ranji trophy final
-
ముచ్చటగా మూడో సారి.. విదర్బ విజయం వెనక మాస్టర్ మైండ్
జట్టులో స్టార్స్ ఎవరూ లేకున్నా... సమష్టితత్వమే విజయ మంత్రంగా ముందుకు సాగితే అద్భుతాలు చేయవచ్చని... అవసరమైన ప్రతి సందర్భంలో ఎవరో ఒకరు బాధ్యతలు తీసుకునేలా తరీఫదునిస్తే ఫలితాలు వాటంతటే అవే వస్తాయని విదర్భ క్రికెట్ జట్టు మరోసారి నిరూపించింది. ఆరేళ్ల క్రితం వరుసగా రెండు సీజన్లలో రంజీ ట్రోఫీ టైటిల్ సాధించిన విదర్భ ఆ తర్వాత తడబడింది.కానీ ఈసారి మాత్రం అందరూ తమవైపు చూసేలా ఆడుతూ చివరకు ఒక్క మ్యాచ్లోనూ ఓడిపోకుండా రంజీ రారాజు తామేనని చాటుకుంది. బ్యాటింగ్లో యశ్ రాథోడ్, కరుణ్ నాయర్, దానిశ్ మాలేవర్, అక్షయ్ వాడ్కర్ మెరిస్తే... బంతితో హర్‡్ష దూబే రికార్డులు తిరగరాశాడు. వెరసి విదర్భ మూడోసారి రంజీ ట్రోఫీని ముద్దాడింది.గతేడాది రంజీ ట్రోఫీ ఫైనల్లో ముంబై చేతిలో ఓడిన విదర్భ జట్టు... ఈ సీజన్ కోసం పెద్ద కసరత్తే చేసింది. ఆటగాళ్లకు ప్రత్యేక శిక్షణ నుంచి మొదలుకొని... తుది జట్టు ఎంపిక వరకు ప్రతి దానిపై దృష్టి పెట్టి మెరుగైన ఫలితాలు సాధించింది. ఫార్మాట్తో సంబంధం లేకుండా దేశవాళీల్లో నిలకడైన ప్రదర్శన కనబరుస్తున్న విదర్భ జట్టు.. సమష్టి కృషితో కదంతొక్కి మూడోసారి రంజీ చాంపియన్గా ఆవిర్భవించింది. ఈ సీజన్లో ఆడిన 10 మ్యాచ్ల్లో ఒక్కటంటే ఒక్క దాంట్లోనూ ఓటమి రుచిచూడని విదర్భ... తొమ్మిది దశాబ్దాల రంజీ ట్రోఫీ చరిత్రలో తొలిసారి రెండు విడతలుగా మ్యాచ్లు నిర్వహించినా ఎక్కడా లయ కోల్పోలేదు.యువ ఆటగాళ్లపై నమ్మకముంచడం... వారికి బాధ్యతలు ఇచ్చి మెరుగైన ప్రదర్శన రాబట్టుకోవడం వల్లే విదర్భ మూడోసారి విజేతగా నిలవగలిగింది. ఫలితంగానే 22 ఏళ్ల హర్ష్ దూబే అత్యధిక వికెట్ల వీరుల జాబితాలో అగ్రస్థానం దక్కించుకోగా... 24 ఏళ్ల యశ్ రాథోడ్ అత్యధిక పరుగులు చేసిన వారిలో ‘టాప్’గా నిలిచాడు. కేవలం యువ ఆటగాళ్ల మీదే భారం వేయకుండా అనుభవజ్ఞులకు కూడా తగిన ప్రాధాన్యత ఇవ్వడంలో విదర్భ మేనేజ్మెంట్ సఫలీకృతమైంది. భారత జట్టు తరఫున 6 టెస్టులు, 2 వన్డేలు ఆడిన సీనియర్ ప్లేయర్ కరుణ్ నాయర్ ఈ సీజన్లో విదర్భ తరఫున విజృంభించాడు. రంజీ సీజన్ మధ్యలో జరిగిన విజయ్ హజారే వన్డే టోర్నీలో 5 శతకాలు బాదిన నాయర్... రంజీ ట్రోఫీలో మరో నాలుగు సెంచరీలతో చెలరేగాడు. సంపూర్ణ ఆధిపత్యం... లీగ్ దశలో ఆడిన 7 మ్యాచ్ల్లో ఆరింట గెలిచి... ఒక దాన్ని ‘డ్రా’ చేసుకొని 40 పాయింట్లతో నాకౌట్కు చేరిన విదర్భ జట్టు క్వార్టర్ ఫైనల్లో తమిళనాడుపై 198 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇక కీలక సెమీఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ ముంబైపై 80 పరుగుల తేడాతో గెలిచి... గతేడాది ఫైనల్లో ఎదురైన పరాభవానికి బదులు తీర్చుకుంది. మరోవైపు జమ్మూకశీ్మర్తో క్వార్టర్ ఫైనల్లో ఒక పరుగు, గుజరాత్తో సెమీఫైనల్లో రెండు పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించి ముందంజ వేసిన కేరళ జట్టు చివరకు తుదిపోరులో అదే తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించలేక రన్నరప్తో సరిపెట్టుకుంది.తుదిపోరులో ఒక దశలో కేరళ జట్టుకు తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం దక్కడం ఖాయమే అనుకుంటున్న సమయంలో హర్‡్ష దూబే మ్యాచ్ను మలుపు తిప్పాడు. ఈ సీజన్లో ఆల్రౌండర్గా అదరగొట్టిన హర్‡్ష 69 వికెట్లు పడగొట్టి... ఒక రంజీ సీజన్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా చరిత్రకెక్కాడు. బ్యాటింగ్లోనూ మెరిసిన అతడు 476 పరుగులు చేశాడు. ఇందులో 5 అర్ధశతకాలు ఉన్నాయి. దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ సలహాలతో ఆల్రౌండర్గా మరింత రాటుదేలుతున్న హర్‡్ష... భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించడమే తదుపరి లక్ష్యమని అన్నాడు.అదరగొట్టిన యశ్ రాథోడ్ విదర్భ జట్టు మూడోసారి రంజీ విజేతగా నిలవడంలో యువ బ్యాటర్ యశ్ రాథోడ్ పాత్ర కీలకం. ఈ సీజన్లో 10 మ్యాచ్లాడిన యశ్... 53.33 సగటుతో 960 పరుగులు సాధించాడు. ఇందులో 5 సెంచరీలు, 3 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఈ సీజన్లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ల జాబితాలో యశ్ ‘టాప్’ ప్లేస్లో నిలిచాడు. ఈ సీజన్ ఆరంభానికి ముందే విదర్భ జట్టుతో చేరిన సీనియర్ బ్యాటర్ కరుణ్ నాయర్... 53.93 సగటుతో 863 పరుగులు సాధించాడు. ఇందులో 4 శతకాలు, 2 అర్ధశతకాలు ఉన్నాయి. అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో నాయర్ నాలుగో స్థానంలో నిలిచాడు. కేరళతో ఫైనల్లో అతడు రెండు ఇన్నింగ్స్ల్లో వరుసగా 86, 135 పరుగులు చేసి విజయంలో ప్రధాన పాత్ర పోషించాడు. ఫైనల్లో రెండు ఇన్నింగ్స్ల్లో వరుసగా 153, 73 పరుగులు చేసి ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కించుకున్న 21 ఏళ్ల మాలేవర్... సీజన్లో 52.20 సగటుతో 783 పరుగులు సాధించాడు. అందులో 2 సెంచరీలు, 6 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. తొలి ఇన్నింగ్స్లో 215 పరుగులు జతచేసిన కరుణ్ నాయర్, మాలేవర్ జోడీ... రెండో ఇన్నింగ్స్లో 183 పరుగులు చేసింది. దీంతో కేరళ జట్టు తిరిగి కోలుకునే అవకాశం లేకుండా పోయింది. 10 మ్యాచ్ల్లో 45.12 సగటుతో 722 పరుగులు చేసిన విదర్భ సారథి అక్షయ్ వాడ్కర్... సమష్టి కృషికి దక్కిన అత్యుత్తమ ఫలితం ఇదని అన్నాడు. జట్టులో ప్రతి ఒక్క ఆటగాడు తమ బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించడంతోనే మూడోసారి రంజీ ట్రోపీ చేజిక్కించుకున్నామని పేర్కొన్నాడు. స్టార్లు లేకపోయినా... పెద్దగా పేరున్న ఆటగాళ్లు జట్టులో లేకపోయినా... కేవలం ‘టీమ్ వర్క్’పైనే ఆధారపడ్డ విదర్భ జట్టు సీజన్ ఆసాంతం చక్కటి ప్రదర్శన కనబర్చి దేశవాళీల్లో మెరుగైన జట్టుగా పరిణతి చెందింది. విదర్భ విజయం వెనక హెడ్ కోచ్ ఉస్మాన్ ఘనీ మాస్టర్ మైండ్ ఉంది. ఉస్మాన్ ఘనీ కోచింగ్లో ఆరితేరిన విదర్భ జట్టు ఏ స్థాయిలోనూ పట్టు సడలించలేదు. ‘ఈసారి జట్టులో అటు యువ ఆటగాళ్లు, ఇటు అనుభవజ్ఞులు ఉండేలా చూసుకున్నాం. ఇది జట్టంతా కలిసి తీసుకున్న నిర్ణయం. కేవలం ట్రోఫీ గెలవడమే కాదు. మున్ముందు జాతీయ జట్టుకు నాణ్యమైన ఆటగాళ్లను అందించాలనే లక్ష్యంతో పనిచేశాం. హర్‡్ష దూబేకు ఆత్మవిశ్వాసం ఎక్కువ. ప్రతి ఆటగాడికి అది ముఖ్యం. కేవలం బౌలర్గానే కాకుండా... అతడు బ్యాట్తోనూ పలు కీలక ఇన్నింగ్స్లు ఆడాడు. సీజన్ ఆసాంతం రాణించడం వల్లే అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్గా రికార్డు నెలకొల్పాడు. రంజీ ఫైనల్ తర్వాత ఫస్ట్ క్లాస్ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన అక్షయ్ వాఖరే... కీలక మ్యాచ్ల్లో హర్‡్షకు దిశానిర్దేశం చేశాడు. బ్యాటింగ్లో యశ్ రాథోడ్ చక్కటి ప్రదర్శన కనబర్చాడు. అతడిలో చాలా నైపుణ్యం ఉంది. కరుణ్ నాయర్ అనుభవం మాకెంతో పనికి వచ్చింది. యువ ఆటగాళ్లతో కలిసి అతడు చక్కటి భాగస్వామ్యాలు నమోదు చేయడమే విజయానికి బాటలు వేసింది. గతేడాది జట్టులో ఉన్నప్పటికీ మ్యాచ్ ఆడే అవకాశం దక్కని దానిశ్ మాలేవర్ ఈసారి నిరూపించుకున్నాడు. ఫైనల్లో అతడి తెగువ అసమానం. ఇలా ప్రతి ఒక్కరూ విజయంలో తమ వంతు పాత్ర పోషించారు’ అని ఉస్మాన్ వెల్లడించాడు. -
అది నా చేతిలో లేదు.. అందుకే అలా సెలబ్రేట్ చేసుకున్నా: కరుణ్ నాయర్
దేశవాళీ క్రికెట్లో భారత వెటరన్ బ్యాటర్, విదర్భ స్టార్ ఆటగాడు కరుణ్ నాయర్ తన సూపర్ ఫామ్ను కొనసాగిస్తున్నాడు. నాగ్పూర్ వేదికగా కేరళతో జరుగుతున్న రంజీ ట్రోఫీ ఫైనల్లో నాయర్ అద్బుతమైన సెంచరీతో కదం తొక్కాడు. విదర్బ సెకెండ్ ఇన్నింగ్స్లో 295 బంతులు ఎదుర్కొన్న కరుణ్.. 10 ఫోర్లు, 2 సిక్సర్లతో 135 పరుగులు చేసి ఔటయ్యాడు. ఇటీవల విజయ్ హజారే వన్డే టోర్నమెంట్లో 5 సెంచరీలు చేసిన కరుణ్ నాయర్కు ఓవరాల్గా ఈ సీజన్లో ఇది 9వ శతకం కావడం విశేషం.అతడు సెంచరీ ఫలితంగా విదర్భ జట్టు భారీ ఆధిక్యం దిశగా దూసుకుపోతుంది. ఆఖరి రోజు ఆటలో విదర్బ తమ సెకెండ్ ఇన్నింగ్స్లో 110.3 ఓవర్లకు 7 వికెట్లు కోల్పోయి 287 పరుగులు చేసింది. అయితే తొలి ఇన్నింగ్స్లో లభించిన ఆధిక్యం 37 పరుగులతో కలుపుకొని విదర్భ ఓవరాల్గా 324 పరుగుల ముందంజలో ఉంది. ఇక తన సెంచరీపై నాలుగో రోజు అనంతరం కరుణ్ నాయర్ స్పందించాడు."మైదానంలో అడుగుపెడితే పరుగులు సాధించడమే నా పని. ప్రస్తుతం అదే చేస్తున్నా. భారత జట్టుకు తిరిగి ఎంపికవడం నా చేతిలో లేదు. దానిపై ఏం వ్యాఖ్యానించలేను. ఈ మ్యాచ్కు ముందు 8 శతకాలు చేశాను. జట్టు సహాయ సిబ్బందితో దీని గురించి మాట్లాడా. ఈ రోజు సెంచరీ చేస్తే తొమ్మిదో అంకే చూపుతానని చెప్పా. అది సాధ్యమైంది కాబట్టే అలా సంజ్ఞ చేశా. నేను క్రీజులో అడుగుపెట్టినప్పుడు జట్టు 7/2తో ఉంది. దీంతో సుదీర్ఘంగా బ్యాటింగ్ చేయాలని ముందే అనుకున్నా.కొన్ని కఠిన సవాళ్లు ఎదురైన సెంచరీ పూర్తిచేసుకొని అజేయంగా నిలవడం ఆనందంగా ఉంది. ఆదివారం కూడా ఇదే ఏకాగ్రతతో బ్యాటింగ్ చేస్తాం. తొలి ఇన్నింగ్స్లో రనౌట్ కావడం ఎంతో బాధించింది. లేకపోతే అప్పుడు కూడా శతకం సాధిస్తానని అనుకున్నా. రెండో ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేయడం అంత సులువు కాదు. కానీ ఓపిగ్గా ప్రయత్నించి పరుగులు రాబట్టా. నాకు ఇది నాలుగో రంజీ ట్రోఫీ ఫైనల్. అత్యుత్తమ ప్రదర్శన కనబర్చడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నా" అని కరుణ్ నాయర్ పేర్కొన్నాడు.చదవండి: IML 2025: యువీ స్పిన్ మ్యాజిక్.. రాయుడు మెరుపులు! సౌతాఫ్రికాను చిత్తు చేసిన భారత్ -
రంజీ ట్రోఫీ ఫైనల్.. జట్టును ప్రకటించిన విదర్భ
మూడోసారి రంజీ ట్రోఫీ టైటిల్ సాధించాలనే లక్ష్యంతో ఉన్న రెండుసార్లు చాంపియన్ విదర్భ జట్టు ఈనెల 26 నుంచి కేరళ జట్టుతో జరిగే ఫైనల్ కోసం జట్టును ప్రకటించింది. గుజరాత్ జట్టుతో జరిగిన సెమీఫైనల్లో పోటీపడ్డ 17 మంది సభ్యులనే ఫైనల్ మ్యాచ్కూ కొనసాగించాలని విదర్భ క్రికెట్ సంఘం (వీసీఏ) సెలెక్షన్ కమిటీ నిర్ణయం తీసుకుంది.అక్షయ్ వాడ్కర్ జట్టుకు సారథ్యంలోనే విదర్భ ఫైనల్లో బరిలోకి దిగుతుందని వీసీఏ సెలెక్షన్ కమిటీ ప్రకటించింది. ఈ సీజన్లో విదర్భ ఒక్క మ్యాచ్లోనూ ఓడిపోకుండా ఫైనల్కు అర్హత సాధించింది. గత ఏడాది 42 సార్లు రంజీ చాంపియన్ ముంబై జట్టు చేతిలో ఫైనల్లో ఓడి రన్నరప్గా నిలిచిన విదర్భ ఈసారి మాత్రం ట్రోఫీని సొంతం చేసుకోవాలనే పట్టుదలతో ఉంది.ఈ సీజన్లో యశ్ రాథోడ్ (933 పరుగులు), హర్‡్ష దూబే (66 వికెట్లు) నిలకడగా రాణించి విదర్భ జట్టు ఫైనల్కు చేరడంలో ముఖ్యపాత్ర పోషించారు. విదర్భ జట్టు 2017–18, 2018–19 వరుస సీజన్లలో రంజీ చాంపియన్గా నిలిచింది. విదర్భ రంజీ జట్టు: అక్షయ్ వాడ్కర్ (కెప్టెన్, వికెట్ కీపర్), అథర్వ తైడె, కరుణ్ నాయర్, ధ్రువ్ షోరే, యశ్ రాథోడ్, యశ్ కదమ్, యశ్ ఠాకూర్, హర్ష్ దూబే, అమన్ మొఖాడె, అక్షయ్ కర్నెవార్, అక్షయ్ వఖారె, ఆదిత్య థాకరే, దర్శన్ నల్కండే, నచికేత్ భుటె, సిద్ధేశ్ వథ్, దానిశ్ మలెవార్, పార్థ్ రఖాడె.చదవండి: Champions Trophy 2025: పాకిస్తాన్కు భారీ షాక్.. టోర్నీ నుంచి ఔట్ -
చరిత్ర సృష్టించిన సర్ఫరాజ్ తమ్ముడు.. సచిన్ రికార్డు బద్దలు
రంజీ ట్రోఫీ 2023-24 సీజన్ ఆరంభం నుంచి అద్బుత ప్రదర్శన కనబరుస్తున్న ముంబై యువ ఆటగాడు ముషీర్ ఖాన్.. ఇప్పుడు ఫైనల్లో కూడా అదరగొట్టాడు. వాంఖడే వేదికగా విదర్భతో జరుగుతున్న తుది పోరులో ముషీర్ ఖాన్ అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు. తొలి ఇన్నింగ్స్లో కేవలం 6 పరుగులు చేసి నిరాశపరిచిన ముషీర్.. రెండో ఇన్నింగ్స్లో మాత్రం శతకంతో మెరిశాడు. 326 బంతుల్లో 10 ఫోర్లతో ముషీర్ 136 పరుగులు చేశాడు. ముషీర్ 326 బంతుల్లో 10 ఫోర్లతో 136 పరుగులు చేశాడు. ఇక ఈ మ్యాచ్లో సెంచరీతో చెలరేగిన ముషీర్ ఖాన్ ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. రంజీ ట్రోఫీ ఫైనల్స్లో అత్యంత పిన్న వయసులో సెంచరీ చేసిన ముంబై ఆటగాడిగా ముషీర్ చరిత్ర సృష్టించాడు. 19 ఏళ్ల 14 రోజుల వయస్సులో ముషీర్ ఈ అరుదైన ఫీట్ సాధించాడు. కాగా ఇప్పటివరకు ఈ రికార్డు భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ పేరిట ఉండేది. 1994-95 రంజీ సీజన్ ఫైనల్లో 21 ఏళ్ల 11 నెలల వయసులో సచిన్ సెంచరీ చేశాడు. తాజా మ్యాచ్తో 29 ఏళ్ల సచిన్ రికార్డును ముషీర్ బ్రేక్ చేశాడు. అయితే ఈ మ్యాచ్ను సచిన్ ప్రత్యక్షంగా స్టాండ్స్ లో నుంచి వీక్షిస్తున్న సమయంలోనే ముషీర్ ఈ ఘనత సాధించడం గమనార్హం. కాగా ఈ మ్యాచ్ను వీక్షించేందుకు టీమిండియా కెప్టెన్ రోహిత శర్మ, సచిన్ టెండూల్కర్, సునీల్ గవాస్కర్ వంటి దిగ్గజాలు వాంఖడేకు వెళ్లారు. ఇక ఈ ఏడాది సీజన్లో కేవలం మూడు మ్యాచ్లు ఆడిన ముషీర్.. 108.25 సగటుతో 433 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్లలో ఓ డబుల్ సెంచరీ కూడా ఉంది. ఇక ఫైనల్లో ముంబై విజయం ముంగిట నిలిచింది. వాంఖడేలో జరుగుతున్న తుది పోరులో ముంబై విదర్భ ముందు 538 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. 538 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన విదర్బ.. మూడో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 10 పరుగులు చేసింది. -
సెంచరీతో చెలరేగిన ముషీర్ ఖాన్.. విజయం ముంగిట ముంబై
రంజీ ట్రోఫీ 2023-24లో భాగంగా విధర్బతో జరుగుతున్న ఫైనల్లో ముంబై విజయం ముంగిట నిలిచింది. వాంఖడేలో జరుగుతున్న తుది పోరులో ముంబై విదర్భ ముందు 538 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. 141/2 ఓవర్ నైట్ స్కోరుతో మూడో రోజు ఆటను ప్రారంభించిన ముంబై.. 418 పరుగులకు ఆలౌటైంది. ముంబై బ్యాటర్లలో ముషీర్ ఖాన్ మరో అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు. 326 బంతుల్లో 10 ఫోర్లతో ముషీర్ 136 పరుగులు చేశాడు. మరోవైపు భారత ఆటగాడు, ముంబై మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ త్రుటిలో సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయాడు. సెకెండ్ ఇన్నింగ్స్లో 111 బంతులు ఎదుర్కొన్న అయ్యర్.. 10 ఫోర్లు, 3 సిక్స్లతో 95 పరుగులు చేశాడు. ఫస్ట్క్లాస్ క్రికెట్లో 14 నెలల తర్వాత అతడికిది తొలి హాఫ్ సెంచరీ కావడం గమనార్హం. వీరిద్దరితో పాటు కెప్టెన్ అజింక్య రహానే(73), శామ్స్ ములాని(50) హాఫ్ సెంచరీలతో రాణించారు. విదర్భ బౌలర్లలో హర్ష్ దూబె ఐదు వికెట్లతో చెలరేగగా.. యశ్ ఠాకూర్ 3, ఆదిత్య థాక్రే, అమన్ తలో వికెట్ పడగొట్టారు. మూడో రోజు ఆట ముగిసేసరికి విదర్భ రెండో ఇన్నింగ్స్లో వికెట్ నష్టపోకుండా 10 పరుగులు చేసింది. ధ్రువ్ షోరె (7), అథర్వ తైడే (3) నాటౌట్గా క్రీజులో ఉన్నారు. కాగా ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన ముంబై తొలి ఇన్నింగ్స్లో 224 పరుగులకు ఆలౌటైంది. అనంతరం విదర్భ.. ముంబై బౌలర్ల దాటికి 105 పరుగులకే కుప్పకూలింది. తద్వారా ముంబై జట్టుకు 109 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్లో బ్యాటర్లు విధ్వంసం సృష్టించడంతో ముంబై.. విధర్భకు భారీ లక్ష్యాన్ని నిర్ధేశించింది. -
ఎట్టకేలకు.. శ్రేయస్ అయ్యర్ విధ్వంసం! వీడియో వైరల్
టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్, ముంబై ఆటగాడు శ్రేయస్ అయ్యర్ ఎట్టకేలకు బ్యాట్ ఝుళిపించాడు. రంజీ ట్రోఫీ 2023-24 సీజన్లో భాగంగా విధర్బ జరుగుతున్న ఫైనల్లో అయ్యర్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఈ తుది పోరు సెకెండ్ ఇన్నింగ్స్లో 111 బంతులు ఎదుర్కొన్న అయ్యర్.. 10 ఫోర్లు, 3 సిక్స్లతో 95 పరుగులు చేశాడు. దూకుడుగా ఆడిన అయ్యర్ తృటిలో సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయాడు. కాగా అయ్యర్ ఇంగ్లండ్తో జరిగిన తొలి రెండు టెస్టుల్లో విఫలమై భారత జట్టులో చోటు కోల్పోయిన సంగతి తెలిసిందే. జట్టులో చోటు మాత్రమే కాకుండా బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ను సైతం శ్రేయస్ కోల్పోయాడు. తొలుత రంజీట్రోఫీలో ఆడేందుకు అయ్యర్ విముఖత చూపించడంతో అయ్యర్ను కాంట్రాక్ట్ నుంచి బీసీసీఐ తప్పించింది. అయ్యర్తో పాటు మరో యువ క్రికెటర్ ఇషాన్ కిషన్పై కూడా బీసీసీఐ వేటు వేసింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలి ఇన్నింగ్స్లో విఫలమైన ముంబై.. రెండో ఇన్నింగ్స్లో మాత్రం భారీ స్కోర్ దిశగా దూసుకుపోతోంది. 114 ఓవర్లకు సెకెండ్ ఇన్నింగ్స్లో ముంబై 7 వికెట్ల నష్టానికి 364 పరుగులు చేసింది. ఓవరాల్గా ముంబై ప్రస్తుతం 483 ఆధిక్యంలో కొనసాగుతోంది. ముంబై బ్యాటర్లలో అయ్యర్తో పాటు ముషీర్ ఖాన్(136) అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. A confident fifty from Shreyas Iyer in the Ranji Trophy final with aggressive approach and looking good against Short balls. 👌pic.twitter.com/G7UReArVhd — Johns. (@CricCrazyJohns) March 12, 2024 -
బౌన్సర్ తాకి విలవిల్లాడుతుంటే..
న్యూఢిల్లీ : రంజీ ట్రోఫీ 2017-18 ఫైనల్ మ్యాచ్లో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. ఢిల్లీ జట్టు బౌలర్ వేసిన ఓ బౌన్సర్ ఛాతిని బలంగా తాకడంతో బ్యాట్స్మన్ నొప్పిని భరించలేక కుప్పకూలిపోయాడు. తీవ్ర నొప్పితో బాధపడుతున్న అతన్ని ఓదార్చేందుకు ప్రత్యర్థి జట్టులోని ఒక్కరూ వెళ్లకపోవడం విస్మయానికి గురి చేస్తుంది. క్రికెట్ నిజంగానే జెంటిల్మెన్ గేమేనా అనే ఆలోచనను రేకెత్తిస్తుంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్మీడియాలో వైరల్గా మారింది. సహచర బ్యాట్స్మన్ బాధను చూడలేకపోయిన మరో బ్యాట్స్మన్ మెడికల్ హెల్ప్ కోసం డ్రెస్సింగ్ రూమ్కు చేయి చూపించారు. ఇదే సమయంలో కుప్పకూలిన క్రికెటర్ నొప్పితో విలవిల్లాడుతున్నా అతని పక్క నుంచి నడుచుకుంటూ వెళ్లిపోయారు ఢిల్లీ ఆటగాళ్లు. ఈ వీడియోను తిలకించిన నెటిజన్లు ఢిల్లీ జట్టు ఆటగాళ్లపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్పోర్ట్స్మన్షిప్ను మరచి ఢిల్లీ ఆటగాళ్లు ప్రవర్తించారని కామెంట్లు పెడుతున్నారు. కాగా, ఢిల్లీతో జరిగిన ఫైనల్లో విదర్భ జట్టు అద్భుత విజయం సాధించి తొలిసారి రంజీ ట్రోఫీని కైవసం చేసుకుని చరిత్ర సృష్టించింది. Sportsmanship ?! 🤔 A post shared by mahi7781 🔵 (@bleed.dhonism) on Dec 31, 2017 at 12:03am PST -
రంజీ ఫైనల్ సందడి షురూ
సాక్షి, హైదరాబాద్: ఐదేళ్ల విరామం తర్వాత ఉప్పల్ క్రికెట్ స్టేడియం రంజీ ట్రోఫీ ఫైనల్కు ఆతిథ్యం ఇవ్వబోతోంది. కర్ణాటక, మహారాష్ట్ర జట్ల మధ్య ఈ ఐదు రోజుల మ్యాచ్ బుధవారం నుంచి జరుగుతుంది. ఇందు కోసం హెచ్సీఏ సన్నాహకాలు పూర్తయ్యాయి. సోమవారం బీసీసీఐ ఉపాధ్యక్షుడు శివలాల్ యాదవ్, హెచ్సీఏ కార్యదర్శి ఇ. వెంకటేశ్వరన్ మైదానాన్ని పరిశీలించి ఏర్పాట్లను పర్యవేక్షించారు. మ్యాచ్ కోసం రెండు పిచ్లను సిద్ధం చేశారు. ఏ వికెట్పై ఫైనల్ నిర్వహించాలో మంగళవారం ఉదయం నిర్ణయిస్తారు. మహారాష్ట్ర, కర్ణాటక జట్లు సోమవారం చెరో రెండు గంటల పాటు నెట్స్లో ప్రాక్టీస్ చేశాయి. ఫైనల్ మ్యాచ్ నిర్వహణను ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న హైదరాబాద్ క్రికెట్ అసోసియేన్ క్రికెట్ ప్రముఖులందరినీ ఈ మ్యాచ్కు ఆహ్వానిస్తోంది. బోర్డు కార్యదర్శి సంజయ్ పటేల్ ఈ మ్యాచ్కు హాజరు కానున్నారు. సెలక్షన్ కమిటీ సభ్యులు సందీప్ పాటిల్, విక్రమ్ రాథోడ్, రాజీందర్సింగ్ హన్స్, రోజర్ బిన్నీ, సబా కరీమ్ ఫైనల్ మ్యాచ్ను ప్రత్యక్షంగా తిలకిస్తారు. రంజీ ట్రోఫీ మాజీ ఆటగాళ్లు, మాజీ ఆఫీస్ బేరర్లు, ఇతర అసోసియేషన్ల అధికారులకు హెచ్సీఏ ప్రత్యేకంగా ఆహ్వానం అందించింది.