్టారు. ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోందని మండిపడ్డారు. ప్రేక్షకులు ఏ సినిమా చూడాలో, చూడకూడదో నిర్ణయించే అధికారం ఎమ్మెన్నెస్ లేదని పేర్కొన్నారు. శాంతిభద్రతలకు భంగం కలిగించడం సరికాదన్నారు. ఉడీలో ఉగ్రవాదుల దాడి జరిగిన తర్వాతే పాకిస్థాన్ నటులను నిషేధించాలన్న డిమాండ్ తెరపైకి వచ్చిందని, ఇప్పుడు విడుదలవుతున్న సినిమాలు భారత్-పాక్ సంబంధాలు సవ్యంగా ఉన్నప్పుడు తీసినవని వివరించారు. కాగా, నిన్న తనపై దాడి చేసిన తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలను అరెస్ట్ చేయకుండా బీజేపీ కార్యకర్తలను అదుపులోకి తీసుకోవడాన్ని ఆయన తప్పుబట్టారు. పశ్చిమబెంగాల్ ప్రభుత్వం అవమానకరంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. -
'మహేశ్ భట్ మూర్కుడు'
ముంబై: పాకిస్థాన్ నటీనటులు నటించిన సినిమాలను ప్రదర్శించరాదని సినిమా ధియేటర్ యజమానుల సంఘం తీసుకున్న నిర్ణయాన్ని మహారాష్ట్ర నవనిర్మాణ సేన(ఎమ్మెన్నెస్) స్వాగతించింది. పాకిస్థాన్ నటీనటులు నటించిన సినిమాలను ఎట్టిపరిస్థితుల్లోనూ అనుమతించేది లేదని ఎమ్మెన్నెస్ నాయకుడు అమేయ్ ఖోపకార్ పునరుద్ఘాటించారు. దర్శకుడు మహేశ్ భట్ మూర్కుడిలా మాట్లాడుతున్నారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మహేశ్ భట్ భారతీయులా వ్యవహరించడం లేదని, ఆయనను పాకిస్థాన్ కు పంపించాలని డిమాండ్ చేశారు. ఆయనేం మాట్లాడినా లెక్కచేయబోమని అన్నారు. పాకిస్థాన్ నటీనటులతో సినిమాలు తీస్తే దాడులు చేసేందుకు కూడా వెనుకాడబోమని హెచ్చరించారు. కొంతమంది హింసోన్మాదులు చేసిన మతిలేని చర్యలకు తనలాంటి ఎంతోమంది శాంతికాముకులను ఇబ్బందులకు గురిచేయడం మంచిది కాదని 'ప్రొఫైల్ ఫర్ పీస్' నినాదంతో మహేశ్ భట్ సోషల్ మీడియాలో ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. -
'బ్యాన్ చేయడం వల్ల సమస్యలు పోతాయా?'
ముంబయి: పాకిస్థాన్ నటులపై నిషధం విధించడం వల్ల ఇరు దేశాల మధ్య సమస్యకు ఎలాంటి పరిష్కారం జరగదని, వారిని నిషేధించడం సబబు కాదని ప్రముఖ చిత్ర దర్శకుడు మైసూర్ శ్రీనివాస్ సాథ్యు(86) అన్నారు. మంగళవారం సాయంత్రం ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన పాక్ ఆర్టిస్టులపై నిషేధం అంశాన్ని ప్రస్తావిస్తూ.. 'ఈ నిర్ణయం పాకిస్థాన్ భారత్ మధ్య సమస్యకు పరిష్కారం కాదు. చాలా ఏళ్లుగా ప్రముఖ సంగీత దర్శకులు, ఆర్టిస్టులు పాకిస్థాన్ నుంచి భారత్ కు వస్తున్నారు. ఇప్పుడు మాత్రం చాలామంది వారిని నిషేధించాలని అంటున్నారు. ఈ నిర్ణయం రెండు దేశాల మధ్య సమస్యలకు పరిష్కారం చూపిస్తుందని నేను అనుకోను' అని సాథ్యు అన్నారు. ఐపీటీఏ కార్యక్రమానికి పాక్ నటులు ఆహ్వానించడాన్ని సమర్థించారా అని ప్రశ్నించగా ఎందుకు ఆహ్వానించకూడదు అని ప్రశ్నించారు.