Political Satire
-
రాజకీయ సంక్రాంతి.. యథా లీడర్ తథా క్యాడర్
జిద్దు ఇడ్వని విక్రమార్కుడు మోటర్ దీస్కోని బొందల గడ్డ దిక్కు బోయిండు. రొండంత్రాల బంగ్లల బేతాలుడుంటున్నడు. ఆకలైతున్నా బేతాలునికి వొండుకోబుద్ది గాలేదు. నాబి కాడ సల్ల బడితె నవాబ్ కైన జవాబ్ జెప్పొచ్చు అనుకోని ఆన్లైన్ల చికెన్ బిర్యాని దెప్పిచ్చుకుండు. తిన్నంక కతల వయ్యి సద్వుకుంట గూసున్నడు. సరింగ నాత్రి ఒకటి గొట్టంగ, విక్రమార్కుడు హారన్ గొట్టిండు. బేతాలు డింట్ల కెల్లి ఇవుతలి కొచ్చిండు. మోటరెన్క సీట్ల ఆరాంగ గూసున్నడు. ఎప్పటి లెక్కనే విక్రమార్కుడు మోటర్ నడ్పలేదు. ఎన్కకు దిర్గి సకినాలు, నూల ముద్దలు ఇచ్చిండు. ‘‘గియెందుకిస్తున్నవ్?’’ అని బేతాలుడు అడిగిండు. ‘‘సంక్రాతి పండ్గని.’’ ‘‘లీడర్లు బిర్యాని పొట్లాలు ఇచ్చిన తీర్గ ప్రేమతోని నువ్వు గివ్వి నాకిచ్చినందుకు శెనార్తిలు. ఏం పండ్గనో ఏమో! ఒక్క దినం ఏసంకు మూతి మీసం గొర్గిచ్చుకును డెందుకో! అన్ని పండ్గలేమొ గని సంక్రాతి పండ్గకు అందరు సంత ఊర్లకు బోవాలనుకుంటరు. మోకేకా ఫాయిదా ఉటాయించి బస్సు చార్జిలు డబల్, త్రిబల్ జేస్తరు. రేల్ గాడిలల్ల నిలబడెతంద్కు గూడ జాగ దొర్కదు. భారత్ జోడో అన్కుంట రాహుల్ గాంది పాద యాత్ర జేస్తున్నడు. బండి సంజయ్, రేవంత్ రెడ్డి, బీహార్ ముక్యమంత్రి నితీశ్ కుమారే గాకుంట యువగళం పేరు మీద లోకేశ్ గుడ్క పాదయాత్రలు జేస్తమంటున్నరు. గాల్ల తీర్గనే పాదయాత్ర జేస్కుంట పండ్గకు ఊర్లకు బోతె బాగుంటదని జెన మనుకుంటున్నరు. యథా లీడర్ తథా క్యాడర్.’’ ‘‘ముగ్గుల సంగతేంది?’’ ‘‘కిసాన్ సర్కార్ అన్కుంట బీఆర్ఎస్, రామరాజ్జెమన్కుంట బీజేపీ, ఇందిరమ్మ సర్కార్ అన్కుంట కాంగ్రెస్ జెనంను ముగ్గుల దించెతంద్కు ఒక్క తీర్గ కోషిస్ జెయ్యబట్టినయి.’’ ‘‘పతంగులెక్కిస్తున్నరా?’’ ‘‘ఫాంహౌస్ల సుతాయించిన మాంజతోని బీఆర్ఎస్ పతంగు లెక్కిస్తున్నది. ఈడీ, సీబీఐ మాంజతోని బీజేపీ పతంగులెక్కిస్తున్నది. సర్పంచుల మాంజ సుతాయించి కాంగ్రెస్ పతంగులెక్కి స్తున్నది. మేడినిండియా మాంజ అనుకుంటనే చైన మాంజతోని బీజేపీ పతంగులెక్కిస్తున్నదని అను కుంట ఆల్ పిరీ మాంజతోని ఆప్ పతంగులెక్కి స్తున్నది. సీపీఐ, సీపీఎం తోక పతంగులు ఎక్కిస్తున్నయి. బీఆర్ఎస్, బీజేపీ పతంగుల నడ్మనే పేంచి నడుస్తున్నది’’ అని బేతాలుడన్నడు. ‘‘రాజకీయ బోగి మంటలు గిన ఉన్నయా?’’ ‘‘ఎందుకు లెవ్వు. లీడర్లు దినాం జెనంల మంటలు బెడ్తున్నరు. గీ నెలల కమ్మంల బీఆర్ఎస్ లచ్చల మందిల మంట బెడ్తది. బీజేపీ గుడ్క గిదే నెలల లష్కర్ల లచ్చల మందితోని మంటలు షురువు జేస్తనని జెప్పింది. జన సేన, టీడీపీ గల్సి ఆంద్రల మాటల మంటలు బుట్టిస్తమంటున్నయి. అమెరికల డల్లాస్ల గుడ్క తెలుగోల్ల నడ్మ కులం, రాజకీయ మంటలు లేసినయి.’’ ‘‘రాజకీయ కోడి పందాల సంగతేంది?’’ ‘‘సంక్రాంతనంగనే కోడి పందాలే యాదికొ స్తయి. కోల్ల కాల్లకు చిన్న కత్తులు గట్టి దంగల కిడుస్తరు. గవ్వి ఒక్క తీర్గ ఫైటింగ్ జేస్తయి. గా కోల్ల మీద కోట్ల రూపాయలు బిట్టు గడ్తరు. గీ నడ్మ ఆన్లైన్ కోడి పందాలు షురువు జేసిండ్రు. గివ్వి యాడాదంత నడుస్తనే ఉంటాయి. లీడర్ల నడ్మ దినాం తిట్ల పందా లుంటయి. గీ రాజకీయ కోల్ల నాల్కలే కత్తులు. అసల్ కోడి పందాలల్ల రెండు కోల్లు ఉంటె ఒకటి సస్తది. రాజకీయ కోల్ల పందాలల్ల ఒక కోడి ఓడి పోతె ఇంకొక కోడి గెలుస్తది. గియ్యాల ఓడిన కోడి రేపు గెల్సినా గెలుస్తది. సంక్రాతి దినాలల్ల నోములు జేసేటి ఆడోల్లు వాడకట్టుల సకినాలు, నూల ముద్దలు బంచుతరు. కుర్సి నోములు జేసేటి లీడర్లు కొత్త కొత్త పద్కాలు బెట్టి జెనంకు రూపాయలు బంచుతరు. నిండ ముంచుతరు.’’ ‘‘వహవ్వా, ఏం చెప్పినవ్ బేతాలా!’’ ‘‘గది గంట్లుండ నియ్యి. ఉప్పరిపల్లి మూసీ నది ఒడ్డుకు మొసల్లు ఎందుకొచ్చినయి. గీ సవాల్కు జవాబ్ ఎర్కుండి గూడ జెప్పకుంటివా అంటె నీ మోటర్ బిరక్ ఫేలైతది’’ అని బేతా లుడన్నడు. ‘‘బేతాలా! సంక్రాతిని మకర సంక్రాంతంటరు. మకరము అంటె మొసలి. రాజకీయ మొసల్లు ఎట్లున్నయో అర్సుకునేతంద్కు పండ్గ నాడు అసలు మొసల్లు మూసీ నది ఒడ్డుకొచ్చినయి’’ అని విక్రమార్కుడు జెప్పిండు. చౌరస్తల రెడ్ సిగ్నల్ బడ్డది. మోటరాగింది. ఎన్క తలుపు దీస్కోని కిందికి దిగిన బేతాలుడు బొందలగడ్డ దిక్కు ఉర్కిండు. (క్లిక్ చేయండి: తమ్ముండ్లూ రాండ్రి! గాలిగొట్టి పోండ్రి!) - తెలిదేవర భానుమూర్తి సీనియర్ జర్నలిస్ట్ -
పొలిటికల్ ఎంట్రీపై కంగనా కామెంట్స్.. ‘బీజేపీ టికెట్ ఇస్తే అక్కడ పోటీ చేస్తా’
కంగనా రనౌత్ ఈ పేరు వినగానే ప్రముఖ బాలీవుడ్ నటి అని గుర్తుకు వస్తుంది. ఇకపై కంగనా.. అటు సినిమా రంగంతో పాటుగా ఇటు పొలిటికల్గానూ తన మార్క్ చూపించనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికి వరకు సినిమా రంగంలో పలు అంశాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచిన కంగనా.. పలు సందర్భాల్లో బీజేపీ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఇక, తాజాగా తన పొలిటికల్ ఎంట్రీపై కంగనా రనౌత్ ఎట్టకేలకు స్పందించారు. ప్రజలు కోరుకుంటే, బీజేపీ అవకాశం ఇస్తే తాను వచ్చే లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానంటూ తన మదిలోని మాటలను వ్యక్తపరిచారు. అయితే, హిమాచల్ ప్రదేశ్లో ఉన్న కంగనా శనివారం ఆజ్ తక్ పంచాయత్ కార్యాక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా కంగనా రనౌత్ మాట్లాడుతూ.. హిమాచల్ ప్రజలు కోరుకుంటే, తనకు బీజేపీ టికెట్ ఇస్తే.. 2024 లోక్సభ ఎన్నికల్లో హిమాచల్ ప్రదేశ్లోని మండి నుంచి పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. ఇదే క్రమంలో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై కంగనా ప్రశంసల జల్లు కురిపించారు. ప్రధాని మోదీ.. మహాపురుష్ అంటూ వ్యాఖ్యలు చేశారు. అలాగే, మోదీకి రాహుల్ గాంధీ ప్రత్యర్థి కావడం విచారకరం. అయినా, మోదీజీకి ప్రత్యర్థులు లేరని తనకు తెలుసని అన్నారు. అనంతరం.. ఆమ్ ఆద్మీ పార్టీ, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్పై సెటైరికల్ కామెంట్స్ చేశారు. ఆప్ తప్పుడు వాగ్దానాలను హిమాచల్ ప్రదేశ్ ప్రజలు అర్థం చేసుకుంటారు. హిమాచల్ ప్రజలు వారి సొంత సోలార్ పవర్ ఆధారంగా పంటలు పండిస్తున్నారు. ఆప్ పార్టీ ఇస్తున్న ఉచిత పథకాలు ఇక్కడ పనికిరావు అంటూ ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. Willing to fight 2024 Lok Sabha polls from Himachal's Mandi, says #KanganaRanaut. Full story: https://t.co/lcp7F8XC72 | #PanchayatAajTak pic.twitter.com/9F9VEFgSbR — IndiaToday (@IndiaToday) October 29, 2022 -
గ్లూమీ.. గ్లూమీ సార్లు మస్తుగున్నరు
ఇప్పుడు మనం ఓ గాడిద కథ చెప్పుకుందాం.. ప్రాచీన గ్రీసు దేశంలో డెమాస్తనీస్కు మహావక్తగా మంచి పేరుండేది. ఆయనోసారి ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తున్నారు. ప్రభుత్వ కార్యక్రమాలు, పన్నులు.. ఇలా చెప్తుంటే జనంలో కాస్త అలజడి, గందరగోళం కనిపించాయి. వాళ్ల అనాసక్తి గ్రహించిన డెమాస్తనీస్.. వెంటనే ప్రసంగం ఆపి మీకు ఒక కథ చెబుతాను వినండి అంటూ మొదలుపెట్టాడు. ‘‘ఇద్దరు వ్యక్తులు వేసవిలో నడుచుకుంటూ వెళ్తున్నారు. ఒకడి దగ్గర గాడిద ఉంది. మరొకడికి దాని అవసరం ఉంది. దాన్ని అమ్ముతావా అని అడిగాడు. ఇద్దరూ మాట్లాడు కున్నారు. బేరం కుదిరింది. అమ్మకం అయిపోయింది.. వారు వాళ్ల ప్రయాణం కొనసాగిస్తున్నారు. అసలే వేసవి ఎండ ఎక్కువగా ఉండి.. ఓ దగ్గర ఆగారు. గాడిద నిలబడి ఉండగా దాని నీడలో అమ్మిన వ్యక్తి కూర్చున్నాడు. కొన్నా యనకు మండుకొచ్చింది. కొనుక్కున్న నేను ఎండలో ఉండాలి అమ్మినవాడు నీడలోకూర్చుంటాడా? అని ఆర్గ్యు చేశాడు. ‘నువ్వు లే నేను కూర్చుంటా’నని గదమాయించాడు. చదవండి: తెలంగాణ సర్కార్ మరో కీలక నిర్ణయం.. అమ్మిన వ్యక్తి బాగా తెలివైన వాడు.. ‘నేను గాడిదను అమ్మాను గానీ నీడను కాదు.. నీడ నాదే..’ అంటూ తన లాజిక్ వదిలాడు.. ఇంకేం తగువు మొదలైంది. నలుగురూ చుట్టూ చేరారు. వాదులాట పెరిగింది. గాడిద–నీడ సమస్య పరిష్కరించడంలో అందరూ మునిగిపోయారు’’ అని చెప్పడం ఆపేశాడు డెమాస్తనీస్. వింటున్న జనంలో ఆసక్తి మొదలైంది. వాళ్లలో వాళ్లు గాడిద గొడవపై మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. ఇంతకీ పరిష్కారమేమైంది? ఏం తేల్చారు? అని డెమాస్తనీస్ను అడగడం మొదలుపెట్టారు. అసలు తమ బతుకు సంగతి చెబితే పట్టని జనం గాడిద గొడవ చర్చించడం చూసి డెమాస్తనీస్ నవ్వి ఊరుకున్నాడు. ఆ గాడిద గొడవ తేలేది కాదు కాబట్టి, మనమూ వదిలేద్దాం. జనాన్ని మనకు అనుకూలమైన చర్చ వైపు నెట్టడమే కదా.. మంచి వక్త నేర్పరితనం. చుట్టూ వరదలున్నా గ్లూమీ.. గ్లూమీ సమాచారంతోనైనా మనకు ఇష్టమైన దారిలోకి ‘మంద’ను మళ్లించడమే కదా.. అసలైన పొలిటీషియన్ టెక్నిక్.. చర్చ గాడిదల వైపు కావచ్చు.. విదేశీ కుట్రల వైపూ కావచ్చు.. జనం ‘కళ్ల నిండా కాళేశ్వరం’ చూసి కంగారు పడో, కడుపు మండో ‘విదేశీ కుట్ర’ అని ఒక మాట అనరా.. బరాబర్ అంటారు ఆయన.. ఇంకా ‘విదేశీ కుట్ర’ అన్నారాయన. ఈ విషయంలో సొంత ప్రభుత్వంపైన అనుమానాలున్నవారు కూడా ఉన్నారు. ఇట్లా రండి అలా సోషల్ మీడియాలో దూరుదాం.. సిడ్నీ.. స్వదేశీ కుట్ర కొద్దిరోజుల క్రితం.. సిడ్నీలో భారీ వర్షాలు పడ్డాయి. ఎంతగా అంటే ఎనిమిది నెలల వర్షం నాలుగు రోజుల్లో దంచేసింది. సహజంగానే పెను నష్టం వాటిల్లింది. ఇంకేం రకరకాల సిద్ధాంతాలు నిద్ర లేచాయి. ప్రభుత్వం చేపట్టిన ‘క్లౌడ్ సీడింగ్’ దానికి కారణమని ప్రచారమైంది. ఆ స్థాయిలో వర్షాలు తెచ్చే క్లౌడ్ సీడింగ్ భౌతికంగా, ఆర్థికంగా సాధ్యం కాదని గవర్నమెంట్ చెప్పినా.. అ వాయిస్ జనానికి చేరేలోపు.. లక్షల్లో వ్యూస్ నమోదయ్యాయి. రాడార్ చిత్రాలు, మేఘాలలో వింత ఆకారాల ఫొటోలు.. విమానం ఎగరడాలు.. ఇలా ఏవేవో ఆధారాలు చూపుతూ.. అది ప్రభుత్వం ప్రజలపై వేసిన ‘వెదర్ బాంబే..’ అనేయడం మొదలుపెట్టారు. ఇదంతా న్యూస్ చానళ్లలో, సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టింది. వాతావరణ నిపుణులు శాస్త్రీయ కారణాలు చెప్పినా ఎవరూ వినలేదు.. అంతా అధికార పక్షం చేసినదేంటూ ఢంకా బజాయించారు... దీనికన్నా మనం విన్న ‘విదేశీ కుట్రే’ నయం కదా.. థాయ్లాండ్.. వరద రాజకీయాలు 2011లో ఇక్కడ వచ్చిన వరదలు ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద ‘నష్టం’గా పేర్కొంటారు. జూలై నుంచి అక్టోబర్ వరకు వరదలు కొనసాగాయి. జనవరి 2012 వరకు కూడా అక్కడక్కడా కొన్ని ప్రాంతాలు నీటిలోనే ఉన్నాయంటే అర్థం చేసుకోవచ్చు.. ఆ వరదల ప్రభావం ఎంతో. ఆ వరదలు బ్యాంకాక్ను కూడా చుట్టుముట్టాయి. 20వేల చదరపు కిలోమీటర్ల మేర పంట పొలాలు నీట మునిగాయి. 13.6 మిలియన్ల జనాభా ముంపు ప్రభావానికి లోనయింది. అనేక పరిశ్రమలు నీట మునిగాయి. లక్షన్నరకుపైగా వాహనాలు ధ్వంసం అయ్యాయి. ఆర్థికంగా జరిగిన నష్టం 46.5 బిలియన్ డాలర్లు.. ఇంత విధ్వంసానికి కారణం ‘ప్రకృతి ప్రకోపం’ అన్న పాయింట్ పక్కకుపోయింది.. చర్చలన్నీ రాజకీయం చుట్టే తిరిగాయి. ఎందుకంటే అచ్చంగా ఎన్నికల ప్రచార సమయంలో వరదలు వచ్చాయి. ‘తాము ఎలాగూ ఓడిపోతామని తెలిసిన అధికార పక్షం డ్యాములను ఖాళీ చేయకుండా ఊరుకుందనీ.. తర్వాత వానలతో డ్యాములన్నీ నిండా మునిగి ఊర్లకు ఊర్లు నీటిలో కొట్టుకుపోయాయని విపక్షం వాదనకు దిగింది. ‘వరదల పెను నష్టంతో రానున్న ప్రభుత్వానికి ఊపిరి ఆడకుండా చేయాలని.. రాజకీయంగా తమను, ఆర్థికంగా ప్రజలను కుదేలు చేయాలనే కుట్రతోనే ఇదంతా జరిగిందని..’ ప్రతిపక్షం గగ్గోలు పెట్టింది. కొన్నేళ్ల పాటు ఆ దేశంలో ఈ చర్చ జరిగింది.. ‘‘అధికార పక్షానికి అంత తెలివి లేదు. వరదలను సరిగ్గా మేనేజ్ చేయకపోవడం వల్లే ఈ దురవస్థ’’ అని అక్కడి వామపక్ష మేధావులు చెప్పినా ఎవరూ వినలేదు. విపక్షాలపై కుట్రతోనే తమ ప్రజలకు భారీ నష్టాన్ని కలిగించారని బలమైన వాదన జనంలోకి పోయింది. ..ఇదీ స్వదేశీ వరద రాజకీయమే. అవకాశం రావాలేగానీ.. వరదలు, విపత్తులు, మహమ్మారులు వేటినీ వదలడం లేదు. కుట్ర కోణాలు, రాజకీయాలు, సొంత అవసరాలు వాటిని అంటుకునే తిరుగుతున్నాయి. 2011లో జపాన్లో తారస్థాయిలో వచ్చిన భూకంపం ఏకంగా సునామీనే సృçష్టించింది. 30 అడుగుల ఎత్తుతో అలలు ఎగిసిపడి.. ఫుకుషిమా పవర్ ప్లాంట్లో ‘అణు’ ప్రమాదానికి దారి తీసింది. ఇదంతా ప్రకృతి విలయంగా ప్రపంచం భావిస్తుండగా.. ‘ఠాట్!.. అంతా తప్పు. దీనికి ఇజ్రాయెల్ చేసిన అణు విస్పోటనమే కారణమని.. ఇరాన్ కోసం çజపాన్ యురేనియం శుద్ధి చేయకుండా అడ్డుకునే పనే’నని జపాన్లో బాగా నమ్మిన వారున్నారు. 2004లో ఇండోనేసియాలో 9.1–9.3 తీవ్రతతో భూకంపం, సునామీ వచ్చినప్పుడు 14 దేశాల్లో 2,27,000 మందికిపైగా మరణించారు. ఇదంతా అమెరికా అధ్యక్షుడి పనేనని ప్రచారమైంది. తూర్పు ఆసియా ప్రాంత ఆర్థిక ప్రగతిని తగ్గించడానికి అమెరికా చేసిన పనేనని బలంగా నమ్మారు. అక్కడ కనిపించిన అమెరికా యుద్ధనౌకను ఆధారంగా చూపారు. గతంలో ఎప్పుడూ అక్కడ భూకంపాలు రాలేదని నిరూపించే ప్రయత్నం చేశారు.. ఇలాంటి సిద్ధాంతాలకు వందలకొద్దీ ఆధారాలు (?) గుప్పించడం కూడా సామాన్య జనానికి అది నిజమేనని అనిపించేలా చేస్తుంది. రెండో ప్రపంచ యుద్ధం నాటి అమెరికా అణుబాంబు ఇప్పుడు పేలిందని కొందరు అనుమానాలు వ్యక్తీకరించారు. పాకిస్తాన్ టార్గెట్గా ఇండియా చేస్తున్న అణు పరీక్షలే దానికి కారణమని మనవైపూ అనుమానంగా చూసినవారూ ఉన్నారు. .. చివరికి భూమి భ్రమణాన్ని మార్చేందుకు ఇలాంటి ప్రయోగాలు చేస్తున్నారని నమ్మి ప్రచారం హోరెత్తించిన వారూ ఉన్నారు. ఇలా అనుమానాలు, కుట్ర కోణాల సిద్ధాంతాలు, వాటికి తగిన ఆధారాలను పుంఖానుపుంఖాలుగా జనం నెత్తిన రుద్దేవారెవరూ నిపుణులో, శాస్త్రవేత్తలో కాదు.. గ్లూమీ, గ్లూమీగా విషయం తెలిసినవారే. అప్పటి అవసరాలు, పాలిటిక్స్ కోసం జనం ముందుకు తెచ్చినవారే. ఇది బాగుంది... శుక్రవారం మళ్లీ వర్షాలు మొదలు కావడంతో సోషల్ మీడియాలో కనిపించిన జోక్.. ఇది కూడా బాగుంది... ఈ మధ్య వరదలు, వ్యాఖ్యలు చూస్తుంటే గుర్తొస్తుందంటూ ఓ మిత్రుడు చెప్పిన కామెంట్.. ప్రముఖ అమెరికన్ రచయిత, కాలమిస్టు, వక్త, యాక్టివిస్టు జిమ్ హైటవర్.. అప్పటి అమెరికా అధ్యక్షుడు జార్జి బుష్పై వేసిన చురక ఇది.. ‘అజ్ఞానం బ్యారెళ్ల లెక్కన అమ్మే వీలుంటే.. జార్జి బుష్ బుర్ర డ్రిల్లింగ్ హక్కులు సంపూర్ణంగా నేనే కొనుక్కుంటా..’ .. ఆహా.. నిజమే ఇలాంటి మార్కెట్ ఉంటే బాగుండు.. సహజ వనరులున్న బుర్రలు మనకు అనేకం ఉన్నాయి కదా.. -సరికొండ చలపతి -
నిజమే! ఇప్పటికిప్పుడు అభివృద్ధి కార్యక్రమాలంటే ఇంతకు మించి ఇంకేం చేస్తాం!!
నిజమే! ఇప్పటికిప్పుడు అభివృద్ధి కార్యక్రమాలంటే ఇంతకు మించి ఇంకేం చేస్తాం!! -
Sakshi Cartoon: ఎన్ని ఎత్తులు వేసిన.. ఎంత వేడుకున్నా పొత్తులుండవ్..
ఎన్ని ఎత్తులు వేసిన.. ఎంత వేడుకున్నా పొత్తులుండవ్.. ప్రస్తుతానికి... -
సాక్షి కార్టూన్ 21-02-2022
అన్ని అవకాశాలు ఉపయోగించుకుంట్నునాం సార్ -
సాక్షి కార్టూన్ 17-02-2022
... మిమ్మల్ని ఉద్దేశించి కాదులే! -
పలుకుబడి
ఒక కాకి ఏ పనిమీదో అప్పుడే తాటిచెట్టు మీద వాలుతోంది. పని ఉండో లేకో ఒకాయన అదే తాటిచెట్టు దగ్గరికి అప్పుడే వస్తున్నాడు. ఆ కాకి కాలు తగిలి తాటిపండు సరిగ్గా ఆయన తలమీద రాలి పడిందట. కాకి కాలు తగిలితే తాటిపండు ఊడి పడుతుందా? ఇది మనకు పట్టింపు ఉన్న విషయం కాదు. కాకతాళీయం అనే మాటకు అర్థం ఆ కాకి, ఆ తాటిపండుతో ముడిపడిన వృత్తాంతమే మనకు కావాల్సినది. కొంత నాటకీయంగా ధ్వనించే ఈ కాకతాళీయం అనే మాటను ఎన్నోసార్లు వినివుంటారు. ఈ మాట చదువుతున్నప్పుడో, విన్నప్పుడో ఎప్పుడైనా తాటిపండు తల మీద రాలిపడుతున్న దృశ్యం మనసులో మెదిలిందా? దీనికంటే నాటకీయమైనవి ఈ చండ్రనిప్పులు. రాజకీయ విమర్శల్లో ఫలానా ఆయన చండ్రనిప్పులు చెరిగాడంటారు. నిప్పులు చెరగడంలోనే ఒక కవిత్వం ఉంది సరే, కానీ ఈ చండ్ర అనేది ఏమిటి? ఇది ఒక చెట్టు. అది కాలుతున్నప్పుడు రేగే శబ్దం జోరుగా చిటపటమంటూ ఉంటుంది. కానీ ఈ మాట విన్నప్పుడు ఎప్పుడైనా ఆ ఉగ్రరూపంతో ఉన్న చెట్టు కళ్లముందు కదలాడిందా? దాదాపుగా ఇలాంటి మాటే, అట్టుడకటం. ఇందులో పెద్ద గోప్యమైన అర్థం ఏమీలేదు. మామూలు అట్టు ఉడకటమే. కానీ అట్టు పెనం మీద ఉడుకుతున్న, పొంగుతున్న ఇమేజ్ ఈ మాటతో జోడీ కట్టిందా అన్నదే అనుమానం. లేకపోతే అంత ఉడికీ ఏం ప్రయోజనం! ఎటూ పెనం, పొయ్యి దగ్గరే ఉన్నాం కాబట్టి– ఈ ఆనవాలు సంగతేమిటో చూద్దాం. ఆనవాలు దొరక్కుండా చేయాలంటారు. ఆ పనిలో అది ఆయన ఆనవాలు అంటారు. అర్థం తెలుస్తోంది. కానీ ఇంతకీ ఏమిటివి? పాలల్లో ఒక్క నీటిబొట్టు కూడా లేకుండా చిక్కగా కాస్తే మిగిలేవి ఈ ఆనవాలుట! అదే వంటింట్లో ఉన్నప్పుడే కరతలామలకం ఏమిటో కూడా రుచి చూద్దాం. ఫలానా విషయం ఆయనకో, ఆవిడకో కరతలామలకం అంటారు. చేతిలో లేదా చేతి తలం మీద ఉన్న అమలకం. అనగా ఉసిరికాయ. అంటే అంత సులభంగా అందుకోగలిగేదీ, అందుబాటులో ఉన్నదీ అని. ఇంత సులభమైనది కూడా దాని అర్థంతో సహా బొమ్మ కడుతోందా అన్నది సందేహం. ఇలాంటి వ్యవహారాలకు అర్థం చెప్పుకోవడం నల్లేరు మీద నడక ఏమీ కాదు. దీన్నే ఇంకోలా చెప్పుకొంటే, నల్లేరు మీద నడక చాలా సుఖం, హాయి. ఎందువల్ల? అసలు ఈ నల్లేరు ఏమిటి? ఇసుకలో నడిచినప్పుడు కాలు దిగబడిపోతుంది. కానీ అదే ఇసుకలో అక్కడక్కడా విస్తరించి ఈ నల్లేరు గుబురు గనక ఉందంటే దానిమీద అడుగులేస్తూ ఎంచక్కా నడిచిపోవచ్చు. పల్లేరు గాయలు గుర్తొచ్చాయంటే సరేగానీ ఈ నల్లేరు ఎంతమందికి తెలుసు? అన్నట్టూ గుచ్చాయంటే గుర్తొచ్చేది, ఏకు మేకవడం. ఏకు అనేది నేతపనిలో భాగం. మెత్తగా, సౌకుమార్యంగా, సాధువుగా ఉండేది కాస్తా మేకులాగా దుర్మార్గంగా తయారైన సందర్భంలో దీన్ని వాడతాం. అన్నీ మనకు తెలుస్తాయా? ప్రయత్నిస్తాం, మళ్లీ ప్రయత్నిస్తాం, అయినా తెలియకపోతే వదిలేస్తాం. ఏదైనా పని జరగనప్పుడు కూడా అంతేగా. కాకపోతే వదిలేముందు ఒక మాట అనేసు కుంటాం, అందని మానిపండు అని. ఏమిటీ మానిపండు? దీని రుచి ఎలా ఉంటుంది? ఎక్కడ దొరుకుతుంది? ఎక్కడా దొరకదు. ఎందుకంటే, ఎక్కలేనంత పొడవైన, అందలేనంత పొడవైన మాను అంటే చెట్టుకు కాస్తుంది కాబట్టి. దీనికి దగ్గరగా వినిపించే మరో వ్యవహారం, అందలం. అక్కన్న మాదన్న అందలం ఎక్కితే, సాటి సరప్ప చెరువు గట్టెక్కాడట. ఏదో ఒకటి ఎక్కాలిగా ఆయన కూడా. ఇంతకీ మాదన్నతో కలిసి అక్కన్న ఎక్కిందేమిటి? పల్లకీ. మరి పల్లకీ ఎక్కడమంటే ఆ రోజుల్లో తమాషా! అదొక హోదాకు చిహ్నం. ఎవరో సమాజంలో అందె వేసిన చేతులకే అలాంటి యోగాలు దక్కేవి. ఇంతకీ ఏమిటీ అందె? కడియం. బిరుదుటందె అని కూడా అంటారు. ఒక మనిషి విద్వత్తు గలవాడనీ, ప్రవీణుడనీ, నిష్ణాతుడనీ చేతికి తొడిగే సర్టిఫికెట్ ఈ ఆభరణం. ఇలాంటివి కూపస్థమండూకాలకు దొరకడం కష్టం. అదేలే, కూపము అనగా బావి, ఆ బావిలో ఉండే, ఆ బావినే ప్రపంచంగా భావించుకునే కప్పలకు ఇలాంటి గౌరవాలు దక్కవూ అని చెప్పడం! ఇకముందైనా ఇలాంటి మాటల్ని వాటి భావచిత్రాలతో గ్రహిద్దామని ఒడిగడదామా! అయ్యో, పాపానికి ఒడిగట్టినట్టుగా ధ్వనిస్తోందా? ఒడి అంటే ఒడి అనే. ఒడిగట్టడం అంటే ఒక పనికి పూను కోవడం అనే మంచి అర్థమే. కానీ కాలం చిత్రమైంది. ఎంత మంచి ఉద్దేశంతో మొదలైనవైనా కొన్ని మాటల్ని ఎందుకో ప్రతికూలంగా నిలబెడుతుంది. ఒక విధంగా దీని మంచి భావాన్ని తుంగలో తొక్కింది అనుకోవచ్చు. ఇంతకీ తుంగ అంటే మామూలు తుంగేగా? తుంగలో ఒక విషపూరిత తుంగ కూడా ఉంటుందట. ఆ తుంగలో గనక ఏదైనా ధాన్యాన్ని తొక్కితే ఇంక అది ఎప్పటికీ మొలకెత్తదట. అంటే ఒకదాన్ని సర్వనాశనం చేయడం తుంగలో తొక్కడం. ఇవన్నీ రాస్తూపోతే ఎప్పటికి ఒక కొలికికి వచ్చేను? అదేలే, ఒక కొసకు, చివరకు, ముగింపు నకు. కానీ చాలా మాటలు, భావాలు, వ్యక్తీకరణలు తెలియకుండానే తుంగలో అడుగంటు తున్నాయి. భాష అనేది మన జీవనాడి. ఉత్త పలుకుగా అది బోలు గింజే. కానీ పూర్ణరూపంతో సారాన్ని గ్రహిస్తే అది అమృతాహారమే; పాతకాలం పెళ్లిళ్లలో గాడిపొయ్యి మీద వండుకున్నంతటి విందుభోజనమే. ఓహో, మళ్లీ ఇదొకటి వివరించాలా! పశువులకు గడ్డి వేసే గాడి ఏమిటో, దానికీ గాడిపొయ్యికీ సంబంధం ఏమిటో... అసలు ఉందో లేదో తెలుసుకుంటేనే మన భాష ఒక గాడిన పడుతుంది. -
అంబానీ ఇంటి వద్ద కలకలం: ‘అతడిని శిక్షించండి’
ముంబై: పారిశ్రామికవేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేశ్ అంబానీ నివాసం వద్ద పేలుడు పదార్థాలతో కూడిన వాహనం కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. దీనిపై దర్యాప్తు కొనసాగతుండగానే.. సదరు వాహనం డ్రైవర్ మరణించాడు. ఇలా కేసులో రోజుకో ట్విస్ట్ వెలుగు చూస్తోంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం దీని దర్యాప్తును యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ఏటీఎస్)కు అప్పగించింది. తాజాగా రాష్ట్ర అసెంబ్లీలో కూడా ఈ విషయంపై వాడీవేడి చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో మంగళవారం మాజీ సీఎం, ప్రతిపక్ష నాయకుడు దేవేంద్ర ఫడ్నవీస్ దీనిపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సారి ఏకంగా ఈ కేసును దర్యాప్తు చేస్తోన్న ఎన్కౌంటర్ స్పెషలిస్ట్, అసిస్టెంట్ పోలీస్ ఇన్స్పెక్టర్ సచిన్ వాజ్ని శిక్షించాల్సిందిగా డిమాండ్ చేశారు. ఈ క్రమంలో మంగళవారం ఫడ్నవీస్ అసెంబ్లీలో చనిపోయిన స్కార్పియో డ్రైవర్ హిరెన్ మన్సుఖ్ భార్య ఇచ్చిన ఎఫ్ఐఆర్ని చదివారు. దీనిలో సదరు డ్రైవర్ మరణించడానికి ముందు జరగిన సంఘటనలు వరుసగా ఉన్నాయి. అనంతరం ఫడ్నవీస్ "అసిస్టెంట్ పోలీస్ ఇన్స్పెక్టర్ సచిన్ వాజ్ని శిక్షించాలి. సాక్ష్యాధారాలను నాశనం చేయడానికి మీరు అతనికి అవకాశం ఇస్తున్నారు. అతను (వాజ్) ఒక నిర్దిష్ట రాజకీయ పార్టీకి చెందిన వ్యక్తి కాబట్టి అతడిని రక్షిస్తున్నారు. అసలు అతడిని ఎలా ఫోర్స్లోకి తీసుకున్నారు.. తొలుత అతడిని సస్పెండ్ చేయండి’’ అంటూ ఫడ్నవీస్ డిమాండ్ చేశారు. అంబానీ ఇంటి ముందు కలకలం రేపిన స్కార్పియో డ్రైవర్ హిరెన్ మన్సుఖ్ (45) మృతదేహాన్ని గత శుక్రవారం ముంబై సమీపంలోని ఒక కాలువ దగ్గర గుర్తించినట్లు థానే పోలీసు అధికారి తెలిపారు. గురువారం రాత్రి నుంచి అతను తప్పిపోయాడని మన్సుఖ్ కుటుంబం తెలిపింది. దాంతో ఈ కేసును మహారాష్ట్ర యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ఏటీఎస్)కు బదిలీ చేశారు. చనిపోవడానికి ముందు మన్సుఖ్ తనను పోలీసు అధికారులు, జర్నలిస్టులు వేధిస్తున్నారని ఆరోపించారని ఫడ్నవీస్ తెలిపారు. ఇక ఫడ్నవీస్ వ్యాఖ్యలను మహారాష్ట్ర హోంమంత్రి దేశ్ ముఖ్ ఖండించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. "మన్సుఖ్ భార్య చేసిన ప్రకటన ఇప్పుడు మీడియాలో ప్రతిచోటా ఉంది. ప్రస్తుతం ఈ కేసును ఏటీఎస్ దర్యాప్తు చేస్తోంది. ఈ కేసుకు సంబంధించి ప్రతిపక్షం దగ్గర మరిన్ని రుజువులు, ఆధారాలు ఉంటే, వారు దానిని ఏటీఎస్కు అందివ్వా లి. అంతేకాకా హోం మినిస్టర్గా నేను మీకు హామీ ఇస్తున్నాను.. ఈ కేసు నుంచి ఎవరు తప్పించుకోలేరు’’ అన్నారు అని దేశ్ ముఖ్. చదవండి: అంబానీ ఇంటివద్ద కలకలం : ఫడ్నవీస్ సంచలన వ్యాఖ్యలు అంబానీ ఇంటివద్ద కలకలం : మరో కీలక పరిణామం -
బ్రేకింగ్: బాబు, ఉమపై వల్లభనేని వంశీ తీవ్ర వ్యాఖ్యలు
గొల్లపూడి: తెలుగు వాడి చరిత్ర దేశంలో లిఖించిన గొప్ప వ్యక్తి ఎన్టీఆర్ అని, రాజకీయాలలో చిరస్థాయిగా నిలిచిపోయారని గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తెలిపారు. ఎన్టీ రామరావుకు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు, వదినను చంపిన ఉమా రాజకీయాల్లో విలువలు గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. ప్లేస్, టైమ్, డేట్ ఉమా ఫిక్స్ చేయాలని సవాల్ విసిరారు. ఎన్నికల ముందు పసుపు.. కుంకుమ ఇస్తే ప్రజలు టీడీపీకి కోసి కారం పెట్టారని తెలిపారు. తాము చర్చకు సిద్ధంగా ఉన్నామని.. సవాల్ అయినా ప్రతి సవాల్ అయినా మేము సిద్ధమేనని వంశీ ప్రకటించారు. మాజీ మంత్రి దేవినేని ఉమ దీక్షపై కౌంటర్ బదులిచ్చారు. అసంబద్ధమైన ఆరోపణలు చేసి చర్చకు రా అంటే ఎలా అని వంశీ ప్రశ్నించారు. అభివృద్ధిపై చంద్రబాబు మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని తెలిపారు. చంద్రబాబు పిచ్చి మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు. చర్చ పెట్టుకుందాం అని చెప్పాము కానీ కొట్లాటకు రమ్మని మేము చెప్పలేదని వంశీ వివరించారు. ఉమా తక్కువ తినలేదు తక్కువ మాట్లాడతాడని మేము అనుకోమని పేర్కొన్నారు. ఒకటి అని రెండు అనిపించుకోవడం ఉమాకి అలవాటు అని తెలిపారు. టీడీపీ చాలా గొప్ప పార్టీ.. ఎన్టీఆర్ టీడీపీ వేరు.. చంద్రబాబు టీడీపీ వేరు అని చెప్పారు. గత ప్రభుత్వంలో ఏ మేరకు అవినీతి జరిగిందో నాకు తెలుసని.. ఉమా ఒక లోఫర్ అని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మా ఇంట్లో అనేక కులాలు ఉన్నాయి.. అన్ని కులాలు ఓట్లు వేస్తేనే మేము గెలిచామని పేర్కొన్నారు. ఒక కులాన్ని టార్గెట్ గా ప్రభుత్వం పని చేస్తోందని ఆరోపించడం అవాస్తవమని స్పష్టం చేశారు. ఒక కులం వాళ్లు ఓట్లు వేస్తే నేను నాని ఎమ్మెల్యేలుగా గెలవలేదని తెలిపారు. ఉమా ఇప్పటికైనా పిచ్చి మాటలు మానుకోవాలని వల్లభనేని వంశీ హితవు పలికారు. -
అబ్బే... ఆ ఉద్దేశం లేదు
‘రాజకీయమా? నేనా? అబ్బే.. ఆ ఉద్దేశమే లేదు’ అన్నారు శ్రుతీహాసన్. ‘మీ నాన్నగారు పార్టీ స్థాపించారు కదా. మిమ్మల్ని కూడా రాజకీయాల్లో చూడొచ్చా’ అని శ్రుతీహాసన్ని అడిగితే ఆమె నుంచి ఈ సమాధానం వచ్చింది. దీని గురించి శ్రుతీహాసన్ మాట్లాడుతూ – ‘‘రాజకీయాల గురించి నాకు ఎలాంటి అవగాహన లేదు. ఎటువంటి అవగాహన లేకుండా రాజకీయాల్లోకి వెళ్లడం అయినా, సినిమాకు దర్శకత్వం వహించడం అయినా పెద్ద పొరపాటు అవుతుంది. మనకు తెలియకుండానే ఎంతోమందికి హాని చేసినవాళ్లం అవుతాం. మా నాన్నగారి పార్టీ ప్రచారానికి కూడా నేను వెళ్లను. ఆయన నమ్మిన సిద్ధాంతం, ఆయన విజన్ను నేను నమ్ముతాను. ఆయనకు మంచి జరగాలని కచ్చితంగా కోరుకుంటాను’ అన్నారు. ఇదిలా ఉంటే.. కరోనా వల్ల జరిగిన నష్టాన్ని, ఆర్థిక ఇబ్బందులను అధిగమించే దిశలో నటీనటులు పారితోషికం తగ్గించుకోవాలని ఇటీవల చిత్రపరిశ్రమకు సంబంధించిన కీలక శాఖలవారు పేర్కొన్నారు. ఆ విషయం గురించి శ్రుతీహాసన్ని అడిగితే – ‘నిజానికి సినిమా ఇండస్ట్రీలో పారితోషికం విషయంలో హీరోలతో పోలిస్తే హీరోయిన్లకు చెల్లించేది చాలా తక్కువ. ఇద్దరి పారితోషికాల్లో వ్యత్యాసం చాలా ఉంది. హీరో అందుకుంటున్న రెమ్యునరేషన్ హీరోయిన్కి రావాలంటే కచ్చితంగా మరో 20 ఏళ్లు పడుతుంది’ అని పేర్కొన్నారు. -
వివాదంలో ప్రముఖ కామెడీ షో
‘పాట్రియాట్ యాక్ట్ విత్ హసన్ మిన్హాజ్’ అనేది ఒక అమెరికన్ కామెడీ, వెబ్ టెలివిజన్ షో. సమకాలీన రాజకీయాలకు సంబంధించిన విషయాలను కామెడీతో కలిపి జనాల ముందు ప్రదర్శిస్తారు. అయితే ప్రస్తుతం ఈ షో ఇబ్బందులను ఎదుర్కొంటుంది. దీని నిర్వహకులు విషపూరిత పని సంస్కృతిని పాటిస్తున్నారంటూ షో మాజీ నిర్మాత నూర్ ఇబ్రహీం నస్రీన్ సంచలన ఆరోపణలు చేశారు. ప్రస్తుతం ఇవి తెగ వైరలవుతున్నాయి. ఈ సందర్భంగా నూర్ వరుస ట్వీట్లు చేశారు. ‘ఈ షోలో పని చేస్తున్నప్పుడు ఎన్నో అవమానాలు పొందాను. చాలా సార్లు నన్ను టార్గెట్ చేశారు. కొన్నిసార్లు కావాలనే విస్మరించేవారు. వీరు షోలో చూపించే నీతిని నిజంగా పాటిస్తే చాల బాగుండేది. చాలా మంది నన్ను ఈ షో గురించి మాట్లాడమని కోరేవారు. కానీ నేను తప్పించుకునేదాన్ని. ఈ షోలో ఎన్నో అవమానాలు పొందాను. చాలా సార్లు డిప్రెషన్కు గురయ్యాను. ఇప్పుడు ఇలా ట్వీట్ చేయడం వల్ల నాకు, నాలా బాధపడే ఇతరులకు ఎలాంటి ప్రయోజనం ఉండదు’ అన్నారు నూర్. (సూపర్ క్రేజ్.. 1.7 మిలియన్ లైక్స్) A lot of people have asked me to talk about Patriot Act. I avoided it because each time I relive the experience of being humiliated and gaslit, targeted and ignored, I sink back into days of depression. Tweeting this will probably not help me or anyone who has suffered. — nur nasreen (@Nuri_ibrahim) August 20, 2020 అంతేకాక ‘కొందరు మహిళలు నాకంటే ధైర్యవంతులు. వారు దీని గురించి చర్చించారు. ఈ షో ఎంతో ముఖ్యమైనది.. ప్రముఖమైనది. ఇందుకు గాను నా పని పట్ల నేను చాలా గర్వంగా ఫీలవుతాను. నాకు లభించిన అవకాశాలకు నేను ధన్యవాదాలు తెలుపుతాను. అయితే గత కొద్ది నెలలుగా నేను అనుభవిస్తున్న మానసిక వేదనతో పోల్చితే.. ఇది అంత విలువైనదేం కాదని అర్థమవుతోంది. నిజంగానే మనకు ఓ దేశ భక్తి చట్టం ఉండాలని.. ఈ షో చూపించిన దానిని వారు నిజంగా పాటించాలని కోరుకుంటున్నారు. అప్పుడే వారు ప్రేక్షకుల ప్రేమకు అర్హులు’ అంటూ వరుస ట్వీట్లు చేశారు నూర్. రాజకీయాల మీద సెటర్లతో ఈ సాగే ‘పాట్రియాట్ యాక్ట్ షో’ మొదట అక్టోబర్ 28, 2018లో నెట్ఫ్లిక్స్లో ప్రదర్శితమయ్యింది. అప్పటి నుంచి ఆరు సీజన్లుగా 40 ఎపిసోడ్లు టెలికాస్ట్ అయిన ఈ షో ప్రస్తుతం ఆగిపోయింది. -
బ్యాండ్ బాజా 22nd Feb 2020
-
బ్యాండ్ బాజా 8th Feb 2020
-
బ్యాండ్ బాజా 1st Feb 2020
-
ఇక అంతే అంటవా..!
సాక్షి, సిరిసిల్ల : ఇది మున్సిపల్ ఎన్నికల సమయం. గల్లీ ముచ్చట్లు.. ఇంటి మీదకు తెచ్చే ప్రమాదం ఉంటుంది. ఏం మాట్లాడినా.. ఎవరితో తిరిగినా.. అనుమానాలు, అపోహలకు తావిచ్చే పరిస్థితి. సొంత పార్టీ వారే శంకించేందుకు అవకాశమున్న రోజులు. సిరిసిల్ల పట్టణంలోని ఓ వార్డు నాయకుడు అధికార పార్టీలో ఈ మధ్యనే చేరాడు. ఆ పార్టీ టికెట్ వచ్చిన అభ్యర్థికంటే.. స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసిన వ్యక్తి అంటేనే అభిమానం. అతనంటేనే మక్కువ. కానీ పార్టీ క్యాండేటును కాదని దగ్గరి మనిషికి ప్రచారం చేసే పరిస్థితి లేదు. దీంతో లోలోపల నీకు మద్దతు కానీ.. వాడకట్టులో నీ కోసం మాత్రం తిరగ అంటూ హామీ ఇచ్చేశాడు. ఆ నేతలిద్దరూ ఒకప్పుడు మంచి దోస్తులు.. కానీ ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు కల్వకుంట చేసినయి.. అధికార పార్టీలో ఉన్న కొందరు ఆ పార్టీ అభ్యర్థికి మనస్ఫూర్తిగా ప్రచారం చేయడం లేదు. దగ్గరి మనిషిని ఇడిసిపెట్టి తిరగబుద్ది అయితలేదు. ఎంతైనా ఇది ఎన్నికల సమయం కదా.. ఆ ఎలక్షన్లు అయిపోతే.. ఎవరి సంగతి ఎంటో తెలుస్తుంది.. అన్నా. మరి ఎన్నికలప్పుడు ఏం మాట్లాడినా.. పట్టుకుని మనసుల పెట్టుకుంటరు.. గందుకే ఏం మాట్లాడకపోవడమే ఉత్తమమని సదరు నాయకులు చెప్పడం.. అంతేనంటవా అని మిగతావాళ్లు అనడంతో ఛాయ్ పే చర్చ ముగిసింది. -
బ్యాండ్ బాజా 4th Jan 2020
-
బ్యాండ్ బాజా 21st Dec 2019
-
బ్యాండ్ బాజా
-
బ్యాండ్ బాజా 16th Nov 2019
-
బ్యాండ్ బాజా 9th Nov 2019
-
బ్యాండ్ బాజా 26th Oct 2019
-
బ్యాండ్ బాజా 19th Oct 2019
-
బ్యాండ్ బాజా 12th Oct 2019
-
బ్యాండ్ బాజా 5th Oct 2019
-
బ్యాండ్ బాజా 28th Sep 2019
-
బ్యాండ్ బాజా 21st sep 2019
-
బ్యాండ్ బాజా 7th Sep 2019
-
బ్యాండ్ బాజా 31st Aug 2019
-
బ్యాండ్ బాజా 24th Aug 2019
-
గౌడ X సిద్ధూ రగడ
సాక్షి, బెంగళూరు: మొన్నటి వరకు సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్న కాంగ్రెస్, జేడీఎస్ పార్టీల నేతలిపుడు నిందారోపణలకు దిగుతున్నారు. కుమారస్వామి ప్రభుత్వం కూలిపోయి నెల రోజులు గడవటంతో ఇరు పార్టీల మధ్య రాజకీయ రచ్చ రాజుకుంటోంది. ప్రభుత్వం కూలిపోయింది మీ వల్లే అని జేడీఎస్ నేత, మాజీ ప్రధాని హెచ్డీ దేవెగౌడ అంటే.. కాదు మీరు, మీ కుమారుల వల్లే కూలిపోయిందని మాజీ సీఎం సిద్దరామయ్య విమర్శలకు దిగారు. కాంగ్రెస్ వల్లే కుమారస్వామికి అష్టకష్టాలు.. సంకీర్ణ ప్రభుత్వంలో తన కుమారుడు కుమారస్వామిని కాంగ్రెస్ నాయకులు అష్టకష్టాలు పెట్టి బాధపెట్టారని దేవెగౌడ ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం జేడీఎస్ కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడారు. ‘‘కాంగ్రెస్ పెట్టిన హింసలకు కుమారస్వామి నా దగ్గరకొచ్చి కన్నీళ్లు పెట్టుకునేవారు. అది చూసి నాకు భోజనం చేయడానికి కూడా మనసొప్పేది కాదు. కాంగ్రెస్ నేతలు పెట్టే బాధల్ని తట్టుకోలేక సీఎం పదవికి రాజీనామా చేస్తానని కుమార స్వామి చాలాసార్లు ప్రస్తావించారు’’ అంటూ వెల్లడించారు. పతనానికి దేవెగౌడ కారణం: సిద్దరామయ్య జేడీఎస్– కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం పతనం కావడానికి తాను కారణం కాదని సీఎల్పీ నాయకుడు సిద్దరామయ్య వ్యాఖ్యానించారు. మాజీ ప్రధాని దేవెగౌడ, ఆయన కుమారులే కారణమని, రాజకీయ దురుద్దేశంతో దేవెగౌడ తనపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారన్నారు. గతంలో రామకృష్ణ హెగ్డే, ఎస్ఆర్ బొమ్మై, ధరంసింగ్ ప్రభుత్వాలను దేవెగౌడ కూల్చిన విషయం తనకు తెలుసన్నారు. ç జేడీఎస్తో మైత్రి వద్దన్న మాట వాస్తవమేనని, అది తన వ్యక్తిగత అభిప్రాయమని, కానీ ఆ తర్వాత కాంగ్రెస్ అధిష్టానం ఆదేశాల మేరకు పూర్తిగా సహకరించి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశామని చెప్పారు. -
బ్యాండ్ బాజా 10th Aug 2019
-
బ్యాండ్ బాజా 2nd Aug 2019
-
బ్యాండ్ బాజా 27th July 2019
-
బ్యాండ్ బాజా 20th July 2019
-
బ్యాండ్ బాజా 29th June 2019
-
బ్యాండ్ బాజా 15th june 2019
-
బ్యాండ్ బాజా 7th June 2019
-
బ్యాండ్ బాజా 1st June 2019
-
నానాయాగి చేస్తున్న చంద్రబాబు
సాక్షి, చీమకుర్తి : రాష్ట్రంలోని పీడీఎఫ్ ఖాతాల్లో రూ.54 వేల కోట్లు శుభ్రంగా డ్రా చేసుకున్నారు. పట్టిసీమ పేరుతో రూ.1800 కోట్లు కొల్లగొట్టేశారు. ఇక పోలవరం సంగతి సరేసరి. ఇలా రాష్ట్రంలోని నిధులను ఐదేళ్లపాటు అధికారకంగా మెక్కేసిన చంద్రబాబు ఎన్నికల్లో ఓడిపోతాననే భయంతోనే దేశంలోని అన్ని రాష్ట్రాల్లో తిరిగి నానాయాగీ చేస్తున్నాడని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దారా సాంబయ్య అన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఎగ్జిట్ పోల్స్లో స్పష్టంగా వైఎస్సార్సీపీ తరఫున జగన్ సీఎం కావడం ఖాయమని తెలిసి పోయింది కాబట్టే చంద్రబాబు తన ఓటమిని జీర్ణించుకోలేక దేశంలోని పలు ప్రాంతాల్లో కాటికి కాళ్లుచాపిన నాయకులను కలుసుకుంటున్నాడని ఎద్దేవా చేశారు. ఎన్నకలను హుందాతనంగా స్వీకరించాలే తప్ప చంద్రబాబు ఓడిపోతుంటే తన స్థాయి తక్కువ చేసుకుని ప్రవర్తించటాన్ని ప్రజలు గమనిస్తున్నారని చురకలు వేశారు. నాడు బాగున్న ఈవీఎంలు, నేడు ఎందుకు బాగాలేవు 2014లో చంద్రబాబు గెలిచినప్పుడు ఈవీఎంలు బాగున్నట్లా..? అదే ఈవీఎం నేడు ఎందుకు బాగులేవు...? చంద్రబాబు ఓడిపోతున్నాడు కాబట్టేగా ఆ భయం. ఈవీఎంలనే మేనేజ్ చేసే అవకాశం ఉంటే దేశంలోని అన్ని ప్రాంతాల్లో బీజేపీనే గెలిపించుకునేవాళ్లం కదా. నిన్న, మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రాజస్థాన్, మధ్యప్రదేశ్లలో బీజేపీ ఎందుకు ఓడిపోయేదంటూ ఈవీఎంలపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. విశ్వసనీయత లేని బాబు ఇంట గెలిచి రచ్చగెలవమన్నారు. కానీ చంద్రబాబు ఇంట ఓడిపోబోతున్నాడు కానీ రచ్చ మాత్రం రచ్చరచ్చ చేస్తున్నాడు. చంద్రబాబు ప్రవర్తన చూస్తూ అధికార పక్షమూ ఆయనే వ్యవహరిస్తున్నాడు. ప్రతిపక్ష బాధ్యతలను ఆయనే నెరవేరుస్తున్నాడు. ఇలా ద్వంద్వ విధాలను అవలంభిస్తుండడం వలనే మొట్ట మొదటి నుంచి ప్రత్యేక హోదా నుంచి ఇప్పుడు ఈవీఎంల వరకు ఆయన మాట్లాడిన మాటల్లో విశ్వసనీయతను కోల్పోయాడు కాబట్టే ఆయనను ప్రజలు పక్కన పెట్టబోతున్నారని సాంబయ్య చెప్పారు. మోడీని కించపరచడం దారుణం ప్రధాని మోడీ కంటే తానే సీనియర్నని చంద్రబాబు చెప్పుకుంటాడు. కలెక్టర్ కంటే తహశీల్దార్ సీనియర్ అయి ఉంటాడు. అంతమాత్రం చేత తహశీల్దార్ చెప్పినట్లు కలెక్టర్ వినాలా..? కలెక్టర్ చెప్పినట్లు తహశీల్దార్ వినాలా..? ఆర్డర్ ఆఫ్ ప్రోటోకాల్ పాటించకుండా మోడీని కించపరచటం, దారుణంగా మాట్లాడటం కూడా ప్రజల్లో చంద్రబాబు ప్రవర్తనా తీరుపైప్రజలు విసుగెత్తిపోయారని సాంబయ్య స్పష్టం చేశారు. జగన్ సీఎం కావడం ఖాయం రేపు మే నెల 23న రాష్ట్రంలో వైఎస్సార్సీపీ గెలిచి జగన్ సీఎం కావడం ఖాయం. కేంద్రంలో మోడీ తిరిగి ప్రధాని కావడం ఖాయమన్నారు. ఏప్రిల్ నెల 11న ఫ్యాన్కే పట్టాభిషేకం అని తాను చెప్పిన జోస్యం నిజం కాబోతుందని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో వైఎస్సార్సీపీకి 130 సీట్లుకు తగ్గకుండా వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. లగడపాటి సర్వేలో హేతుబద్దత లేదని, ఆయన సర్వే ఏదో ఒక పార్టీకి మేలు చేయాలనే లక్ష్యంతో చెప్పినట్లుగా ఉందే తప్ప అది సర్వే కాదు. సర్వేలో ప్రజల అభిప్రాయాలు ప్రతిబింభించాలే తప్ప ఎవరికో లబ్ధి చేకూర్చేలా ఉండే వాటిని సర్వేలని చెప్పడం సమంజసం కాదని లగడపాటి సర్వేను కొట్టిపారేశారు. -
బ్యాండ్ బాజా 18th May 2019
-
బ్యాండ్ బాజా 4th May 2019
-
కోడలా, కోడలా...కొడుకు పెళ్లామా...
ఓ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలంటే ఆ ఏడాదంతా కష్టపడాలి. అది ఎల్కేజీ కానీ...పదో తరగతి పరీక్ష కానీ. ఏ పరీక్ష అయినా ఇదే పద్ధతి. ఆ ఉత్తీర్ణతకు ముందు పలు విభాగాల పాఠ్యపుస్తకాలు అధ్యయనం, ప్రతినెలా, త్రైమాసికం, ఆఫ్ ఇయర్లీ, ఫైనల్ పరీక్షలు ఉం టాయి. ఒక్కో మెట్టు దాటి ... ఫైనల్లో ఉత్తీర్ణులైతేనే సర్టిఫికెట్. మరి ఈ నేతలేమిటో ఎన్నికల ముందు సీటు దక్కించుకొని ఓటేయాలని నేరుగా మా ముందుకే వచ్చేస్తున్నారు. ఎన్నికల్లో పోటీ చేస్తామనే ఆలోచన ఉన్నవారు జనం మధ్యలో ఉండి...కష్ట, నష్టాలపై పోరాడాలి కదా...పోరాటం వద్దు... ఏ సమస్యలున్నాయో తెలుసుకోవాలి కదా. నియోజకవర్గ పరిధులు తెలి యవు, అందులో మండలాలు...మండలాల్లోని గ్రామాల మొహం ఏనాడైనా చూశారా వీరు. రాజమహేంద్రవరం పార్లమెంటు టీడీపీ అభ్యర్థి మాగంటి రూప, నగర టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి ఆదిరెడ్డి భవానీ విషయం దగ్గరకు వద్దాం. గత నెల వరకు ఇక్కడ ఎవరు పోటీ చేస్తారో తెలియదు... ఓ నగర నేతైతే ‘ఆ సీటు నాదే...నన్ను కరివేపాకులా వాడుకుంటున్నారని, యూజ్ అండ్ త్రోగా పార్టీలో నేనున్నానని’ విలేకర్ల సమావేశం పెట్టి మరీ వాపోయాడు. రాజమహేంద్రవరం రూరల్ ప్రజాప్రతినిధి, ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీగా గుర్తింపు పొందిన సీనియర్ నేత రాజమహేంద్రవరం నగరం టికెట్ కోసం చక్రం తిప్పినా ఆ చక్రం గతి తప్పిం ది. చివరకు వలస నేత మేతకే రుచిమరిగిన అధి ష్టానం అటువైపే మొగ్గు చూపిం ది. ఏకంగా ఆయన కోడలకే ‘జై భవానీ అంటూ ‘జై’ కొట్టింది. ఇక పార్లమెంటు అభ్యర్థి విషయంలో పోటీ లేదు. మామ వద్దంటూనే కోడల్ని ముందుకు నెట్టి సైకిల్ ఎక్కించేశారు. అవన్నీ నాకెందుకు...మీ పార్టీ అంతర్గతం. నా దగ్గరకు వచ్చి ... నా ఓటును కెలుకుతున్నారు కాబట్టి నేనో విషయం నేరుగా ఈ మహిళా అభ్యర్థుల్నే అడుగుతా. ఇంతకు ముందు చెప్పినట్టు ఓ విద్యార్థి పరీక్ష గట్టెక్కాలంటే ఆ ఏడాదంతా చదవాలి కదా. మరి మీరు ఈ నియోజకవర్గం కోసం ఏమి చదివి మా ముందుకు వచ్చారు. నియోజకవర్గంపై మీకు ఏమాత్రం అవగాహన ఉంది? ఓ పార్టీలో గెలిచి, మరో పార్టీలో చేరి నిస్సిగ్గుగా ప్రజాస్వామ్యం కోసం సుద్దులు చెబుతున్న మీ మామగారి చరితేమిటో మీకు తెలియంది కాదు. ఓ పార్టీ వాళ్లు గెలిపిస్తే...వారికి వెన్నుపోటు పొడిచి మరో పార్టీ కండువా వేసుకొని ఇప్పుడు ఓటుకు రేటు కడుతూ ఏ మొహం పెట్టుకొని ఓటు అడుగుతున్నారు. మీకు ఓటేస్తే ... ఈ ఓట్లన్నీ మరో పార్టీకి గుత్తగా అమ్మేయరనే గ్యారంటీ ఏమిటీ. ఓటుతో గద్దెనెక్కిస్తే కోట్ల రూపాయలకు అమ్ముడైపోయిన ప్రజాప్రతి‘నిధుల’కా మేం ఓట్లేయాలా. ఇక ఎంపీ అభ్యర్థి మామగారు ... ఈ ఐదేళ్లు ఎంపీగా ఉండీ చేసిందేమీ లేదు. హోదా కోసం వాళ్ల పార్టీ నేత ఆమరణ...! నిరాహార దీక్ష చేస్తే ‘పెరిగిన కొవ్వు కరగడాని’కన్నట్టుగా ఎకసెక్కాలకు దిగి ... హోదాగ్నిపై నీళ్లు జల్లిన ఈయనా మనకు నేత. ఢిల్లీలో తలపడాల్సిన ఈయన నిజ జీవితంలో కూడా ‘నటిస్తూ’ ఈ సారి మొహానికి రంగు మార్చినట్టుగా తన కోడలికి ఎన్నికల రంగు పులిమి మా ముందు నిలబెట్టారు. మహిళాద్వయానికి ఏమి చూసి ఓటు వేయాలి...? పోటీ చేయాలని ఆలోచన ఉంటే కనీసం ఏడాది ముందునుంచైనా ఓటర్లతో మమేకమవకుండా ఇప్పుడు ‘తగుదనమ్మా’నంటూ వస్తే మేమేమైనా మేకలమా? ఓ పెళ్లి చేయాలంటే ఏడు తరాల చరిత్ర చూడాలని అన్నారు పెద్దలు. మంచి నేతను ఎంపికచేసుకునే ముందు కనీసం ఓ తరం చరిత్ర కూడా చూడొద్దా..? మా ఓటే మాకు వజ్రాయుధం... విచక్షణతో ఓటేస్తాం. – కృష్ణారావ్... -
బ్యాండ్ బాజా
-
బ్యాండ్ బాజా 30th March 2019
-
హార్టికల్చర్ హబ్.. అంతా హుళక్కే
‘వైఎస్సార్ జిల్లాను హార్టికల్చర్ హబ్గా మార్చేస్తామంటే నిజమేనని అనుకున్నాం. లెక్కలేనని ఉప ఉత్పత్తుల పరిశ్రమలు వచ్చేస్తాయని చెప్తే మంచిరోజులొస్తాయని భ్రమపడ్డాం. అదుగో ఉద్యాన పంట ఉత్పత్తులు కొనేందుకు దేశీయ, విదేశీ కార్పొరేట్ కంపెనీలు క్యూ కట్టేస్తున్నాయంటూ హోరెత్తిస్తే నిజమేననుకున్నాం. అవన్నీ ఒట్టి మాటలేనని తేలిపోయాయి. సాక్షాత్తూ సీఎం చంద్రబాబు, వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డే మమ్మల్ని బురిడీ కొట్టించారు. మా ఉద్యాన రైతుల ఆశలను అడియాశలు చేశారు’ అని వైఎస్సార్ జిల్లా రైతులు గోడు వెల్లబోసుకున్నారు. ‘సీఎం, మంత్రి జిల్లాకు వచ్చినప్పుడల్లా హార్టికల్చర్ హబ్ అంటూ ఊదరగొట్టారు. గిట్టుబాటు ధర లేకపోతే రూ.4 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటుచేసి తామే పంటను కొంటామని భరోసా ఇచ్చారు. ఆ హామీలన్నీ గాలి మూటలయ్యాయి. మాకు తీవ్ర అన్యాయం చేశారు’ అని వైఎస్సార్ జిల్లా లింగాల మండల కేంద్రంలో ‘సాక్షి’ నిర్వహించిన రచ్చబండలో రైతులు వాపోయారు. సీఎం చంద్రబాబు, వ్యవసాయ మంత్రి దారుణంగా మోసగించారు. ఉప ఉత్పత్తుల పరిశ్రమలు ఎక్కడ? రూ.4వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి అంటూ ఎందుకు మోసగించారు? రచ్చబండలో రైతులు ఏం చెప్పారంటే.. జిల్లాలో 36 రకాలకు పైగా ఉద్యాన పంటల్ని పండిస్తున్నాం. పక్క జిల్లాలో పలు రకాల కంపెనీలను తీసుకువచ్చి దిగుబడుల్ని కొనుగోలు చేయిస్తున్నారు. అందుకు బడ్జెట్లో రూ.45 కోట్లు అదనంగా కేటాయించారు. రైపనింగ్ చాంబర్లు, కోల్డ్ స్టోరేజీలు, గ్రేడింగ్ యూనిట్లు, ఉప ఉత్పత్తుల కేంద్రాలను ఏర్పాటు చేశారు. మా జిల్లాపై మాత్రం చిన్న చూపు చూశారు. తెలుగు రాష్ట్రాలతోపాటు దేశ, విదేశాల్లో పులివెందుల అరటి, వీరబల్లి బేనిషా మామిడికి మంచి పేరుంది. జిల్లా నుంచి ఢిల్లీ, ముంబై, నాగపూర్, చెన్నై, వేలూరు, హైదరాబాద్, బెంగళూరు, పుణే, రాజస్తాన్, గుజరాత్, ఉత్తరప్రదేశ్, పంజాబ్ మార్కెట్లకు మేమే సొంత ఖర్చులతో ఎగుమతి చేస్తున్నాం’ అని ఓ రైతు ఇక్కట్లను ఏకరువు పెట్టాడు. మరో రైతు అందుకుంటూ ‘జిల్లాలో 1.11 లక్షల హెక్టార్లలో అరటి, మామిడి, బొప్పాయి, చీనీ, నిమ్మ, జామ, దానిమ్మ, సపోటా, పూల తోటలు, కూరగాయ పంటలు సాగు చేస్తున్నాం. ఉప ఉత్పత్తుల తయారీ పరిశ్రమలు లేకపోవడంతో ఏటా రూ. 600 కోట్లు నష్టపోతున్నాం. మార్కెటింగ్ లేక దళారులను, వ్యాపారులను ఆశ్రయిస్తున్నాం. గిట్టుబాటు ధర లేనప్పుడు విలువ ఆ«ధారిత ఉత్పత్తుల తయారీకి అవసరమైన గ్రేడింగ్, ప్రాసెసింగ్, జ్యూస్, పల్ప్, పౌడర్ పరిశ్రమల యూనిట్లు, అనుబంధ పరిశ్రమలు ఏర్పాటు చేయలేదు. దీంతో అయినకాడికి అమ్ముకుంటున్నాం. జిల్లాలో అరటి కోసం బనానా కోల్డ్ చైన్ పేరిట రూ.5–6 కోట్లతో ప్రణాళికలు తయారు చేసి ప్రభుత్వానికి పంపి ఐదేళ్లవుతున్నా వాటికి దిక్కూమొక్కూలేవు. అపెడా, వాల్మార్ట్, ఫ్యూచర్ గ్రూప్స్, ఐఎన్ఐ కంపెనీలు జిల్లాకు వస్తున్నాయంటూ ఆశలు కల్పించినా ఒక్క కంపెనీ కూడా రాలేదు’ అని మరో రైతు ఆవేదన వ్యక్తం చేశారు. మామిడి, అరటి, బొప్పాయి, చీనీ, నిమ్మ, కూరగాయల పంటలు సాగు చేసే రైతులతో 52 రైతు ఉత్పత్తిదారుల సంఘాలు ఏర్పాటైనా, మా గ్రూపుల వద్దకు వచ్చి ఇంతవరకూ పంటను కొనుగోలే చేయలేదని ఇంకొకరు వాపోయారు. జిల్లాలో సాగవుతున్న పండ్ల తోటలు (హెక్టార్లలో) 1,11,254 పండ్ల తోటల నుంచి దిగుబడి (టన్నుల్లో) 28,47,519 పంట ఉత్పత్తుల ఆదాయం (రూ. కోట్లలో) 1,775 పరిశ్రమలు లేక నష్టపోతున్న మొత్తం (రూ. కోట్లలో) 600 గ్రూపు ఏర్పాటైనా ఒరిగిందేమీ లేదు ప్రభుత్వం ఊరించడం తప్ప ఉద్యాన రైతుకు చేసిందేమీలేదు. అరటి, మామిడి, బొప్పాయి రైతులు గ్రూపులుగా ఏర్పాటవ్వాలని చెప్పారు. ఇంతవరకు ఒక టన్ను కూడా కొనుగోలు చేయలేదు. ప్రత్యేక పరిశ్రమలు వచ్చిన దాఖలాలు లేవు. ధరల స్థిరీకరణ నిధిని రూ.4వేల కోట్లతో ఏర్పాటు చేస్తామని చెప్పినా అది ఏమైందో ముఖ్యమంత్రికే తెలియాలి. ప్రతి ఏటా తక్కువ ధరకు అరటి పంటను అమ్ముకోవాల్సి వస్తోంది. –కె.చంద్రశేఖరరెడ్డి, లింగాల ఉప ఉత్పత్తుల పరిశ్రమ ఒక్కటీ రాలేదు అరటి నుంచి జ్యూస్, క్రీములు, వడియాలు, నారు, పేపరు ప్లేట్లు తయారు చేసే పరిశ్రమలు వస్తున్నాయని సీఎం పార్నపల్లె లిఫ్ట్ ఇరిగేషన్ ప్రారంభోత్సవానికి వచ్చినప్పుడు గొప్పలు చెప్పారు. ఇంతవరకు ఒక్క పరిశ్రమ ఏర్పాటు చేయలేదు. నాలుగైదు రోజులు నిల్వ ఉన్నా చెడిపోనంత నాణ్యత కలిగిన కాయలు ఇక్కడి ప్రత్యేకత. సీఎం మాటలు చెప్పడం తప్ప ఉద్యాన రైతులకు చేసిందేమీ లేదు. –ఎంసీ శేఖరరెడ్డి, లింగాల హార్టికల్చర్ హబ్ లేదు.. అంతా ఉత్తిదే హార్టికల్చర్ హబ్ వస్తుంది. పరిశ్రమలు, ఉప పరిశ్రమలు వస్తాయని ఐదేళ్లుగా కళ్లు కాయలు కాసేలా ఎదురు చూశాం. పంటకు గిట్టుబాటు ధర వస్తుందని ఆశించాం. అవేమీ రాలేదు. చివరకు దళారులను ఆశ్రయించి పంటను అమ్ముకోవాల్సి వస్తోంది. – అలవలపాటి ప్రతాప్రెడ్డి, లింగాల మార్కెట్ సదుపాయం కల్పించకుండా దగా లింగాల మండలానికి ముఖ్యమంత్రి చంద్రబాబు రెండు సార్లు వచ్చారు. ఇక్కడి రైతులు బంగారం పండిస్తున్నారని, అరటికి మార్కెట్ సదుపాయం కల్పిస్తామని, రైతులను లక్షాధికారుల్ని చేస్తామని నమ్మబలికారు. – ఎ.శంకరరెడ్డి, లింగాల -
జగన్.. ఓ మై జగన్
చంద్రబాబు ప్రచారసభలకు జనం రావడం మానేశారు. వేదిక కింద ప్రజలు ‘నాయకులసంఖ్య’లో, వేదిక పైన నాయకులు ‘ప్రజలసంఖ్య’లో కనిపిస్తున్నారు. ‘‘చూశారా తమ్ముళ్లూ.. ఆ జగన్ని’’ అన్నాడు చంద్రబాబు.. మైకు నోటి దగ్గర పెట్టీ పెట్టుకోగానే. ‘‘చూడ్డానికి తమ్ముళ్లెవరూ రాలేదు సార్. కొంచెంసేపు వెయిట్ చేద్దాం’’ అన్నారు వేదిక మీది నాయక ప్రజలు. ‘‘లీడర్ కోసం జనం వెయిట్ చెయ్యాలి గానీ, జనం కోసం లీడర్ వెయిట్ చెయ్యడం ఏంటయ్యా? తమాషాగా ఉందా! ఎటుపోతున్నాం మనం? ఐ వాంట్ ప్రజలు రైట్ నౌ’’ అన్నాడు చంద్రబాబు. ‘‘రైట్ నౌ అంటే కొంచెం కష్టమేమో సార్. ఎంత ట్రై చేసినా ప్రజలు ఇళ్లలోంచి కదలడం లేదు. ‘మీ భవిష్యత్తు నా బాధ్యత’ అని బాబుగారు తన పేరు చెప్పి మరీ మిమ్మల్ని తీసుకురమ్మన్నారని చెప్పినా ఎవరూ వినడం లేదు’’ అన్నాడు వేదిక మీద ఆ చివర్న ఉన్న లీడర్ ఈ చివరికొచ్చి. చంద్రబాబుకి చిరచిరలాడింది. ‘‘ఎండలు ముదిరిపోయాయా? ప్రజలు ముదిరిపోయారా’’ అన్నాడు. ‘‘ఎండలు ముదిరిపోతే.. మనకొక ఎండ, జగన్కొక ఎండ ఉండవు కదా నాయుడు గారూ. ఏదో ఊటీకి వెళ్లినట్లు ఓటర్లంతా మూట గట్టుకుని జగన్ మీటింగులకు వెళ్తున్నారు. అంటే.. ఎండలు ముదర్లేదు. ప్రజలే ముదిరారు. ఇకనైనా మీరు జగన్ సీఎం అయితే రాష్ట్రంలో ఏం జరగదో చెప్పడం మాని, మీరు సీఎం కాకపోతే రాష్ట్రానికి ఏం జరుగుతుందో చెప్పుకోవాలి. రోజుకు వందసార్లు మీకు తెలియకుండానే జగన్.. జగన్.. అంటున్నారు తెలుసా మీరు’’ అన్నాడు వేదిక మీద ఉన్న ఇంకో నాయకుడు. ‘‘ఏంటయ్యా నువ్వు. జగన్కి ప్రశాంత్ కిశోర్లా, నువ్వు మాకు అశాంత్ కిశోర్లా తయారయ్యావు. నోటికి ఒక్క మంచిమాటా రాదా నీకు!’’ అన్నాడు చంద్రబాబు. ‘‘అదిగో చూశారా.. మళ్లీ జగన్ అన్నారు’’ అన్నాడు నాయకుడు. ‘‘సర్లే. జగన్ని జగన్ అనకుండా ఇంకేం అనమంటావో చెప్పు. ఏదో ఒకటి అనకపోతే జగన్ని జనమే కాదు మనమూ నమ్మేస్తా’’ అన్నాడు చంద్రబాబు. ‘‘ఊ.. జగన్లో ‘జ’ని తీసి గన్ అనొచ్చు. కానీ, ఆ గన్ని మన మీద మనమే గురి పెట్టుకున్నట్లు అవుతుంది. పోనీ, జగన్లో ‘గ’ ని తీసి, జన్ అందామంటే జగన్ జనం మనిషి అన్న మీనింగ్ వస్తుంది. ఈ రెండూ కాకుండా జగన్లోని చివరి అక్షరం తీసి ‘జగ’ అంటే మీనింగ్లెస్ అవుతుంది. బుర్ర చెడిపోయిందనుకుంటారు మనకు. పూర్తి పేరు జగన్మోహన్రెడ్డి కాబట్టి, ‘జగన్’ తీసి మోహన్రెడ్డి అంటే అసలే వర్కవుట్ కాదు. పవన్ కల్యాణ్ని పవన్ కల్యాణ్ అనకుండా కల్యాణ్ అంటే ఏం తెలుస్తుంది? జగన్ని జగన్ అని కాకుండా మోహన్రెడ్డి అన్నా అంతే’’ అన్నాడు నాయకుడు. ‘‘మరేం చేద్దామంటావ్. జనమూ రాకుండా, జగన్ పేరూ రాకుండా.. ఎలా మనం ప్రచారం చేసుకోవడం’’ అన్నాడు చంద్రబాబు డీలా పడిపోతూ. స్టేజ్ పైన ఆయన్ని ఆ స్టేజ్లో చూసి తట్టుకోలేకపోయారు స్టేజీపై నాయకులు. ‘‘దిగులు పడకండి నాయుడు గారూ. జనం రాకున్నా వచ్చారనీ, జగన్ పేరు ఎత్తకున్నా ఎత్తారని రాయడానికి ‘ఈ’పేపర్, ‘ఆ’పేపర్ ఉన్నాయి కదా. అన్నీ మీరన్నవే రాస్తున్నాయా ఆ రెండు పేపర్లు. జనానికి మీరు చెప్పనివి, జగన్ని మీరు అననివి కూడా వాటికవే అల్లి, పేజీకో పెద్ద హెడ్డింగ్ పెట్టి వేస్తున్నాయి కదా. ప్రచారాన్ని వాటికి వదిలిపెట్టి మీరు ప్రశాంతంగా ఉండండి’’ అని చంద్రబాబుని సేదతీర్చాడు వేదికపై ఉన్న ఓ నాయకుడు. – మాధవ్ -
బాబు ఇక ఆపు నీ డప్పు..
ఎల్లో మీడియా ఎన్నికల వేళ మొదలెట్టాం మా బాబు డప్పు వాస్తవాన్ని కప్పెట్టి అహోఒహోలతో మెప్పు మా నిప్పే గొప్పంటూ తిప్పితిప్పి చెప్పు ప్రజలు ఇన్నాళ్లూ చేసిందేమిటో గుట్టు విప్పు ఇప్పటికే మేం చేసింది తప్పు అందరికీ కలిగింది కనువిప్పు.. ఈసారి తప్పకుండా వదిలిస్తాం ఈ తుప్పు -
సైకిల్, గ్లాస్ ఒక్కటేరా..
అది నెల్లూరులోని ఓ వీధిలో ఉన్న కేఫ్.. రవి: రేయ్ పిల్లకాయ్.. ఏం ఆలోచిస్తున్నావ్? త్వరగా టీ తాగు. పోదాం.. ప్రవీణ్ : ఏం లేదన్నా.. నాకొకటి అర్థం కావట్లేదు. మా సేనాని మీ పార్టీవోళ్లని వదిలేసి ప్రతిపక్షాన్ని ప్రశ్నిస్తున్నాడు. సీట్లు కూడా మీ పార్టీకి అనుకూలంగా ప్రకటించాడు. ఇది కరెక్టేనా అన్నా. రవి: ఏందిరా తమ్ముడూ.. కొత్తగా మాట్లాడతన్నావ్? ఏమైందిరా. నీకు బ్రెయిన్ వాష్ చేయాల్సిందే. పైన, కింద మనం ఒకటేరా. అప్పుడు పబ్లిగ్గా కలిసున్నాం. ఇప్పుడు రహస్యంగా కలిసుంటున్నాం. మనం వేరు కాదురా. ప్రవీణ్ : అన్నా.. పబ్లిక్ పిచ్చోళ్లు కాదే. వాళ్లకి అన్నీ అర్థమవుతున్నాయ్. రవి: వామ్మో.. నీకు అర్థమయ్యేలా చెప్పాల్సిందే. చూడు పిల్లోడా.. అమరావతి పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం జరుగుతున్నా, అధికారులపై దాడులు పెరిగినా, ప్రాజెక్ట్ల్లో అవినీతి ఏరులై పారుతున్నా, పెట్టుబడుల సదస్సుల పేరుతో అబద్ధాలు చెబుతున్నా, హత్యా రాజకీయాలు చేస్తున్నా, ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్నామని జనం చెవిలో పూలు పెట్టినా, ఇసుక, మట్టి, గ్రావెల్ ఇష్టమొచ్చినట్టు తవ్వేసి దోపిడీ చేస్తున్నా, ఓటుకు నోటిస్తూ అడ్డంగా దొరికిపోయినా బాబోరిని మీ సేనాని ప్రశ్నించలేదు. ఎందుకంటావు? అది వాళ్లిద్దరి మధ్య ఉన్న ఒప్పందం. బాబోరి మీద ఈగ వాలనివ్వడు. ఆయనకు ఏదైనా సమస్య వస్తే ప్రతిపక్షాన్ని తిట్టి డైవర్ట్ చేస్తాడు. ప్రవీణ్ : థ్యాంక్స్ అన్నా.. భలే విషయం చెప్పావు.. ఇంత వరకు నాకు ఈ రాజకీయం తెలవదు. రవి: హా.. మీరు మంచోళ్లు రా. ఎప్పుడూ మా కోసమే పని చేస్తారు. సోషల్ మీడియాలో కూడా టీడీపీ అవినీతిపై ఎవరైనా మాట్లాడితే వాళ్లని వ్యక్తిగతంగా తిట్టి డైవర్ట్ చేయ్. ఇప్పటికే మనోల్లు చాలా మంది అట్లనే చేస్తున్నారు. అంటూ వెళ్లాపోయారు. ఓ పెద్దాయన వీరి మాటలిని ‘ఖర్మ రా బాబు’ అనుకుంటూ పైకి లేచాడు. -
బ్యాండ్ బాజా 9th Feb 2019
-
బ్యాండ్ బాజా 2nd Feb 2019
-
బ్యాండ్ బాజా 26th Jan 2019
-
వెండితెరపై వీధి పోరాటాలు
తమిళనాడులో అన్నాడీఎంకే ప్రభుత్వం విజయ్ నుంచి రజనీకాంత్ దాకా ప్రజాదరణ పొందిన సినిమా స్టార్ల పని పట్టాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఒకవైపు తమిళ సినిమాల్లో రాజకీయపరంగా చూపుతున్న వివాదాస్పద దృశ్యాల పట్ల ప్రభుత్వ వైఖరిని ఇది ప్రతిఫలిస్తోంది. మరొకవైపు జయలలిత జీవించి ఉండగా ఆమెను కన్నెత్తి చూడటానికి సాహసించని తమిళ చిత్ర పరిశ్రమ ఆమె లేనప్పుడు విమర్శలకు దిగడం గమనార్హం. విజయ్ తాజా సినిమా ‘సర్కార్’ లో ప్రజలు మిక్సర్లు, గ్రైండర్లు వంటి జయ ప్రభుత్వం అందించిన ఉచిత వస్తువులను నిప్పుల్లోకి విసిరేస్తున్నట్లు చిత్రించిన పాట పట్ల అన్నాడీఎంకే తీవ్ర ఆగ్రహం ప్రదర్శించింది. తమిళనాడులో ప్రస్తుతం జరుగుతున్నది నిజంగానే పరిహాసాస్పదంగా ఉంది. రాజకీయ రంగంలో ప్రతిభకు సంబంధించిన కన్వేయర్ బెల్ట్గా చిత్రపరిశ్రమను వ్యవహరిస్తున్న చరిత్ర ఈ రాష్ట్రానికి ఉంది. వెండితెరకు పరిచయమై తర్వాత రాజకీయ భవిష్యత్తును నిర్మించుకున్న ఇద్దరు నేతలు ఎంజీ రామచంద్రన్, జయలలితలతో అన్నాడీఎంకే బాగా లబ్ధి పొందింది. అంతకు ముందు డీఎంకే పార్టీ మాస్ మీడియా అయిన సినిమా దన్నుతో తన భావజాలాన్ని ప్రచారం చేసేది. కానీ ఈరోజు అన్నాడీఎంకే గడచిన దీపావళివారాన్ని చాలావరకు చెన్నై ఆకాశంలో రాజకీయ పటాసులను పేల్చడంలోనే గడిపేసింది. తమిళ చిత్ర పరిశ్రమలో ముగ్గురు మేటి హీరోలు విజయ్, రజనీకాంత్, కమల్ హాసన్లకు వ్యతిరేకంగా తుపాకులు గురిపెట్టాలని ఈ పార్టీ నిశ్చయించింది. రజనీ, కమల్ రాజకీయాల్లో ప్రవేశించనున్నట్లు ప్రకటించారు. ఇక రాజకీయాలపై విజయ్ ఆసక్తి అందరికీ తెలిసిందే. తమిళనాడులో విజయ్ నటించిన చిత్రం ‘సర్కార్’తో అన్నాడీఎంకే సర్కారుకు సమస్యలు మొదలయ్యాయి. ఊహించినట్లుగానే ఈ సినిమా బాక్సాఫీసు వద్ద భారీ ఓపెనింగ్స్సాధించింది. అయితే, ‘సర్కార్’ సినిమా తమ పార్టీ పరువుకు నష్టం కలిగించేందుకు పన్నిన కుట్ర అంటూ అన్నాడీఎంకే నిందించింది. విజయ్, ఈ చిత్ర నిర్మాతలను ఉగ్రవాదులుగా చిత్రించడమే కాకుండా రాజద్రోహ ఆరోపణలు చేస్తూ వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఇద్దరు మంత్రులు హెచ్చరించారు. విజయ్ వంటి వృద్ధిలోకి వస్తున్న నటుడికి ఇది మంచిది కాదు అని రాష్ట్ర సమాచార మంత్రి కె. రాజు అభిప్రాయపడ్డారు. ఇక న్యాయశాఖ మంత్రి సీవీ షణ్ముగం ఆరోగ్యకరమైన విమర్శకు ఆహ్వానం పలుకుతూనే, సినిమా హింసను ప్రేరేపించిందని, ఇది తీవ్ర నేరమని వ్యాఖ్యానించారు. ప్రజలు తమకు ఓటు వేసేలా ఆకర్షించడానికి వస్తువులను ఉచితంగా బహూకరిస్తామని వాగ్దానం చేయడం తమిళనాడు ఎన్నికల సంస్కృతిలో భాగం. అన్నాడీఎంకే దివంగత నాయకురాలు జయలలిత 2011 తమిళనాడు ఎన్నికల్లో ఈ వస్తువులను ఇస్తామని వాగ్దానం చేశారు. ప్రజలు ఇలాంటి ఉచిత వస్తువులను తిరస్కరిస్తున్నట్లు చూపటం ద్వారా సర్కార్ చిత్రం అన్నాడీఎంకే పార్టీని వేలెత్తి చూపుతోందని ఆ పార్టీ అర్థం చేసుకుంది. అంతటితో కథ ముగియలేదు. ఆ సినిమాలో విలన్ పాత్ర పోషించిన వరలక్ష్మి పేరు కోమలవల్లి. ఇది జయలలిత అసలు పేరు. తమ నాయకురాలి స్మృతిని అవమానించడానికి ఉద్దేశపూర్వకంగా ఆ పేరును పెట్టారని అన్నాడీఎంకే భావిస్తోంది. పైగా సన్ పిక్చర్స్ ఈ సినిమాను నిర్మించడం రాజకీయ కుట్ర దాగి ఉన్నట్లు అన్నాడీఎంకే పసిగట్టింది. ఈ చిత్ర సమర్పకుడు కళానిధి మారన్ డిఎంకే దివంగత నాయకుడు ఎం.కరుణానిధి మునిమనవడు. కళానిధి సోదరుడు దయానిధి మారన్ డీఎంకే ఎంపీగా, యూపీఏ ప్రభుత్వంలో కేంద్ర టెలికాం మంత్రిగా పనిచేశారు. పైగా తమిళనాడులో డీఎంకే, అన్నాడీఎంకేలు రాజకీయపరంగా బద్ధశత్రువులు కూడా. అన్నాడీఎంకే కార్యకర్తలు మదురైలో సర్కార్ సినిమా ప్రదర్శనను అడ్డుకోవడమే కాకుండా సినిమా హాళ్లపై దాడి చేయడంతో పరిణామాలు మరింత వేడెక్కాయి. ఈ సినిమాపై 110 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టినందున ఆర్థిక నష్టాన్ని పసిగట్టిన సర్కార్ చిత్ర నిర్మాతలు సినిమాలో కోమలవల్లి పేరును వల్లించిన దృశ్యాలను మ్యూట్ చేయడంతోపాటు ఉచిత పథకాలపై విమర్శ దృశ్యాలను సినిమాలోంచి తొలగించాలని నిర్ణయించారు కూడా.సర్కార్ సినిమాపై తమ వైఖరిని మరింత స్పష్టంగా వ్యక్తపరచిన ఆ రాష్ట్ర రెవెన్యూమంత్రి ఆర్బి ఉదయకుమార్ తమిళ సినిమాలకు విధివిధానాలను కూడా నిర్దేశించేంత పనిచేశారు. సెన్సార్ బోర్డును మించి మాట్లాడుతూ, రాజకీయ ఉద్దేశాలతో కూడిన వివాదాస్పద దృశ్యాలను సినిమాలు వదిలేయాలని ఉదయకుమార్ పేర్కొన్నారు. అమ్మ జయలలిత ప్రభుత్వ సంక్షేమ పథకాలను విమర్శించే హక్కు ఎవరికీ లేదని ప్రకటించారు. 2017 దీపావళినాడు విడుదలైన విజయ్ సినిమా మెర్సల్ (తెలుగులో ‘అదిరింది’) సైతం ఇలాంటి చిక్కులను ఎదుర్కొంది. జీఎస్టీ (గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్)ని నేరుగా విమర్శిస్తూ ఆ సినిమాలో పొందుపర్చిన ఒక సంభాషణ పట్ల తమిళనాడు బీజేపీ యూనిట్ అభ్యంతరం తెలిపింది. సినిమాలోంచి ఆ డైలాగ్ను తీసివేయాలని కోరుతూ బీజేపీ విజయ్కి వ్యతిరేకంగా ప్రచారం చేసింది కూడా. కానీ ఆ చిత్రంపై వచ్చిన వ్యతిరేకత మరింత ఆసక్తిని రేపి, మెర్సల్ని బాక్సాఫీసు వద్ద మరింత హిట్ చేసింది. నిజానికి మెర్సల్ను వ్యతిరేకించాలని బీజేపీ తీసుకున్న నిర్ణయం బెడిసికొట్టింది. ఒకసారి సెన్సార్ బోర్డు సినిమాకు సర్టిఫికెట్ ఇచ్చాక, అన్నాడీఎంకే ప్రభుత్వంతో సహా మరెవరికీ సినిమాను అడ్డుకునే అధికారం లేదని సర్కార్ సినిమాను సమర్థిస్తున్న వారు వాదిస్తున్నారు. ప్రభుత్వ బలాన్ని, కండబలాన్ని ఉపయోగించి తమ భావ వ్యక్తీకరణ స్వేచ్ఛపై దాడిచేస్తున్నట్లుగా వీరు భావిస్తున్నారు. అయితే చిత్ర నిర్మాతలను తమ చెప్పుచేతల్లో ఉంచుకోవాలనుకోవడం సర్కార్ సినిమాతోనే మొదలు కాలేదు. 2013లో కమల్ హాసన్ సైతం ముస్లిం బృందాలు వ్యతిరేకత తెలపడంతో తన విశ్వరూపం సినిమాలో కొన్ని మార్పులు చేయాల్సి వచ్చింది. అధికారంలో ఉన్నవారి ప్రోత్సాహంతోటే అలాంటి నిరసన ప్రదర్శనలు జరుగుతున్నాయని ఈ ప్రముఖ నటుడు, నిర్మాత పదేపదే చెబుతూ వచ్చారు. అదే సంవత్సరం విజయ్ తీసిన తలైవా (నాయకుడు) ‘నాయకత్వం వహించాల్సిన సమయం’ అంటూ ట్యాగ్ లైన్తో వచ్చింది. ఇది అన్నాడీఎంకే నాయకత్వాన్ని కలవరపర్చింది. చిత్ర ప్రచార కార్యక్రమాల నుంచి ఆ ట్యాగ్ లైన్ను పూర్తిగా తొలగించాక రెండు వారాలు ఆలస్యంగా ఆ సినిమా విడుదలకు నోచుకుంది. ‘నోటా’, ‘తమిళ్పడమ్2’ అనే రెండు సినిమాలు కూడా అన్నాడీఎంకే పాలనను తీవ్రంగా విమర్శించాయి. కానీ పాలక పార్టీ వాటిపై ఎలాంటి వ్యతిరేకతనూ ప్రదర్శించలేదు. నిజానికి తమిళ్పడమ్2 సినిమా దర్శకుడు సీఎస్ అముదం గత శుక్రవారం వ్యంగ్యంగా ట్వీట్ చేస్తూ, సర్కార్ చిత్రాన్ని ప్రమోట్ చేయడంలో అన్నాడీఎంకే సాయపడుతోందన్నారు. ‘అలాంటి ప్రచారాన్ని మా సినిమాకు దక్కనివ్వలేదు, మేం సినిమాను ఉత్తమంగా తీయడానికి ప్రయత్నించాం. ఇది పూర్తిగా పాక్షిక వైఖరే‘ అనేశారు. విజయ్ని అన్నాడీఎంకే ప్రభుత్వం లక్ష్యంగా చేసుకోవడానికి కారణం ఉంది. విజయ్కి యూత్లో, ఫ్యామిలీ ఆడియన్స్లో భారీ ఫాలోయింగ్ ఉంది. తన సినిమాలో ప్రదర్శించిన అన్నాడీఎంకే వ్యతిరేక సందేశం ఆ పార్టీపై తీవ్ర ప్రభావం చూపగలదు. తమ దివంగత నాయకురాలు ప్రోత్సహించిన సంక్షేమపథకాలపై విమర్శను చూసీ చూడనట్లు వదిలివేసిన పక్షంలో తమ పార్టీని హేళన చేయడానికి కోలీవుడ్ చిత్ర నిర్మాణ సంస్థలు వరుసకట్టే ప్రమాదం ఉందని అన్నాడీఎంకే వాదిస్తోంది. అయితే మరింత వ్యూహాత్మకంగా పావులు కదిపిన అన్నాడీఎంకే పార్టీ విషయాన్ని అంతటితో ఆపివేయలేదు. ఇద్దరు తమిళ దిగ్గజ నటులు రజనీకాంత్, కమల్ హాసన్ల పని పట్టాలని కూడా నిశ్చయించుకుంది. సెన్సార్ బోర్డ్ ఆమోదం తెలిపిన సినిమాను దెబ్బతీయడానికి ప్రయత్నించిన రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపై ఈ ఇద్దరు నటులూ విమర్శలు గుప్పించారు. అన్నాడీఎంకే పత్రిక ‘నమదు అమ్మ’ (మన అమ్మ) రజనీకాంత్ని విమర్శిస్తూ, ప్రభుత్వం ఆమోదించిన ఆహారంలో బల్లి కనపడితే రజనీకాంత్ దాన్ని ఆరగించగలరా అని ఎద్దేవా చేసింది. ఈ వ్యంగ్య విమర్శను అర్థం చేసుకోవడానికి పెద్దగా కష్టపడనవసరం లేదు. అన్నాడీఎంకే రజనీకాంత్పై గురిపెట్టడం వాస్తవమే. ఎందుకంటే బీజేపీతో రజనీకాంత్ బంధం రహస్యమైన విషయం కాదు. దానికి రాజకీయ ప్రాధాన్యత ఉంది కూడా. రజనీకాంత్ వెంటనే తనపై విమర్శను తిప్పికొట్టడమే కాకుండా, అన్నాడీఎంకేకి బలమైన సందేశం పంపారు. నరేంద్రమోదీని దేశంలోనే అత్యంత శక్తిమంతుడైన నాయకుడిగా రజనీ ఇప్పుడు ప్రశంసిస్తున్నారు. ఇక కమల్ హాసన్ను తమిళనాడు ముఖ్యమంత్రి ఇ. పళనిస్వామి ఎద్దేవా చేశారు. విశ్వరూపం తొలి భాగం సినిమాకు సమస్యలు ఎదురు కానున్నట్లు సూచన వచ్చినంతనే దేశం వదిలి వెళ్లిపోవడానికి సంసిద్ధత ప్రదర్శించిన కమల్ను సీఎం పరిహసించారు. అన్నాడీఎంకే అనుసరిస్తున్న ఈ వ్యూహాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? లోక్సభ ఎన్నికలు, రాష్ట్రంలో 20 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు సమీపిస్తుండటంతో తమిళ చిత్రపరిశ్రమలో గ్లామర్ ఉన్న నటులను ఓ పట్టు పట్టాలని పాలకపార్టీ ప్రయత్నిస్తోంది. అమ్మ ప్రభుత్వంగా తనకు తాను చెప్పుకుంటున్న ప్రస్తుత నాయకత్వం తేలిపోతున్నట్లు ఉద్దేశపూర్వకంగా ప్రచారం చేస్తున్నారని అన్నాడీఎంకే అనుమానిస్తోంది. జయలలిత నిజమైన వారసురాలిగా అన్నాడీఎంకే నిలబడుతుందా లేదా అనే విషయాన్ని మనం 2019లో చూడబోతున్నాం. ఈలోగా విజయ్ సినిమా సర్కార్కి ఇది ప్రభుత్వ స్పందన అయినట్లయితే, అవినీతిపై యుద్ధం ప్రకటించిన కమల్ హాసన్ భారతీయుడు 2 సినిమాపట్ల ప్రభుత్వ వైఖరి మరీ ఘోరంగా ఉండతోతుందని కోలీవుడ్ జనాలు చెప్పుకుంటున్నారు. స్పష్టంగానే, పాలక అన్నాడీఎంకేకి, సినీ రాజకీయనేతల నడుమ ఘర్షణ సమీప భవిష్యత్తులో ముగిసిపోయేలా కనిపించటం లేదు. టీఎస్ సుధీర్ వ్యాసకర్త, సీనియర్ జర్నలిస్టు -
బ్యాండ్ బాజా 18th August 2018
-
బ్యాండ్ బాజా 11th August 2018
-
పంచతంత్రం
మహానుభావుడు ఏ మధుర క్షణాల్లో సృష్టించా డోగానీ పంచతంత్రం ఒక విలక్షణమైన వేదం. ఎప్ప టికీ మాసిపోదు. ఎన్నటికీ డాగు పడదు. సృష్టిలో మనిషి ఉన్నంతకాలం పంచతంత్రం ఉంటుంది. అది ఏమాత్రం విలువలు మారని గణిత శాస్త్రం. ‘కాకి–రత్నాలహారం’ ఎంత గొప్ప కథ. ఒక అల్ప జీవికి రాజభటులను సమకూర్చిన సన్నివేశం అది. ఒక చీమ నీళ్లలో కొట్టుకుపోతుంటే పావురం పండు టాకుని అందించి ఒడ్డుకు చేరుస్తుంది. తర్వాత బోయ ఆ పావురానికి బాణం ఎక్కుపెట్టినపుడు చీమ వాడిని కుట్టి గురి తప్పిస్తుంది. మిత్రుడు ఎంతటి చిన్నవాడైనా, మనసుంటే రక్షించగలడు. ఇదే మిత్ర లాభం. ఇవన్నీ జంతువులమీదో, పక్షులమీదో పెట్టి చెప్పినా, అవన్నీ మన కోసం చెప్పినవే. మిత్రలాభం, భేదం, సంధి, విగ్రహం, అసంప్రేక్షకారిత్వం అనే అయిదు తంత్రాలను మనం జీర్ణించుకుని, జీవితా నికి అన్వయించుకోగలిగితే తిరుగుండదు. ఇది ఏ రంగంలో ఉన్నవారికైనా వర్తిస్తుంది. ఇక జాగ్రత్తపడా ల్సింది విజయానంతరం ఆవహించే అహంకారం గురించి. మృగరాజుగా పేరొందిన సింహం ఒక కుందేలు దెబ్బకి జలసమాధి అయిన ఉదంతం మనకో నీతి నేర్పుతుంది. మరీ ముఖ్యంగా రాజకీయ నాయకులు నిత్యం వీటిని పఠించుకోవాలి. అందులో ఆ సందర్భంలో తను ఏ జీవికి పోలతాడో సరిగ్గా అంచనా వేసుకోవాలి. దాన్నిబట్టి అడుగు ముందుకో వెనక్కో వెయ్యాలి. ఈ మధ్య రాజకీయాల్ని గమనిస్తుంటే– ఇక ఎన్నికలు.. ఎన్నికలు మరియు ఎన్నికలు తప్ప ఏమీ వినిపించడం లేదు. ప్రజకి నైరాశ్యం వచ్చేసింది. చాలా నిరాసక్తంగా ఉన్నారు. ఓటర్లు చాలా ఉదాసీ నంగా ఉన్నారు. నాయకులు బాణాలు ఎవరిమీద ఎక్కుపెడుతున్నారో, ఎందుకు పెడుతున్నారో తెలి యదు. చూస్తుంటే నిత్యం ఒక పద్మవ్యూహం, ఒక ఊబి, ఒక ఉచ్చు పరస్పరం పన్నుకుంటున్నట్టని పిస్తుంది. చివరికి ఎవరికెవరు వలవేస్తున్నారో, ఇంకె వరు ఉరి వేస్తున్నారో బోధపడదు. నేను ఈ చిక్కుల ముగ్గులోంచి బయటపడలేక, అనుభవం పండిన ఓ రాజకీయ నేతని కలిసి బావురు మన్నాను. ఆయన చిత్రంగా నవ్వి ‘‘మేం మాత్రం ఏం చెబుతాం. ఒక సాంప్రదాయం, ఒక నడక, ఒక నడత ఉంటే స్థితిగతులు విశ్లేషణకి అందుతాయి గానీ, ఈ ఇసుక తుఫానులో ఏమి అంచనా కట్ట గలం’’ అన్నాడు. ఒక్కసారి శ్వాస పీల్చుకుని ‘‘చద రంగం ఆడేటప్పుడు బలాలు ఓ పద్ధతి ప్రకారం ప్రవర్తిస్తాయ్. పులి జూదంలో పందెం ప్రకారం అవి నడుస్తాయ్. పందెపుగవ్వల ఆజ్ఞ ప్రకారం పావులు చచ్చినట్టు నడుస్తాయ్. ఆ పావులు పాము నోట్లో పడచ్చు, నిచ్చెనెక్కచ్చు’’ అని నావంక చూసి మళ్లీ ప్రారంభించాడు.ఏమాత్రం నాగరికత యెరగని అడవిలో కూడా ‘జంగిల్ లా’ ఒకటుంటుంది. సింహం బక్క ప్రాణుల్ని ముట్టదు. అది ఆకలితో అలమటిస్తున్నా ఆపదలో ఉన్నా దాని నైజం మార్చుకోదు. చచ్చినా దిగజారదు. మరి నక్క ఉందంటే దానికో జీవలక్షణం ఉంటుంది. అదలాగే బతికేస్తుంది. ఆత్మరక్షణకి కొమ్ములతో పొడిచేవి కొమ్ములతోనే పొడుస్తాయి. పంజా విసిరేవి, కాళ్లతో తన్నేవి, కోరలతో పీకేవి ఉంటాయి. అవి సదా అలాగే చేస్తాయి. ఎటొచ్చీ కోతులు మాత్రం మనకు అందుతాయ్. చాలా దగ్గర లక్షణాలుంటాయ్. నిశ్చలంగా ఉన్నా, చెరువు నిర్మ లంగా వున్నా కోతులు సహించ లేవు. ఒక రాయి విసిరి చెదరగొట్టి ఆనందిస్తుంది కోతి. అలాగే ఇప్పుడు మనం ఉండేది కూడా అడవే కదా. రాజకీయాలకి వస్తే ఇదంతా డబ్బుమీద నడిచింది, నడుస్తోంది, నడు స్తుంది. కుల బలం పదవిని కట్టపెట్టదు. కావల్సింది ధన బలం. చాలా మంది డబ్బేం చేసుకుంటారు. వెళ్తూ కట్టుకెళ్తారా అంటారు. దేన్నీ కట్టుకెళ్లం. చదువుని, కీర్తిని, పొగడ్తల్ని ఇక్కడే పారేసి వెళ్తాం. అందు కని డబ్బుని ‘‘వేదాంతీ’కరించకూడదు. దేవుడు ఓ తిక్కలో ఉండగా మనిషిని చేశాడు. అందుకే అవ యవాలుగానీ, మెదడుగానీ ఏదీ సక్రమంగా కుద ర్లేదు. ఇలాంటి మెదడుకి రాజకీయం కలిస్తే ఇహ చెప్పేదేముంది?! ఇక్కడ నీతి నియమాలుండవు. అనుభవం అస్సలు వర్కవుట్ కాదు. ఎప్పటికప్పుడు కొత్తనీరు వస్తూ ఉంటుంది. పాత అనుభవాలకి అస్సలు విలువలేదు’’ అని పెద్దాయన ముగించాడు. శ్రీరమణ (వ్యాసకర్త ప్రముఖ కథకుడు) -
పొలిటికల్ కారిడర్ 17th July 2018
-
బ్యాండ్ బాజా 11th June 2018
-
రాజకీయ వ్యంగ్యం.. ఆయుధం
వాషింగ్టన్: సామాజిక మాధ్యమం ట్వీటర్లో ప్రధాని మోదీని అనుసరించే వారి సంఖ్య 3.6 కోట్లకు పైమాటే. ఇంతలా మోదీ నెటిజన్లను ఆకర్షించడానికి గల కారణాలేమిటో తెలుసుకునేందుకు అమెరి కాకు చెందిన ఓ యూనివర్సిటీ పరిశోధన నిర్వహించి.. అసలు రహస్యాన్ని శోధించింది. మోదీ తన ట్వీట్లలో రాజకీయ వ్యంగ్యం, చతురత వంటి అంశాలను ఉపయోగించి నెటిజన్లను ఆకర్షిస్తూ.. తన రాజకీయ శైలిని పునరుద్ధరించుకున్నారని మిచిగాన్ వర్సిటీ వెల్లడించింది. దీనికోసం వర్సిటీలోని స్కూల్ ఆఫ్ ఇన్ఫర్మేషన్కు చెందిన పరిశోధకులు మోదీ గత ఆరేళ్ల కాలంలో చేసిన దాదాపు 9 వేల ట్వీట్లను విశ్లేషించారు. రాహుల్ గాంధీ, క్రికెట్, వినోదం, వ్యంగ్యం, అవినీతి, అభివృద్ధి, విదేశీ వ్యవహారాలు, హిందూ మతం, శాస్త్ర–సాంకేతికత వంటి 9 వైవిధ్య భరితమైన అంశాలు మోదీ ట్వీట్లలో ఉండేవని వారు వెల్లడించారు. -
ఆవకామ్ బిర్యానీ 25th February 2015