pratyusha sinha Committee
-
అభ్యంతరం లేని వారిని పంపించండి
అఖిల భారత సర్వీసు అధికారులపై కేంద్రానికి రెండు రాష్ట్రాల లేఖ హైదరాబాద్: ఇరు రాష్ట్రాలకు అఖిల భారత సర్వీసు అధికారులను పంపిణీ చేస్తూ ఈ నెల 10వ తేదీన ప్రత్యూషసిన్హా కమిటీ ప్రకటించిన జాబితాల్లో అభ్యంతరాలున్న అధికారులను మినహాయించి మిగతా అధికారులను ఆయా రాష్ట్రాల్లో పనిచేసేందుకు వీలుగా ‘సర్వ్ టు వర్క్’ ఆర్డర్ను జారీ చేయాల్సిందిగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు రాజీవ్శర్మ, ఐ.వై.ఆర్.కృష్ణారావులు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. సిన్హా కమిటీ ప్రకటించిన జాబితాపై ఎవరికైనా అభ్యంతరాలు, సమస్యలు ఉంటే ఈ నెల 25వ తేదీ సాయంత్రంలోగా తెలియజేయాలని సదరు కమిటీ పేర్కొన్న విషయం తెలిసిందే. ఏకాభిప్రాయమున్న అధికారులకు రెండు రాష్ట్రాల్లో సర్వ్ టు ఆర్డర్ జారీ చేయాలని కేంద్ర వ్యక్తిగత శిక్షణ విభాగానికి సీఎస్లు లేఖలు రాశారు. -
ఇద్దరు అటు.. నలుగురు ఇటు
తెలంగాణ, ఏపీకి ఐఏఎస్, ఐపీఎస్ల విభజన - స్వరాష్ట్రంలోనే కలెక్టర్, ఎస్పీ - తెలంగాణకు జేసీ, డీఐజీ - ఆంధ్రాకు శ్రీకేశ్ లట్కర్, ఫకీరప్ప సాక్షి, కరీంనగర్ : తెలంగాణ, ఆంధప్రదేశ్ రాష్ట్రాలకు ఐఏ ఎస్.. ఐపీఎస్ల విభజన పూర్తయింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో 22న కేంద్రం ఐఏఎస్, ఐపీఎస్లను ఆయా రాష్ట్రాలకు కేటాయించిం ది. మన జిల్లాలో విధులు నిర్వర్తిస్తున్న సీని యర్ ఉన్నతాధికారులు తెలంగాణ పరిధిలోనే ఉండనున్నారు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన క లెక్టర్ ఎం.వీరబ్రహ్మయ్య, ఎస్పీ శివకుమార్కు స్వరాష్ట్రంలోనే సేవలందించే అవకాశం దక్కింది. ఆంధ్రప్రదేశ్కు చెందిన డీఐజీ ఆర్.బి.నాయక్ను తెలంగాణకు కేటాయించారు. లక్నోకు చెందిన జేసీ సర్ఫరాజ్ అహ్మద్కు ఎంచుకున్న ఆప్షన్ మేరకు తెలంగాణ కోటా వరించింది. మరో ఐఏఎ్స్ శ్రీకేశ్ బాలాజీరావు లట్కర్, ఐపీఎస్ ఫకీరప్పను ఆంధ్రాకు కేటాయిస్తూ ఢిల్లీలో ప్రత్యూష సిన్హా కమిటీ శుక్రవారం రాత్రి జాబితా విడుదల చేసింది. తెలంగాణలోనే...! - ఎం.వీరబ్రహ్మయ్య జూన్ 19, 2013లో ఇక్కడ కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించారు. వరంగల్ జిల్లా వాస్తవ్యుడైన కలెక్టర్కు 1997లో ఐఏఎస్ కన్ఫం అయింది. తెలంగాణ కోటాలోనే కేటాయించడంతో కలెక్టర్ ఈ ప్రాంతంలోనే విధులు నిర్వర్తించనున్నారు. ఉత్తరప్రదేశ్లోని లక్నోకు చెందిన సర్ఫరాజ్ అహ్మద్ 26, డిసెంబర్ 2013లో జిల్లా జాయింట్ కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించారు. ఆప్షన్స్లో జేసీ తెలంగాణనే కోరుకోగా.. కేటాయింపూ ఆయన అభీష్టం మేరకే జరిగింది. - తెలంగాణేతర ఐపీఎస్ అధికారి.. కరీంనగర్ డీఐజీ ఆర్బీ నాయక్కు కోరుకున్న తెలంగాణ రాష్ట్రమే కేటాయించారు. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లాకు చెందిన నాయక్ 7 మే 2012న కరీంనగర్లో డీఐజీగా బాధ్యతలు చేపట్టారు. వరంగల్కు చెందిన ఎస్పీ శివకుమార్ను కూడా తెలంగాణకే కేటాయించారు. 31 అక్టోబర్ 2010న ఆయన జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించారు. ఆంధ్రాకు ఇద్దరు - మహారాష్ట్రలోని నాందేడ్కు చెందిన శ్రీకేశ్ బాలాజీరావు లట్కర్ 2011 నుంచి జిల్లాలో సేవలందిస్తున్నారు. మొన్నటి వరకు జగిత్యాల సబ్ కలెక్టర్గా పని చేసిన ఆయన్ను ప్రభుత్వం ఇటీవలే కరీంనగర్ కార్పొరేషన్ కమిషనర్గా నియమించింది. లట్కర్ తెలంగాణలోనే విధులు నిర్వర్తించేందుకు మొగ్గు చూపి.. ఆప్షన్ ఎంచుకున్నా జూనియర్ కావడంతో కేంద్రం ఆయన ఆప్షన్ను పరిగణలోకి తీసుకోలేదని సమాచారం. - కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఐపీఎస్ అధికారి ఫకీరప్పను ఆంధ్రప్రదేశ్కు కేటాయించారు. మూడు నెలల క్రితమే గోదావరిఖని డీఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన ఫకీరప్ప తెలంగాణలోనే పని చేసేందుకు సుముఖత చూపినట్లు తెలిసింది. అయినా ఫలితం లేకుండాపోయింది. -
నేడు ప్రత్యూష్సిన్హా కమిటీ భేటీ
-
‘పంపకాల’ పరిశీలనకు ఐదుగురు ఐపీఎస్లు
రెండు రాష్ట్రాల నుంచి పంపుతున్న అధికారుల సంఘం సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర విభజన నేపథ్యంలో అఖిల భారత సర్వీసు అధికారుల పంపకాన్ని ప్రత్యూష సిన్హా కమిటీ శనివారం చేపడుతోంది. దీన్ని పరిశీలించేందుకు రెండు రాష్ట్రాల నుంచి అధికారుల్ని పంపాల్సిందిగా ఐపీఎస్ అధికారుల సంఘాన్ని కమిటీ కోరింది. ఈ ప్రతినిధి బృందాన్ని ఎంపిక చేసేందుకు సంఘం బుధవారం తెలంగాణ డీజీపీ కార్యాలయంలోని సమావేశ మందిరంలో భేటీ అయింది. తాత్కాలిక కేటాయింపుల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో పని చేస్తున్న ఐదుగురిని ఎంపిక చేసింది. క్యాడర్ కేటాయింపులో రోస్టర్ విధానాన్ని అవలంభిస్తున్న కమిటీ సీనియర్ నుంచి జూనియర్ వరకు జాబితా రూపొందిస్తుంది.కేటాయింపు ఏ రాష్ట్రం నుంచి ప్రారంభంకావాలనే అంశాన్ని టాస్ ద్వారా నిర్ణయిస్తారు. ఈ టాస్ ప్రక్రియను పరిశీ లించేందుకు రెండు రాష్ట్రాలకు చెందిన ఐపీఎస్ అధికారులు శివధర్రెడ్డి, విశ్వనాథ రవీందర్, ఉమేష్ షరాఫ్, మాలకొండయ్య, స్వాతిలక్రాలను పంపాలని అధికారుల సంఘం నిర్ణయించింది. -
నెలాఖరుకల్లా ఐఏఎస్ల తుది పంపిణీ
ఆంధ్రప్రదేశ్లో ఎక్కువుగా ఉన్న 13 మంది తెలంగాణకు రోస్టర్ విధానంలో కేటాయింపు హైదరాబాద్: ఐఏఎస్ల తుది పంపిణీని ఈ నెలాఖరుకల్లా పూర్తి చేయడానికి ప్రత్యూష సిన్హా కమిటీ కసరత్తు చేస్తోంది. దీనికి సంబంధించి త్వరలోనే మార్గదర్శకాలను ఖరారు చేయనుంది. ఆ మార్గదర్శకాల మేరకు ఐఏఎస్ల తుది పంపిణీని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చేయనుంది. తాత్కాలికంగా తెలంగాణకు 41 మంది ఐఏఎస్లను మాత్రమే కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. మిగతా ఐఏఎస్లందరూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోనే పనిచేయనున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో శాఖలకు ఐఏఎస్ అధికారులు లేక పరిపాలన సాగడం లేదు. అలాగే ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ మంది ఐఏఎస్లు ఖాళీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో నెలాఖరులోగా ఐఏఎస్ల పంపిణీని పూర్తి చేయాలని ప్రత్యూష సిన్హా కమిటీ నిర్ణయించింది. ఆ కమిటీ లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్కు చెందిన డెరైక్ట్ రిక్రూటీ ఐఏఎస్ల్లో 13 మంది ఎక్కువగా ఉన్నట్లు తేలింది. దీంతో ఎక్కువగా ఉన్న వారిని రోస్టర్ విధానంలో తెలంగాణ ప్రభుత్వానికి కేటాయించనున్నారు. రెండు రాష్ట్రాల్లో ఐఏఎస్ల సంఖ్య ఎంత అనేది ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం నిర్ధారించిన విషయం తెలిసిందే. జిల్లాల నిష్పత్తి ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 211 ఐఏఎస్ పోస్టులను, తెలంగాణకు 163 ఐఏఎస్ పోస్టులను కేంద్రం కేటాయించిన విషయం తెలిసిందే.